kiara advani
-
హీరోయిన్ కియారా ప్రెగ్నెన్సీ.. వాళ్లకు టెన్షన్
సాధారణంగా హీరోయిన్లు.. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి-పిల్లల విషయంలో కాస్త ప్లానింగ్ తోనే ఉంటారు. కియారా అడ్వాణీ కూడా బహుశా ప్లానింగ్ తోనే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ఆ మూవీ టీమ్ కి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏంటా సంగతి?హీరోయిన్ కియారా అడ్వాణీ.. రెండు రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించింది. ఇది జరిగి రోజైన కాలేదు అప్పుడే షూటింగ్ కి కూడా హాజరైంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో 'వార్ 2'లో ఒకటి. ఇదివరకే ఈమె పార్ట్ షూటింగ్ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కేజీఎఫ్ ఫేమ్ యష్ కొత్త సినిమా 'టాక్సిక్'లోనూ ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)తాజాగా కియారా అడ్వాణీ ప్రెగ్నెంట్ అని బయటపెట్టడంతో మూవీ టీమ్ కి టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఈమెకు బేబీ బంప్ కనిపించేలోపు కియారా పార్ట్ షూటింగ్ అంతా పూర్తి చేసుకోవాలి. లేదంటే తర్వాత సినిమా లేట్ అయ్యే అవకాశముంది. దీంతో ఈ ఒకటి రెండు నెలల్లో 'టాక్సిక్'లో కియారా పార్ట్ పూర్తవుతుంది. తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటారని తెలుస్తోంది.గతంలో 'కల్కి' షూటింగ్ జరుగుతున్న టైంలో దీపికా పదుకొణెకి కూడా ప్రెగ్నెన్సీతోనే షూటింగ్ అంతా పూర్తి చేసింది. తర్వాత ప్రమోషన్లలో మాత్రం కనిపించడం కుదరలేదు. దీపికలా ప్లానింగ్ తో చేసేసుకుంటే కియారాకి ఇబ్బందేం ఉండకపోవచ్చు. లేదంటే మాత్రం 'టాక్సిక్'కి తిప్పలు తప్పవు.(ఇదీ చదవండి: బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?) -
గొప్ప బహుమతి
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు శుభవార్త చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన భర్త సిద్ధార్థ్తో కలిసి బేబీ సాక్స్ను చేతిలో పట్టుకున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది’ అని వెల్లడించారు కియారా.విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ‘షేర్షా’(2021) సినిమాలో తొలిసారి కలిసి నటించారు సిద్ధార్థ్ – కియారా. ఆ మూవీ షూటింగ్లో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారడంతో 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు కాబోతున్న కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలకు సమంత, రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉంటే .. తెలుగులో మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్చరణ్తో ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ సినిమాల్లో నటించారు కియారా అద్వానీ. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన గేమ్ ఛేంజర్ బ్యూటీ (ఫోటోలు)
-
తల్లి కాబోతున్న కియారా : తొలి మెటర్నిటీ ఫ్యాషన్ లుక్ అదుర్స్!
హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోంది అనే క్యాప్షన్తో ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియారా త్వరలోనే ఒక బిడ్డకు జన్వనివ్వబోతోందన్న వార్త ఫ్యాన్స్ను ఆనందంలో ముంచెత్తింది. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కియారా భర్త సిద్దార్థ్ (Sidharth Malhotra)కూడా ఇన్స్టాలో షేర్ చేశాడు. కియారా అద్వానీ ఫ్యాషన్ మాస్ట్రో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఫ్యాషన్షోలో బాలెన్సియాగా బ్లాక్ దుస్తులను ప్రదర్శించింది. అది ట్రెడిషనల్ దుస్తులైనా, లేదా హై-ఫ్యాషన్ వెస్ట్రన్ అయినా ఆమె లుక్ స్పెషల్గా ఉంటుంది. ఇటీవల, తీరా ఈవెంట్లో, కియారా క్లాసిక్ బ్లాక్ దుస్తులు, బంగార ఆభరణాలతో ఒక బోల్డ్ స్టేట్మెంట్ లుక్తో అదరగొట్టింది. బ్రాండ్ సిగ్నేచర్ లోగోను పోలీ ఉన్న లూజ్గా ఉండేశాటిన్ జాక్వర్డ్ టాప్ ఎంచుకుంది బాలెన్సియాటూ-పీసెస్ ఎటైర్లో స్టన్నింగ్గా కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆమె తొలి పబ్లిక్ మెటర్నిటీ ఫ్యాషన్ లుక్. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే చోకర్ ,ఆకర్షించే సింహం పంజా పెండెంట్తో సహా చంకీ స్టేట్మెంట్ నెక్లెస్లను ధరించింది కియారా. భారీ చెవిపోగులు, ఉంగరాలు బ్రాస్లెట్ల స్టాక్ను కూడా జోడించింది. అంతేకాదు లౌబౌటిన్ హీల్స్లో అసలే పొడగరి అయిన కియారా మరింత సొగసరిలా అందర్నీ మెస్మరైజ్ చేసింది. -
శుభవార్త చెప్పిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. ఓ మై గాడ్ అంటూ సామ్ రియాక్షన్
గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి బేబీ సాక్స్ను చేతిలో పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది" అని వెల్లడించింది. ఈ పోస్ట్ కింద రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత.. ఓ మైగాడ్, కంగ్రాచ్యులేషన్స్ అని కామెంట్ చేసింది.ప్రేమ.. పెళ్లికియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. లస్ట్ స్టోరీస్ (2018) సినిమా ముగింపు సమయంలో నిర్వహించిన పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరూ జంటగా షేర్షా సినిమాలో నటించారు. రోమ్ నగరంలో సిద్దార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని కియారా.. కాఫీ విత్ కరణ్ షోలో వెల్లడించింది. సినిమాకియారా అద్వానీ ఫగ్లీ సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. ఎమ్మెస్ ధోని, మెషిన్, లస్ట్ స్టోరీస్, గుడ్ న్యూస్, కబీర్ సింగ్, ఇందూ కి జవానీ, భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ మేరా, సత్యప్రేమ్ కీ కథ చిత్రాల్లో నటించింది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం యష్ టాక్సిక్ మూవీతో పాటు హిందీ వార్ 2లో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా.. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, కపూర్ అండ్ సన్స్, ఎ జెంటిల్మెన్, మర్జావాన్, షేర్షా, థాంక్ గాడ్, మిషన్ మజ్ను, యోధ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) చదవండి: రాహుల్ గాంధీపై కేసు? ప్రీతి జింటా ఏమందంటే? -
కియారా అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు, లేటెస్ట్ పిక్స్ వైరల్
-
ఎన్టీఆర్ వార్ 2 పై ఆశలు పెట్టుకున్న కియారా
-
వైట్ డ్రెస్ లో కియారా అద్వానీ.. కళ్లు చెదిరిపోయే క్లిక్స్
-
kiara Advani: భర్తతో గేమ్ ఛేంజర్ బ్యూటీ వెకేషన్ (ఫోటోలు)
-
Game Changer: రామ్చరణ్ ఫ్యాన్స్కు నిరాశ.. ఇదేదో ముందే చెప్పొచ్చుగా!
ఈ సారి సంక్రాంతికి మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. అందులో మొదటగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer Movie) నేడే (జనవరి 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, జనవరి 14న విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రాబోతున్నాయి. శుక్రవారం రిలీజైన గేమ్ ఛేంజర్కు మిక్స్డ్ టాక్ వస్తోంది.ఆ కారణం వల్లే..డైరెక్టర్ శంకర్ పాత ఫార్ములానే వాడారని కొందరు అంటుంటే.. ఇండియన్ 2 కంటే బెటర్గానే ఉందని మరికొందరు అంటున్నారు. ఇకపోతే థియేటర్లో నానా హైరానా పాట (#NaanaaHyraanaaSong) కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. సినిమాలో ఆ పాటనే కనిపించలేదట! దీనిపై గేమ్ ఛేంజర్ టీమ్ స్పందించింది. సాంకేతిక సమస్యల వల్ల ఈ పాటను మూవీలో యాడ్ చేయలేకపోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, జనవరి 14 నుంచి నానా హైరానా సాంగ్ను థియేటర్లో ప్లే చేస్తామని పేర్కొంది. కోట్లు పెట్టి తీసింది ఇందుకేనా?చిత్రయూనిట్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టింది ఇలా ఎడిటింగ్లో తీసేయడానికేనా? చెత్త నిర్ణయాలు.., ఇదేదో ముందే చెప్పొచ్చుగా.. ఈ పాట కోసమే టికెట్ బుక్ చేసుకున్నా.., కనీసం ఆ పాట పెట్టుంటే గేమ్ ఛేంజర్పై నెగెటివిటీ కాస్త తగ్గేదేమో.. ఈ ఒక్కటైనా బాగుందని సంతృప్తి చెందేవారేమో అని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు మాత్రం.. ఏం పర్లేదు, జనవరి 14 తర్వాత మరోసారి టికెట్లు కొని సినిమా చూస్తామని కామెంట్లు చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విశేషాలు..ఈ ఏడాది రిలీజవుతున్న మొదటి భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. రామ్చరణ్, కియారా అద్వానీ (Kiara Advani), అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్జే సూర్య విలన్గా నటించాడు. తమన్ సంగీతం అందించాడు. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారతీయుడు 2 డిజాస్టర్ తర్వాత శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫస్ట్ డే ఫస్ట్ ఫోనే సినిమా బాలేదంటూ ఎక్కువ నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇదే టాక్ కొనసాగితే సినిమా గట్టెక్కడం కష్టమే!పాటల కోసమే రూ.75 కోట్లుఅసలే సినిమాలోని ఐదు పాటల కోసమే రూ.75 కోట్లు ఖర్చు పెట్టానని గర్వంగా చెప్పుకున్నాడు నిర్మాత దిల్రాజు. తీరా థియేటర్లో చూస్తే మెలోడీ సాంగ్ నానా హైరానా వేయనేలేదు. సాంకేతిక సమస్యలంటూ ఏదో సాకు చెప్పారు. నాలుగు రోజుల తర్వాతే థియేటర్లో నానా హైరానా పాట వినిపిస్తుందని సమాధానం చెప్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సాంగ్ను ఇంత లైట్ తీసుకోవడం ఏమీ బాగోలేదంటున్నారు చరణ్ ఫ్యాన్స్కథేంటంటే?ఓ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్కి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే గేమ్ చేంజర్. గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Everyone's favorite, #NaanaaHyraanaa | #Lyraanaa | #JaanaHairaanSa from #GameChanger has been edited out due to technical challenges encountered during the processing of infrared images in the initial prints. Rest assured, we are diligently working towards adding the song back… pic.twitter.com/N1mQO2GAG6— Game Changer (@GameChangerOffl) January 9, 2025 చదవండి: Game Changer: రామ్చరణ్ ఫ్యాన్స్కు నిరాశ.. -
‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
రాజమౌళి, శంకర్ ఇద్దరూ టాస్క్ మాస్టర్లే : రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు.జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్(Ram Charan) మాట్లాడుతూ.. ‘శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్ణం. ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు. శంకర్ గారు కథ చెబుతారు వినండి అని దిల్ రాజు గారు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్గా ఉంటారు. ప్రతీ దాన్ని ఎంతో పర్ఫెక్ట్గా చేయాలని చూస్తుంటారు. (చదవండి: 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. ఐదు నిమిషాలే వృథా!)రాజమౌళి గారు, శంకర్ గారు ఇద్దరూ కూడా టాస్క్ మాస్టర్లే. సెట్లోకి నేను వచ్చినప్పుడు నన్ను కాకుండా నా హెయిర్ను చూశారు. ఆయన అనుకున్న దాని కంటే ఓ ఐదు శాతం తగ్గింది. అంత తీక్షణంగా ఆయన ప్రతీ ఒక్క విషయాన్ని పరిశీలిస్తుంటారు. ఆయనతో పని చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు. కియారా(kiara advani)తో నేను చేసిన డ్యాన్సులు, పాటలు అందరినీ అలరిస్తాయి. మేం డల్లాస్లో చేసిన ఈవెంట్కు అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. డల్లాస్లో మాకు అపరమితమైన ప్రేమ లభించింది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ కోసం ఏదైనా కొత్తగా చేద్దామని డల్లాస్లో ఈవెంట్ను ప్లాన్ చేశాం. డల్లాస్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ చిత్రంలో ఐదు పాటలుంటాయి. ఈ పాటలకు 75 కోట్లు ఖర్చు అయ్యాయి. ఒక్కో పాట పది రోజులకు పైగా చిత్రీకరించారు. అన్నీ కూడా శంకర్ మార్క్లోనే ఉంటాయి. నా బ్యానర్లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించాలని అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఈ సినిమా రామ్ చరణ్కు అయితే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్కు థాంక్స్’ అని అన్నారు.ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్లో పని చేయడం ఆనందంగా ఉంది. శంకర్ గారు, రామ్ చరణ్ గారితో పని చేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్గా ఎదిగారు. చాలా మంచి యాక్టర్. ఈ చిత్రంలో ఐఏఎస్ రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. కియారా, రామ్ చరణ్ చేసిన పాటలు, డ్యాన్సులు అదిరిపోతాయి. ఈ చిత్రంలో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మేం సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు. జనవరి 10న ఈ సినిమా ఏంటో మీకు తెలుస్తుంది’ అని అన్నారు. -
గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer Movie) వచ్చేవారమే రిలీజ్ కానుంది. సంక్రాంతి కంటే ముందుగానే జనవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు, ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది. శనివారం (జనవరి 4న) ముంబైలో గేమ్ ఛేంజర్ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కు చరణ్, ఎస్జే సూర్య, దిల్ రాజు ఇలా అందరూ విచ్చేశారు. కానీ హీరోయిన్ కియారా మాత్రం ఎక్కడా కనిపించలేదు.ఈవెంట్కు డుమ్మా.. ఎందుకంటే?తను ఆస్పత్రిపాలైందని, అందుకే ఈవెంట్కు రాలేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై కియారా టీమ్ క్లారిటీ ఇచ్చింది. తను బాగానే ఉందని తెలిపింది. నాన్స్టాప్గా పని చేస్తుండటం వల్ల కియారాను విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని, అందుకే తను ఈవెంట్కు హాజరవలేదని వివరణ ఇచ్చింది.ఐదు పాటల కోసం..ఇదిలా ఉంటే ఈ సమావేశంలో నిర్మాత దిల్రాజు ఆసక్తికర విషయం బయటపెట్టాడు. 'ఈ సినిమాలో ఐదు పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాం. నానా హైరానా పాట కోసం న్యూజిలాండ్లో పదిరోజులు షూట్ చేశాం. రా మచ్చా రా పాట కోసం వైజాగ్, అమృత్సర్ వెళ్లాం. రిహార్సల్స్ అన్నీ కలిపితే రూ.75 కోట్ల కన్నా ఇంకా ఎక్కువే అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.వీరి కాంబినేషన్లో రెండో మూవీశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అంజలి, ఎస్జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రెండు గంటల 45 నిమిషాల నిడివితో రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. ఇదిలా ఉంటే విజయవాడలో 256 అడుగులతో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. దేశంలో అతి పెద్ద కటౌట్గా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్లో ఇది చోటు దక్కించుకుంది. After #Prabhas #Yash Now #Ramcharan Entered SIMPLE and HUMBLE in NORTH Event [#GameChanger] 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/BgDeNDIf4k— GetsCinema (@GetsCinema) January 4, 2025 చదవండి: గోవిందాను పెళ్లి చేసుకోవాల్సిందన్న హీరోయిన్.. నటుడి భార్య ఏమందంటే? -
‘గేమ్ ఛేంజర్’ HD మూవీ స్టిల్స్
-
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్ ట్రెండింగ్ లో ‘కియారా అద్వానీ’ (ఫొటోలు)
-
డల్లాస్లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. హ్యాపీ లైఫ్కి మైక్రో మంత్ర!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ సాంగ్స్, టీజర్కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని హ్యాపీ లైఫ్కు మైక్రో మంత్ర అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ఈనెల 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజైన ప్రోమో ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. తమన్ సంగీతమందించారు.కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. -
గేమ్ ఛేంజర్లో రామ్ చరణ్ 'నానా హైరానా'
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పిస్తే.. టీజర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది.సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించిన సీన్స్ను చిత్రీకరించారు. అక్కడ ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునే సీన్స్తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సన్నివేశాలను చిత్రీకరించారు.అయితే ఈ సన్నివేశాల్లో కేవలం జూనియర్ ఆర్టిస్ట్లు మాత్రమే పాల్గొన్నారు. -
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
అందంతో టెంపరేచర్ పెంచేస్తున్న 'గేమ్ ఛేంజర్' హీరోయిన్ (ఫొటోలు)
-
బంగారపు టూత్బ్రష్తో గేమ్ ఛేంజర్ హీరోయిన్
సింధులోయ నాగరికతలో బంగారాన్ని ఆభరణాలుగానే కాకుండా వ్యాపారం కోసం ఉపయోగించారు. అందుకే సింధు ప్రజలు బంగారాన్ని అపురూపమైనదిగా కాకుండా నిరంతర వస్తువుగానే చూసేవారు. ఇకపోతే హీరోయిన్ కియారా అద్వాణీ కూడా సింధి అమ్మాయే!నోటితో మాట్లాడకుండా తాను సింధి అమ్మాయినని ఎలా చెప్తానో చూడు అంటూ కియారా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఆమె వాష్రూమ్లో అద్దం ముందు బ్రష్ పట్టుకుని ఉంది. అది మామూలు బ్రష్ కాదు, బంగారపు టూత్ బ్రష్. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'బ్రష్ చూస్తుంటే తోముకున్నట్లే లేదు.. అది ఊరికే షో ఆఫ్కేనా?', 'మూడునెలలకోసారి బ్రష్ మార్చాలంటారు.. మరి ఈ గోల్డ్ బ్రష్ను నువ్వు మారుస్తావా? లేదా ఏళ్లతరబడి ఇదే వాడుతున్నావా?' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కియారా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్చరణ్తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్రాజు నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
‘తిర ఫ్లాగ్షిప్’ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ కి పోటీ గా చిన్న సినిమాలు సిద్ధం..
