allu aravindh
-
జీవిత, రాజశేఖర్కు ఏడాది జైలుశిక్ష.. బెయిల్
పరువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ సంచలన తీర్పు వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై గతంలో రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చిరంజీవి బ్లడ్బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిని సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు. (ఇదీ చదవండి: సూర్య కొత్త సినిమా ప్రకటన.. విశాఖలో పుట్టిన సుధకే డైరెక్టర్ ఛాన్స్) చిరంజీవి పేరుతో నడుస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై వారిద్దరూ అసత్య ఆరోపణలు చేశారంటూ అల్లు అరవింద్ అప్పట్లోనే పరువునష్టం దావా వేశారు. అందుకు సంబంధించిన తీర్పును తాజాగా కోర్టు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా కూడా విధించింది. (ఇదీ చదవండి: చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్) దీంతో జరిమానాను రాజశేఖర్, జీవిత చెల్లించడంతో వారికి అప్పీలుకు వెళ్లే అవకాశం దక్కింది. వారు జిల్లా కోర్టును ఆశ్రయించడంతో వారిద్దరికి రూ. 10 చొప్పున పూచీకత్తుగా తీసుకుని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. -
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్తో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. మంత్రి హైదరాబాద్ పర్యటనలో భాగంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. చిరు ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి నాగార్జున అక్కినేని, అగ్ర నిర్మాత అల్లు అరవింద్తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్తో కలిసి దిగిన ఫొటోలను చిరు షేర్ చేశారు. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ ఈ మేరకు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, వ్యక్తిగత, ఇతరత్రా అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ‘హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మా ఇంటికి వచ్చారు. మాతో గడిపిన ఈ వీలువైన సమయానికి ఆయనకు ధన్యవాదాలు. ఈ సందరర్భంగా నా సోదరుడు నాగార్జునతో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ, వేగవంతమైన పురోగతి గురించి ఆయన చర్చించడం జరిగింది. ఈ ఆహ్లాదకరమైన సమావేశం నాకేంతో నచ్చింది’ అంటూ చిరు రాసుకొచ్చారు. Thank you dear Sri @ianuragthakur for making time to drop by at my place on your visit to Hyderabad yesterday. Loved the delightful discussion we had along with my brother @iamnagarjuna about the Indian Film Industry and the rapid strides it is making! pic.twitter.com/Bm6bjvHT39 — Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023 -
మా టీమ్ సక్సెస్ సీక్రెట్ అదే
‘‘వినరో భాగ్యము విష్ణు కథ’ విషయంలో కొత్తవారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని కొందరు అడుగుతున్నారు. అల్లు అరవింద్గారి క్రమశిక్షణ వల్ల మా ఖర్చు హద్దుల్లో ఉంటుంది. అదే మా టీమ్ సక్సెస్ సీక్రెట్’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రమిది. ఇప్పుడిప్పుడే ‘కేజీఎఫ్, విక్రమ్’ వంటి సినిమాల ఫార్మాట్లకు ప్రేక్షకులు అలవాటుపడుతున్నారు. కొత్త దర్శకులకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది.. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘మా చిత్రం కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ కూడా ఉంది’’ అన్నారు మురళీ కిషోర్ అబ్బూరు. నిర్మాత ఎస్కేఎన్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా రిలీజవుతున్న ‘మాలికాపురం’
గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి మరో డబ్బింగ్ చిత్రం రాబోతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. మంచి సినిమాలను ప్రేక్షక్షులను అందించాలనేది ఆయన సంకల్పం. ఆ దిశగా తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాంగా ఆహాను తీసుకువచ్చారు. దీని ద్వారా ఎన్నో కొత్త సినిమాలను, డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులన అందిస్తున్నారు. ఇక థియేటర్లో సైతం ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ల్లో సమర్పిస్తున్నారు. అలా ఇటీవల గీతా ఆర్ట్స్లో వచ్చిన కాంతార చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదిరించారో తెలిసిందే. ఇక్కడ ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే తరహాలో మలయాళ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్. ‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్ లీడ్లో రోల్లో తెరకెక్కి మలయాళ చిత్రం మాలికాపురంను జనవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తన సూపర్హీరో అయ్యప్పన్ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపారు. మలయాళంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనిని నిర్మించాయి. యాన్ మెగా మీడియా, కావ్య ఫిల్మ్ కంపెనీ బ్యానర్లో అంటోన్ జోసెఫ్, వేణు కున్నపిల్లి సంయుక్తంగా నిర్మించారు. -
18 పేజెస్’ సినిమా ఒక సాధారణ లవ్స్టోరీ కాదు..: అల్లు అరవింద్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. ‘ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘గత నాలుగు నెలలుగా.. నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్నా. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు,సపోర్ట్ చేస్తున్న మీడియాకు మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైన లవ్స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేం తీసిన ‘18 పేజెస్’ సినిమా ఒక సాధారణ మైన లవ్స్టోరీ కాదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్లో ఏడు సినిమాలు చేశారు. అవన్నీ మ్యూజికల్గా బిగ్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు. ఇక నిఖిల్ చాలా డెడికేటెడ్గా వర్క్ చేశాడన్నారు. ఇక అనుపమ నటన చాలా న్చాచురల్గా ఉంటుందని, అందుకే అనుపమ అంటే తనకు ఇష్టమని అల్లు అరవింద్ పేర్కొన్నారు. -
సంచలనం సృష్టించిన బాలయ్య టాక్ షో, 5వ ఎపిసోడ్కు రికార్డ్ వ్యూస్
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. బాలయ్య తనదైన శైలి, చమత్కారం, పంచ్లతో ఈ షోను విజయవంతం చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ పలు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ సీజన్ కూడా రికార్డ్ సృష్టించింది. లేటెస్ట్గా జరిగిన 5వ ఎపిసోడ్ రెండు రోజుల్లోనే 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి సంచలనం రేపింది. దివంగత మాజీ సీఎం, సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 5వ ఎపిసోడ్ టాలీవుడ్ స్టార్ నిర్మాతలైన దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్తో పాటు అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లు 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన సినిమాల గురించి చర్చించారు. అల్లు అరవింద్, సురేష్ బాబును నేపోటిజం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఇంకా మూవీస్ గురించి డిస్కస్ చేశారు. హీరోయిన్ల నాభిపై పూలు, పళ్లు ఎందుకు వస్తారో రాఘవేంద్ర రావును అడిగారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ సరదాగా సాగింది. దాంతో ఈ షోకు ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ అభించింది. ఈ నేపథ్యంలో అన్స్టాపబుల్ 5వ ఎపిసోడ్కు రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది. Matallo marintha fire 🔥. Kaburlalo marintha fun. Maruvaleni kathalu, inka enneno. An episode that you can't miss😉 Watch #UnstoppableWithNBKS2 Episode 5 Streaming Now@SBDaggubati #alluarvind#kodandaramireddy @Ragavendraraoba #MansionHouse @tnldoublehorse @realmeIndia pic.twitter.com/f6JDjDfrtZ — ahavideoin (@ahavideoIN) December 5, 2022 -
మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్
‘‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర కథని తమ్మారెడ్డి భరద్వాజగారు అందించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత ఆయన నుంచి నాకు వరుసగా కాల్స్ వచ్చాయి. తన కథను మేము సరిగ్గా తీయలేకపోయారని అంటారేమో అనుకుని మొదట టెన్షన్ పడ్డా.. కానీ, సినిమా చాలా బాగా తీశారని ఆయన చెప్పడంతో సంతోషపడ్డాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. చదవండి: స్టార్ హీరో సల్మాన్కు అనారోగ్యం.. షూటింగులు వాయిదా అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో మధ్య తరగతి అబ్బాయిగా శిరీష్ బాగా నటించాడు. మా సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ‘కపట నాటక సూత్రధారి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ‘‘దాసరి నారాయణరావు, బాలచందర్గార్లు మధ్య తరగతి సమస్యలను అందంగా, సరదాగా చెప్పేవారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఊర్వశివో రాక్షసివో’లో చూపిస్తుండటం హ్యాపీ’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘యువత ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా తీశాం’’ అన్నారు రాకేష్ శశి. ‘‘ఇంటికెళ్లిన తర్వాత కూడా ప్రేక్షకులు మా మూవీ గురించి ఆలోచిస్తారు’’అన్నారు అల్లు శిరీష్. -
‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో గీత ఎవరో చెప్పేసిన అల్లు అరవింద్
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. చెప్పాలంటే ఈ నిర్మాణ సంస్థకు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్యానర్లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగిపోతాయి. కొత్త నటినటులు ఉన్నప్పటికి ఈ బ్యానర్లో వచ్చే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అయితే ఏ నిర్మాణ సంస్థకు అయిన వారివారి కూతుళ్ల పేర్లులేదా భార్య పేరు, ఇంటి పేరు ఉంటుంది. కానీ, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ ‘గీత ఆర్ట్స్’లో గీత అనేది ఎవరు పేరు అనేది ఆసక్తి కలిగించే విషయం. ఎందుకంటే ఈ పేరుతో అల్లు కుటుంబంలో ఎవరు లేకపోవడమే! చదవండి: బిగ్బాస్ 6: గీతూ రాయల్ భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? తాజాగా గీత ఆర్ట్స్లో గీత అంటే ఎవరో రివీల్ చేశారు సంస్థ అధినేత అల్లు అరవింద్. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయనకు గీత ఆర్ట్స్లో.. గీత అంటే ఎవరనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘గీత’ అనేది నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌటు చాలామందిలో ఉంది. అది నిజమే. నాకు గీత అనే గర్ల్ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరునే మా నిర్మాణ సంస్థకు పెట్టానని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. నా గర్ల్ఫ్రెండ్ పేరు గీత అనేది నిజం, మా బ్యానర్ పేరు గీత ఆర్ట్స్ అని పెట్టడం నిజం. కానీ ఈ రెండూ వేరు వేరు సందర్భాలు. అయితే నా స్నేహితులు ఈ రెండింటిని కలిపేసి నన్ను ఆటపట్టిస్తుంటారు‘’ అని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం తమ బ్యానర్కు గీత ఆర్ట్స్ పెట్టడం వెనక అసలు కారణమేంటో ఆయన వివరించారు. చదవండి: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్ ‘‘నిజానికి ‘గీత ఆర్ట్స్’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామనే ఒక ప్రపోజల్ను పెట్టింది మా నాన్నగారు (అల్లు రామలింగయ్య). భగవద్గీత బోధన ప్రకారం.. ప్రయత్నం మాత్రమే మనది .. ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం. అది సినిమాలకు కరెక్టుగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే.. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. ‘గీత’లో చెప్పినట్లుగా సినిమా నిర్మాణ వ్యవహారాలు ఉండటంతో ‘గీత ఆర్ట్స్’ అని పెడదామని నాన్నగారు అనడం.. అదే ఫైనల్ కావడం జరిగిపోయింది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. మరి పెళ్లి తర్వాత అయినా ఈ పేరు నిర్మల ఆర్ట్స్ అని మార్చొచ్చు కదా అని హోస్ట్ అడగడంతో అప్పటికే ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయని, అందుకే మార్చడం ఎందుకని వదిలేశామని నవ్వుతూ సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్. -
అల్లు అరవింద్కు రూ. 40 కోట్లు నష్టం !.. బన్నీ సినిమా హిందీ వెర్షన్ లేనట్లేనా ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. బన్నీ స్టైలిష్ యాక్షన్, త్రివిక్రమ్ మ్యాజికల్ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ మాస్ పెర్ఫామెన్స్ చిత్రం 'పుష్ప' హిట్తో 'అల వైకుంఠపురములో' మూవీని కూడా హిందీలో విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ డబ్బింగ్ వెర్షన్ను థియేటర్లలో రిలీజ్ చేయడాన్ని ఆపేశారు. ఈ సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీంతో రీమేక్ నిర్మాతలకు, డబ్బింగ్ నిర్మాతలకు మధ్య అభిప్రాయ బేధాలు కుదరకపోవడంతో సినిమా విడుదలను మానుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ రీమేక్లో హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ అని డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న గోల్డ్మైన్స్ మనీష్ షా ఆరోపిస్తున్నారు. ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్ను థియేటర్లలో రిలీజ్ చేస్తే తాను నటిస్తున్న 'షెహజాదే' చిత్రాన్ని చేయకుండా మధ్యలోనే మానేస్తానని హీరో కార్తీక్ ఆర్యన్ నిర్మాతలకు చెప్పాడట. అయితే 'షెహజాదే' నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఇప్పటివరకూ 'షెహజాదే' చిత్రీకరణకు అయిన ఖర్చు రూ. 40 కోట్లు అని తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ కోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమాను విడుదల చేస్తే తనకు రూ. 20 కోట్లు ప్రాఫిట్ వచ్చేదని, కానీ తనకు తెలిసిన నిర్మాతలకు నష్టం రాకూడదనే ఈ రిలీజ్ ప్రయత్నాన్ని విరమించుకున్నాని మనీష్ షా పేర్కొన్నారు. అలాగే ఇది కార్తీక్ ఆర్యన్ కోసం కాదు, అల్లు అరవింద్ కోసం చేస్తున్నాని, షెహజాదే నిర్మాతలు రూ. 40 కోట్లు నష్టపోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ వెర్షన్ను కేవలం 'దించాక్' టీవీ ఛానెల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్ ట్వీట్ వైరల్
Allu Sirish Shocking Tweet About AHA App Goes Viral: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన తెలుగు ఏకైక ఓటీటీ యాప్ ఆహా. లెటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు సరికొత్త రియాలిటీ షోతో ఆహా డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆహా స్థాపించిన కొద్ది కాలంలోనే అగ్ర ఓటీటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఆహా సబ్స్రైబర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఆహాతో తనకు సంబంధం లేదంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు అల్లు వారి వారసుడు, హీరో అల్లు శిరీష్. చదవండి: ‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్కు తమిళ నిర్మాత భారీ ఆఫర్ దీంతో అతడి ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ మారింది. కాగా ఆహా సబ్స్రైబర్లు యాప్లో ఏమైన సమస్యలు ఎదురైతే ట్వీటర్ వేదిక తమ సమస్యలను లెవనెత్తుతున్నారు. యాప్కు సంబంధించిన సాంకేతిక సమస్యలను చెబుతూ దీనిని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆహా వీడియోస్ టీంతో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్లను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఇలా చాలా మంది ఆహాలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సోషల్ మీడియాలో వీరిని ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై అల్లు శిరీష్ స్పందించాడు. అతడు ఈ ట్వీట్ని షేర్ చేసి.. ‘ఆహాని ట్యాగ్ చేస్తూ చాలామంది నేను ఆహా బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాను అని అనుకుంటున్నారు. దయచేసి ఆహా టీం ఈ కంప్లైంట్స్ని చూడండి’ అంటూ పోస్ట్ చేశాడు. శిరీష్ ఇలా ట్వీట్ చేయడంతో నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. ‘ఏంటి శిరీష్కు ఆహాకి సంబంధం లేదా’ ప్రశ్నిస్తున్నారు. అంతేగా ఆహా అల్లు ఫ్యామిలీదే కదా, ఆహాతో తనకు సంబంధం లేకపోవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘శిరీష్ ఇంకా ఆహా బాధ్యతలను స్వీకరించలేదేమో అందుకే ఇలా స్పందించాడు’ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నా బెస్ట్ ఆన్స్క్రీన్ పెయిర్ సమంతనే: నాగ చైతన్య అయితే ఆహాలో అల్లు అరవింద్ మాత్రమే కాక మరికొంతమంది ఇందులో పార్ట్నర్లుగా ఉన్నారు. ఐకాన్ స్టార్, అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆహాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఆహా చేసే ప్రతి ఈవెంట్లోనూ అల్లు అర్జున్ భాగమవుతున్నాడు. అలాగే అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ కూడా ఆహాకు సాంకేతిక సలహాదారుడిగా ఉన్నాడు. ఇలా అల్లు వారి వారసులు ఆహాలో ఏదోకవిధంగా భాగమవుతున్నారు. అయితే ఇంతవరకు అల్లు శిరీష్ మాత్రం ఆహాలోని ఏ ఈవెంట్లో కనిపించకపోవడం గమనార్హం. Dear @ahavideoIN, lots of ppl tagging me thinking I'm involved with Aha. Kindly address the customer complaints. https://t.co/xbt4xkdfhr — Allu Sirish (@AlluSirish) January 15, 2022 -
ఘనంగా ప్రారంభమైన కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం, టైటిల్ ఇదే..