-
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
భర్త క్షేమం కోసం...
డిజైనర్ చీరలు, చుడీదార్లు, గౌనులు, నగలు, నుదుట ఎర్రని సింధూరం, చేతులకు మెహిందీతో కొందరు బాలీవుడ్ తారలు చాలా అందంగా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ తారలు ఇలా కళకళలాడారు. ఈ పండగకు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలోంచి చూసిన తర్వాతే భోజనం చేస్తారు. ఉత్తరాదినపాటించే ఆచారం ఇది. ఈ కర్వా చౌత్కి బాలీవుడ్లో ఇలా భర్త క్షేమం కోసం ఉపవాసం ఆచరించి, పూజ చేశారు కొందరు తారలు. ఆ విశేషాల్లోకి...‘‘నీ ఆయురారోగ్యాల కోసం ఈరోజు మాత్రమే కాదు.. ప్రతి రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను... కర్వా చౌత్ శుభాకాంక్షలు. మన శాశ్వతమైన ప్రేమకు, మన బలమైన బంధానికి చిహ్నంగా ఈ మంగళసూత్రం ఓ గుర్తు’’ అంటూ భర్త జహీర్ ఇక్బాల్పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు సోనాక్షీ సిన్హా. నటుడు జహీర్ ఇక్బాల్తో సోనాక్షీ వివాహం ఈ ఏడాది జూన్లో జరిగింది. తొలి కర్వా చౌత్ను ఇష్టంగా జరుపుకున్నారు సోనాక్షి. ఇక ఈ ఏడాది తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో రకుల్ ప్రీత్సింగ్ ఉన్నారు. నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కాగా ఇటీవల వర్కౌట్ చేస్తుండగా రకుల్కి గాయమైంది. వెన్నెముకకు గాయం కావడంతో ఆమె బెడ్ రెస్ట్లో ఉన్నారు. అయితే కర్వా చౌత్ సందర్భంగా చేతికి భర్త పేరులోని ‘జె’ అక్షరం, ఒక పువ్వు డిజైన్తో మెహిందీ పెట్టించుకుని, ‘బెడ్ రెస్ట్వాలా ఫస్ట్ కర్వా చౌత్’ అంటూ ఆ ఫొటోను షేర్ చేశారు రకుల్. అలాగే అదితీ రావ్ హైదరీకి కూడా ఇది తొలి కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ తో అదితి వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. ఇంకా తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో కృతీ కర్భందా ఉన్నారు. నటుడు పుల్కిత్ సామ్రాట్తో ఆమె పెళ్లి ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఇక కియారా అద్వానీకి ఇది రెండో కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహం జరిగింది.రెండో కర్వా చౌత్కి భర్త పేరులోని ‘ఎస్ఎమ్’ అక్షరాలను మెహిందీ డిజైన్గా పెట్టించుకుని, ఆ ఫొటోను, జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూస్తున్న ఫొటోలను షేర్ చేశారు కియారా. పరిణీతీ చో్ర΄ాకి కూడా ఇది రెండో కర్వా చౌత్. గత ఏడాది సెప్టెంబర్లో రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరిగింది. చేతి వెనకాల రెండు హార్ట్ సింబల్స్తో మెహిందీ పెట్టించుకున్న ఫొటోను షేర్ చేశారు పరిణీతి. మరోవైపు సోనమ్ కపూర్ కూడా భర్త ఆనంద్, కుమారుడు వాయు పేర్లను మెహిందీ డిజైన్గా పెట్టించుకుని, ఆ ఫొటోను షేర్ చేశారు. 2018లో ఆనంద్, సోనమ్ల వివాహం జరిగింది.అయితే ఫాస్టింగ్ ఉండనని, ఈ పండగ సందర్భంగా మెహిందీ పెట్టించుకోవడం, రుచికరమైన వంటకాలు తినడం ఇష్టం అని పేర్కొన్నారు సోనమ్. కాగా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ ప్రతి ఏడాదీ ఘనంగా కర్వా చౌత్ జరుపుకుంటారు. అందర్నీ ఆహ్వానిస్తుంటారు కూడా. ఈ ఏడాది శిల్పా శెట్టి, రవీనా టాండన్ వంటివారు సునీతతో కలిసి ఆమె ఇంట్లో పండగ చేసుకున్నారు. ఇలా కర్వా చౌత్ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల సందడి జోరుగా కనిపించింది. -
గేమ్ చేంజ్
గేమ్ డేట్ చేంజ్ అయింది. ఎందుకంటే ఆడే ఆటని అందరూ చూడాలంటే సరైన తేదీ ఉండాలి కదా. అందుకే ఆటని సంక్రాంతికి మార్చారు. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ గురించే ఇదంతా. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నప్పుడు క్రిస్మస్ కన్నా సంక్రాంతి అయితే బాగుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్సీస్లోని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భావించాం.అయితే సంక్రాంతికి చిరంజీవిగారి ‘విశ్వంభర’ కూడా ఉంది. ‘విశ్వంభర’ భారీ బడ్జెట్ చిత్రమే. అయితే ‘గేమ్ చేంజర్’ మూడేళ్లుగా నిర్మాణంలో ఉందని, సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారిని, యూవీ సంస్థని కోరడంతో ‘విశ్వంభర’ దాదాపు పూర్తి కావచ్చినప్పటికీ సానుకూలంగా స్పందించారు. మా సినిమా కోసం వాళ్ల సినిమాను వాయిదా వేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి ధన్యవాదాలు’’ అన్నారు. -
సంక్రాంతి బరిలో..?
‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. తండ్రీకొడుకులుగా రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, సునీల్, జయరాం, ప్రియదర్శి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ‘గేమ్ చేంజర్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబరులో విడుదల చేయనున్నట్లుగా ఇటీవల ‘దిల్’ రాజు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... ‘గేమ్ చేంజర్’ వాయిదా పడిందా? ఒకవేళ పడితే వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
#IIFAUtsavam2024 : ఐఫా అవార్డుల వేడుక మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
జాబిలమ్మ వచ్చెనండి
రామ్చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. బుధవారం కియారా అద్వానీ బర్త్ డే సందర్భంగా ‘గేమ్ చేంజర్’లో ‘జాబిలమ్మ..’ అంటూ యూనిట్ ఆమె కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది.ఇప్పటికే ఈ సినిమాలో రామ్చరణ్ పాత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మిగిలిన ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. -
గేమ్ ఛేంజర్ భామ బర్త్ డే.. భర్త స్పెషల్ పోస్ట్!
బాలీవుడ్ నటి కియారా అద్వానీ ప్రస్తుతం గేమ్ ఛేంజర్లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ కియారా బర్త్ డే కావడంతో పలువురు సినీతారలు, ఫ్యాన్స్ విషెస్ తెలిపారు.తాజాగా ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భార్యకు స్పెషల్గా విష్ చేశారు. కియారా ఫోటోను షేర్ చేస్తూ రొమాంటిక్ నోట్ రాసుకొచ్చారు. హ్యాపీ బర్త్ డే మై లవ్.. యూ ఆర్ మై సోల్మేట్.. ఇక్కడ మరెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి." అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కాగా.. కియారా, సిద్ధార్థ్ ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్లోని జైసల్మీర్లో వివాహం చేసుకున్నారు.కాగా.. 2014లో 'ఫగ్లీ' అనే కామెడీ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన కియారా అద్వానీ.. ఆ తర్వాత స్పోర్ట్స్ బయోపిక్ 'ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ చిత్రంలోనూ కనిపించింది. అంతేకాకుండా భరత్ అనే నేను, వినయ విధేయ రామ, లస్ట్ స్టోరీస్, గుడ్ న్యూజ్, భూల్ భూలయ్యా 2, సత్యప్రేమ్ కి కథ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్తో పాటు వార్- 2 చిత్రంలోనూ నటిస్తోంది.కియారా తదుపరి తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్', ఎస్. శంకర్ దర్శకత్వం వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆమె కిట్టిలో 'వార్ 2' కూడా ఉంది. మరోవైపు సిద్ధార్థ్ చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ 'యోధ'లో కనిపించాడు. అంతేకాకుండా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో కూడా నటించాడు. View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
హీరోయిన్ బర్త్ డే.. 'గేమ్ ఛేంజర్' టీమ్కి తప్పని ట్రోల్స్!
బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ పుట్టినరోజు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఈమె హీరోయిన్గా చేస్తున్న 'గేమ్ ఛేంజర్' టీమ్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. నార్మల్గా అయితే ఇదేమంత పెద్దగా పట్టించుకునే విషయం కాదు. కానీ కియారాకు విషెస్ చెప్పడం కోసం వేసిన పోస్టర్ వల్ల ట్రోల్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని విజయ్ సేతుపతి.. ఇప్పుడేమో జాక్పాట్!)'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెడితే ఇప్పటికీ ఇంకా అలా నడుస్తూనే ఉంది. ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ మూవీ నుంచి 'జరగండి జరగండి' అనే పాట తప్పితే మరో కంటెంట్ బయటకు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు కియారా పుట్టినరోజని చెప్పి అదే పాటలోని లుక్ రిలీజ్ చేశారు. ఇదే ట్రోల్స్కి కారణమైంది.సినిమాలో మరో కంటెంటే లేనట్లే అదే పాటలోని ఫొటోలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్గా 'భారతీయుడు 2'తో ఘోరమైన డిజాస్టర్ అందుకున్న శంకర్.. దీనికి దర్శకుడు. మరి ఏం చేస్తాడో ఏంటో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికైనా సరే వేరే కంటెంట్ తీసుకొస్తే 'గేమ్ ఛేంజర్'పై బజ్ పెరగొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
పేరు మార్చుకుని.. స్టార్ హీరోతో పెళ్లి.. కియారా గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసిన గేమ్ ఛేంజర్ భామ.. ఫోటోలు
-
కియారా అద్వానీ ఫ్యాషన్ అండ్ క్లాసీ లుక్స్ (ఫోటోలు)
-
గేమ్ ఛేంజర్ బ్యూటీ.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లు (ఫోటోలు)
-
అతిగా తినను... ఉపవాసం ఉండను
సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగలా కనిపించడానికి కథానాయికలు కఠినమైన కసరత్తులు చేస్తారు... డైట్ ఫాలో అవుతారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో డైట్... చేసే వ్యాయామాలు కూడా వేరుగా ఉంటాయి. హీరోయిన్ కియారా అద్వానీ తానేం చేస్తారో ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. ‘‘నేను ఎంత త్వరగా బరువు పెరగగలనో అంతే త్వరగా తగ్గగలను. బరువు పెరగడం, తగ్గడం రెండూ నాకు సులభమే. డ్యాన్స్, స్విమ్ చేయడం చాలా ఇష్టం.స్కూల్ డేస్లో అప్పుడప్పుడూ ఈ రెండూ చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే సినిమా రంగంలోకి వచ్చానో అప్పట్నుంచి వీటిని నేను నా దినచర్యలో భాగంగా ప్లాన్ చేసుకుని చేస్తున్నాను. జిమ్, డ్యాన్స్, స్విమ్మింగ్.. ఇవన్నీ ఫిట్నెస్లో భాగమే. వీటిని మనం ఇష్టంగా చేస్తే సరదాగా ఉంటుంది’’ అని చెప్పకొచ్చారు కియారా. ఇంకా తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ– ‘‘నచ్చిన ఆహారాన్ని అతిగా తినడం, ఉపవాసాలు చేయడం వంటివి పాటించను. మసాలా ఎక్కువగా ఉండని ఇంటి భోజనం తినడానికే ఇష్టపడతాను’’ అన్నారు. -
ధనుష్తో కియారా రొమాన్స్
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా నటుడు ధనుష్. ఈయన నటుడు మాత్రమే కాకుండా గాయకుడు, గీత రచయిత, కథకుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా కథానాయకుడుగా రాణిస్తున్నారు. తాజాగా ఈయన తమిళంలో రాయల్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించారు సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది కథానాయకుడుగా ధనుష్ 50వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా తెలుగులో కుబేర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ నటుడు నాగార్జున ముఖ్యపాత్రను పోషిస్తుండగా, రష్మికమందన్న నాయకిగా నటిస్తున్నారు. కాగా ధనుష్ ఇంతకుముందు రంజనా, షమితాబ్, అత్రాంగి రే వంటి హిందీ చిత్రాల్లో నటించి అక్కడ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న విషయం తెలిసింది. తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. దీనికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఇందులో కథానాయకిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈమె ప్రస్తుతం తెలుగులో రామ్చరణ్ సరసన నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. -
తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి?
రీసెంట్ టైంలో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో కియారా అడ్వాణీ ఒకరు. హిందీ చిత్రాలతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది కానీ తెలుగులోనూ రెండు మూవీస్ చేసి ఇక్కడ క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తూ బిజీగా ఉంది. అలాంటిది ఇప్పుడు కియారాకు తమిళం నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)మిళ హీరోల్లో శింబు స్టైలే వేరు. దాదాపు కొన్నేళ్ల పాటు హిట్ లేక పూర్తిగా కనుమరుగైపోయిన ఇతడు.. కొన్నాళ్ల క్రితం 'మానాడు', 'వెందు తనిందడు' చిత్రాలతో హిట్స్ కొట్టాడు. గతేడాది వచ్చిన 'పత్తు తలా' మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇతడు కమల్ 'థగ్ లైఫ్'లో కీలక పాత్ర చేస్తున్నాడు. మరోవైపు కమల్ నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా చేస్తున్నాడు.దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కియారా అడ్వాణీ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తమిళ చిత్రసీమలోకి కియారా ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
రెడ్ కార్పెట్పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
-
కియారాకు అరుదరైన అవకాశం
ప్రతిష్టాత్మక 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరోయిన్ కియారా అద్వానీ తొలిసారి సందడి చేయనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో భాగంగా రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్లో కియరా ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తారట. మంగళవారం (మే 14) ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 25వరకూ జరగనున్నాయి. ఇప్పటివరకు దేశం తరఫున పలుమార్లు ప్రాతినిధ్యం వహించి, మెప్పించారు ఐశ్వర్యా రాయ్. ఆ తర్వాత సోనమ్ కపూర్ కూడా ఇండియా ప్రతినిధిగా మెప్పించారు. ఈ ఏడాది ఇండియాకి ప్రాతినిధ్యం వహించే అవకాశం కియరా అద్వానీని వరించింది. కాన్స్లో వేనిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న ‘రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ సినిమా’ కార్యక్రమంలోనూ కియరా ΄ాల్గొంటారు. ప్రపంచ సినిమాకు ప్రొత్సాహకాలు, చిత్రీకరణ, సినిమా నిర్మాణంలో వస్తున్న సాంకేతిక అంశాలు.. వంటి వాటి గురించి నాలుగు ప్యానెల్స్ చర్చలు జరపనున్నాయి. మే 18న లా ప్లేజ్ డెస్ పామ్స్లో ఈ చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లోనూ కియారా పాల్గొంటారు. కాగా ఈ ఏడాది చిత్రోత్సవాల్లో ఐశ్వర్యా రాయ్, అదితీ రావ్ హైదరి, శోభితా ధూళి΄ాళ వంటి తారలు దేశం నుంచి హాజరు కానున్నారు. ఇప్పుడు కియారా అద్వానీ పేరు ఈ జాబితాలో చేరింది. ఈ చిత్రోత్సవాల్లో స్టయిలిష్గా కనిపించడానికి, చర్చల్లో తన అభి్ర΄ాయాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి కియారా చాలా ప్రిపేర్ అయ్యారని సమాచారం. -
‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్చరణ్ (ఫొటోలు)
-
పారడైసు పావడేసుకొచ్చెనండి...
‘జరగండి జరగండి... జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి... జరగండి జరగండి... పారడైసు పావడేసుకొచ్చెనండి...’ అంటూ పాట అందుకున్నారు రామ్చరణ్. ఈ జాబిలమ్మ ఎవరూ అంటే కియారా అద్వానీ. రామ్చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. రామ్చరణ్ పుట్టినరోజు ప్రత్యేకంగా బుధవారం ‘జరగండి..’ లిరికల్ సాంగ్ను 150కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు. అనిత సమర్పణలో జీ స్టూడియోస్ అసోసియేష¯Œ తో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
Kiara Advani: పింక్ ఔట్ఫిట్లో కియారా అద్వానీ.. అదరహో (ఫోటోలు)
-
కాస్కోండి మూడోసారి కూడా ఈ సినిమాతో భయపెట్టడం గ్యారెంటీ
హారర్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘భూల్ భులయ్యా’. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో భాగంగా రెండు సినిమాలు వచ్చాయి. అవి రెండూ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్తో ఆ సక్సెస్ను కొనసాగిస్తున్నారు మేకర్స్. సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న 'చంద్రముఖి' సినిమాకు రీమేక్ వెర్షన్గా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సినిమా 'భూల్ భులయ్యా'. 2007లో విడుదలైన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు పోషించారు. 'చంద్రముఖి' డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దుమ్మురేపింది. దీంతో సుమారు 15 ఏళ్ల తర్వాత అనీస్ బజ్మీ దర్శకత్వంలో 'భూల్ భులయ్యా 2' విడుదలైంది. 2022లో వచ్చిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ, టబు నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ ప్రాంచైజీకి బాలీవుడ్లో మంచి గుర్తింపు రావడంతో మూడో ప్రయత్నానికి ముహూర్తం కుదిరింది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఈ ప్రాజెక్టులో భాగమవ్వడంతో సెట్స్కు చేరకముందే దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 'భూల్ భులయ్యా 3' నవంబర్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
విదేశాల్లో శిక్షణ
ఇంటర్నేషనల్ ట్రైనింగ్కు రెడీ అవుతున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘డాన్ 3’. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ‘డాన్ 3’లో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో రణ్వీర్, కియారా.. ఇద్దరికీ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయట. దీంతో అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో ఇద్దరూ స్టంట్స్ నేర్చుకోనున్నారని బాలీవుడ్ టాక్. విదేశాల్లో ఈ శిక్షణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది సెప్టెంబరులో ్ర΄ారంభం కానుందని తెలిసింది. -
'గేమ్చేంజర్' టార్గెట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
హీరో రామ్చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్చేంజర్’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారని తెలిసింది. ఇటీవల ‘గేమ్చేంజర్’ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివు డిజైన్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో రామ్చరణ్ పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్తోపాటుగా, రామ్చరణ్, నవీన్చంద్ర, మరికొందరు కీలకపాత్రధారులపై టాకీపార్టు చిత్రీకరణ కూడా జరగనుంది. కాగా ఈ సినిమా చిత్రీకరణను జూలైలోపు పూర్తి చేయాలని చిత్రయూనిట్ టార్గెట్ పెట్టుకుందని ఫిల్మ్నగర్ సమాచారం. అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్, ఎస్జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘గేమ్చేంజర్’ డిసెంబరులో విడుదల కానుందనే ప్రచారం ఫిల్మ్నగర్ సర్కిల్స్లో జరుగుతోంది. -
డాన్ ప్రేయసి
డాన్తో లవ్లో పడ్డారు హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్’ యూనివర్స్లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్ 3’ మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కియారాకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్ ‘డాన్ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. -
నాభి అందాలతో శ్రద్ధాదాస్.. భర్త ముద్దుల్లో ఆ స్టార్ హీరోయిన్
నడుము చూపిస్తూ మెంటలెక్కిస్తున్న శ్రద్ధా దాస్ సంక్రాంతి ముగ్గులతో మరింత అందంగా శ్రీముఖి లంగాఓణీలో కుందనపు బొమ్మలా హీరోయిన్ మాళవిక 'గుంటూరు కారం' సక్సెస్ సెలబ్రేషన్స్.. నమ్రత పోస్ట్ భర్తని ముద్దులతో ముంచెత్తిన హీరోయిన్ కియారా అడ్వాణీ టైట్ ఔట్ఫిట్తో కాక రేపుతున్న హీరోయిన్ కేథరిన్ రొమాంటిక్ పోజుల్లో 'బిగ్బాస్' ఫేమ్ రతికా రోజ్ కొంటె చూపుతో తినేసేలా చూస్తున్న హీరోయిన్ రీతూవర్మ View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Byee y'll ...This is fcking cutee 😭😭❤️🫶#SidharthMalhotra #KiaraAdvani #Sidkiara pic.twitter.com/yi4shktcCE — SID'S DAY ❤️ (@Itss_Ritzzzz) January 16, 2024 View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Tridha Choudhury🪬 (@tridhac) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) -
హీరోయిన్ కియారా వేసుకున్న శాండిల్స్ ఇంత కాస్ట్లీనా?
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. ఈ ఏడాది గూగుల్ సెర్చ్లో టాప్లో ఉంది. ముఖ్యంగా ఈ అమ్మడి పెళ్లి, సినిమాల గురించి తెగ వెతికేశారు. బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కియారా సుపరిచితమే. భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది కియారా. ప్రస్తుతం రామ్చరణ్తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుంది. వెండితెరపై గ్లామర్ వడ్డించడంలో ఏమాత్రం వెనక్కు తగ్గని ఈ భామ తన నటనతో కుర్ర హృదయాల మనసు దోచుకుంది. అందుకే కియారాకు నార్త్, సౌత్లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కియారా రీసెంట్గా తన భర్త సిద్దార్థ్ మల్హొత్రతో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో కియారా వేసుకున్న చెప్పుల ధర తెలుసుకొని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ శాండిల్స్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 88వేలు. ఇది తెలిసి ఇంత సింపుల్ హీల్స్ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అంటూ అవాక్కవుతున్నారు. మరి సెలబ్రిటీలు వాడే వస్తువులకు ఆ మాత్రం రేంజ్ ఉంటుందిగా. -
బాలీవుడ్లో టాప్ 15 అత్యంత అందమైన నటీమణులు వీరే (ఫొటోలు)
-
ఈ ఏడాది గూగుల్ టాప్ సెర్చ్లో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు
ఈ ఏడాది (2023) భారత దేశంలో అత్యధిక మంది గూగుల్ చేసిన వ్యక్తుల వివరాలను గూగల్ సంస్థ ఇవాళ వెల్లడించింది. ఈ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి కియారా అడ్వానీ టాప్లో ఉండగా.. టీమిండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితా టాప్-10లో ఏకంగా ఆరుగురు క్రికెటర్లు ఉండగా.. టీమిండియాకు చెందిన వారు ముగ్గురు ఉండటం విశేషం. గిల్ రెండులో, మొహమ్మద్ షమీ నాలుగో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ తొమ్మిదో ప్లేస్లో ఉండగా.. న్యూజిలాండ్ నయా సెన్సేషన్ రచిన్ రవీంద్ర మూడో స్థానంలో, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఏడులో, వరల్డ్కప్ ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ పదో స్థానంలో ఉన్నారు. కియారా అడ్వానీ భర్త సిద్దార్థ్ మల్హోత్రా ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉండగా.. ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఐదులో, మాజీ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హామ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇండియాలో ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ చేయబడిన చిత్రాల విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (మొదటి స్థానం), పఠాన్ (ఐదో ప్లేస్) సినిమాలు టాప్-5లో నిలిచాయి. ఈ ఏడాది భారత్లో అత్యధికంగా గూగుల్ చేయబడిన సినిమాలు.. జవాన్ గదర్ 2 ఓపెన్హైమర్ ఆదిపురుష్ పఠాన్ ద కేరళ స్టోరీ జైలర్ లియో టైగర్ 3 వారీసు -
గ్లామర్ డోస్ పెంచిన జగతి మేడమ్.. జాన్వీని ఇలా చూస్తే మాత్రం!
పరువాల విందుతో కేక పుట్టిస్తున్న జాన్వీ కపూర్ అద్దాల డ్రస్తో వావ్ అనిపించిన ప్రగ్యా జైస్వాల్ పింక్ కలర్ ఫ్రాక్లో నోరా వయ్యారమైన పోజులు బ్లాక్ డ్రస్లో జిగేలుమనేలా కియారా అడ్వాణీ డ్యాన్స్తో దుమ్ములేపిన 'బిగ్బాస్' ఫేమ్ శ్రీసత్య సన్నజాజి నడుము చూపిస్తున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్ దేవకన్యలా కనిపిస్తూ మాయ చేస్తున్న ఖుషీ కపూర్ బీచ్లో చిల్ అవుతున్న హీరోయిన్ సోనారిక View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Sonarika Bhadoria (@bsonarika) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) -
'ఫారే' ప్రీమియర్ షోలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
చలో మైసూర్
హీరో రామ్చరణ్ కొన్ని రోజులు మైసూర్కు మకాం మార్చనున్నారట. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘గేమ్చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసిందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ నెల చివర్లో జరగనున్న ఈ షెడ్యూల్లో రామ్చరణ్పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా శంకర్ ప్లాన్ చేశారట. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘గేమ్చేంజర్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
పదేళ్లు అయినా నా కోసం ఎదురు చూస్తున్నారు: కియారా అద్వానీ
బాలీవుడ్ తారలు ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమపై ఆసక్తి చూపుతున్నారనేది ఎవరు కాదనలేని నిజం. అక్కడి హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు సైతం సౌత్ ఇండియా పరిశ్రమలోని పలు చిత్రాల్లో నటించటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం దక్షిణాది చిత్రాల అవకాశాలను ఏ మాత్రం వదులుకోవడం లేదు. దీపిక పదుకొనే, కత్రినా కైఫ్, అలియా భట్, కంగనా రనౌత్ వంటి తారలు మన చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ కోవలోకి నటి కియారా అద్వానీ చేరింది. బాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. అక్కడ క్రేజీ కథానాయికగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గ్లోబల్స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తోంది. కాగా నటి కియారా అద్వానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ పేర్కొంటూ తాను చేసే ఏ విషయంలోనైనా ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తానంది. నటించే చిత్రాల్లో తన పాత్రలు భిన్నంగా ఉండాలని కోరుకుంటానని పేర్కొంది. చిత్రాలపై చాలామంది పెట్టుబడి, శ్రమ ఉంటాయని, అందుకే చిత్రాలు ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పింది. తన భర్త సిద్ధార్థ్కు చిత్రపరిశ్రమలో మంచి పేరు ఉందని, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ఇకపోతే తాను నటిగా రంగ ప్రవేశం చేసి పదేళ్లు అయ్యిందని, ఇప్పుడు కూడా పలువురు తనతో చిత్రాలు చేయడానికి ఎదురు చూస్తూ ఉండడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు. -
పెళ్లి తర్వాత మరింత హాట్నెస్.. చీరలో ఆ లేడీ యాంకర్
డిఫరెంట్ లుక్లో మెగాడాటర్ నిహారిక అందాల విందు చేసిన యాంకర్ మంజూష లైట్ పింక్ ఔట్ఫిట్తో ఆకట్టుకున్న ఈషా రెబ్బా టైట్ జీన్ డ్రస్లో రకుల్ ప్రీత్ వయ్యారాలు టాప్ యాంగిల్ నుంచి గ్లామర్ చూపిస్తున్న నేహాశర్మ ఛైర్పై కూర్చుని మరీ కాజల్ అగర్వాల్ సోయగాలు హీటెక్కించే పోజులతో చెమట పట్టించిన కియారా View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) -
రూట్ మార్చిన నిహారిక.. కియారా వేరే లెవల్ లుక్
దసరా సెలబ్రేషన్స్లో నిహారిక నయా లుక్ సైడ్ పోజుల్లో సెగ రేపుతున్న దివ్యాంశ కౌశిక్ కాటన్ చీరలో క్యూట్గా యాంకర్ అనసూయ మాల్దీవుల్లోనే ఇంకా ఉండిపోయిన పూజాహెగ్డే బ్లాక్ అండ్ వైట్ చీరలో కవ్విస్తున్న జబర్దస్త్ వర్ష ర్యాంప్ వాక్తో అదరగొట్టిన కియారా అడ్వాణీ రెడ్ డ్రస్లో ధగధగా మెరిసిపోతున్న హన్సిక View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Divyansha Kaushik (@divyanshak) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్ ఫిక్స్.. సినీ చరిత్రలో ఇదే టాప్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మళ్లీ పట్టాలెక్కనుంది. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో చరణ్తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ కార్యక్రమం అంతా కూడా హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: కుమార్తెను తలుచుకుని విజయ్ ఆంటోనీ భార్య ట్వీట్.. చచ్చిపోతున్నా అంటూ..) 2024 వేసవిలో గేమ్ ఛేంజర్ విడుదల కానుందని సమాచారం. అయితే, ఈ సినిమాపై మరోక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ OTT రైట్స్ను ZEE5 సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ డిజిటల్ హక్కుల కోసం ZEE5 ప్లాట్ఫామ్ అన్ని భాషలకు కలుపుకుని సుమారు రూ.250 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త బెంచ్మార్క్ని సెట్ చేసినట్లు రికార్డుకెక్కనుంది. రామ్ చరణ్ చిత్రానికి సంబంధించిన అత్యధిక డీల్గా ఇదీ చరిత్రలో నిలిచిపోతుంది. జూ.ఎన్టీఆర్ ‘దేవర’ స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ రూ. 90 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది రానుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జే.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి అయింది. -
'గేమ్ చేంజర్' షూటింగ్లో రామ్చరణ్కు గాయాలు!