‘రాజావారు రాణి గారు’, ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం కిరణ్ ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇక అల్లు అన్విత హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ కశ్మీరా పర్ధేశీలపై క్లాప్తో చిత్రాన్ని ప్రారంభించారు. నిర్మాత బన్నీవాసు కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. ఈ మూవీతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్కు సంబంధించిన పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ను ఖరారు చేశారు. జీఏ2పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా,చావు కబురు చల్లగా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వినూత్నమైన కథతో ఈ నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు తెలిపాడు. -
ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్ సాయం..
Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims: సినిమాలు నిర్మిస్తూ డబ్బులు సంపాదించడమే కాదు, అవసరానికి సహాయం కూడా చేస్తారు సినీ నిర్మాతలు. అలాంటి కోవకే చెందినదే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. అయితే గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ. 10 లక్షలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ స్వయంగా ట్విటర్లో ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains. — Geetha Arts (@GeethaArts) November 24, 2021 ఇలా ఇంతకుముందు 'గీతా ఆర్ట్స్2' బ్యానర్లో వచ్చిన 'గీతా గోవిందం' సినిమా ఫ్రాఫిట్ను కేరళ వరద బాధితులకు సహాయంగా అందించారు. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం ఈ క్రిస్మస్కి థియేటర్లలో సందడి చేయనుంది. -
విశాఖలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ టీం సందడి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం చిత్రపరిశ్రమకు ఎప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు పేర్కొన్నారు. 25 శాతం సినిమాలను ఏపీలో చిత్రీకరించేందుకు నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. బీచ్రోడ్డులో ఆదివారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ థ్యాంక్స్ మీట్ను ఘనంగా నిర్వహించారు. నెల వ్యవధిలో అన్నదమ్ముల సినిమాలు రిలీజై హిట్ అవ్వడం గొప్ప విషయమన్నారు. ఇక హీరో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. తన కెరీర్ ఓ మైలు రాయిగా నిలిచిపోయిందన్నారు. ఇంతటి ఘనవిజయం అందజేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. వంద శాతం థియేటర్ల సీట్లు అమ్మకాలకు అనుమతిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. వైజాగ్కు మళ్లీ వస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, నటీనటులు పాల్గొన్నారు. -
చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. నాగ్, అల్లు అరవింద్ హాజరు
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చిందే సినీ పెద్దలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అపాయింట్మెంట్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న చిరంజీవి నివాసంలో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సినీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో హీరో నాగార్జున అక్కినేని, అల్లు అరవింద్, దగ్గుబాటి సూరేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్ తదితరులు హజరయ్యారు. సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్, బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు వంటి సమస్యలపై వారు చర్చించారు. -
చాలెంజ్గా తీసుకుని చేశాను
‘‘సామ్జామ్ షో నాకు చాలా పెద్ద చాలెంజ్. దీంతో పోల్చుకుంటే సినిమా యాక్టింగ్ చాలా సులభం అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ షో చేయటం ముఖ్యమనిపించింది. అందుకే చాలెంజ్గా తీసుకుని ఈ షో చేశాను’’ అన్నారు సమంత. ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో ‘సామ్జామ్’ అనే షోతో ఈ నెల 13నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నారు సమంత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమంత మాట్లాడుతూ– ‘‘సామ్జామ్ టాక్ షో కాదు. ఈ షోలో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం. టాలెంట్ను ఎంకరేజ్ చేస్తాం. నేను బిగ్బాస్ షోకు హోస్ట్గా చేయటం నాగ్మామ నిర్ణయం. ఆ షో చేసే టైమ్లో పెద్దగా నిద్ర పట్టలేదు. చాలా హార్డ్వర్క్ చేశాను’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఆహా’ను ఫిబ్రవరిలో లాంచ్ చేశాం. ఈ ప్లాట్ఫామ్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లడానికి సమంతగారితో ఓ పెద్ద షో చేయాలనుకున్నాం. ఇది నార్మల్ షో కాదు. నందినీరెడ్డి ఈ షోను తన భుజాలపై మోస్తున్నారు’’ అన్నారు. నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘కాఫీ విత్ కరణ్’, ‘కౌన్బనేగా కరోడ్పతి’ షోలు చేసిన టీమ్తో పని చేయటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. -
సూపర్గా సెట్ చేశా!
అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో బన్నీ వాసు, వాసూవర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ–టీజర్ని విడుదల చేశారు. ఈ టీజర్లో అఖిల్ సినిమాలోని తన పాత్రని పరిచయం చేసుకుంటూ.. ‘అయామ్ హర్ష. ఒక అబ్బాయి లైఫ్లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారీడ్ లైఫ్.. కెరీర్ని సూపర్గా సెట్ చేశా.. ఈ మ్యారీడ్ లైఫే. ఓ అయ్యయ్యయ్యో..’ అంటూ టీజర్కి లీడ్ ఇచ్చారు. ‘‘ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది. అఖిల్, పూజా హెగ్డేల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా థ్రిల్లింVŠ గా ఉంటాయి. భాస్కర్, బన్నీ వాసు కుటుంబ ప్రేక్షకులు, యువత లక్ష్యంగా సినిమాలు తీస్తారు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది. ఈ నెల 25న ఈ సినిమా టీజర్ని విడుదల చేస్తున్నాం. 2021లో సంక్రాంతికి సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రదీశ్ ఎమ్. వర్మ. -
నాన్నగారు మా తరతరాలకు గుర్తింపునిచ్చారు
తెలుగు తెరపై హాస్యపు జల్లు అల్లు రామలింగయ్య. ఆయన మన మధ్య లేకున్నా ఆయన వదిలిన పదాలు, బాడీ లాంగ్వేజ్ మరువలేని జ్ఞాపకాలు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించడంతో పాటు చివరి శ్వాస వరకూ నటించి, సినిమాపై తన ప్రేమని చాటుకున్నారు అల్లు రామలింగయ్య. నటుడుగా ఎంత బిజీగా ఉన్నా కూడా తన వృత్తి హోమియోపతిని మాత్రం వదల్లేదు. నిర్మాతగా మారి, గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి అనేక సూపర్హిట్స్ కూడా అందించారు. అలాంటి మహానటుడు, నిర్మాత అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్ 1న. ఈ సంవత్సరం ఆయన 99వ జయంతి. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య తనయుడు, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ –‘‘మా నాన్న తర్వాత నేను, నా తర్వాత మా అబ్బాయిలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాం. ఈ మధ్య నేను ఎయిర్పోర్ట్కి వెళితే అక్కడ ఒకావిడ నన్ను చూసి, ‘నమస్కారం అరవింద్గారు’ అని పలకరించారు. అక్కడే ఉన్న వాళ్ల అమ్మకి అల్లు రామలింగయ్యగారి అబ్బాయి అని పరిచయం చేశారావిడ. నాన్నగారు తరతరాలకు మా ఫ్యామిలీకి గుర్తింపునిచ్చారు’’ అన్నారు. అల్లు స్టూడియో అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు వెంకటేష్, అల్లు అర్జు¯Œ , అల్లు శిరీష్ల నిర్వహణలో అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అల్లు స్టూడియోలో ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉండబోతుంది? ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? అనే విషయాలు త్వరలో తెలియజేస్తారు. -
తమన్నా ఆహా
తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో క్రేజీ ప్రాజెక్ట్స్తో దూసుకెళుతున్నారు తమన్నా. కేవలం కథానాయికగానే కాదు.. అతిథి పాత్రల్లో, ప్రత్యేక పాటల్లోనూ మెరుస్తున్నారీ మిల్కీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, బాలీవుడ్లో నటించిన ‘బోలే చుడియా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్తో కలిసి ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్నారు తమన్నా. అయితే ‘ది నవంబర్స్ స్టోరీ’ అనే తమిళ వెబ్ సిరీస్తో డిజిటల్ మాధ్యమంలోనూ ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో తమన్నా మెరవనున్నారట. ‘ఆహా’లో ఓ స్పెషల్ టాక్ షోను ప్లాన్ చేశారని, ఆ షోకి తమన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం. -
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి
‘‘సముద్రమంత లోతున్న మంచితనం, శిఖరమంత ఎత్తున్న గొప్పతనం.. నా జీవితంలో మంచికీ చెడుకి మధ్య నిల్చున్న వ్యక్తి చిరంజీవి’’ అన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. చిరంజీవి జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన ‘మెగాస్టార్– ది లెజెండ్’ పుస్తకాన్ని ‘కళాబంధు’ టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించి, దర్శకుడు రాఘవేంద్రరావుకి తొలి ప్రతిని అందజేశారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘హిమాలయాలంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి. అందుకే ఆయన 40 ఏళ్లుగా స్టార్గా ఉన్నారు. మరో 20 ఏళ్లు కూడా ఉంటారు’’ అన్నారు. ‘‘మొదటి 3–4 ఏళ్లే మేమిద్దరం బావ–బామ్మర్దిగా ఉన్నాం. ఆ తర్వాత స్నేహితుల్లా ప్రయాణించాం. చిరంజీవిగారితో నాది 40ఏళ్ల ఏమోషనల్ జర్నీ. కష్టపడే తత్వానికి నిదర్శనం ఆయన’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి జీవితాన్ని పుస్తకంగా మలచడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఈ పుస్తకం వెనుక మూడేళ్ల ప్రయాణం ఉంది’’ అన్నారు వినాయకరావు. ‘‘చిన్నతనంలో నాన్న ఎంత కష్టపడి పని చేసేవారో చూసే అవకాశం మాకు దొరికేది కాదు. ఇప్పటికీ మాకు ఏం అందించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పుస్తకం ద్వారా నాన్నకు మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. వినాయకరావుగారికి మా కుటుంబం, అభిమానులందరి తరఫున ధన్యవాదాలు’’ అన్నారు రామ్చరణ్. మురళీమోహన్, దర్శకుడు బి.గోపాల్, వీవీ వినాయక్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పూజాహెగ్డే లుక్కి అభిమానులు ఫిదా
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' ఫస్ట్ లుక్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయగానే సినిమా అభిమానులు నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ని తెలియజేస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించి మొదటి స్టెప్ అంటూ విడదుల చేసిన అఖిల్ అక్కినేని లుక్కి మంచి రెస్పాన్స్ రావటం విశేషం. ఇప్పడు సెకండ్ స్టెప్ అంటూ హీరోయిన్ పూజా హెగ్డే లుక్ని విడుదల చేశారు. (బ్యాచ్లర్ వచ్చేశాడు) ఇలా స్టెప్స్ అంటూ ఆడియన్స్ లో ఫ్యాన్స్లో ఈ చిత్రం పై క్యూరియాసిటి మరింత పెంచుతున్నారు. ఈ రెండు లుక్లు ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండటం ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనా తెలియజేస్తుంది. అఖిల్ అక్కినేని ఒక ప్రత్యేఖ ఇమేజ్ ని తన సోంతం చేసకుంటున్నారు. ఈ సినిమా తన కెరీర్ బెస్ట్ కానుంది. బొమ్మరిల్లు చిత్రం విడుదలయ్యి ఇన్ని సంవత్సరాలయినా కూడా ఇప్పటికి బొమ్మరిల్లు చిత్రం లోని సంభాషణలు కాని, సన్నివేశాలు కాని డిస్కషన్ లో వున్నాయంటే ఆ సినిమా క్రియెట్ చేసిన ట్రెండ్ అలాంటిది.. ఆ చిత్ర దర్శకుడు భాస్కర్ కొంత గ్యాప్ తరువాత మరోక్కసారి పది సంవత్సరాలు మాట్లాడుకునేలా చిత్ర కధ కుదిరిందని చిత్ర యూనిట్ అంటున్నారు. (మోస్ట్ ఎలిజిబుల్!) అదే విధంగా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతిరోజు పండగే చిత్రాలతో కెరీర్ బెస్ట్ గ్రాసర్గా రికార్డు విజయాల్ని అందించిన బన్ని వాసు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా శ్రధ్ధ తీసుకుంటున్నారు. సంగీతం గోపి సుందర్ అందించారు, ఈ ఆడియోని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.. నటీ నటులు అఖిల్ అక్కినేని పూజా హెగ్ఢే ఆమని మురళి శర్మ జయ ప్రకాశ్ ప్రగతి సుడిగాలి సుధీర్ గెటెప్ శ్రీను అభయ్ అమిత్ టెక్నీషియన్స్ డైరెక్టర్ : బొమ్మరిల్లు భాస్కర్ మ్యూజిక్ : గోపీ సుందర్ సినిమాటోగ్రాఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ ఎడిటర్ : మార్తండ కే వెంకటేశ్ ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ సమర్పణ : అల్లు అరవింద్ బ్యానర్ : జీఏ2 పిక్చర్స్ -