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సునీల్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘గేమ్చేంజర్’ తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ రద్దు అయ్యింది. ‘‘గేమ్చేంజర్’లోని కొందరు ఆర్టిస్టులు షూటింగ్కు అందుబాటులో లేని కారణంగానే ఈ నెలలో జరగాల్సిన షూటింగ్ రద్దు అయింది. అక్టోబర్ రెండోవారంలో తిరిగి షూటింగ్ను స్టార్ట్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే రెండు రోజుల క్రితం రామ్చరణ్కు షూటింగ్లో చిన్న గాయమైందని ఓ వార్త వైరలవుతోంది. గాయం కారణంగా డాక్టర్ పది రోజుల వరకు విశ్రాంతి తీసుకోమన్నారని తెలుస్తోంది. ఈ కారణం వల్ల కూడా షూటింగ్ రద్దైనట్లు సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
పదిహేడేళ్ల తర్వాత...
బాలీవుడ్ సీనియర్ డాన్స్కు నూతన డాన్ రణ్వీర్ సింగ్ అండ్ టీమ్ నుంచి ఆహ్వానాలు అందనున్నాయని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ వెండితెరపై డాన్ పాత్రలు చేసిన అమితాబ్ బచ్చన్(డాన్– 1978), షారుక్ ఖాన్ (డాన్–2006, ‘డాన్ 2’–2011)లు ‘డాన్ 3’ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. ఇందుకోసం రణ్వీర్, ఫర్హాన్లు ప్రయత్నాలు మొదలు పెట్టారని టాక్. అయితే 2006లో వచ్చిన ‘కభీ అల్విదా నా కహ్నా’ తర్వాత అమితా»Œ , షారుక్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మరి..‘డాన్ 3’ కోసం దాదాపు 17ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వేచి చూడాలి. -
రామ్ చరణ్.. చిన్న బ్రేక్!
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘గేమ్చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. అయితే ఈ షెడ్యూల్లో చిన్న విరామం ఇచ్చిన యూనిట్ తిరిగి షూటింగ్ని ప్రారంభించినట్లు ఫిల్మ్నగర్ టాక్. రామ్చరణ్తో పాటు కీలక తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట శంకర్. జయరాం, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
జవాన్లతో కియారా సెలబ్రేషన్స్, తొలిసారి ఆ పని చేసిన ఐటం బ్యూటీ
నవ్వుతో ఫిదా చేస్తున్న కీర్తి సురేశ్ చీర కడితే ఆ ఆనందమే వేరంటున్న అనన్య నాగళ్ల తన ఫేవరెట్ ఫోటోలు షేర్ చేసిన శ్రియ ఇప్పుడీ సన్గ్లాసెసే ఇష్టమంటోన్న మాళవిక మోహన్ ఫస్ట్ టైం లైవ్లో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఆర్మీ జవాన్లతో కియారా అద్వానీ సాహసాలు View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Rani Mukerji 🔵 (@_ranimukerji) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Annie 🦋 (@thenameis_annie) -
FDCI ICW 2023 Photos: ర్యాంప్వాక్లో సినీ తారల హోయలు (ఫోటోలు)
-
నాకు ప్రెగ్నెంట్ అవాలని ఉంది: గేమ్ ఛేంజర్ హీరోయిన్
భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటున్న ఈమె ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో, హృతిక్ రోషన్ వార్ 2లో నటిస్తోంది. కెరీర్ పీక్లో ఉన్న సమయంలో ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాజస్థాన్లో వీరి వివాహం జరిగింది. గత నెలలో ఈమె పొట్ట కాస్త పెద్దదిగా కనిపించడంతో ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేశారు. అయితే తర్వాత మళ్లీ నాజూకుగా కనిపించడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది. కానీ కియారాకు ప్రెగ్నెంట్ అవ్వాలని ఎప్పటినుంచో ఉంది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో ఆమె మాట్లాడుతూ తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని చెప్పింది. ఆ సమయంలో తనకు నచ్చింది తినొచ్చని, అడ్డు చెప్పేవారే ఉండరని అభిప్రాయపడింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా సరే కానీ ఆరోగ్యంగా ఉంటే అంతే చాలంది. తాజాగా ఈ వ్యాఖ్యలు ఫిల్మీదునియాలో మరోసారి వైరల్గా మారాయి. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి తన సినిమాలన్నీ పూర్తి చేసి త్వరలోనే గుడ్న్యూస్ చెప్తుందేమో చూడాలంటున్నారు అభిమానులు. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి! నేను ఆ ఇద్దరికి మాత్రమే భయపడతాను: రజనీకాంత్ -
పెళ్లి గేమ్ లాంటిది.. నా భార్య ఏమో: హీరో సిద్ధార్థ్
Sidharth Malhotra Kiara Advani: బాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల లిస్ట్ తీస్తే బోలెడంతమంది ఉంటారు. కానీ వీళ్లందరిలో కియారా-సిద్ధార్థ్ జోడీ సమ్థింగ్ డిఫరెంట్. ఎందుకంటే బయట ఎక్కడ కనిపించినా సరే ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఓ ఈవెంట్లో భాగంగా తన భార్యపై హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?) పెళ్లి అనేది గేమ్ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సిద్ధార్థ్ మల్హోత్రాకు యాంకర్ నుంచి 'పెళ్లి లైఫ్ ఎలా ఉంది?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'పెళ్లి అనేది గేమ్ లాంటిది. ఇందులో నేను అనేది ఉండదు. మనం అనేది మాత్రమే ఉంటుంది. ఈ ఆటలో ఇద్దరం కలిసి గెలుస్తాం, ఓడుతాం.. ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి.' అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. భార్య బంగారం భార్య కియారా అడ్వానీ గురించి అడగ్గా.. 'నా లైఫ్ లో దొరికిన అత్యంత విలువైన సంపద ఆమె(కియారా)' అని సిద్ధార్థ్ మల్హోత్రా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే 'షేర్ షా' సినిమాలో కలిసిన నటించిన వీళ్లిద్దరూ.. షూటింగ్ సమయంలో లవ్ లో పడ్డారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. కియారా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో హీరోయిన్ గా నటిస్తోంది. సిద్ధార్థ్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!) -
కుర్రాళ్ల గుండెలు దోచేస్తున్న కియారా అద్వానీ (ఫోటోలు)
-
ఫిబ్రవరిలో హీరోయిన్ పెళ్లి.. అప్పుడే ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కియారా అద్వానీ బీ టౌన్తో పాటు టాలీవుడ్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ ఛేంజర్లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లోనూ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. మరోసారి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో జతకట్టింది. ఇప్పటికే భూల్ భూలయ్యా-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ జంట మరోసారి 'సత్యప్రేమ్ కి కథ' చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: ఆదిపురుష్పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే.. ) తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కియారా, కార్తీక్. ప్రమోషన్లలో భాగంగా రాజస్థాన్లో జైపూర్లో సందడి చేశారు. దీనికి సంబంధించి కియారాతో ఉన్న ఫోటోలను కార్తీక్ తన ఇన్స్టాలో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కియారా అద్వానీ మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఆమె ఆ ఫోటోల్లో బేబీ బంప్తో ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కియారా అద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా శుభవార్త ఉందా? కియారా జీ.. అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్లో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో అనిల్ అంబానీ, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్ సహా బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా.. కియారా, సిద్ధార్థ్ 'షెర్షా' మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఆ తర్వాత వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే జపాన్ వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఈ బాలీవుడ్ జంట సినిమాలతో బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్ ఫిక్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. మధ్యలో కియారా!
పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిపోయిన తర్వాత సినిమాలకు భాషతో సంబంధం లేకుండా పోయింది. మన ప్రేక్షకులైతే అదీ ఇదీ అని తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని మూవీస్ చూసేస్తున్నారు. మన హీరోలు కూడా తెలుగు వరకు మాత్రమే పరిమితమైపోకుండా ఎక్కడ ఛాన్స్ వస్తే ఆ భాషల్లో నటించేస్తున్నారు. అలా తారక్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పటికే న్యూస్ వచ్చేసింది. ఇప్పుడు ఆ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. 'ఆర్ఆర్ఆర్'లో నటించి, మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన జూ.ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నాడు. నవంబరులోపు దీని షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని టాక్. ఇది పూర్తయిన వెంటనే తారక్.. బాలీవుడ్ లో 'వార్ 2'లో నటించబోతున్నాడు. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అని సమాచారం. యష్ రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న స్పై యూనివర్స్ లో 'వార్-2' మూవీ ఒకటి. తొలి భాగంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించగా.. సీక్వెల్ లో మాత్రం హృతిక్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో హృతిక్ కు హీరోయిన్ గా కియారా అడ్వాణీని ఎంపిక చేశారని అంటున్నారు. అధికారికంగా చెప్పనప్పటికీ ఇదే నిజమనిపిస్తోంది. మరి ఎన్టీఆర్ సరసన ఏ హీరోయిన్ చేయనుందో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కియారా ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తోంది. Into the Spy Universe!🎬❤️#KiaraAdvani will reportedly join #HrithikRoshan and #JrNTR in #War2. pic.twitter.com/UfQBs8irjp — Filmfare (@filmfare) June 17, 2023 (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?) -
Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ కియారా అద్వానీ పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్గా అగ్ర హీరోలతో సినిమాల్లో నటించిది. కొద్ది నెలల క్రితమే ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లో అత్యంత వైభవంగా ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జైసల్మీర్లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!) కాగా.. కియారా సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోట్లు తెలుస్తోంది. కారు విలువ దాదాపు భారత మార్కెట్లో రూ.3 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఇటీవలే భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి జపాన్ టూర్కు వెళ్లిన భామ ఇండియాకు తిరిగొచ్చింది. ఈ కారును మే 26న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది. (ఇది చదవండి: నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి) కాగా.. టాలీవుడ్లో మెగా తనయుడు రామ్ చరణ్తో కలిసి గేమ్ ఛేంజర్ చిత్రంలో కనిపించనుంది. కియారా నటించిన సత్యప్రేమ్ కి కథ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. -
గేమ్ ఛేంజర్: మైసూర్ వెళ్లనున్న రామ్చరణ్
‘గేమ్ చేంజర్’ మూమెంట్స్ కోసం మైసూర్ వెళ్లనున్నారు రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, ఎస్జే సూర్య, జయరాం, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా భారీ క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్లో జరిగింది. కాగా ‘గేమ్ చేంజర్’ నెక్ట్స్ షెడ్యూల్ మైసూర్లో జరగనున్నట్లు తెలిసింది. జూన్ మొదటివారంలో రామ్చరణ్, శంకర్ అండ్ కో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం మైసూర్ ప్రయాణం కానున్నారని సమాచారం. దాదాపు పది రోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందట. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. జపాన్లో మేజిక్ జరిగింది: రామ్చరణ్ భార్య ఉపాసన గర్భవతి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం తనకు ఏడో నెల అని శ్రీనగర్లో జరిగిన ‘జీ 20’ కార్యక్రమంలో పాల్గొన్న రామ్చరణ్ అన్నారు. ఇదే వేదికపై జపాన్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అది ఇప్పుడు ఇంకా స్పెషల్ అని, ఎందుకంటే జపాన్లోనే ఈ మేజిక్ (భార్య ప్రెగ్నెన్సీ గురించి) జరిగిందనీ రామ్చరణ్ పేర్కొన్నారు. -
1200 మంది ఫైటర్స్తో గేమ్ చేంజర్...
-
స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జైసల్మీర్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్ చేసిన ఈ కొత్తజంట ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో కియారా చేసిన ఓ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబూ రత్నానీ తీసిన ఫోటోను తాజాగా తన ఇన్స్టాలో షేర్ చేశారు. గతంలో 2021 క్యాలెండర్ కోసం ఈ ఫోటోకు ఫోజులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే కియారా డబ్బు కోసం టాప్లెస్గా కనిపించలేదని ఫోటోగ్రాఫర్ రత్నానీ తెలిపారు. కియారా చిత్రాన్ని ముంబైలోని ఒక హోటల్లో చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. నేను గతంలో కూడా చాలా మంది హీరోయిన్లతో ఇలాంటి ఫోటో షూట్ తీశానని తెలిపారు. 2020లో కియారా చేసిన ఫోటోషూట్ కూడా వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. గతంలో కృతి సనన్, దీపికా పదుకొనే, విద్యాబాలన్, సన్నీ లియోన్, పరిణీతి చోప్రా, టబు క్యాలెండర్ కోసం టాప్లెస్గా పోజులిచ్చారు. -
బాలీవుడ్ హీరో పెళ్లి, నెట్టింట వైరలవుతున్న వీడియో!
యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ పెళ్లి చేసుకున్నాడు. కియారా అద్వానీతో ఏడడుగులు నడిచాడు. అదేంటి, కియారాకు ఆల్రెడీ పెళ్లైపోయింది కదా అనుకునేరు.. అయినా సరే వీరి పెళ్లి జరిగింది. కాకపోతే రీల్ లైఫ్లో! కార్తీక్, కియారా జంటగా నటిస్తున్న చిత్రం సత్యప్రేమ్ కీ కథ. ప్రస్తుతం వీరు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సన్నివేశాన్ని మేకర్స్ షూట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో లీకవగా వైరల్గా మారింది. ఇందులో షేర్వాణీ ధరించిన కార్తీక్ ఎమోషనలవుతుండగా.. కియారా కూడా హీరోకు మ్యాచ్ అయ్యే లెహంగా వేసుకుని, దానికి ఎర్ర దుపట్టా జోడించి రాయల్గా కనిపించింది. ఈ సినిమాకు సమీర్ విద్వాంస్ దర్శకత్వం వహించాడు. మొదట ఈ చిత్రానికి సత్యనారాయణ్ కీ కథ అని టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్పై అభ్యంతరాలు వ్యక్తమవడంతో సత్యప్రేమ్ కీ కథగా మార్చారు. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది. ఆనంది గోపాల్ అనే మరాఠీ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న సమీర్ ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ఇటీవల అతడు షెహజాదా(అల వైకుంఠపురములో)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఇది జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో నిర్మాతగా మారిన కార్తీక్కు షెహజాదా బోలెడంత నష్టాన్ని తెచ్చిపెట్టింది. మరోవైపు కియారా అద్వాణీ ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె చివరగా గోవిందా నామ్ మేరా సినిమాతో మెప్పించింది. Leaked video of @TheAaryanKartik & @advani_kiara from their upcoming movie Satyaprem Ki Katha is going viral !!#kartikaaryan #kartik #kiaraadvani #kiara #kiaraaliaadvani pic.twitter.com/j9eFi1VNJi — Glamour Flash Entertainment (@GlamourFlashEnt) March 29, 2023 -
భర్తతో కలిసి షాపింగ్ చేసిన కియారా అద్వానీ
-
RC15 సెట్స్లో అదిరిపోయిన రామ్చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సెస్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. RC15 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. ఇక రేపు(సోమవారం)రామ్చరణ్ పుట్టినరోజు కావడంతో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి.RC15 సెట్స్లో యూనిట్ సభ్యుల మధ్య రామ్చరణ్ తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. చరణ్ ఎంట్రీ కాగానే అతనిపై గులాబీల వర్షం కురిపించారు. అనంతరం కేక్కట్ చేయించారు. ఈ వేడకలో శంకర్, దిల్రాజు, కియారాలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ram charan. RC (@rc_15_love_) Global star @AlwaysRamCharan birthday celebrations begins #RC15 #GlobalStarRamCharan #Ramcharan pic.twitter.com/CqnpfZeBuJ — SivaCherry (@sivacherry9) March 25, 2023 -
కియారా.. అదిరిపోయే అందాలు చూశారా..!(ఫోటోలు)
-
రొమాంటిక్ హోలీ.. సిద్ధార్థ్ బుగ్గలపై రంగులు అద్దిన కియారా!
కులమతాలకతీతంగా ప్రజలందరూ ఆనందంగా జరుపుకునే పండగల్లో హోలీ ఒకటి. నేడు, రేపు దేశవ్యాప్తంగా ఈ రంగుల పండగ జరగనుంది. ఇప్పటికే చాలా చోట్ల హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త వసంతానికి స్వాగతం పలుకుతూ జనాలు సంతోషంగా హోలీ ఆడుతున్నారు. చిన్నా, పెద్దా.. పేద , ధనిక తారతమ్యం లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. సినీ తారలు సైతం హోలీ పండగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ తన భర్త సిద్దార్థ్ మల్హొత్రతో కలిసి తొలిసారి హోలీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంది. పండగ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. భర్త సిద్ధార్థ్ ముఖానికి కియారా స్వయంగా రంగులు పూశారు. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు అనన్య పాండే, మల్లికా షెరావత్, కరణ్ జోహార్ తదితర బాలీవుడ్ సినీ ప్రముఖులు ‘రొమాంటిక్’గా హోలీ పండను సెలబ్రేట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) बुरा न मानो होली है।❤️🔫 हैप्पी होली।❤️💛💚 . .#holihai #holifestival #holi #HappyHoli2023 pic.twitter.com/vKmyg0b0Na — Soundarya Sharma (@soundarya_20) March 7, 2023 Wishing everyone a very happy Holi ♥️🎨 #Holi pic.twitter.com/siGxrpdjIm — SONAL CHAUHAN (@sonalchauhan7) March 7, 2023 Holi is the day of colour.. It is the day good wins over evil. It is the day we let our inner child out… today let us tell our adult selves also to believe in the goodness of humanity. When we believe it will be so. 🙏 ❤️🧡💛💚💙💜🤍#HappyHoli #Holi #Colours pic.twitter.com/unhlSrOsXu — Kajol (@itsKajolD) March 7, 2023 View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
కియారా- సిద్ధార్థ్ పెళ్లి.. బిగ్ న్యూస్ చెబుతానన్న నటి..!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జైసల్మీర్లో ఘనంగా పెళ్లి జరిగింది. ఇరు కుటంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో బాయ్ఫ్రెండ్-గర్ల్ఫ్రెండ్గా ఉన్న సిద్-కియారాలు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్ చేసిన ఈ కొత్తజంట ఇప్పుడు పనిలో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా కియారా పోస్ట్ చేసిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లి తర్వాత వచ్చే బిగ్ న్యూస్ ప్రెగ్నెన్సీ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కియారా తన ఇన్స్టాలో స్టోరీస్లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. మీకు త్వరలోనే బిగ్ న్యూస్ చెబుతానంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆమె తన రూమ్లో కూర్చుని, ప్లేట్ నిండా మామిడికాయ ముక్కలు తింటూ ఫోటోలో కనిపించింది. అయితే కియారా అభిమానులు ఆ బిగ్ న్యూస్ ఏంటా అని ఎదురు చూస్తున్నారు. కాగా.. ప్రస్తుతం కియారా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్సీ15 పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి కోసం సుమారు 20రోజులు బ్రేక్ తీసుకున్న కియారా ఇప్పుడు బ్యాక్ టూ వర్క్ అంటూ సెట్స్లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఇ -
అదిరేటి లుక్స్లో అదుర్స్ అనిపించిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. ఫోటో పోస్ట్ చేసిన కియారా
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘనంగా పెళ్లి జరిగింది. ఇరు కుటంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో బాయ్ఫ్రెండ్-గర్ల్ఫ్రెండ్గా ఉన్న సిద్-కియారాలు భార్యభర్తలుగా ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్ చేసిన ఈ కొత్తజంట ఇప్పుడు పనిలో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం కియారా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి నేపథ్యంలో సుమారు 20రోజులు బ్రేక్ తీసుకున్న కియారా ఇప్పుడు బ్యాక్ టూ వర్క్ అంటూ సెట్స్లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఇక సిద్ కూడా తన నెక్ట్స్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నాడు. తాజాగా ఇద్దరూ కలిసి ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో సందడి చేశారు. చదవండి: కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా? -
కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా?
బాలీవుడ్ లవ్బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హొత్ర ఇటీవలె పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సిద్-కియారాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక రీసెంట్గా పెళ్లి, మెహందీ, సంగీత్.. ఇలా ఒక్కో వేడుకకు సంబంధించిన ఫోటోలను కియారా ఇన్స్టాగ్రామ్లో షేర్చేస్తుంది. తాజాగా సంగీత్ వేడుకలో సిద్ధార్థ్తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో కియారా అవుట్ఫిట్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ రంగులో ఉన్న ఈ లెహంగాకు 98,000కు పైగా క్రిస్టల్స్తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సుమారు 4,000 గంటలు (దాదాపు 24 వారాలు)కష్టపడి ఈ లెహంగాను తీర్చిదిద్దారు మనీష్ మల్హోత్రా అండ్ టీం.ప్రస్తుతం కియారా సంగీత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఆ రాత్రి సమ్థింగ్ రియల్లీ స్పెషల్.. కియరా పోస్ట్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హొత్రను ఫిబ్రవరి 7న ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్కి వెళ్లిన ఈ జంట తాజాగా తిరిగి ముంబైకి చేరింది. ఇప్పుడు కాస్త ఫ్రీ అవ్వడంతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది కియరా. సంగీత్ వేడుకలో సిద్ధార్థ్తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్థింగ్ రియల్లీ స్పెసల్’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ ఫోటోలు సంగీత్ వేడుకలోని అని ఆమె మెన్షన్ చేయకపోవడంతో కియరా తన తొలి రాత్రి గురించి చెప్పిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కామెంట్ బాక్సులో ఫైర్ ఎమోజీలు, లవ్ సింబల్స్తో నింపేశారు. మరికొంత మంది మాత్రం 'కబీర్ సింగ్' డైలాగులు పెడుతున్నారు. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కియారా హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాకి హిందీ రీమేక్ అది. అందులో హీరోయిన్ తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. హీరో గడ్డం పెంచి సైకోలా తయారవుతాడు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ఏంటి కియరా ఇంత పని చేశావు.. ’అని కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
సెట్లో ప్రేమించుకున్నారు.. పెళ్లి సెట్ చేసుకున్నారు
ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు ప్రపంచంలోని ప్రేమికులంతా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వాలెంటైన్స్ డేకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రేమ తర్వాత పెళ్లి వరకు చేరిన జంటలు మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. కానీ బాలీవుడ్లో అలాంటి ప్రేమజంటలు ఎక్కువగానే ఉన్నాయి. తెరపై చూసిన ప్రేమ కథలే నిజ జీవితంలో ఒక్కటయ్యాయి. ప్రేమ పెళ్లిళ్లతో బాలీవుడ్ జంటలు అభిమానులకు సర్ప్రైజ్లు కూడా ఇచ్చాయి. కొన్ని జంటలు ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లడంలో విఫలమైనా.. మరికొన్ని జంటలు మాత్రం పెళ్లి బంధంలో అడుగుపెట్టాయి. బాలీవుడ్లో ఇటీవలే పెళ్లి చేసుకున్న కియారా-సిద్ధార్థ్ జంట నుంచి ఇప్పటిదాకా ఒక్కటైనా జంటలు ఏవో తెలుసుకుందాం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెట్లో ప్రేమించి పెళ్లి సెట్ చేసుకున్న బాలీవుడ్ ప్రేమ జంటలపై ఓ లుక్కేద్దాం పదండి. కాజోల్, అజయ్ దేవగన్ : కాజోల్, అజయ్ దేవగన్ 1995 చిత్రం హల్చల్ షూటింగ్ సెట్లో కలుసుకున్నారు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత 1999లో పెళ్లి చేసుకున్నారు. కాజోల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజయ్ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించికున్నప్పుడు నెలల తరబడి తన తండ్రి తనతో మాట్లాడలేదని ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత సంతోషంగా వివాహం చేసుకున్నారు. కాగా వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ పొందిన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ జంట 1970లో మొదటిసారి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కలుసుకున్నారు. అయితే ఆ గుడ్డి సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఏక్ నాజర్ సెట్స్లో ఉన్నప్పుడు వారి బంధం మరింత బలపడింది. చివరికి జూన్ 3, 1973న వివాహం చేసుకున్నారు. జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్ముఖ్ సెట్లో పరిచయమై పెళ్లిదాకా వెళ్లిన జంటల్లో జెనీలియా డిసౌజా, రితీష్ దేశ్ముఖ్. ఈ జంట2003లో తుజే మేరీ కసమ్ సెట్స్లో మొదటిసారి పరిచయంతోనే మంచి స్నేహితులయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రేమ జంట ఫిబ్రవరి 3, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తేరే నాల్ లవ్ హో గయా, మస్తీ, లై భారీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. ట్వింకిల్ కన్నా, అక్షయ్ కుమార్ షూటింగ్ సెట్లో పరిచయంతో ఒక్కటైన జంట అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నా. మొదటిసారి ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ షూటింగ్లో ఈ జంట కలుసుకున్నారు. ఆ తర్వాత అక్షయ్కి ట్వింకిల్పై ప్రేమ ఏర్పడింది. ఈ జంట ప్రేమ వ్యవహారం 1999లో ఇంటర్నేషనల్ ఖిలాడీ మేకింగ్ సమయంలో మొదలైంది. రెండేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన బాలీవుడ్ జంట చివరికి జనవరి 17, 2001న వివాహం చేసుకున్నారు. దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ జంటల్లో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఒకరు. వీరి ప్రేమ 2013లో గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా సెట్స్లో చిగురించింది. దాదాపు ఆరేళ్ల పాటు కలిసి ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత పద్మావత్, ఫైండింగ్ ఫ్యానీ, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో కనిపించారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ బాలీవుడ్లో మరో పవర్ ఫుల్ కపుల్ ఎవరంటే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. ఈ జంట డిసెంబర్ 2021లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్లో జరిగిన అతిపెద్ద వివాహాలలో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్. దాదాపు ఐదేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఏప్రిల్ 2022లో ఒక్కటైంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ జోడికి నవంబర్లో ఓ పాప కూడా జన్మించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మణిరత్నం చిత్రం గురు షూటింగ్ సమయంలో కలుసుకున్న జంట ఐశ్వర్య అభిషేక్. ఈ జంట సెట్లోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటచు ప్రేమలో ఉన్న జంట ఏప్రిల్ 10, 2007న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు ఉమ్రావ్ జాన్, ధూమ్ 2 వంటి చిత్రాలలో పనిచేశారు. ఈ జంట 2011లో ఆరాధ్య జన్మించింది కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో మరో ప్రేమజంట షాహిద్ కపూర్, కరీనా కపూర్. మొదట ఆమె తాషాన్ సెట్లో సైఫ్ను కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సైఫ్, కరీనా రెండేళ్ల పాటు డేటింగ్ అనంతరం అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఈ ఏడాదిలో ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. రాజస్థాన్లో సూర్యగడ్లో ఫిబ్రవరి 7న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమకథ మొదటి చిత్రం షేర్షా సెట్స్లో ప్రారంభమైంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా పుట్టినరోజు సందర్భంగా కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ రిలేషన్షిప్ను అధికారికంగా తెలియజేసింది. -
ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్
బాలీవుడ్ క్రిటిక్, నటుడు కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) గురించి తెలిసిందే. సినీ సెలబ్రెటీలు టార్గెట్గా తరచూ వారిని విమర్శిస్తుంటాడు. స్టార్ హీరోల సినిమాలు, బి-టౌన్ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు, ఎఫైర్స్పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు ఎన్నోసార్లు వివాదంలో చిక్కుకున్నాడు. ఈక్రమంలో అతడిపై పలుమార్లు పోలీసు కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ కమల్ ఆర్ ఖాన్ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఇప్పటికే ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్ వంటి స్టార్స్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో పడ్డాడు. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అయితే తాజాగా అతడు ఓ బాలీవుడ్ కొత్త జంటను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం కమల్ ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. ‘ప్రస్తుతం బాలీవుడ్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే! ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యాకే ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే తన ట్వీట్ ఆ జంట ఎవరనేది మాత్రం చెప్పలేదు. దీంతో కొత్తగా పెళ్లి చేసుకుంది కియారా-సిద్ధార్థ్ కదే! అంటే కేఆర్కే వారిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడా? అని నెటిజన్లంతా ఆలోచనపడ్డారు. చదవండి: శివరాత్రి స్పెషల్: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే ఆలియా భట్ బాటలోనే కియారా కూడా వెళ్లిందా? కియారా గర్భవతి అయినందువల్లే వారు సడెన్గా చేసుకున్నారా? అని కొందరూ అనుమానం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు కేఆర్కే కామెంట్స్ను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ఇకనైనా ఆపమంటూ అతడిపై మండిపడుతున్నారు. ‘మీ పని మీరు చూసుకోండి.. ఎప్పుడూ పక్కవాళ్లపై పడుతుంటారు’ అంటూ కేఆర్కేకు చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు. కాగా కొంతకాలంగా సీక్రెట్గా డేటింగ్లో ఉన్న కియారా-సిద్ధార్థ్ రీసెంట్గా గుట్టుచప్పుడుగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఫిబ్రవరి 7న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వీరి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. Bollywood’s new trend is, that first get pregnant and then get married. According to sources, Bollywood Ki recently Huyee Marriage Ka Bhi Yahi Formula Hai. Accha Hai. — KRK (@kamaalrkhan) February 12, 2023 -
ముంబైలో సిద్ధార్థ్-కియారా గ్రాండ్ రిసెప్షెన్, బాలీవుడ్ తారల సందడి.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, కొద్ది మంది సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. ఇక ప్రేమ, పెళ్లి విషయంలో గొప్యత పాటించిన ఈ జంట బి-టౌన్ సెలబ్రెటీల కోసం సిద్ధార్థ్-కియారాలు ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. నిన్న ఆదివారం (ఫిబ్రవరి 12) ముంబైలోని ఓ స్టార్ హోటల్లో సాయంత్రం 8:30 గంటలకు ఫంక్షన్ ఏర్పాటు చేసి సెలబ్రెటీలకు ఆహ్వానం ఇచ్చారు. చదవండి: మేము మనుషులమే.. ట్రోల్స్పై ‘సీతారామం’ బ్యూటీ ఆవేదన ఈ కార్యక్రమంలో సినీ తారలంత సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. షారుక్ ఖాన్, ఆలియా భట్, రణ్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, హిద్ కపూర్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, విద్యా బాలన్, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్ కపూర్, ఆయుష్ శర్మ, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, శిల్పాశెట్టి, కరీనా కపూర్, దిశా పటాని, ఆదిత్య కపూర్తో సహా పలువురు సినీ సెలబ్రెటీలు కుటుంబసమేతంగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది? That back hug ❤️✨️#SidKiaraReception #sidkiara pic.twitter.com/0gnOU6w9Df — 𝐌𝐫.&𝐌𝐫𝐬.𝐌𝐚𝐥𝐡𝐨𝐭𝐫𝐚 (@loveSidkiara1) February 12, 2023 Untagged Video: Picture Perfect 👌🥹🫶 The Malhotra's and Advani's family clicked together at #SidKiaraReception 💞 🧿@SidMalhotra @advani_kiara #SidharthMalhotra #KiaraAdvani #SidKiara pic.twitter.com/9lydmMzB7r — Sidharth Malhotra FC (@SidharthFC_) February 12, 2023 Vidya balan is here too I'm loving this big fat Bollywood reception 😍#SidKiaraReception pic.twitter.com/PbeWysvTFf — Nˢᶦᵈʷᵃˡᵉ🫶🏻 (@narmadakrystle) February 12, 2023 Alia and neetu kapoor 😍#SidKiaraReception pic.twitter.com/miCvAqLQwj — Nˢᶦᵈʷᵃˡᵉ🫶🏻 (@narmadakrystle) February 12, 2023 The diva miss #KareenaKapoorKhan blessed my eyes with her gorgeous pink saree 💓🥵 #SidKiaraReception pic.twitter.com/7YZeSyzc7F — JacquelinexsalmanFAN (@Lindaxlove) February 12, 2023 -
గ్రాండ్గా కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
కియారా- సిద్ధార్థ్ పెళ్లి.. వెక్కి వెక్కి ఏడ్చిన రాఖీ సావంత్
ఇటీవలే వివాహబంధంలోకి అడుపెట్టిన కియారా అద్వాని- సిద్ధార్థ్ మల్హోత్రా జంటకు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అభినందనలు తెలిపింది. వారిద్దరి పెళ్లి చాలా అద్భుతంగా జరిగిందని కొనియాడింది. బాలీవుడ్ ప్రేమజంట వివాహా వేడుకను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. ఎవరి పెళ్లి గురించి విన్నా నా గుండెల్లో బాధ మరింత ఎక్కువవుతోందని వాపోయింది. రాఖీ ఏడుస్తున్న వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. రాఖీ మాట్లాడుతూ..' కియారా- సిద్ధార్థ్ పెళ్లి చాలా పవిత్రంగా జరిగింది. కానీ నా జీవితం మాత్రం చాలా దారుణంగా తయారైంది అంటూ ఏడ్చేసింది రాఖీ. ఎవరిదైనా పెళ్లి వార్త వింటే సంతోషంగా అనిపిస్తుంది. కానీ నాకు పెళ్లి పేరు వింటేనే ఏడుపు వచ్చేస్తోంది. నా జీవితం ఎందుకు ఇలా జరుగుతోంది.' అంటూ రోదించింది. కాగా.. గతేడాది ఆదిల్ దురానీతో వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ఆమె భర్తకు మరొకరితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అతనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలే రాఖీ సావంత్ తల్లి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరుస సంఘటనలతో రాఖీ సావంత్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia) -
కియారాకు సిద్ధార్థ్ మ్యారేజ్ గిఫ్ట్ అదే..!
బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫిబ్రవరి7న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్లోని జైసల్మీర్ ప్యాలెస్లో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. బాలీవుడ్లో ఇప్పటికి వరకు జరిగిన పెళ్లిల్లలో ఖరీదైన వాటిలో ఒకటిగా నిలిచింది. కాగా.. షేర్షా మూవీలో తొలిసారి కలిసి నటించిన సిద్-కియారాలు ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి తమ రిలేషన్పై ఎక్కడా నోరు విప్పని ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే రాజస్థాన్, దిల్లీ పర్యటన తర్వాత ప్రస్తుతం ముంబయికి చేరుకుంది కొత్త జంట. తాజాగా వీరి ఇంటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఇంటి విలువ దాదాపు రూ.70 కోట్లు అని బీ టౌన్లో చర్చ నుడుస్తోంది. త్వరలోనే నూతన వధూవరులు ఆ ఇంటిలోకి మారనున్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని పాలి హిల్ ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఈ భవనం.. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సిద్ధార్థ్ తన భార్య కియారా కోసం ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. జైసల్మీర్లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత శనివారం ముంబయికి తిరిగి వచ్చింది జంట. ఆదివారం సాయంత్రం బాలీవుడ్ నటులు, స్నేహితుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
మాజీ బాయ్ఫ్రెండ్ రిసెప్షన్కు రానున్న ఆలియా భట్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక రిసెప్షన్ను ముంబైలో గ్రాండ్గా నిర్వహించనున్నారు. రేపు(ఆదివారం)ముంబైలోని ఓ స్టార్ హోటల్లో సాయంత్రం 8:30 గంటలకు సిద్-కియారాలు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఇక ఈ రిసెప్షన్కు వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ కూడా నెట్టింట లీక్ అయ్యింది. షారుక్ ఖాన్, ఆలియా భట్,రణ్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, హిద్ కపూర్, కరణ్ జోహార్,వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మీడియాకు చెందిన పలువురు హాజరు కానున్నారు. కాగా ఈ లిస్ట్లో ఆలియా దంపతుల పేర్లు కూడా ఉండటం విశేషం. గతంలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీ షూటింగ్లో ఆలియా- సిద్దార్థ్లు ప్రేమలో పడి ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు. తర్వాత ఆలియా రణ్బీర్ను పెళ్లాడగా,సిద్-కియారాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. -
పెళ్లి వీడియోను షేర్ చేసిన సిద్-కియారా.. నెట్టింట వైరల్
బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హొత్రలు ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫిబ్రవరి7న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని జైసల్మేర్ ప్యాలెస్లో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తమ పెళ్లి వీడియోను షేర్ చేసుకున్నారు. వేదికపైకి 'షేర్షా' సాంగ్కి డ్యాన్స్ చేస్తూ వచ్చిన కియారా సిద్దార్థ్ను చూస్తూ మురిసిపోయింది. పెళ్లి కాస్ట్యూమ్లో అద్భుతంగా ఉన్నావంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ పూలదండలు మార్చుకొని ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. ఇక కియారా లేత గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోగా, సిద్దార్థ్ క్రీమ్ షేర్వాణీలో కనిపించాడు. కాగా షేర్షా మూవీలో తొలిసారి కలిసి నటించిన సిద్-కియారాలు ఆ సినిమా టైంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి తమ రిలేషన్పై ఎక్కడా నోరు విప్పని ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
కొత్త పెళ్లి కూతురు కియారాకు అత్తింటి వారి ఘనస్వాగతం, వీడియో వైరల్
కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్లో ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మీర్లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు పిబ్రవరి 7తో ముగిశాయి. చదవండి: ‘యశోద’ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు! పెళ్లి అనంతరం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కియారా-సిద్దార్థ్లు. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం బుధవారం(ఫిబ్రవరి 8న) దంపతులుగా ఢిల్లీ చేరుకున్నారు. మొదటి సారి కోడలిగా అత్తింట్లోకి అడుగుపెడుతున్న కియారాకు సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పంజాబీ సాంప్రదాయ ప్రకారం డోలు, సన్నాయిలతో ఈ కొత్త జంటను ఇంట్లోకి ఆహ్వానించారు. చదవండి: షణ్ముఖ్తో హగ్లు, ముద్దులు.. తప్పు చేశానంటూ శ్రీహాన్ ముందు సిరి కన్నీళ్లు! ఈ సందర్భంగా సిద్ధార్థ్-కియారాలు పంజాబీ డోలుకు డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం మీడియాకు ఫోజులు ఇచ్చిన ఈ కొత్త జంట పాపరాజిలకు స్వీట్స్ పంచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక ఈరోజు (ఫిబ్రవరి 9) రాత్రి ఢిల్లీలో ఫ్యామిలీ రిసెప్షన్ నిర్వహించారు. ఇక ఫిబ్రవరి 10న ముంబైలో ఫ్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ల కోసం మరో రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) View this post on Instagram A post shared by @varindertchawla View this post on Instagram A post shared by @varindertchawla View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) -
కియారా-సిద్ధార్థ్ల సీక్రెట్ డేటింగ్, పెళ్లిపై కంగనా షాకింగ్ రియాక్షన్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం. ఆమె పేరు వినిపిస్తే చాలు ఏ వివాదానికి తెరలేపిందా! అని అంతా ఆశ్చర్యపోతుంటారు. ఇక ఆమె మాట్లాడితే బాలీవుడ్ స్టార్ కిడ్స్, నెపోటిజంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు బి-టౌన్ సెలబ్రెటీలపై ఆరోపణలు చేస్తూ వారిని విమర్శిస్తూ ఉంటుంది కంగనా. చదవండి: సుమంత్తో విడాకుల అనంతరం నటనకు బ్రేక్ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అలాంటి కంగనా తాజాగా కొత్త జంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల డేటింగ్, పెళ్లిపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఆమె స్పందన చూసి కొందరు సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు మంగళవారం(ఫిబ్రవరి 7న) ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వార్త బయటకు రావడంతో ఓ ట్విటర్ యూజర్ అయితే వీరు డేటింగ్లో ఉంది నిజమేనా? అని ట్వీట్ చేశాడు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరో తెలుసా? దీనికి కంగానా ఆసక్తికర రీతిలో స్పందించింది. ‘అవును వారు డేటింగ్లో ఉన్నారు. కానీ బ్రాండ్ల కోసం, సినిమాల ప్రమోషన్ల కోసం కాదు. ఈ జంట లైమ్ టైట్లో ఉండేందుకు, ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ఎప్పడు ప్రయత్నించలేదు. చాలా చిత్తశుద్ధితో, నిజమైన ప్రేమ కలిగిన చూడముచ్చటైన జంట వీరిద్దరిది’ అని కంగనా రనౌత్ బదులిచ్చింది. కియారా, సిద్ధార్థ్ జంటను గతంలోనూ కంగనా పలు సందర్భాల్లో ప్రశంసించిన సంగతి తెలిసిందే. ‘ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉంది.. సినిమా పరిశ్రమలో నిజమైన ప్రేమను అరుదుగా చూస్తుంటాం. వీరిద్దరూ కలసి చూడ్డానికి దేవతల మాదిరిగా ఉన్నారు’’ అని కియారా, సిద్ధార్థ్ వివాహానికి ముందు కంగనా రనౌత్ ట్వీట్ చేయడం గమనార్హం. They were dating? pic.twitter.com/msnnsYKSHu — Aniruddha Guha (@AniGuha) February 7, 2023 -
వైభవంగా కియారా-సిద్ధార్థ్ పెళ్లి.. హనీమూన్కు నో ఛాన్స్..!
బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర పెళ్లి ఘనంగా జరిగింది. రాజస్థాన్ జైసల్మీర్లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు బీటాన్ క్యూట్ కపుల్ కియారా, సిద్ధార్థ్. ఫిబ్రవరి 4 నుంచి మొదలైన వేడుకలు ఇవాల్టితో ముగియనున్నాయి. వివాహానికి విచ్చేసిన సినీ, రాజకీయ ప్రముఖలను కోసం దాదాపు 70 లగ్జరీ కార్లు ఏర్పాటు చేశారు. వీరికి వండి వడ్డించడానికి 500 మంది దాకా వెయిటర్లను ముంబయి, దిల్లీ నుంచి ప్రత్యేకంగా రప్పించారు. అయితే నూతన వధూవరులు మాత్రం హనీమూన్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వారి కెరీర్ ప్రణాళికల్లో భాగంగా మరికొన్ని వాయిదా వేసుకుంటారని సమాచారం. అయితే వీరి వివాహా ఆచారాల కారణంగా పెళ్లి చేసుకున్న వెంటనే హానీమూన్కు వెళ్లరట. జైసల్మీర్ నుంచి ఇంటికి తిరిగొచ్చాక పంజాబీ, సింధు కుటుంబ ఆచారాల ప్రకారం వేడుకలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతే కాకుండా సిద్ధార్థ్.. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే కియారాకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇద్దరూ తమ వర్క్ కమిట్మెంట్ పూర్తి చేసిన తర్వాతే హనీమూన్ ట్రిప్ను ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై సిద్ధార్థ్, కియారా స్పందించలేదు. ఇటీవల కొత్తగా పెళ్లయిన జంట అతియా శెట్టి-కేఎల్ రాహుల్ సైతం హనీమూన్ వేడుకను వాయిదా వేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ రెండు గ్రాండ్గా రిసెప్షన్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 12న ముంబైలోని తమ ఇండస్ట్రీ స్నేహితుల కోసం, ఫిబ్రవరి 9న దిల్లీలోని వరుడి కుటుంబ సభ్యుల కోసం మరో రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పెళ్లిలో బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్, రామ్ చరణ్, మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్తో పాటు వ్యాపార దిగ్గజం ఇషా అంబానీతో సహా అనేక మంది స్నేహితులను హాజరయ్యారు. -
కియారా వల్ల నా భార్యతో విడాకులు తీసుకునేదాకా వెళ్లా: వ్యాపారవేత్త
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మరికాసేపట్లో ఏడడుగులు వేయనున్నారు. జైసల్మీర్లో ఎంతో ఘనంగా జరగనున్న వీరి వివాహానికి సెలబ్రిటీలందరూ విచ్చేశారు. ఈ వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో వ్యాపారవేత్త, భారత్పే సహవ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ తన ఆటోబయోగ్రఫీ డోగ్లాపన్లో రాసుకొచ్చిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పుస్తకంలో అష్నీర్.. కియారా వల్ల నేను విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది అంటూ ఓ సంఘటనను పంచుకున్నాడు. అందులో ఏం రాసి ఉందంటే.. 'నేను వీకెండ్ రాగానే షార్క్ ట్యాంక్ ప్రోగ్రామ్ కోసం షూటింగ్కు వెళ్తున్నాను. మిగిలిన రోజులు నా పనిలో మునిగి తేలుతున్నాను. అలా పనిలో పడి బిజీ అయిపోవడంతో కనీసం అమ్మతో మాట్లాడేంత సమయం కూడా దొరకలేదు. దీంతో ఓ రోజు అమ్మ వచ్చి చాలా పెద్దవాడివైపోయావురా, మాటలు కాదు కదా కళ్లకు కూడా కనిపించట్లేదు అంది. అదే రోజు ఉదయం ఓ స్నేహితుడు కలవడంతో నా భార్య మాధురి, నేను పెళ్లెప్పుడు అని ఆరా తీశాం. ఓ సినీతారతో పెళ్లి సంబంధం కుదిరే ప్రయత్నాలు జరుగుతున్నాయని అతడు చెప్పాడు. ఇలా సెలబ్రిటీలతో సంబంధాలు కుదిర్చేందుకు ఓ మధ్యవర్తి పని చేస్తుందన్నాడు. తనొక స్టార్టప్ బిజినెస్ వ్యవస్థాపకుడు.. కానీ అమ్మాయి మాత్రం సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కావాలని కోరుకుంటున్నాడు. ఇది గుర్తొచ్చి మా అమ్మతో నీకు బయట ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇప్పటికిప్పుడు నేను పెళ్లికి రెడీ అయితే కియారా అద్వానీని వివాహం చేసుకోవచ్చు తెలుసా? అని జోక్ చేశాను. అది విని మాధురి ముఖం మాడిపోయింది. తర్వాత మేమిద్దరం ముంబైకి వెళ్లేందుకు విమానం ఎక్కాం. తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఇంతలో ఫుడ్ రావడంతో తినమని ఆమెను పలకరించాను. అంతే.. ఒక్కసారిగా నా మీద అరిచేసి తిట్టినంత పని చేసింది. నువ్వు కియారాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అయితే నేనెందుకు మరి అంటూ తన నగలన్నీ తీసేసింది. ఆమె చర్యతో నేను ఒక్కసారిగా షాకయ్యాను. దయచేసి అలా ప్రవర్తించొద్దంటూ ఆమెను నగలు తీసేయకుండా పట్టుకున్నాను. అప్పటిదాకా ఫోన్లో సినిమా చూస్తున్న ఓ పెద్దాయన వెంటనే దాన్ని ఆపేసి లైవ్లో మా ఫైట్ మూవీని చూస్తున్నాడు. అక్కడున్న అందరికీ ఈ గొడవంతా మంచి ఎంటర్టైన్మెంట్లా అనిపించింది' అని రాసుకొచ్చాడు అష్నీర్. Kiara Advani, Ashneer Grover and his divorce. pic.twitter.com/MQQraqSQIF — Keshav Bedi (@keshavbedi) December 28, 2022 చదవండి: స్టేజీపై పాట పాడిన ధనుష్.. వీడియో వైరల్ -
పెళ్లి బిజీలో కియారా.. డ్యాన్సింగ్ టైం అంటున్న రామ్చరణ్
హీరో రామ్చరణ్ డ్యాన్స్ మోడ్లోకి వెళ్లారు. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ నేటి నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ఓ సాంగ్ను చిత్రీకరించనున్నారు. సో.. రామ్చరణ్కు ఇది డ్యాన్సింగ్ టైమ్. డిఫరెంట్ లొకేషన్స్లో పాట చిత్రీకరణ జరగనుండటం విశేషం. పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న కియారా త్వరలోనే తిరిగి సెట్స్లో పాల్గొననున్నట్లు కనిపిస్తోంది. తొలుత హైదరాబాద్లో చిత్రీకరణ జరిపి తర్వాత వైజాగ్, రాజమండ్రిలో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేశారట చిత్రయూనిట్. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: బ్లాక్బస్టర్ గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ -
కియారా -సిద్ధార్థ్ పెళ్లి.. మూడు రోజుల ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
కొత్త ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన బాలీవుడ్ ప్రేమజంట హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వనుంది. రాజస్థాన్లోని జైసల్మీర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యయి. మూడు రోజుల పాటు పెళ్లి వేడుక ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో పాల్గొనే అతిథుల కోసం కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. ముంబయికి చెందిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అతిథులతో పాటు దాదాపు 150 మంది వీవీఐపీల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం 70 లగ్జరీ వాహనాలైన మెర్సిడెస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ సిద్ధం చేశారు. అతిథులకు రాజస్థానీ వంటకాలను సిద్ధం చేయనున్నారు. సూర్యగఢ్ ప్యాలెస్ కియారా- సిద్ధార్థ్ రాయల్ వెడ్డింగ్కు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యగఢ్ ప్యాలెస్ డెస్టినేషన్ రాయల్ వెడ్డింగ్స్కు నిలయం. అతిథులకు విలాసవంతమైన హోటల్ గదులు, బెడ్రూమ్లు, పెద్ద తోటలు, ఒక కృత్రిమ సరస్సు, ఒక వ్యాయామశాల, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, విల్లాలు, 2 పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్లో వెడ్డింగ్కు ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలల్లో మద్యం లేకుండా ఒక్కరోజు ఖరీదు రూ.1.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అక్టోబరు నుంచి మార్చి వరకైతే రోజుకు దాదాపు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నారు. రూ.8 నుంచి 10 కోట్ల ఖర్చు సిద్ధార్థ్- కియారాల వివాహం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వేడుక ఖర్చు దాదాపు రూ. 6 కోట్లకు పైనే ఉండనుంది. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర ఖర్చులు కలుపితే పెళ్లి ఖర్చు దాదాపు రూ.8 నుంచి 10 కోట్ల వరకు కానుంది. వీరి పెళ్లి బాలీవుడ్లో అత్యంత ఖరీదైన వేడుకల్లో ఒకటిగా నిలవనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్చరణ్తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. -
పెళ్లికి బయలుదేరిన కియారా అద్వానీ.. ఎయిర్పోర్ట్ ఫోటోలు వైరల్
-
పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్ కియారా అద్వానీ (ఫోటోలు)
-
ఆ హీరోతో పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్!.. రాయల్ వెడ్డింగ్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి 6న సిద్-కియారాల వివాహం జరగనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ, రాజస్థాన్లోని జైసల్మేర్ ఫోర్ట్లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయట. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని, ఓ ప్రైవేట్ జెట్లో వీరు రాజస్థాన్ చేరుకుంటారని సమాచారం. కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీష్ మల్హొత్రా సహా సిద్-కియారాల పెళ్లికి వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. కాగా షేర్షా మూవీలో తొలిసారి నటించిన ఈ జంట ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. -
‘గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది’ అంటున్నస్టార్ హీరోయిన్స్
ఏడేళ్ల తర్వాత తెలుగుకి వచ్చారు కృతీ సనన్.. దిశా పటానీ. మూడేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు కియారా అద్వానీ.. మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు అనుష్క. ఇరవైరెండేళ్ల తర్వాత హిందీ సినిమా చేశారు జ్యోతిక.. ఎందుకీ గ్యాప్ అంటే.. వేరే భాషల్లో సినిమాలు చేయడంవల్ల, వేరే కారణాల వల్ల అన్నమాట.అంతేకానీ కావాలని ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’. ఇక తెలుగు, హిందీలో గ్యాప్ తర్వాత ఈ స్టార్స్ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం... ‘జియా జలే...’ అంటూ వరుణ్ తేజ్తో కలిసి ‘లోఫర్’లో చాలా హాట్ హాట్గా స్టెప్పులేసిన దిశా పఠానీ గుర్తుందా? తెలుగులో తనకు ఇదే తొలి చిత్రం. ఆ మాటకొస్తే.. హీరోయిన్గానే మొదటి సినిమా. 2015లో ఈ సినిమా వచి్చంది. ఆ తర్వాత ఈ నార్త్ బ్యూటీ హిందీ పరిశ్రమకు వెళ్లి మళ్లీ తెలుగువైపు చూడలేదు. ఈ ఏడేళ్లల్లో అక్కడ సినిమాలు చేస్తూ వచి్చన దిశా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ‘΄ాజెక్ట్ కె’. ప్రభాస్ హీరోగా నాగ్ అశి్వన్ దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ΄ాన్ ఇండియా సినిమా ద్వారా దిశా గ్రాండ్గా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. దిశాలానే కృతీ సనన్ కూడా పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్తో తెలుగు తెరపై గ్రాండ్ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే దిశాలానే ప్రభాస్ సరసన కనిపించనున్నారు. ఆ బ్యూటీలానే కృతీ కూడా ఏడేళ్లకు తెలుగుకి వస్తున్నారు. మహేశ్బాబు సరసన ‘1 నేనొక్కడినే’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి ఆ తర్వాత నాగచైతన్య సరసన ‘దోచేయ్’ (2015) చేశారు. మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక ‘ఆదిపురు‹Ù’ విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీతగా కృతీ సనన్ చేశారు. ఈ ఏడాది జూన్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక హిందీ చిత్రం ‘ఫగ్లీ’ (2014) ద్వారా హీరోయిన్గా పరిచయ మైన కియారా అద్వానీ ఆ తర్వాత నాలుగేళ్లకు తెలుగు తెరపై మెరిశారు. మహేశ్బాబు సరసన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్చరణ్ సరసన ‘వినయ విధేమ రామ’ (2019)లో నటించారు. హిందీ చిత్రాలు చేస్తూ వస్తున్న కియారా కొంత గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ రామ్చరణ్ సరసనే కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో కియారా కథానాయికగా నటిస్తున్నారు. దిశా, కృతీలానే ఈ బ్యూటీ కూడా గ్రాండ్గా పాన్ ఇండియా మూవీతో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ ముగ్గురూ పాన్ ఇండియా సినిమాల ద్వారా మళ్లీ తెలుగులో కనిపించనుండటం వారికే కాదు.. వారి ఫ్యాన్స్కి కూడా ఆనందంగా ఉంటుంది. నిశ్శబ్దంగా... అనుష్క రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా తెరపై కనిపించారు. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ చిత్రంలో బదిరురాలు (మూగ, చెవిటి) పాత్ర చేశారు అనుష్క. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంతకుముందు 2019లో చిరంజీవి నటించిన ‘సైరా’లో వెండితెరపై కనిపించారు అనుష్క. సో.. సిల్వర్ స్క్రీన్పై ఈ బ్యూటీ కనిపించి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు అనుష్క. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరో. మహేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. పెద్ద అప్డేట్స్ ఏవీ ఇవ్వకుండా ఈ చిత్రం షూటింగ్ని నిశ్శబ్దంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇరవైరెండేళ్లకు హిందీలో... హిందీ చిత్రం ‘డోలీ సజా కే రఖ్నా’ (1998)తో తన కెరీర్ను ప్రారంభించారు జ్యోతిక. ఆ తర్వాత ‘వాలీ’ సినిమాతో తమిళ్కి పరిచయమై, వరుసగా తమిళ్, తెలుగు.. ఇలా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా బిజీ అయ్యారు. హీరో స్యూరని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయ్యాక కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె. 2009 నుంచి 2014 వరకూ సినిమాలు చేయలేదు. 2015లో ‘36 వయదినిలే’తో రీ–ఎంట్రీ ఇచ్చి, లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇక జ్యోతిక చివరిగా హిందీ తెరపై కనిపించిన సినిమా ‘లిటిల్ జాన్’ (2001). ఇన్నేళ్ల తర్వాత ఆమె ఆ మధ్య హిందీ సినిమా ‘శ్రీ’ అంగీకరించారు. రాజ్కుమార్ రావ్ హీరోగా తుషార్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘శ్రీ’లో నా ΄ాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. భారమైన హృదయంతో ఈ యూనిట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు జ్యోతిక. -
రెండుసార్లు పెళ్లి తేదీలు విన్నా.. కానీ ఎవరూ పిలవలేదు: సిద్దార్థ్ మల్హోత్రా
ఈ ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన జంట హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీలెక్కనున్నట్లు రూమర్స్ హల్చల్ చేశాయి. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని.. ఫిబ్రవరి 6న పెళ్లికి ముహూర్తం కుదిరిందని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నట్లు తెగ వైరలయ్యాయి. రాజస్థాన్లోని జైసల్మేర్ ప్యాలేస్ వివాహ వేదిక కానుందనీ.. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలను ఈ జంట ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. (ఇది చదవండి: కియారా అద్వానీ పెళ్లికి ముహూర్తం కుదిరిందా?) కానీ ఈ వార్తలపై తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా నోరు విప్పారు. ఇప్పటికీ నా పెళ్లికి ఇంకా నన్ను ఎవరూ ఆహ్వానించలేదు. ప్రజలు కూడా ఎవరు పిలవలేదు. ఇప్పటికే రెండుసార్లు పెళ్లి తేదీలు కూడా విన్నా. అభిమానులు తన వ్యక్తిగత జీవితంపై వచ్చే ఊహగానాల కంటే.. నా సినిమాలపై దృష్టి సారిస్తే మంచిది. అదే నాకు నచ్చుతుంది.' అని అన్నారు. ఇటీవల కియారా అద్వానీ, సిద్ధార్త్ మల్హోత్రా పెళ్లి గురించి రూమర్స్ పెద్దఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్చరణ్తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. షేర్షా సినిమా తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి మిషన్ మజ్నుతో ఓటీటీలో అలరించనున్నారు. జనవరి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. చివరిసారిగా సిద్ధార్థ్, అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్లతో నటించిన థ్యాంక్ గాడ్లో కనిపించాడు. -
కియారా అద్వానీ పెళ్లికి ముహూర్తం కుదిరిందా?