ఒక అమ్మ ప్రయాణం
రేవతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇట్లు అమ్మ’. ‘మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్’ అనేది ఉపశీర్షిక. ‘అంకురం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన సి. ఉమామహేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. బొమ్మక్ క్రియేష¯Œ ్స పతాకంపై బొమ్మక్ మురళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోని విడుదల చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘అంకురం’ సినిమా చూసి ఆ దర్శకుడు ఎలా ఉంటారో చూడాలనుకున్నాను. నేను అలా అనుకున్న మరో దర్శకుడు బాలచందర్. ‘అంకురం’ సినిమా నాకిప్పటికీ గుర్తుంది. కొంతమంది మాత్రమే ఉమా మహేశ్వరరావుగారిలా సమాజం కోసం కథలు రాసి సినిమాలు రూపొందిస్తుంటారు’’ అన్నారు. ‘‘చెడు మార్గంలో పయనిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని మా చిత్రం ఇస్తుంది’’ అన్నారు ఉమామహేశ్వరరావు. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది’’ అన్నారు బొమ్మక్ మురళి. ‘‘ఒక అమ్మ ప్రయాణమే ఈ సినిమా. జీవితం ఎలా సాగుతుందో అంతే సహజత్వంతో దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు’’ అన్నారు రేవతి. సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగులపల్లి కనకదుర్గ, దేవి, విమల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎంఆర్. -
భవిష్యత్ డిజిటల్ రంగానిదే
‘‘ఏడాది క్రితం ఓ మీడియం మన సినిమాలను తినేస్తుందేమో అనే భయంతో ‘ఆహా ఓటీటీ’ ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు. ఆహా గురించి మా అబ్బాయిలకు (అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శీరిష్)లకు చెప్పగానే..‘నాన్నా.. నువ్వు రేపటిని చూస్తున్నావ్’ అన్నారు. తెలుగు వారికి తెలుగు కంటెంట్ను చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ‘ఆహా ఓటీటీ’కి శ్రీకారం చుట్టాం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘ఆహా ఓటీటీ’ ప్రివ్యూ ఫంక్షన్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఎవరైనా డిజిటల్ మీడియంలోకి రావాలంటే సందేహించొద్దు. భవిష్యత్తు డిజిటల్ రంగానిదే. ఇది మాకు కొత్త. అందుకే అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. మై హోమ్ రామేశ్వర్రావుగారు, రామ్లతో పాటు మరికొందరు ‘ఆహా ఓటీటీ’లో భాగస్వామ్యులుగా ఉన్నారు. అజయ్ ఠాకూర్ హ్యాండిల్ చేస్తున్నారు. టెక్నాలజీ బిజినెస్ గురించి కోల్కతాలోని మా స్నేహితులు, ఓ అమెరికన్ కంపెనీ సపోర్ట్ తీసుకుంటున్నాం. ఈ ఏడాది పాతిక షోలను ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు క్రిష్ ఓ షో చేస్తున్నారు. ఇందులో కంటెంట్ బోల్డ్గా ఉంటుంది. కాబట్టి పేరెంట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు. ‘మేం గృహనిర్మాణం నుంచి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాం. అరవింద్గారి ఆలోచనల నుంచి పుట్టిందే ‘ఆహా ఓటీటీ’. ఇందులో వందశాతం తెలుగు కంటెంట్ ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏడాది ప్రీమియాన్ని 365 రూపాయలుగా నిర్ణయించాం’’ అన్నారు జూపల్లి రామూరావు. ‘‘ఆహా ఓటీటీ’ ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ గేమ్చేంజర్గా చెప్పవచ్చు. టీవీని ఓటీటీ రీప్లేస్ చేస్తుందనిపిస్తోంది. సినిమాల నుంచి వెబ్కు యాక్టర్స్ క్రాస్ ఓవర్ అవుతున్నారు’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘నా రైటింగ్లోని మరో కోణమే ‘మస్తీస్’. అజయ్భూయాన్ బాగా డైరెక్ట్ చేశారు. అవకాశం ఇచ్చిన అల్లుఅరవింద్, రామ్, అజిత్ఠాగూర్కి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు క్రిష్. యాక్టర్ నవదీప్ మాట్లాడారు. -
అల్లువారి జీవితాలు ప్రేక్షకులకు అంకితం
‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత పూర్తి వినోదంతో ఉండే పెద్ద సినిమా చేయాలనుకున్నాను.. అప్పుడు నాకు గుర్తొచ్చిన పేరు త్రివిక్రమ్గారే. మేమిద్దరం కలుసుకొని ఆనందంగా ఓ సినిమా చేయాలనుకున్నాం. అలా చేసిందే ‘అల.. వైకుంఠపురములో..’. మా సినిమాను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘రాధాకృష్ణ, త్రివిక్రమ్గార్లతో హ్యాట్రిక్ కొట్టాం. మా నాన్నగారికి(అల్లు అరవింద్) బాగా డబ్బులు రావాలని, అందులో నాకు వాటా ఇవ్వాలని కోరుకుంటున్నా(నవ్వుతూ). పూజాహెగ్డేతో ‘డీజే’ తర్వాత ఈ సినిమా చేశా.. తనతో మళ్లీ నటించాలనుంది. మేమెంత నటించినా, సాంకేతిక నిపుణులు ఎంత గొప్పగా పనిచేసినా సినిమాకి దర్శకుడు ప్రాణం లాంటివాడు. ఆ ప్రాణం లేకపోతే మేమెంత చేసినా శవానికి అలంకరించినట్టే. బంధుప్రీతి గురించి చాలా మంది కామెంట్ చేస్తుంటారు. దేవుడికి ఒక పూజారి తన జీవితం అంకితం చేస్తాడు.. ఆ తర్వాత వాళ్ల అబ్బాయి, ఆ తర్వాత వాళ్ల వాళ్ల అబ్బాయి.. ప్రేక్షక దేవుళ్లను వినోదపరచడానికి మా అల్లు కుటుంబం కూడా అంకితం. మా తాతగారు(అల్లు రామలింగయ్య) చేశారు, మా నాన్నగారు చేశారు, నేనూ చేస్తున్నాను.. ఉన్నంతకాలం చేస్తూనే ఉంటాం’’ అన్నారు. ‘‘కళామతల్లి పాదాల వద్ద సేద తీర్చుకుంటున్న కుటుంబం మాది. మమ్మల్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు బన్నీ, త్రివిక్రమ్ల కెరీర్లోనే కాదు.. ఇండస్ట్రీలోనే బెస్ట్గా నిలబడతాయని అంటున్నారు. 18న వైజాగ్లో ఈ సినిమా సక్సెస్ మీట్ చేయబోతున్నాం’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఈ సినిమాలో మేం దాచిన సర్ప్రైజ్లు రెండు.. ఒకటి శ్రీకాకుళం ‘సిత్తరాల సిరపడు’ పాట.. రెండోది బ్రహ్మానందంగారు. ఆయన కనపడగానే ప్రేక్షకులు బాగా గోల చేశారు. సుశాంత్ కథ వినకుండానే చేశాడు. రూపాయి అడిగితే రెండు రూపాయిలు ఇచ్చిన అరవింద్గారు, రాధాకృష్ణగారికి థ్యాంక్స్. బన్నీ చాలా తపన ఉన్న నటుడు.. తనలోని గొప్ప నటుడిని ఈ సినిమాలో చూపించారు. సచిన్కి ఫుల్ టాస్ వేసినా, బన్నీకి ఇలాంటి సినిమా వచ్చినా సిక్సరే’’ అన్నారు త్రివిక్రమ్. ‘‘బాధ్యత నన్ను మరింత బాగా పని చేయించింది. సంక్రాంతి రేసులో పరిగెత్తాం. కొంచెం బరువున్నా నేనే గెలిచేలా చేశారు’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమా టైమ్లో బన్నీగారికి ఫ్యాన్ అయ్యాను.. ఈ సినిమాతో త్రివిక్రమ్గారికి ఫ్యాన్ అయిపోయాను’’ అన్నారు పూజా హెగ్డే. ఈ కార్యక్రమంలో నటులు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సునీల్, సుశాంత్, నవదీప్, హర్షవర్ధన్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ నవీన్ నూలి తదితరులు పాల్గొన్నారు. -
ఈ విజయం ఆ ఇద్దరిదే
‘‘ప్రతిరోజూ పండగే’ సినిమా విజయం మారుతి, సాయి తేజ్లదే. ఈ ఇద్దరూ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారు. మంచి సినిమా తీసిన యూనిట్ని అభినందిస్తున్నాను’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించిన ఈ సినిమా విజయోత్సవం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ–‘‘ప్రతిరోజూ పండగే’ నా కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన మారుతిగారికి థ్యాంక్స్. సత్యరాజ్గారి పాత్రను మర్చిపోలేను. రావు రమేశ్గారితో నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్. ఈ సక్సెస్ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ రాసుకున్నప్పుడు రాజమండ్రిలో చిత్రీకరించాలనుకున్నాను. సక్సెస్మీట్ను రాజమండ్రిలోనే నిర్వహించాలని షూటింగ్ అప్పుడే అనుకున్నాను.. ఇప్పుడు చేశాం’’ అన్నారు మారుతి. ‘‘తేజూ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తికి ఇంత మంచి విజయం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాస్. -
ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా?
‘‘పవన్ కల్యాణ్తో తీయబోయే సినిమాలో విలన్ పాత్ర చేయగలరా? అని పదేళ్ల క్రితం మమ్ముట్టిని అడిగితే, ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా అన్నాడు. మమ్ముట్టి వ్యక్తిత్వానికి అది నిదర్శనం’’ అన్నారు అల్లు అరవింద్. మమ్ముట్టి లీడ్ రోల్లో పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మామాంగం’. ఈ సినిమా తెలుగు, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 12న విడుదలవుతోంది. తెలుగులో విడుదల చేస్తున్న అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కేరళలోని చావెరుక్కల్ యుద్ధ వీరులకు గొప్ప చరిత్ర ఉంది. కలరీ యుద్ధ విద్యలో ఆరితేరిన వారి కథతో మమ్ముట్టి ఈ సినిమా చేయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘మామాంగం’ కేరళకు సంబంధించిన కథే కాదు. ప్రతి భారతీయుడు దీని గురించి తెలుసుకోవాలి. ప్రతి 12 ఏళ్లకు జరిగే మామాంగం అనే ఉత్సవం నేపథ్యంలో ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు మమ్ముట్టి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహి.వి రాఘవ్ పాల్గొన్నారు. -
బ్యాట్తో గ్రౌండ్లోకి దిగిన షాహిద్!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో బీ- టౌన్ను షేక్ చేశాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఇక ఈ సక్సెస్తో జోరుమీద ఉన్న షాహిద్ మరో తెలుగు రీమేక్కు సిద్దమైపోయిన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ హిందీ రీమేక్లో షాహిద్ నటిస్తున్నాడు. ఇందుకోసం ఇప్పుడే బ్యాట్స్మెన్ అవతారం ఎత్తి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. కాగా ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా రీమేక్తో షాహిద్ తొలిసారి తెరపై క్రికెటర్గా కనిపించనున్నాడు. ఇందుకోసం క్రికెట్ బ్యాట్తో గ్రౌండ్లోకి దిగిపోయాడు. షాహిద్ తాజా లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఇక తర్వాత 300 కోట్లకు పరుగులు’ అంటూ ఇప్పటి నుంచే సినిమా కలెక్షన్ల గురించి అంచనాలు పెంచేస్తున్నారు. కాగా మరికొందరు ‘తెలుగు సినిమాలు హిందీ హిట్లకు మార్గం సుగమం చేస్తున్నాయని, రీమేక్ల సక్సెస్కు కేరాఫ్ అయిన కండల వీరుడు సల్మాఖాన్ స్థానాన్ని షాహిద్ భర్తి చేసేలా ఉన్నాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక జెర్సీ రీమేక్ గురించి షాహిద్ మాట్లాడుతూ.. ‘కబీర్ సింగ్’ హిట్ తర్వాత నాకు కాస్త సమయం దొరికిందని, ఆ సమయంలో తాను జెర్సీ సినిమా చుశానని అది తనకు బాగా నచ్చిందని షాహిద్ అన్నాడు. కాగా ఒరిజనల్ వర్షన్ను రుపొందించిన గౌతమ్ తిన్ననూరి హిందీ ‘జెర్సీ’కి దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్ రాజులు సంయుక్తంగా అమన్ గిల్తో కలిసి హిందీలో రీమేక్ చేయనున్నారు. Shahid Kapoor begins prep for the role of a cricketer in the #Hindi remake of #Telugu film #Jersey... The #Hindi version will be directed by Gowtam Tinnanuri, who also helmed the original #Telugu version, starring Nani... 28 Aug 2020 release. pic.twitter.com/9TUcNTOWvf — taran adarsh (@taran_adarsh) November 1, 2019 -
పంచ్ పడుద్ది
ఈ ఏడాది ‘ఎఫ్ 2, గద్దలకొండ గణేష్’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి గురువారం కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు నాగబాబు క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటిలకు స్క్రిప్ట్ను అందించారు. కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. వరుణ్గారు కథ వినగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ మూవీ కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకుని చాలా మేకోవర్ అయ్యారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: తమన్.ఎస్. -
సైరా సెలబ్రేషన్స్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాను సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మించారు. ఈ నెల 2న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సక్సెస్ను సెలబ్రేట్ చేయడానికి అల్లు అరవింద్ ‘సైరా’ టీమ్కి పార్టీ ఏర్పాటు చేశారు. దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. -
శ్రీ రాముడిగా?
‘సూపర్ 30’ సక్సెస్తో సూపర్ ఎనర్జీలో ఉన్నారు హృతిక్ రోషన్. ఇప్పుడు వరుసగా సినిమాలను సైన్ చేస్తున్నారు. ఫర్హాన్ ఖాన్తో ‘సత్తే పే సత్తే’, ఆ తర్వాత ‘క్రిష్ 4’ ఉంటుందని ప్రకటించారు. లేటెస్ట్గా అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ్’ సినిమాలో హృతిక్ హీరోగా నటించనున్నారని బాలీవుడ్ టాక్. ఇందులో శ్రీరాముడిగా హృతిక్ నటించనున్నారట. లైవ్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాను ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారి, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రం బడ్జెట్ సుమారు 1500 కోట్లు. -
క్లాప్కి ఇళయరాజా క్లాప్
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా రూపొందనున్న చిత్రం ‘క్లాప్’. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఐబి కార్తికేయన్, యం. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనున ్న ‘క్లాప్’ చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా క్లాప్ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తమిళ వెర్షన్కు హీరో నాని క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తదితరులు ‘క్లాప్‘ బౌండెడ్ స్క్రిప్ట్ని చిత్రబృందానికి అందించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పాను. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకంటే మా సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ కథపై ఏడాది వర్క్ చేశాను. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది’’ అన్నారు పృథ్వి ఆదిత్య. ‘‘మిత్రుడు రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు.. కథ విని ఇంప్రెస్ అయి ఈ చిత్రంలో భాగమయ్యాను. ఇళయ రాజాగారి మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్ ఎస్సెట్ కానుంది. ఈ నెల 17నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, మధురైలలో షూటింగ్ జరుపుతాం. నాలుగు షెడ్యూల్స్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ప్రవీణ్ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్ష. -
కొత్త ప్రయాణం
‘బొమ్మరిల్లు, పరుగు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్. ఆయన దర్శకత్వంలో అఖిల్ హీరోగా కొత్త చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ప్రొడక్షన్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు, వాసూ వర్మలు నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. అల్లు అరవింద్ మనవరాలు బేబి అన్విత క్లాప్ కొట్టగా, అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్లో స్టార్ట్ కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్ భార్య నిర్మల, చిరంజీవి సతీమణి సురేఖ, అక్కినేని అమల, దర్శకులు శ్రీకాంత్ అడ్డాల, మారుతి, పరశురామ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. మణికందన్, సంగీతం: గోపీ సుందర్. -
సినీ నిర్మాత అల్లు అరవింద్ ఔదార్యం
బంజారాహిల్స్: మండుటెండల్లో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసుల దాహార్తిని తీర్చేందుకు సినీ నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ ముందుకొచ్చారు. ఖర్చుకు వెనుకాడకుండా నాణ్యమైన మజ్జిగను తయారు చేయించి, ప్రతిరోజూ 300 బాటిళ్ల చల్లటి మజ్జిగను పోలీసులకు పంపిణీ చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, సైఫాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు బాటిళ్లను అందజేస్తున్నారు. ‘అల్లు ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు మజ్జిగ పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు మజ్జిగ బాటిళ్లు అందజేస్తున్న నిర్వాహకులు -
క్రేజీ కాంబినేషన్ కుదిరేనా?
150వ చిత్రం (ఖైదీ నంబర్ 150) తర్వాత ప్రస్తుతం భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ‘సైరా’లో నటిస్తున్నారు చిరంజీవి. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సోషల్ డ్రామా సబ్జెక్ట్ చేయనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. లేటెస్ట్గా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను అల్లు అరవింద్ నిర్మిస్తారట. ‘శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలనుంది’ అని ఇప్పటికే పలు సందర్భాల్లో చిరంజీవి పేర్కొన్నారు. భారీ బడ్జెట్తో గ్రాఫిక్స్తో కూడిన సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలను ఎక్కువగా రూపొందిస్తారు శంకర్. మరి చిరంజీవి, శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా ఎలాంటి జానర్లో ఉంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం కమల్హాసన్తో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు శంకర్. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి సినిమాపై దృష్టి పెడతారట శంకర్. మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి. -
అమ్మ లేకుంటే చనిపోయేవాణ్ణి
‘‘పాతికేళ్లుగా మా కుటుంబానికి లారెన్స్ చాలా సన్నిహితుడు. చిన్న డ్యాన్సర్గా కెరీర్ను స్టార్ట్ చేసి, ‘హిట్లర్’ సినిమాతో డ్యాన్స్ మాస్టర్గా మారాడు. ఇప్పుడు లారెన్స్ ఓ బ్రాండ్లా తయారయ్యాడు. అతని సినిమా వస్తోందంటే అందరూ ఎదురు చూస్తున్నారు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కోవై సరళ, శ్రీమాన్ ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘కాంచన 3’. లారెన్స్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్లో రాఘవ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలవుతోంది. తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్’ బ్రోచర్ను అల్లు అరవింద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సంపాదించిన దాన్ని పదిమందికీ పంచాలనుకుంటాడు లారెన్స్. అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవిగారు తన శిష్యుడ్ని అభినందిస్తూ 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు’’ అన్నారు. ‘‘అమెరికాలో సిల్వస్టర్ స్టాలోన్ తనని తాను హీరోగా తయారు చేసుకున్నాడు. అలాగే లారెన్స్ కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు’’ అన్నారు నిర్మాత ‘లగడపాటి’ శ్రీధర్. ‘‘లారెన్స్లో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ‘ఠాగూర్’ మధుగారికి థాంక్స్. లగడపాటి శ్రీధర్గారితో ‘స్టైల్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘స్టైల్ 2’ చేద్దామంటున్నారు.. తప్పకుండా చేస్తాను. డ్యాన్స్ సినిమా చేయాలంటే మంచి డ్యాన్సర్ కావాలి. ఇక్కడ బాగా డ్యాన్స్ చేసే వాళ్లలో బన్నీ, చరణ్, తారక్ ఉన్నారు. అన్నయ్యే (చిరంజీవి) అన్నింటికీ బాస్. ఆయన ‘హిట్లర్’ సినిమాలో డ్యాన్స్ మాస్టర్గా చాన్స్ ఇవ్వకుంటే.. నేను నంబర్ వన్ డ్యాన్స్మాస్టర్ని అయ్యేవాడినే కాను. నాగార్జునగారు డైరెక్షన్ చాన్స్ ఇచ్చేవారే కాదు. నన్ను ఆశీర్వదించిన రజనీకాంత్గారికి, చిరంజీవిగారికి, నన్ను డైరెక్టర్ని చేసిన నాగార్జునగారికి థాంక్స్. నేను డ్యాన్స్ మాస్టర్గా ఎదిగింది తెలుగు రాష్ట్రాల్లోనే కాబట్టి ఇక్కడ కూడా చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాను. ట్రస్ట్ ద్వారా మంచి పనులు చేస్తున్నానంటే కారణం మా అమ్మగారే. ఆమె లేకుంటే నేను బ్రెయిన్ ట్యూమర్తో ఎప్పుడో చనిపోయేవాణ్ణి. మా అమ్మే నాకు దేవత. అందుకే అమ్మకు గుడి కట్టించాను. ఓపెన్ హార్ట్ సర్జరీ సమస్య, ఆర్థికంగా వెనకబడి చదువుకోలేనివారు నన్ను సంప్రదించవచ్చు’’ అన్నారు. -
అల్లు పూల్
అల్లువారి ఇంట్లో బుధవారం ఆనందం అల్లరి చేసింది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగానే అల్లువారి ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా. ఈ దంపతులకు అర్హా అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే మనవడి పుట్టినరోజుని అల్లు అరవింద్ ఓ స్విమింగ్పూల్ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘నాకు ఎంతో అమూల్యమైనవాడు. ఐదేళ్ల స్వీట్నెస్, చిలిపితనం, క్యూట్నెస్... అంతులేని ప్రేమ.. అయాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్కు పుట్టినరోజు బహుమతిగా మా నాన్నగారు స్విమ్మింగ్పూల్ను బహుమతిగా ఇచ్చారు. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం ‘నీకు ఏం గిఫ్ట్ కావాలి? అని అయాన్ను నాన్న అడిగినప్పుడు స్మిమ్మింగ్పూల్ అని చెప్పాడు. నాన్న ఒప్పుకున్నారు. స్విమ్మింగ్ను బహుమతిగా ఇచ్చారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. మా నాలుగో తరం పిల్లలని చూసి నాకు అసూయగా ఉంది. అన్నట్లు.. ఈ స్విమ్మింగ్ పూల్కు అయాన్పూల్ అని పేరు పెట్టాం’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘అయాన్కు ఐదోవ జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు స్నేహా. -
అల్లు పూల్
అల్లువారి ఇంట్లో బుధవారం ఆనందం అల్లరి చేసింది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగానే అల్లువారి ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా. ఈ దంపతులకు అర్హా అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే మనవడి పుట్టినరోజుని అల్లు అరవింద్ ఓ స్విమింగ్పూల్ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘నాకు ఎంతో అమూల్యమైనవాడు. ఐదేళ్ల స్వీట్నెస్, చిలిపితనం, క్యూట్నెస్... అంతులేని ప్రేమ.. అయాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్కు పుట్టినరోజు బహుమతిగా మా నాన్నగారు స్విమ్మింగ్పూల్ను బహుమతిగా ఇచ్చారు. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం ‘నీకు ఏం గిఫ్ట్ కావాలి? అని అయాన్ను నాన్న అడిగినప్పుడు స్మిమ్మింగ్పూల్ అని చెప్పాడు. నాన్న ఒప్పుకున్నారు. స్విమ్మింగ్ను బహుమతిగా ఇచ్చారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. మా నాలుగో తరం పిల్లలని చూసి నాకు అసూయగా ఉంది. అన్నట్లు.. ఈ స్విమ్మింగ్ పూల్కు అయాన్పూల్ అని పేరు పెట్టాం’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘అయాన్కు ఐదోవ జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు స్నేహా. -
సమ్మర్లో షురూ
‘నెక్ట్స్ ఏంటి?’ అంటూ మంగళవారం ‘సాక్షి’లో అఖిల్ గురించి ఓ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ‘మిస్టర్ మజ్ను’ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఏంటి? అనేది వార్త సారాంశం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, పరశురామ్, సత్య ప్రభాస్ ఎవరో ఒకరి దర్శకత్వంలో సినిమా ఉంటుందని చెప్పాం. ఇప్పుడు ఎవరి డైరెక్షన్లో చేయబోతున్నారో చెప్పేస్తున్నాం. ‘బొమ్మరిల్లు’ భాస్కర్తో అఖిల్ సినిమా ఫిక్స్ అయింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘బొమ్మరిల్లు, పరుగు’ సినిమాలతో తనలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్న భాస్కర్ కొంత గ్యాప్ తర్వాత చేయబోతున్న సినిమా ఇది. -
ఈ అవకాశం రావడం వైష్ణవ్ అదృష్టం
చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయిదరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్స్ వైష్ణవ్ తేజ్, మనీషా రాజ్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చిరంజీవి క్లాప్ ఇచ్చారు. నాగబాబు, అల్లు అర్జున్ స్క్రిప్ట్ను టీమ్కు అందించారు. ఈ సినిమా షూటింగ్ మార్చి మొదటి వారం నుంచి స్టార్ట్ కానుంది. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మైత్రీ మూవీస్ గురించి, ఆ సంస్థ అందించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్తవాళ్లను ప్రోత్సహిస్తున్నందుకు సుకుమార్ని అభినందిస్తున్నాను. ‘రంగస్థలం’ సినిమాతో సుకుమార్, మైత్రీ వాళ్లతో నాకు అనుబంధం ఏర్పడింది. వైష్ణవ్కి ఇంత మంచి అవకాశం రావడం అదృష్టం. ఈ అవకాశాన్ని వైష్ణవ్ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బుచ్చిబాబు కొత్త కథ రాశాడు. ‘రంగస్థలం’ కథా చర్చల్లో బుచ్చిబాబు పాత్ర ఎంతో ఉందని సుకుమార్ నాతో చెప్పారు’’ అన్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్లో సుకుమార్ కూడా భాగమైనప్పుడు ఈ సినిమా డిఫరెంట్గా ఉంటుందనుకున్నాను. వైష్ణవ్, మనీషాకు నా అభినందనలు. దర్శకుడు అడిగిందల్లా ఇచ్చే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. దేవిశ్రీ కూడా తోడై ఈ సినిమా స్టామినా పెంచేశారు’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘బుచ్చిబాబు అద్భుతమైన కథ రాశాడు. నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది. కథ రాస్తున్నప్పుడే వైష్ణవ్ హీరో అని ఫిక్స్ అయ్యాడు బుచ్చి. మైత్రీ వాళ్లకు థ్యాంక్స్. పెద్ద సినిమాలు నిర్మిస్తూ, చిన్న సినిమాలనూ నిర్మించడం వారికే సొంతం. దేవిశ్రీ ప్రసాద్కు థ్యాంక్స్. వైష్ణవ్కి మంచి భవిష్యతు ఉంది. కథ ఇంత బాగా రావడానికి కారణం చిరంజీవిగారే. ఆయన చాలా ఇన్ఫుట్స్ ఇచ్చారు’’ అన్నారు సుకుమార్. ‘‘కథ చాలా అద్భుతంగా వచ్చింది. హీరో, హీరోయిన్ సినిమాకు సరిగ్గా సరిపోయారు’’ అన్నారు నిర్మాత నవీన్ యర్నేని. ‘‘సుకుమార్గారికి థ్యాంక్స్ అని చెప్పడం చిన్న పదం అయిపోతుంది. నన్ను నమ్మిన అమ్మా నాన్నలకు, చిరంజీవిగారికి థ్యాంక్స్. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. నిర్మాతలకు, దేవిశ్రీ ప్రసాద్గారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారికా, దేవిశ్రీ ప్రసాద్, వైష్ణవ్ తేజ్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
గజినీ 2 ?
తెలుగు ఆడియన్స్కు సూర్యను బాగా దగ్గర చేసిన చిత్రం ‘గజిని’. ఈ తమిళ సూపర్ హిట్ను తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. తమిళంలోలానే ఇక్కడా ఘనవిజయం సాధించింది. అంతే కాదు హిందీ వెర్షన్ను ఆమిర్తో నిర్మించారు అరవింద్. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే గీతా ఆర్ట్స్ బ్యానర్పై ‘గజినీ 2’ అనే టైటిల్ను తెలుగు, తమిళ భాషల్లో రిజిస్టర్ చేయించినట్టు తెలిసింది. మరి ఈ సినిమా సూర్య, మురుగదాస్ కాంబినేషన్లోనే ఉంటుందా? కాంబినేషన్ మారుతుందా? వేచి చూడాలి. -
ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది!
‘‘దిల్’ రాజు మా కుటుంబ సభ్యుడు. కథని నమ్ముకుని ప్రయాణం చేసే అతి తక్కువ మంది నిర్మాతల్లో రాజుగారు ఒకరు. అలాంటి నిర్మాత ఎంచుకున్న దర్శకుడు త్రినాథరావు. రామ్ స్వచ్ఛత ఉన్న మనిషి. తన సినిమాలు సరదాగా ఉంటాయి. ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో రామ్తో సెటిల్డ్గా చేయించారు త్రినాథరావు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాకు హర్షిత్ నా వద్ద పనిచేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్మీట్లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘నేను తీసిన ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే’ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఓ డైరెక్టర్గా ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది.ఈ మధ్య కాలంలో ప్రకాశ్రాజ్గారితో చాలా ఎక్కువ రోజులు పనిచేసిన యూనిట్ మాదే. మా సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ దసరాకి ప్రేక్షకులు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు హ్యాపీ. చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే సంతోషంగా అనిపించింది. రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. త్రినాథ్రావుగారు చాలా ఎంటర్టైనింగ్ డైరెక్టర్’’ అన్నారు రామ్. ‘‘డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, రైటర్గా 34 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నా. త్రినాథరావుని చూస్తే.. ఏ కోశానా డైరెక్టర్ లుక్లో కనపడడు. కానీ, సినిమాను కంఫర్ట్బుల్గా తీస్తాడు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ఈ సమావేశంలో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, రచయితలు సాయికృష్ణ, ప్రసన్న కుమార్, నిర్మాత హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రైలర్, సినిమా చూసి బాగుందన్నా
‘‘బన్ని ఓ సారి ‘పేపర్ బాయ్’ ట్రైలర్ పంపి చూడమన్నాడు. చూసి చాలా బాగుందన్నా. తర్వాత మెహర్ రమేశ్ వచ్చి ఈ సినిమా చూడమంటే చూసి, చాలా బాగుంది అన్నాను. మీరు ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? అన్నాడు మెహర్ రమేశ్. ఇండస్ట్రీనే నమ్ముకున్న సంపత్నందిలాంటి వ్యక్తి ఓ కథ రాసుకుని మరో డైరెక్టర్కి అవకాశం ఇచ్చి, మంచి సినిమా చేసినప్పుడు మా సంస్థ ద్వారా విడుదలైతే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందనే విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సంతోష్ శోభన్, రియా సుమన్, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్లో డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘పేపర్ బాయ్’ హక్కులను అల్లు అరవింద్గారు తీసుకున్నారని చెప్పగానే సినిమా చాలా పెద్ద హిట్ అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అరవింద్గారి జడ్జ్మెంట్పై నాకు అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు ఇది పెద్ద సినిమా’’ అన్నారు. ‘‘చిన్న సినిమా నిర్మాతలకు ఉండే కష్టాలేంటో నాకు తెలుసు.‘ పేపర్ బాయ్’ లాంటి చిన్న సినిమాకు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘అరవింద్గారు రిలీజ్ చేస్తున్నారనగానే ఇదొక మంచి సినిమా అనే గుర్తింపు వచ్చింది. ఆయనకు మా సినిమా గురించి చెప్పిన మెహర్ రమేశ్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు సంపత్ నంది. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిగా కష్టపడుతున్నాం. గీతా ఆర్ట్స్వారు మా సినిమాను తీసుకోవడం వల్ల ఈ కష్టం మరచిపోయాం’’ అన్నారు జయశంకర్. దర్శకులు మెహర్ రమేశ్, కల్యాణ్ కృష్ణ, సంతోష్ శోభన్ తదితరులు పాల్గొన్నారు. -
కాన్సెప్ట్ అదేనా?
‘మనం’ సినిమా కథ చెప్పి, ఒప్పించడం కష్టం. పోనీ ‘24’ సినిమా కథ? మళ్లీ అదే పరిస్థితి. ఇలా.. చెప్పుకోవడానికి చాలా క్లిష్టంగా చూడటానికి చాలా క్లియర్గా ఉంటాయి దర్శకుడు విక్రమ్కుమార్ సినిమా కథలు. ఈసారి కూడా ఆడియన్స్కు ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా చెప్పడానికే రెడీ అవుతున్నారట విక్రమ్ కుమార్. అల్లు అర్జున్ హీరోగా విక్రమ్కుమార్ ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా షికారు చేస్తున్న పుకారు ఏంటంటే ఈ సినిమా కథ పునర్జన్మల నేప«థ్యంలో సాగనుందని. ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా కొంచెం టైమ్ తీసుకున్నారు అల్లు అర్జున్. విక్రమ్కుమార్ చెప్పిన ఈ పాయింట్ బన్నీని చాలా ఎగై్జట్ చేసిందని సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించనున్నారట. -
నేను యస్.. ఆయన వి...
‘‘గీత గోవిందం’ సినిమా పూజ రోజు అల్లు అరవింద్గారు నాతో ‘మా లక్ష్మీ (పారితోషికం)ని మీరు తీసుకొని మీ సరస్వతి (కెమెరా వర్క్)ని మాకు ఇవ్వండి’ అన్నారు. ఎందుకో ఆ మాట నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. టెక్నీషియన్స్కు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చాలా గొప్పది’’ అని కెమెరామేన్ యస్. మణికందన్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఈ నెల 15న రిలీజైన ఈ సినిమా మంచి టాక్తో దూసుకెళ్తోందని చిత్రబృందం పేర్కొంది. మణికందన్ చెప్పిన విశేషాలు. ► కెరీర్ స్టార్టింగ్లో కెమెరామేన్ శరవణన్, మనోజ్ పరమహంసలగారి వద్ద వర్క్ చేశాను. ‘రేసు గుర్రం’ సినిమాలో రెండు పాటలకు లైటింగ్ చేయడానికి వస్తే ‘ముకుంద’ సినిమాకు అవకాశం వచ్చింది. తమిళంలో ‘కుట్రమ్ కడిదల్, మగళిర్ మట్టుమ్’ అనే సినిమాలు చేశాను. ► ‘గీత గోవిందం’ పాయింట్ బావుంది.. ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. సినిమా హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఈ రేంజ్ బ్లాక్బస్టర్ అవుతుందనుకోలేదు. అరవింద్గారి అనుభవం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకు ఏం కావాలో మాత్రమే ఆలోచిస్తారు. వరుసగా రెండు సార్లు ఆయన బ్యానర్లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. పరశురామ్తో వర్క్ చేయడం బాగుంటుంది. ఫస్ట్ సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’ జర్నీ చాలా నచ్చడంతో సెకండ్ సినిమాకు కూడా అసోసియేట్ అయ్యాం. ► ‘బన్నీ’ వాసు గారు సినిమా స్టార్ట్ కాకముందు ఏం కావాలి? అని అడుగుతారు. అంత ఫ్రీడమ్ ఇస్తారు. విజయ్ దేవరకొండ సింప్లీ సూపర్. ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అయినా కూడా తను మాత్రం సింపుల్గానే ఉన్నాడు. ► నా నెక్ట్స్ మూవీ సెప్టెంబర్లో ఆరంభమవుతుంది. పూరీగారు కాల్ చేశారు. త్వరలో అనౌన్స్ చేస్తాను. తెలుగు ఆడియన్స్ అంటే ఇష్టం. వాళ్లు సినిమా మీద చూపించే అభిమానం ఆకట్టుకుంది. నా దృష్టిలో బెస్ట్ ఆడియన్స్ అంటాను. ‘‘చాలామంది నన్ను కెమెరామేన్ వి.మణికందన్ (ఓం శాంతి ఓం, రా.వన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఫేమ్)తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇదే విషయాన్ని ఓసారి ఆయనతో చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు నా ‘ఓం శాంతి ఓం’ నువ్వే చేశా వని చెప్పేయ్’’ అని సరదాగా అన్నారు. -
ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కర్ని హెచ్చరిస్తున్నా: చిరంజీవి
‘‘ఈ ఫంక్షన్లో పాలు పంచుకోవడం నా బాధ్యత. ఆ సంతృప్తి కోసమే ‘గీత గోవిందం’ సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చా. ఓ సినిమా బాగుందంటే అది చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెట్ సినిమానా అని ఆలోచించరు. కంటెంట్ బాగుంటే మీ (ప్రేక్షకులు) దృష్టిలో అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే’’ అని చిరంజీవి అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘రెండేళ్లుగా చూస్తుంటే తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషం, ఉత్సాహం, ప్రోత్సాహంతో ముందుకెళుతోందన్నది వాస్తవం. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, అభిమానానికి మేం ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం. ఏం సినిమా తీస్తున్నారని అరవింద్గారిని నేను అడిగినప్పుడు ‘గీత గోవిందం’ చేస్తున్నాను. ‘అర్జున్రెడ్డి’ సినిమాలో విజయ్ అగ్రెసివ్ పాత్ర చేశాడు.. ‘గీత గోవిందం’ సినిమాలో చాలా సాఫ్ట్. ఈ పాత్రని ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న డౌట్ వచ్చినప్పుడు ‘విజేత’ గుర్తొచ్చింది. ‘ఖైదీ, అడవిదొంగ, చట్టంతో పోరాటం, చట్టానికి కళ్లు లేవు’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా నేను దూసుకెళుతున్న టైమ్లో.. ‘విజేత’ ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఈ పాత్రలో నన్ను ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న మీమాంస నాకు, అరవింద్గారికి ఉండేది. ఆ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసి, ఆల్ క్లాస్ హీరో అనిపించింది. ‘గీత గోవిందం’ సినిమా కూడా విజయ్ని ఆల్ క్లాస్ హీరో అనిపించింది. విజయ్కి ఇది ల్యాండ్ మార్క్ ఫిల్మ్. నీకు చాలా భవిష్యత్ ఉంది. ఈ సినిమాతో నీకు స్టార్ స్టేటస్ వచ్చింది. 1978 నుంచి నేను 30 సినిమాలు చేసినా సరే ‘ఖైదీ’ సినిమా నాకు స్టార్ హీరో స్టేటస్ ఇచ్చింది. ఇండస్ట్రీలోని టాప్స్టార్స్లో విజయ్ ఒక్కడు అయినందుకు స్వాగతిస్తున్నా. మన ఇండస్ట్రీకి దక్కిన మరో అరుదైన స్టార్ విజయ్ దేవరకొండ’’ అన్నారు. ఇదేం న్యాయం పైరసీ గురించి చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గీత గోవిందం’ సినిమా కంటెంట్ దాదాపు గంటన్నర్ర లీకైపోయింది.. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు అరవింద్. ఆయనకు ఊరట కలిగించేందుకు నేను ఓ మాట చెప్పా. పవన్ కల్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ కంటెంట్ లీకైనా సక్సెస్కి ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. ‘గీత గోవిందం’ సినిమా కూడా ‘అత్తారింటికి దారేది’ అంత హిట్ అవుతుందని సెంటిమెంట్గా అనుకోమని చెప్పా. ఇన్ని కోట్లు వెచ్చించి ఓ సినిమా తీసిన తర్వాత ఆ కంటెంట్ని కుర్రతనంగానో, వేరే దురుద్దేశాలు ఉండో దాన్ని చోరీ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం ఏం న్యాయం? సినిమా పరిశ్రమ కొన్ని వేలమందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న మాతృసంస్థ.. తల్లిలాంటిది. ఇక్కడ పనిచేసే టెక్నీషియన్స్ దాన్ని దొంగలించి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడమంటే ఎంత ద్రోహం చేస్తున్నారంటే.. తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లే అని తెలుసుకోవాలి. ఈరోజు వారంతా జైలులో ఊసలు లెక్కపెడుతున్నారు. ఈ దుస్థితి కావాలా మీకు? మీ తల్లితండ్రులకు బాధ కలిగించాలా? ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కర్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. కింది స్థాయి టెక్నీషియన్స్ ఎవరైనా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే అది మీ తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లే అని గుర్తుంచుకోండి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ లాస్ట్ రీల్ రీ–రికార్డింగ్ టైమ్లో కంటెంట్ లీకు అయిందని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇంతటి విజయ పతాకం ఎగురవేస్తుంటే మేం చూసి ఆనందిస్తున్నాం. పరశురామ్ గ్రేట్ రైటర్. చిరుకి, విజయ్కి కొన్ని కామన్ పోలికలు ఉన్నాయి. విజయ్.. ఈ సినిమాతో నువ్వు స్టార్ అయ్యావు’’ అన్నారు. చిత్ర నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం బన్నీనే (అల్లు అర్జున్). అరవింద్ గారికి రెండు సక్సెస్ సీక్రెట్స్ ఉన్నాయి. సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా బాగా రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?.. ఇదే ఆయన మొదటి సక్సెస్ ఫార్ములా. రెండో సక్సెస్ ఫార్ములా ఏంటంటే.. డైరెక్టర్ అనుకున్నట్లు సినిమా వచ్చేవరకూ, ఆయనకు సంతృప్తి ఇచ్చే వరకూ తీయిస్తూనే ఉంటారు’’ అన్నారు. పరశురామ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి, నాకు పునర్జన్మను ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. చిరంజీవి సార్.. మీరు మా సినిమా చూసి నాతో మాట్లాడిన మాటలు నాకు భగవద్గీత లాంటివి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్లేని విజయ్ హీరోగా ఎదుగుతూ పైకొస్తుంటే ప్రోత్సహిస్తున్న చిరంజీవిగారికి హ్యాట్సాఫ్’’ అన్నారు. ‘‘ఇక్కడ మనం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. కేరళ పరిస్థితి బాగోలేదని మొన్నే చిరంజీవిగారు, చరణ్, బన్నీ చేయూతనిచ్చారు. అరవింద్గారి అనుమతితో మా బ్యానర్ నుంచి ఓ పది లక్షలు ఇవ్వనున్నామని ఇక్కడ ప్రకటిస్తున్నా. ‘అర్జున్రెడ్డి’తో కాదు ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ హీరో స్థాయికి వెళ్లాడు విజయ్’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్ వెనకాల అరవింద్గారు, పరశురామ్గారు, ‘బన్నీ’వాసుగారు ఉన్నారు. జస్ట్ నేను యాక్టర్లా నా జాబ్ చేశానంతే’’ అన్నారు విజయ్ దేవరకొండ. సీనియర్ నటి అన్నపూర్ణ, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, శానం నాగఅశోక్కుమార్, డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, కెమెరామేన్ మణికందన్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే
‘‘ఓ మంచి సినిమా తీసినప్పుడు ఉండే ఆనందం అనుకోని సంఘటనలు జరిగితే బాధగా మారుతుంది. గుంటూరులో ఉన్న తన మరదలి మెప్పు కోసం ఒక కుర్రాడు సినిమాని బయటపెట్టేశాడు. ఇది కావాలని చేసిన నేరమని అనడంలేదు. తెలిసి చేíసినా తెలియక చేసినా పెద్ద నేరమే’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ చిత్రం కొంత భాగం ఆన్లైన్లో లీక్ అయిందని చిత్రబృందం ఆవేదన వ్యక్తం చేసింది. పైరసీ గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ప్రపంచంలో పైరసీ ఎవరు చేసినా 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. రిలీజ్ కాని మా సొత్తును మీరు (పైరసీదారులు) తీసుకోవడం దొంగతనం. సినిమా తీసేవాళ్లందరం సినిమాను దాచుకోవడానికి డీఐటి అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అక్కడ పని చేసే ఒక కుర్రాడు చేసిన తప్పు ఇది. అలా మా సినిమా వైరల్ అయింది. పోలీస్ విచారణ జరుగుతోంది’’ అన్నారు. ‘‘రాత్రి (ఆదివారం జరిగిన ప్రీ–రిలీజ్ వేడుక) నేను అరవింద్గారి స్పీచ్ విన్నాను. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండాలా? లేదా అని అనడం బాధగా అనిపించింది. ఎవరో కొంతమంది సరదాగా చేసిన పనికి ఇంత పెద్ద మనిషి బాధపడటం ఏంటి? హెచ్చరిక అనుకోండి.. రిక్వెస్ట్ అనుకోండి. ఇటువంటి తప్పులు జరిగితే క్షమించం. సినిమా అనేది మా ప్రాణం’’ అన్నారు ‘దిల్’ రాజు. పి. కిరణ్ మాట్లాడుతూ– ‘‘ఉద్యోగం కోసం ఇండస్ట్రీకి వస్తుంటారు. నమ్మి ఉద్యోగం ఇస్తే, ఇలాంటి మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? దయ చేసి స్టూడెంట్స్ ఇలాంటి పనులకు దూరంగా ఉండండి. పైరసీ అనేది ఒక మేజర్ క్రైమ్. చిన్నప్పటి నుంచి పిల్లలకు దొంగతనం చేయకూడదని చెప్పినట్టు పైరసీ కూడా చేయకూడదని ప్రతి ఒక్కరికీ చెప్పాలి’’ అన్నారు. ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ – ‘‘నాకు ఆరున్నర సంవత్సరాల కొడుకు, మూడున్నర సంవత్సరాల పాప ఉన్నారు. వాళ్లను చూసి 12 రోజులు అయింది. ఎడిటింగ్ రూమ్లో మేం పని చేసుకుంటుంటే మా సినిమా లీక్ అయిందని ఎవరో చెప్పారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. ఈ విషయంలో సహాయం చేసిన గుంటూరు ఎస్పీకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫిర్యాదు చేసిన గంట లోపలే ఏ సిస్టమ్ నుంచి ఈ వీడియోను అప్లోడ్ చేశారో మాకు సమాచారం ఇచ్చారు. 12 గంటల లోపే 40 మంది టీమ్తో ఈ పైరసీ జరుగుతున్న రెండు హాస్టల్స్ మీద దాడి చేశారు. దాదాపు 27 మందిని అరెస్ట్ చేశారు. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీశాం. ఇంకో కోటి రూపాయిలు పెట్టి ఆ దొంగలందర్నీ పట్టుకుంటాం. ఇది పైరసీ కేసు కాదు. దొంగతనానికి సంబంధించిన కేసు. దీనిలో భాగస్వాములైన స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇది బాధపడాల్సిన విషయం అయినప్పటికీ వాళ్లు శిక్షార్హులని నా అభిప్రాయం’’ అన్నారు. పరశురామ్ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా కథను ఓకే చేయించుకోవడానికి ప్రతి డైరెక్టర్కి దాదాపు రెండున్నరేళ్లు పడుతుంది. ఈ ప్రయాణంలో దాదాపు 100సార్లు ఆ కథ చెప్పాలి. నిర్మాతలకు, ఆర్టిస్టులకు అనుగుణంగా మార్చుకొని తల బద్దలు కొట్టుకొని ఒక సినిమా తీస్తాం. ఇన్ని కష్టాలు పడి సినిమా తీస్తే దాన్ని జనం దాకా తీసుకువెళ్లడానికి ఎన్ని కష్టాలు పడాలి? గర్భంలో బిడ్డను 9 నెలలు మోసి ఆ కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి దానితో సెల్ఫీలు దిగి ఆనందపడే పరిస్థితుల్లో ఉన్నట్లుగా మా సినిమా రిలీజ్కి రెడీ అయిన సమయంలో ఊహించని షాక్. మా జీవితాలతో ఆడుకోవద్దు’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘మేం సినిమా చేసేదే థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూద్దాం అని. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థకి జరిగింది కాబట్టి ‘మేం ఉన్నాం. నువ్వేం బాధపడొద్దు’ అని అరవింద్గారు ధైర్యం చెప్పారు. అదే ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి’ లాంటి చిన్న సినిమాలకు ఇలా జరిగితే మేం ఉండేవాళ్లం కాదు. స్టూడెంట్స్ అంతా మనవాళ్లే అని ముద్దుగా వాళ్లను రౌడీస్ అని పిలుచుకుంటాను. స్టూడెంట్సే నన్ను అర్థం చేసుకోకుండా నా సినిమాను బయటకు తీసుకువస్తే నేనెవరికి చెప్పుకోవాలి? ఎడిటింగ్, సౌండ్ సరిగ్గా లేని కంటెంట్ని చూస్తే ఏం మజా వస్తుంది? ఇప్పుడు సినిమా చేయడంకంటే ఆ సినిమా పైరసీ కాకుండా చూడటమే ముఖ్యం అనిపిస్తోంది’’ అన్నారు. నిర్మాత దామోదర ప్రసాద్ పాల్గొన్నారు. -
నాన్నగారికి రాజుగారు అప్పు ఇచ్చారు
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రిస్క్. ఆ రిస్క్ తీసుకోవడానికి యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్లు ఎప్పుడూ ముందుంటారు. కానీ తెరవెనుక నుంచే మొత్తం నడుపుతారు. రిస్క్, రివార్డులు తీసుకునే వాళ్లలో ‘బాహుబలి’ నిర్మాతలు (శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని) తర్వాత వీరినే అనుకుంటా. గుండె ధైర్యంతో పాటు చాలా పెద్ద మనసున్న మంచివాళ్లు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిహారిక మా ముందు పుట్టి పెరిగి మామయ్యా.. అంటుండేది. ఇవాళ హీరోయిన్గా చూస్తుంటే నాకు డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతోంది. సుమంత్ అశ్విన్ డీసెంట్, ప్లెజెంట్, రొమాంటిక్ యాక్టర్. టీనేజ్కి కొంచెం పైబడినట్టు ఉండి రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయగల తక్కువ మంది హీరోల్లో సుమంత్ ఒక్కరు. ఎమ్మెస్ రాజుగారితో పోటీ పడి పైకొచ్చాం. అంత మంచి నిర్మాత ఆయన. ఇటీవల ఓ సినిమాలో మురళీశర్మగారి నటన చూశాక ఎస్వీ రంగారావుగారి అవార్డు ఉంటే ఇవ్వాలనిపించింది. అంత బాగా చేశారు. ‘సమ్మోహనం’ సినిమా చూసి నరేశ్ని అభినందిస్తూ మెసేజ్ చేశా. ‘హ్యాపి వెడ్డింగ్’ ఫీల్ గుడ్ మూవీ. సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలనుకునే సినిమాల్లో ఇదొకటి’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘నిహారిక కోసమో, ఈ సినిమా గురించి మాట్లాడటానికో ఇక్కడికి రాలేదు. ఎమ్మెస్ రాజుగారి కోసం వచ్చా. ఆయన, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. వంశీ అన్న, విక్రమ్, ప్రమోద్గారు చేసిన ప్రతి సినిమా హిట్ అవుతోంది. వారిపై నమ్మకంతో, నిహారిక మాటలు విన్నాక, ట్రైలర్ చూశాక కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందనిపించింది. ట్రైలర్ పండితే సినిమా కూడా పండుతుందని చాలా వరకు నేను నమ్ముతా. మురళీశర్మగారితో ‘ఎవడు’ సినిమా చేశా. త్వరలో మరో సినిమా చేయాలనుకుంటున్నా. సుమంత్ వెరీ హార్డ్వర్కర్. తన కెరీర్కి ఇది మైల్స్టోన్ అవుతుంది. ఎమ్మెస్ రాజుగారితో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. నెలక్రితం నాన్నగారు (చిరంజీవి), నేను కూర్చుని ఉన్నప్పుడు రాజుగారి టాపిక్ వచ్చింది. నాన్నగారు 1980లలో జరిగిన ఓ సంఘటన చెప్పారు. నాన్నగారు చాలా మంది నిర్మాతలతో పని చేస్తూ ఉండేవారు. ఓ నెల నాన్నకీ, అమ్మకీ డబ్బులు సరిపోలేదు. నాన్నగారు హీరోగా పని చేస్తున్న ఓ ముగ్గురు నిర్మాతలను ఐదు వేలు అప్పు అడిగితే వాళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. చివరిగా ఎమ్మెస్ రాజుగారి నాన్నగార్ని (అయ్యప్పరాజు) అడిగినప్పుడు.. ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా ఐదు వేల రూపాయలు నాన్నగారికి ఇచ్చి తీసుకో.. తర్వాత తీసుకుంటాను అన్నారట ఎమ్మెస్ రాజుగారు. తర్వాత నాన్న తిరిగిచ్చేశారు. అది ఇవాళ్టికి కూడా గుర్తుపెట్టుకుని నాన్నగారు నాకు చెప్పారు. ఎమ్మెస్ రాజుగారు నాకు ఫోన్ చేసి ఫంక్షన్ గురించి చెప్పగానే అది నా బాధ్యత.. వస్తాను అన్నాను. ఇక్కడికి నేను రావడం గొప్ప విషయం కాదు. ఆయన గొప్పతనం మీ అందరికీ చెప్పాలనే ఇక్కడికొచ్చా. నటుడికి, నిర్మాతకి, డైరెక్టర్కి కావాల్సింది ప్రతిభే కాదు మంచి ప్రవర్తన. గ్రేట్ టాలెంట్ ఉన్నవారు బ్యాడ్ యాటిట్యూడ్తో ఉంటే సక్సెస్ అవలేరు కానీ, బ్యాడ్ టాలెంట్ ఉన్నా ఒక మంచి యాటిట్యూడ్ ఉంటే ఎప్పటికైనా లైఫ్లో సక్సెస్ అవుతారు. అలాంటి రాజుగారి ఫ్యామిలీ ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉండాలని మా ఫ్యామిలీ తరఫునుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘హ్యాపి వెడ్డింగ్’ వెరీ గుడ్ టైటిల్. చాలా పాజిటివ్గా ఉంది. ఈ సినిమా ‘బొమ్మరిల్లు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు డైరెక్టర్ బి. గోపాల్. ‘‘నా దృష్టిలో ప్రతి ఒక్కరి జీవితంలో బిగ్గెస్ట్ ఫంక్షన్ పెళ్లి. ఆ ఈవెంట్ ఓ ఎమోషనల్ ప్యాకేజ్.. అదే మా ‘హ్యాపి వెడ్డింగ్’. ఈ సినిమా ఫీల్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళతారని చెప్పగలను. సుమంత్, నిహారికగార్ల సపోర్ట్ లేకుంటే ఈ సినిమా చాలా కష్టం’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘హ్యాపి వెడ్డింగ్’ కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యి ఓకే చేశా. ఈ కథకి అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారు. వంశీ, ప్రమోద్గారు లక్కున్న నిర్మాతలు. ఆ లక్ మాకూ వస్తుందనుకుంటున్నా’’ అన్నారు నిహారిక. ‘‘ఈ సినిమాలో కొన్ని సీన్లకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అవి స్వీట్ మెమొరీస్. వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ప్రేక్షకులే దేవుళ్లు. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి’’ అన్నారు సుమంత్ అశ్విన్. -
థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లోనే..
యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్లు అన్నీ సురేష్బాబు, అల్లు అరవింద్, దిల్రాజ్, సునీల్ చేతిల్లోనే ఉన్నాయని తెలంగాణ ఫిలిమ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ నలుగురు రెండు రాష్ట్రాల్లోని థియేటర్లను తమచేతుల్లో పెట్టుకుని చిన్న సినిమాలు విడుదల కాకుండా చేస్తున్నారని అన్నారు. ఆ నలుగురికి దీటుగా చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు త్వరలోనే డిజిటల్ చానల్ ప్రారంభిస్తున్నామని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని తెలిపారు. ప్రభుత్వానికి 20శాతం పన్ను కడుతూ.. చిన్న, పెద్ద సినిమాలను రిలీజ్ చేసేం దుకు ముందుకు వెళ్తుమన్నారు. థియేటర్లు అవస రం లేకుండానే మా డిజిటల్ ద్వారానే అన్ని టీవీ ల్లో సినిమాలను విడుదల చేస్తామని అన్నారు. ఇం డియాలో ఎక్కడ లేని విధంగా ‘మా’ డిజిటల్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ‘మా’ డిజిటల్ ద్వారా సుమారు 1000 చిన్న సినిమాలను రిలీజ్ చేస్తామన్నారు. ఇది విజయవంతం కావాలని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నట్లు చెప్పారు. సమావేశంలో సోగ్గాడే శోభన్ కృష్ణ సినిమా హీరో రాయగిరి ఉమాపతిగౌడ్, డైరెక్టర్ జింక హరీష్బాబు, సినిమా ఆర్టిస్టు సత్యనారాయణ ఉన్నారు. -
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ప్రారంభం
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మొదలైంది. శనివారం హైదరాబాద్లో సందడి సందడిగా స్టార్ట్ అయింది. వైవిధ్యమైన చిత్రాలతో జోరు మీదున్న వెంకటేశ్, ఫిదా, తొలి ప్రేమ సినిమాల విజయాలతో మంచి ఊపు మీదున్న వరుణ్ తేజ్ ఈ ఎఫ్ అండ్ ఎఫ్కి హీరోలు. ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది చిత్రానికి ఉపశీర్షిక. హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో జరిగింది. తొలి సన్నివేశంలో పాల్గొన్న ఇద్దరు హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్లపై నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. అనంతరం అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, శిరీష్, వెంకటేశ్, వరుణ్ తేజ్ అందరూ కలిసి సినిమా స్క్రిప్ట్ను దర్శకుడు అనిల్ రావిపూడికి అందించారు. జూలై 5న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. తమన్నా, మెహరీన్లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తారు. సమీర్రెడ్డి ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో శిరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
గీత.. గోవిందం... కహానీ ఏంటి?
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా జంటగా ‘శ్రీరస్తు శుభమస్తు’ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గీత గోవిందం’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను శనివారం రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘పెళ్లి చూపులు’, ‘అర్జున్రెడ్డి’ సినిమాల్లో మంచి యాక్టింగ్ స్కిల్స్తో విజయ్ స్టార్డమ్ సంపాదించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా విజయ్ కెరీర్లో బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. విజయ్, రష్మికల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటాయి. మా బ్యానర్లో రెండో చిత్రం చేస్తున్న పరశురాం కమిట్మెంట్ ఉన్న దర్శకుడు. గోపీసుందర్ సంగీతం బాగుంది. రిలీజ్ డేట్ని త్వరలోనే ‘బన్నీ’ వాసు ఎనౌన్స్ చేస్తారు’’ అన్నారు. ‘‘థియేటర్కి వచ్చే ప్రేక్షకుడు నిరుత్సాహపడకూడదనేలా మమ్మల్ని వర్క్ చేయమని ప్రోత్సహించే అల్లు అరవింద్గారు ఈ సినిమాకు సమర్పకులుగా ఉండటం హ్యాపీగా ఉంది. విజయ్ క్రేజ్ ఉన్న హీరో. ఫ్యామిలీ ఎమోషన్స్ను తెరకెక్కించడం పరశురాంకు వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘అల్లు అరవింద్గారి ఆశీర్వాదం, ‘బన్నీ’ వాసు సపోర్ట్తో సినిమా బాగా వచ్చింది. విజయ్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని అతని పాత్రని డిజైన్ చేశా. రియల్ లైఫ్ రష్మికని ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు దర్శకుడు. అన్నట్లు.. గీత గోవిందం అని టైటిల్ పెట్టారు కాబట్టి సినిమాలో నాయకా నాయకల పేర్లు ఇవే అయ్యుండొచ్చు. -
ఏబీసీడీలకు వేళాయె
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని అల్లు శిరీష్ కథానాయకుడిగా తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రుక్సార్ థిల్లాన్ కథానాయిక. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మధుర శ్రీధర్, బిగ్బెన్ సినిమాస్ బ్యానర్పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాతల అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా మరో నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. పలు చిత్రాల్లో బాల నటుడిగా అలరించిన మాస్టర్ భరత్ ‘ఏబీసీడీ’ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని. -
అందుకే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశా
తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు సుధీర్బాబు. ఇప్పుడు ఆయన ‘సుధీర్బాబు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘తన సమర్థత మీద ప్రయాణించే మంచి మనసున్న వ్యక్తి సు«ధీర్బాబు. ‘సుధీర్బాబు ప్రొడక్షన్స్’ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను’’అన్నారు. ‘‘సుధీర్బాబు నిర్మాత అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్ నిర్మాతగా సుధీర్బాబు పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను’’అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సుధీర్బాబు మాట్లాడుతూ–‘‘ ఏదో ఒకరోజు నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసే స్టేజ్లో ఉంటే కొత్తవాళ్లను తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. అలాగే స్టార్ట్ చేశా. కృష్ణగారు, మహేశ్ వాళ్లను వాడేసుకుని ఎప్పుడూ సినిమాలు చేయాలనుకోలేదు. సొంతంగా ఎదగాలని కోరుకుంటాను. అందులో ఒక తృప్తి ఉంటుంది. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టడానికి అదే రీజన్. మంచి సినిమాలు, జనాలకు గుర్తుండే సినిమాలు చేయాలన్నదే నా విజన్. ప్రొడ్యూసర్ అవుతానని అనుకోలేదు. అయ్యా. దర్శకుణ్ణి కూడా అవుతానేమో. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. బయటి ప్రొడక్షన్లో కూడా నటిస్తాను. మా బ్యానర్లో రాబోతున్న తొలి సినిమా షూటింగ్ ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో తుదిదశకు చేరుకుంది. మంచి సందర్భం చూసుకుని ఇలాగే గ్రాండ్గా ఈ సినిమా గురించి ప్రకటిస్తాం. ఇప్పుడు ఏ విషయం ఎనౌన్స్ చేయడం లేదు. ఎందుకంటే నేను హీరోగా చేసిన ‘సమ్మోహనం’ సినిమా రిలీజ్ అవుతుంది. అందుకే ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేద్దామనుకోవడం లేదు. అందుకే బ్యానర్ లాంచ్ వరకు మాత్రమే పెట్టాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సందీప్ కిషన్, దర్శకులు వంశీ పైడిపల్లి, శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, అనిల్ సుంకరలతోపాటు చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది
‘‘నిన్నటికి నిన్న వచ్చిన ‘బాహుబలి’ మన తెలుగు సినిమా అని రొమ్ము విరిచి చెప్పుకున్నాం. ‘మహానటి’ లాంటి సినిమాతో మళ్లీ అంతే ఫీలింగ్ కలిగింది. తెలుగు ఇండస్ట్రీ గర్వించే సినిమా ఇది. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ప్రేక్షకుడు ‘మహానటి’ని గుండెల్లో పెట్టుకుంటారు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మించిన ‘మహానటి’ గత బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. టైటిల్ రోల్లో కీర్తీ సురేష్ నటించారు. ఈ చిత్రబృందాన్ని అల్లు అరవింద్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూశాక నాగ్ అశ్వి¯Œ కి కాల్ చేసి సూపర్ హిట్, బ్లాక్బస్టర్ వంటి పిచ్చి పదాలు వాడకుండా ‘థ్యాంక్యూ ఫర్ మేకింగ్ అజ్ ప్రౌడ్’ అని చెప్పాను. స్వప్న, ప్రియాంక, అశ్వినీదత్ గారు తప్ప ఈ సినిమాను ఇంకెవ్వరూ తీయలేరు. లెక్కపెట్టి తీస్తే ఎంత లెక్కపెడితే అంతే వస్తుంది. లెక్క పెట్టకుండా తీస్తే లెక్కలేనంత వస్తుంది. సినిమా ఈజ్ నాట్ ఎ నంబర్.. ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ ‘మహానటి ఈజ్ ప్రైజ్లెస్’’ అని చెప్పారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ స్తాయి. కానీ కొన్ని మాత్రం ఇండస్ట్రీ స్థాయిని పెంచేవి వస్తుంటాయి. ‘మహానటి’ ఆ కోవకు చెందినదే. సావిత్రి, జెమినీ గణేశన్ల ప్రేమకథను ‘దేవదాసు’తో ముడిపెట్టడంతో పాటు ఆమె మందు అలవాటు చేసుకునే సన్నివేశం వంటివి పొయెటిక్గా, సెటిల్డ్గా చెప్పిన విధానం అద్భుతం’’ అన్నారు రాజమౌళి. రమేశ్ ప్రసాద్, కేయస్ రామారావు, శ్యామ్ ప్రసాద్రెడ్డి, పి. కిరణ్, బి.వి.యస్.యన్ ప్రసాద్, పరుచూరి సోదరులు, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, కరుణాకరన్, మారుతి, నందినీ రెడ్డి, సంపత్ నంది, త్రినాథ్ రావు నక్కిన, విజయ్కుమార్ కొండా తదితరులు పాల్గొన్నారు. -
టాక్సీవాలాది విచిత్రమైన కథ – అల్లు అరవింద్
‘‘టాక్సీవాలా’ నాకో కొత్త ఎక్స్పీరియన్స్. విజయ్ దేవరకొండ కథ విని ఎగ్జయిట్ అయ్యాడు. ఎస్.కె.ఎన్ నిర్మాతగా విజయ్ దేవరకొండతో ఈ సినిమా చేశాడు. నిర్మాతగా తనకు మంచి భవిష్యత్ ఉండాలి. విచిత్రమైన సబ్జెక్ట్ ఇది. కొత్తగా ఉంటుంది. విజయ్ దేవరకొండ జెన్యూన్ ఆర్టిస్ట్. తనకు గొప్ప భవిష్యత్ ఉంటుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా, మాళవికా నాయర్, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్స్గా రాహుల్ సంక్రితియాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. జిఏ 2, యూవీ పిక్చర్స్పై ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘ది ఎండ్’ తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. ఎక్కడా తగ్గకుండా సినిమాను కంప్లీట్ చేశాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రాహుల్ సంక్రితియాన్. ‘‘ఒకప్పుడు గీతా ఆర్ట్స్లో వచ్చిన చిరంజీవిగారు, పవన్కల్యాణ్గారి సినిమాలకు బ్యానర్స్ కట్టేవాణ్ణి. ఇప్పుడు ఆ బ్యానర్లో నిర్మాతగా నా పేరు రావడం గొప్ప విషయంగా భావిస్తున్నా’’ అన్నారు ఎస్.కె.ఎన్. ‘‘మంచి టాలెంట్, సినిమాపై ప్యాషన్ ఉన్నవారి కోసం అల్లు అరవింద్గారి ఆశీర్వాదంతో జీఏ2 స్టార్ట్ చేశాం. ‘టాక్సీవాలా’ జర్నీలో యు.వి.క్రియేషన్స్ వారు నాకు సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు నిర్మాత ‘బన్ని’ వాసు. ‘‘మే 18న మా సినిమా విడుదలవుతుంది. సినిమా చూసి అందరూ పడి పడినవ్వుకుంటారు’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘ఓ మంచి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు కథానాయికలు మాళవికా నాయర్, ప్రియాంక జవాల్కర్. -
వర్మది క్రూయల్ మైండ్
" నేను ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లయ్యింది. మా నాన్నగారు అల్లు రామలింగయ్య, ఆ తర్వాతి తరంలో నేను, చిరంజీవి, ఆ తర్వాతి తరంలో పవన్ కల్యాణ్ నుంచి.. చిత్ర పరిశ్రమలో ఉన్న మాకు ఇండస్ట్రీ అంటే భక్తి, గౌరవం. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న బాధాకరమైన విషయాలు మీకు తెలిసినవే. శ్రీరెడ్డిగారు తీసుకొచ్చిన కొన్ని విషయాలపై ఫిల్మ్చాంబర్లో జరిగిన మీటింగ్స్లో ఒక్కదానిలో తప్ప అన్నింటిలో నేనూ ఉన్నా. లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఓ కమిటీ పెట్టుకోవాలి. వాటిని అరికట్టడానికి తీసుకోబోతున్న జాగ్రత్తల గురించి త్వరలో ఇండస్ట్రీ చెబుతుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. గురువారం అల్లు అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మంచి పని చేయబోతోంది. 50 శాతం అవుట్సైడర్స్, 50 శాతంæఇండస్ట్రీవాళ్లతో కలిపి ఒక రిడ్రెస్సల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. వేధింపులు ఎదురయ్యాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 క్రాఫ్ట్స్లో వారు ఏ విభాగానికి చెందితే అందులోంచి తొలగించాలని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీలో నేను కూడా ఉండబోతున్నా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి నేను సీనియర్ మెంబర్ని. నేను టార్గెట్ చేస్తున్నది రామ్గోపాల్ వర్మని. రామ్గోపాల్వర్మ అనే వ్యక్తి గొప్ప సినిమాలు తీసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆల్ ఇండియా డైరెక్టర్గా ముంబైలో ఉన్నాడు. ఆయన తెలుగు ఇండస్ట్రీని తల్లిలా భావించాలి. కానీ, అతను ఎంత ద్రోహం చేస్తున్నాడు? ఎంత నికృష్టుడో చెప్పడానికే మీ ముందుకు వచ్చా. ‘బాహుబలి’ తీసింది మేమురా? తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకుని గర్వపడే ఈ సమయంలో ఇలాంటివి ఏంటి? అని బాధపడుతున్న తరుణం. బుధవారం రాత్రి ఓ వీడియో చూశాక రామ్గోపాల్ వర్మ‘గారు’ అనే గౌరవం పోయింది. ఒక ఛండాలపు మాటను పవన్ కల్యాణ్ని ఉద్దేశించి శ్రీరెడ్డితో నేనే (వర్మ) అనిపించానని, ఇందుకు ఫ్యాన్స్కు క్షమాపణ అని రామ్గోపాల్ వర్మ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇంకో వీడియోలో రామ్గోపాల్వర్మ చెప్పడం వల్లే తాను ఇవన్నీ చేశానని శ్రీరెడ్డి వాయిస్ విన్నాను. ఈ వీడియో బయటకు వస్తుందని సేఫ్గా వర్మ ముందే తానే శ్రీరెడ్డితో అలా చెప్పించానని వీడియో రిలీజ్ చేసి, క్షమాపణ చెప్పాడు. నువ్వు (వర్మని ఉద్దేశించి) సురేశ్బాబు (నిర్మాత) ఫ్యామిలీతో మాట్లాడి, శ్రీరెడ్డికి 5 కోట్లు ఇప్పించడానికి ట్రై చేశానని చెప్పావు. నేను సురేశ్ ఫ్యామిలీ మెంబÆŠ్సతో మాట్లాడాను. ‘‘లా ఆఫ్ ది ల్యాండ్కు మేము లొంగుతాం తప్ప ఇవన్నీ వేస్ట్. ఎంకరేజ్ చేయం’’ అని చెప్పారు. శ్రీరెడ్డికి నువ్వు ఇప్పిస్తానన్న 5 కోట్ల ఆఫర్ నీకు ఇచ్చింది ఎవరు? ఆ అమ్మాయితో ఓ బూతు మాట్లాడించి పవన్ సైజ్ (ఇమేజ్) తగ్గిండానికి నీకు ఫండ్ చేస్తున్నది ఎవరు? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? వంటి సందేహాలతో నాకు నిద్ర పట్టలేదు. ఇండస్ట్రీలోని ఒక ఫ్యామిలీపై నీకింత జాగ్రత్త ఉంటే.. మా కుటుంబం మీద లేదా? అంటే.. ఈ కుటుంబంలో చిరంజీవి, పవన్, రామ్చరణ్ ఉన్నారు. నీకీ కుటుంబం అంటే దుగ్ధ. సురేశ్ కుటుంబాన్ని కాపాడాలని అలా చేశానని అన్నావు. ఎంత నాటకం? నీ బతుక్కి అవసరమా? నువ్వు తెలివైనవాడివే. కానీ క్రూయల్ మైండ్. వర్మను ఏం చేస్తారనేది ఇండస్రీయే నిర్ణయిస్తుంది. వర్మకు సొసైటీ ఎటువంటి శిక్ష విధించాలి?’’ అన్నారు. -
అరుంధతిలా భాగమతి హిట్ కావాలి – అల్లు అరవింద్
‘‘భాగమతి’ ట్రైలర్ను బిగ్ స్క్రీన్పై చూస్తే కాస్త భయమేసింది. ఏడాదికిపైగా ఈ సినిమా తీస్తున్నారు. అనుష్కకి ఉన్న ఏకైక లక్షణం.. ఓపిక చాలా ఎక్కువ. ఇండస్ట్రీలో అది ఎవరికీ లేదు. ఆ విషయాన్ని ‘అరుంధతి’ చిత్రంతో నిరూపించుకున్నారు. ఆ సినిమాలా ‘భాగమతి’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. అనుష్క టైటిల్ రోల్లో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ‘భాగమతి’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు అశోక్ మాట్లాడుతూ– ‘‘గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. ఈ రెండూ సమాంతరంగా నడుస్తుంటాయి. తను గెలుస్తూ.. తన చుట్టూ ఉన్నవారిని గెలిపిద్దాం అని ఎవరైనా ఆలోచిస్తే.. అతనిలో దైవత్వం మొదలైనట్లు. అలాంటి దేవుడైన ప్రభాస్ ముందు ఈ కథ విని, ఇక్కడిదాకా నడిపించారు. వంశీ, ప్రమోద్, విక్కీగారు త్రిమూర్తులు. వీరితో ఐదేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. సినిమాను బిడ్డలా చూసుకున్నారు. ‘భాగమతి’ కోసం అనుష్క విపరీతమైన డస్ట్లో 45 రోజులు పని చేశారు’’ అన్నారు. ‘‘2012లో ‘భాగమతి’ కథ వినగానే నచ్చిందన్నా. కానీ, డేట్స్ లేకపోవడంతో చేయలేనని చెప్పా. ఈ సినిమా నేను కాకుండా వేరే ఎవరైనా చేసి ఉంటే బాధపడేదాన్ని. ఎందుకంటే నా హృదయానికి బాగా దగ్గరైన కథ ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అనుష్క. ‘‘నాతో ‘పిల్లజమీందార్’ చేసిన తర్వాత అందరూ ఆశోక్ను ‘పిల్లజమీందార్ అశోక్’ అని పిలుస్తున్నారు. జనవరి 26 తర్వాత అందరూ ‘భాగమతి అశోక్’ అని పిలుస్తారు. ఈ ఏడాది టాలీవుడ్కి సరైన హిట్ పడలేదు. ‘భాగమతి’తో ఆ హిట్ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు హీరో నాని. ‘‘సాధారణంగా నటీనటులు, దర్శకులకు అభిమానులుంటారు. కానీ, నిర్మాతలకు ఉండరు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు అభిమానులుంటారు’’ అన్నారు దర్శకుడు మారుతి. దర్శకులు మేర్లపాక గాంధీ, రాధాకృష్ణ, నటులు ప్రభాస్ శ్రీను, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిప్రేమ టైటిల్ అనగానే భయపడ్డా– వరుణ్ తేజ్
‘‘ప్రసాద్గారికి, నాకు మంచి అనుబంధం ఉంది. ‘మగధీర’ సినిమాకు ఆయన కో–ప్రొడ్యూసర్. పవన్కల్యాణ్తో ‘అత్తారింటికి దారేది’ సినిమా తీసిన ప్రసాద్గారు ఇప్పుడు పవన్ టైటిల్ ‘తొలి ప్రేమ’తో వరుణ్తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆ ‘తొలిప్రేమ’తో పవన్కి ఎంత పేరొచ్చిందో.. ఈ ‘తొలిప్రేమ’ పెద్ద హిట్ అయి వరుణ్కి అంతే మంచి పేరు వస్తుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. వరుణ్తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘తొలిప్రేమ’. ఎస్.ఎస్.తమన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను అల్లు అరవింద్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఫిదా’ సినిమాకి ముందు ‘తొలిప్రేమ’ చిత్రాన్ని వెంకీ మా బ్యానర్లో చేయాల్సింది. కానీ, ‘ఫిదా’ కారణంగా తను బాపినీడుకి కథ వినిపించడం, ఆయనకు నచ్చడంతో సినిమా ఓకే అయ్యింది. మా బ్యానర్లో చేయాల్సిన సినిమా వారి బ్యానర్లో చేశారనే కారణంతో బాపినీడు ఈ సినిమా టోటల్ రైట్స్ను నాకు ఇచ్చేశాడు. ఇలాంటి విషయాలు అరుదుగా జరుగుతుంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆరు నెలల వరకు ఏ టైటిల్ పెడదామని ఆలోచించాం. ‘తొలిప్రేమ’ టైటిల్ పెడదామని వెంకీ అన్నారు. నాకు ఇష్టమున్నా కాస్త భయపడ్డాను. ఆ టైటిల్ పెట్టుకుని ఏమైనా తేడా వస్తే మనకు పగిలిపోద్ది అన్నాను. ఎందుకంటే అది బాబాయ్కి ఐకానిక్ మూవీ. మా పెదనాన్న, బాబాయ్ వేసిన ఈ ఫౌండేషన్ను పాడు చేయకుండా మంచి సినిమాలు చేస్తాం’’ అన్నారు వరుణ్తేజ్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నన్ను నమ్మిన వ్యక్తి, ఇండస్ట్రీని నన్ను నమ్మేలా చేసిన వ్యక్తి ‘దిల్’ రాజుగారు. ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న నాకు ఆరు అడుగుల నాలుగు అంగుళాల ధైర్యాన్నిచ్చాడు వరుణ్. నా నమ్మకానికి ఊపిరి పోసిన వ్యక్తి బాపినీడు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వెంకీ అట్లూరి. రాశీఖన్నా, తమన్ పాల్గొన్నారు. -
గమ్మునుండవోయ్
‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి చెప్పిన డైలాగ్ ఇది. పిల్లలకు, పెద్దలకు గోన గన్నారెడ్డి అలియాస్ అల్లు అర్జున్ ఓ వెరైటీ స్టైల్లో చెప్పిన ఈ డైలాగ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడీ డైలాగ్ని గుర్తు చేయడానికి కారణం ఉంది. ఫిల్మ్ నగర్లో బన్నీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సొంత బేనర్ పెట్టి, బన్నీ ప్రొడ్యూసర్ కావాలనుకుంటున్నాడన్నది ఆ వార్త సారాంశం. నిర్మాతగా తన తొలి చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడితో తీయడానికి రెడీ అయిపోయాడని కూడా చెప్పుకుంటారు. నిజమేనా బాసూ? అని అడిగితే.. ‘గమ్మునుండవోయ్’ అని ఫిల్మ్నగర్లో ఓ వర్గం అంటోంది. తండ్రి అల్లు అరవింద్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తోన్న గీతా ఆర్ట్స్, భాగసామ్యంలో నడిపిస్తోన్న ‘జీఏ2’, ‘వి4’.. ఇన్ని బేనర్లు ఉండగా బన్నీ ఇంకో కొత్త బేనర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటున్నారు. పాయింటే కదా. బన్నీ సన్నిహిత వర్గాలు కూడా ‘ఇది గాసిప్’ అని తేల్చేశాయి. సో.. బన్నీ సొంత బేనర్ పెట్టడంలేదు. భవిష్యత్తులో నిర్మాత అవ్వాలనుకుంటే ‘జీఏ2’ బేనర్ మీద నిర్మించాలనే ఆలోచన ఉందట. అప్పటివరకూ గమ్మునుందాం. -
ఆ నలుగురూ చిత్ర పరిశ్రమను చంపేస్తున్నారు
‘‘థియేటర్ల లీజులు లక్షల్లో దండుకుంటూ పన్నులు కట్టకుండా ఓ నలుగురు బడా నిర్మాతలు చిత్ర పరిశ్రమను చంపేస్తున్నారు. చిరంజీవిని అడ్డం పెట్టుకుని బార్క్ సంస్థ ద్వారా 400 ప్రొజెక్టర్లు వ్యక్తిగత వినియోగం కోసమని చెప్పి సురేష్బాబు, అల్లు అరవింద్ 400 థియేటర్లకు ఉపయోగిస్తున్నారు’’ అని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. దీనిపై గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు శుక్రవారం విలేకర్లతో చెప్పారు. తరుణ్తో తాను తీసిన ‘యుద్ధం’ విడుదలకు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నానని, ఈ సినిమా ఈ నెల 14న విడుదల కాని పక్షంలో శాశ్వతంగా చిత్ర నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటానని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.