ఈ కొత్త సంవత్సరం తొలిరోజు వార్తల్లో నిలిచినవారిలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ జంట ఒకటి. ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘షేర్షా’ చిత్రంలో నటించినప్పుడు ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని సమాచారం. ఫిబ్రవరి 6న పెళ్లికి ముహూర్తం కుదిరిందని బాలీవుడ్ టాక్. మెహందీ, సంగీత్, పెళ్లి.. ఈ మూడు వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయట. మెహందీ, సంగీత్ ఒకే రోజున, ఆ మర్నాడు వివాహ వేడుకను ప్లాన్ చేశారని భోగట్టా. రాజస్థాన్లోని జైసల్మేర్ ప్యాలేస్ వివాహ వేదిక కానుందనీ, పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ టాక్. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, సినీ ప్రముఖులకు ముంబయ్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని సిద్ధార్థ్, కియారా అనుకున్నారట. ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్చరణ్తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు. -
పెళ్లికి రెడీ అవుతున్న హీరో, హీరోయిన్.. డేట్ ఫిక్స్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్థింగ్, సమ్థింగ్ నడుస్తోందని అంతా ఫిక్స్ అయ్యారు. తాజాగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న వీరి వివాహం ఘనంగా జరగనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయట.పెళ్లివేడుక కోసం రాజస్థాన్లోని జైసల్మేర్ ఫోర్ట్ను ఇప్పటికే ఖరారు చేశారని టాక్ వినిపిస్తుంది. కుటుంబసభ్యులు,సన్నిహితులతో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు సిధ్, కియారా పెళ్లికి హాజరుకానున్నారట. జనవరిలో తమ పెళ్లి గురించి సిద్ధార్థ్, కియారాలు అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సోషల్ హల్చల్: జాన్వీ కపూర్ బ్యూటీ.. రెడ్ డ్రెస్లో కియారా లుక్స్
ప్రతి రోజు సోషల్ మీడియాలో సినీ తారలు తమ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సినీ తారలపై ఓ లుక్కేద్దాం. బ్లాక్ డ్రెస్లో జాన్వీ కపూర్ అందాలు రెడ్ డ్రెస్లో కవ్విస్తున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ బ్లూ డ్రెస్లో హెబ్బాపటేల్ హోయలు బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హాట్ లుక్స్ ఖతార్ టూర్ ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే ఫ్యాషన్ లుక్లో రవీన్ టాండన్ స్టన్నింగ్ లుక్లో అదరగొట్టిన పూజా హెగ్డే View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Sonalee Kulkarni (@sonalee18588) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
RC15 : న్యూజిలాండ్లో షూటింగ్ కంప్లీట్ చేసిన రామ్చరణ్, కియారా
న్యూజిలాండ్కి బై బై చెప్పారు రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల న్యూజిలాండ్లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో రామ్చరణ్, కియారాలపై బాస్కో వర్టిస్ కొరియోగ్రఫీలో ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశారు. ‘న్యూజిలాండ్లో సాంగ్ షూటింగ్ పూర్తయింది. అద్భుతమైన విజువల్స్ వచ్చాయి’’ అని బుధవారం ట్వీట్ చేశారు రామ్చరణ్. కాగా ఈ పాట చిత్రీకరణకు దాదాపు రూ.15కోట్లు ఖర్చుచేశారట చిత్రయూనిట్. సో.. ఈ సాంగ్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్గా ఉండనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్ హీరోయిన్.. వరుడు అతనేనా?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తరచూ డిన్నర్ పార్టీలని, హాలీడే ట్రిప్లని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలుస్తుంటారు. మరి ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటి కానుందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తాము లవ్లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా కియారా అద్వానీ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెళ్లి వార్తలకు ఆ వీడియో మరింత బలం చేకూరుస్తోంది. కియారా తాజాగా తన ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో చాలా అందంగా నవ్వుతూ కనిపించారు. కియారా అద్వానీ వీడియోను షేర్ చేస్తూ తన అభిమానులను ఆటపట్టించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి ప్రకటన చేస్తుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. ఇన్స్టాలో కియారా వీడియో షేర్ చేస్తూ.. ' ఈ రహస్యాన్ని ఇంకా ఎక్కువ కాలం దాచలేను. త్వరలోనే ప్రకటిస్తున్నా. డిసెంబర్ 2న ప్రకటిస్తా. వేచి ఉండండి' అంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ అభిమాని సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి చేసుకుంటున్నారా? అని కామెంట్ చేయగా.. మరొకరు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమేనా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్లతో కలిసి నటించిన గోవిందా నామ్ మేరా విడుదలకు సిద్ధమవుతోంది. గోవింద నామ్ మేరా డిసెంబర్ 16న ఓటీటీలో విడుదల కానుంది. ఆమె తర్వాత కార్తీక్ ఆర్యన్తో సత్యప్రేమ్ కి కథ, రామ్ చరణ్తో ఆర్సీ15 కనిపించనుంది. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
న్యూజిలాండ్ షూట్లో బిజీగా రామ్చరణ్.. పిక్స్ వైరల్..!
రామ్చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్సీ15'. ప్రస్తుతం ఈ సినిమాను న్యూజిలాండ్లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తున్నాయి. నటి కియారా అద్వానీ తన ఇన్స్టాలో పిక్స్ షేర్ చేయడంతో వైరలవుతున్నాయి. (చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు) షూటింగ్ గ్యాప్లో చరణ్తో కలిసి బర్గర్ తింటున్న ఫొటోలను కియారా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ రొమాంటిక్ సాంగ్ను తెరకెక్కిస్తున్నారు. డ్యూన్డీన్సిటీ బీచ్తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లోని బ్యూటీఫుల్ లొకేషన్స్లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో చిత్రబృందంతో కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోలను కియారా సోషల్ మీడియాలో పంచుకుంది. కియారా తన ఇన్స్టాలో రాస్తూ..'తర్వాత సాంగ్ షూట్ కోసం డైట్లో ఉన్నామంటూ' రాసుకొచ్చింది. కియారా పోస్ట్కు ఫొటోలను ఉద్దేశించి రామ్చరణ్ సతీమణి ఉపాసన కామెంట్ చేసింది. మీ అందరిని మిస్ అవుతున్నానంటూ రిప్లై ఇచ్చింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్తో ఈ సినిమాను దిల్రాజు నిర్మిస్తున్నారు. నవీన్చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న విక్కీ కౌశల్ సినిమా
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన తాజా చిత్రం ‘గోవిందా నామ్ మేరా’. శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహర్ నిర్మించాడు. కియారా అద్వానీ, భూమి పడ్నేకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు నేరుగా ఓటీటీలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. దీంతో ఈ చిత్రం థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) -
శంకర్- రామ్చరణ్ సినిమా; పది కోట్ల పాట?
దర్శకుడు శంకర్ సినిమాల్లో సాంగ్స్ విజువల్స్ పరంగా, లొకేషన్స్ పరంగా చాలా గ్రాండియర్గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ మరో గ్రాండియర్ సాంగ్ను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే శంకర్ పది కోట్ల బడ్జెట్తో పాట ప్లాన్ చేశారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ న్యూజిల్యాండ్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతుందట. హీరో రామ్చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలపై గ్రాండ్గా డ్యూయట్ సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ పాటకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైనే బడ్జెట్ను కేటాయించారట. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చుతారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతదర్శకుడు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఫారిన్లో పాట
త్వరలో న్యూజిల్యాండ్లో ల్యాండ్ కానున్నారు రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ న్యూజిల్యాండ్లో ఆరంభం కానుందని తెలిసింది. ఈ నెల మూడోవారంలో రామ్చరణ్, శంకర్ అండ్ టీమ్ ఫారిన్ ప్రయాణం అవుతారు. ముందుగా న్యూజిల్యాండ్లోని అందమైన లొకేషన్స్లో రామ్చరణ్, కియారాలపై ఓ రొమాంటిక్ సాంగ్ను చిత్రీకరిస్తారట. ఈ పాటకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ స్టెప్స్ సమకూర్చనున్నారని తెలిసింది. ఈ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా ప్లాన్ చేశారట శంకర్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
బాలీవుడ్ హీరోతో కియారా లవ్? డిసెంబర్ లో మ్యారేజ్?
-
ప్రియుడంటే కియారాకు ఎంత ప్రేమో, వైరల్ వీడియో
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే! తరచూ డిన్నర్ పార్టీలని, హాలీడే ట్రిప్లని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తాము లవ్లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా సిద్దార్థ్, కియారా ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. ఇందులో ప్రేమ పక్షులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు. అయితే అన్సీన్ వీడియోలో కియారా తన ప్రియుడి కళ్లల్లో నలక పడితే తీసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సిద్ అంటే ఎంత ప్రేమో, వీరిని చూస్తుంటే ఆల్రెడీ పెళ్లైన జంటలాగే ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by 𝐊𝐢𝐚𝐫𝐚 𝐒𝐢𝐝𝐡𝐚𝐫𝐭𝐡 𝐌𝐚𝐥𝐡𝐨𝐭𝐫𝐚 💘🇮🇩 (@sidkiara.world30) చదవండి: -
వచ్చే నెలలో వైజాగ్లో...
హీరో రామ్చరణ్– డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ని సెప్టెంబరులో ఆరంభించనున్నట్లు అప్డేట్ ఇచ్చారు శంకర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టాలీవుడ్లో ఆగస్టు 1 నుంచి షూటింగ్లు బంద్ కావడంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. సెప్టెంబర్ 1నుంచి తిరిగి షూటింగ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్చరణ్–శంకర్ సినిమా కూడా రీ స్టార్ట్ కానుంది. ‘‘ప్రస్తుతం కమల్హాసన్తో ‘ఇండియన్ 2, రామ్ చరణ్తో ‘ఆర్సి 15’ సినిమాలు చేస్తున్నాను. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాం. ‘ఆర్సి 15’ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్, వైజాగ్లో జరగనుంది. సెప్టెంబర్ తొలి వారంలోనే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. -
ఆ డైరెక్టర్కి అలా హగ్ ఇచ్చా.. అందరు వింతగా చూశారు: కియారా
సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను మూవీతో టాలీవుడ్కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ప్రస్తుతం ఆమె హిందీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇటూ తెలుగు, అటూ హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో షాహిద్ కపూర్తో కలిసి ఆమె కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా పరిశ్రమలోకి రాకుముందు ఓ దర్శకుడి పట్ల తను వ్యవహరించు తీరుకు చాల ఇబ్బంది పడ్డానని చెప్పింది. చదవండి: పూరీ దగ్గర సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడా! ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నటి అవ్వాలనేది నా కోరిక. ఇదే విషయం మా దగ్గరి బంధువు అయిన నటి జూహి చావ్లాకు తెలిసింది. నన్ను నటిగా తెరపైకి తీసుకురావాలని ఆమె ప్రయత్నిస్తున్న క్రమంలో తను నటించిన ఐ యామ్ మూవీ విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఆమె ఇండస్ట్రీ వాఆళ్ల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీ హీరోహీరోయిన్లు, దర్శక-నిర్మాతలతో పాటు పలువుకు సినీ పెద్దలు కూడా హాజయ్యారు. వారికి పరిచయం చేసేందుకు నన్నూ కూడా ఆపార్టీకి ఆహ్వానించారు. చదవండి: సౌందర్యతో అలాంటి రిలేషన్ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్ అక్కడికి వెళ్లిన నన్ను.. దర్శకుడు సుజాయ్ హోష్కు ఆమె పరిచయం చేశారు. పరిచయం అనంతరం ఆయన నాతో మాట్లాడుతూ.. చేయి పైకెత్తి ఎవరినో పిలవబోయారు. దాన్ని అర్థం చేసుకోలేని నేను.. కౌగిలించుకోమన్నారేమో అనుకుని వెంటనే ఆయన్ని హగ్ చేసుకున్న. నేను చేసిన పనికి అక్కడే ఉన్న జూహీ షాకై చూశారు. ‘ఈ అమ్మాయి ఇలా చేసిందేంటి!’ అన్నట్టుగా ఆమె నా మొహం వైపు చూశారు. ఆ సంఘన గుర్తొస్తే ఇప్పటికీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను మర్చిపోలేని ఇబ్బందికర సంఘటన ఇది’’ అంటూ కియారా చెప్పుకొచ్చిది. -
మీ అమ్మ నువ్వింకా కన్యవే అనుకుంటుందా?.. షాకైన హీరోయిన్
కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీల పర్సనల్ విషయాలు లాగడమే ఈ షో లక్ష్యంగా తయారైంది. ఏ సెలబ్రిటీ వచ్చినా వారి బెడ్రూమ్ విషయాలు లేదంటే రిలేషన్షిప్ గురించి ఏ మాత్రం మొహమాటం లేకుండా కూపీ లాగుతుంటాడు హోస్ట్ కరణ్ జోహార్. ఇటీవల సిద్దార్థ్ మల్హోత్రా ఈ షోకి రాగా తాజాగా సిద్దార్థ్ ప్రేయసి కియారా అద్వానీ కాఫీ విత్ కరణ్లో ప్రత్యక్షమైంది. ఆమెతో పాటు హీరో షాహిద్ కపూర్ కూడా గెస్ట్గా విచ్చేశాడు. ఇక వాళ్లిద్దరినీ సోఫాలో కూచోబెట్టిన కరణ్.. తన వాడివేడి ప్రశ్నలతో కియారాకు చెమటలు పట్టించాడు. నువ్వు బెడ్రూమ్లో దొంగా పోలీసు వంటి ఆటలు ఆడలేదా? అని అడిగాడు. దీనికామె కొంత ఇబ్బందిగా చూస్తూ మా అమ్మ ఈ ఎపిసోడ్ చూస్తుంది అని బదులిచ్చింది. అయినా వెనక్కు తగ్గని హోస్ట్.. అయితే ఏంటట? మీ అమ్మ నువ్వింకా కన్యవనే అనుకుంటుందా, ఏంటి? అని డైరెక్ట్గా అడిగేశాడు. దీనికి కియారా నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నా అని ఆన్సరిచ్చింది. సిద్దార్థ్తో నువ్వు రిలేషన్లో లేవా? అన్న ప్రశ్నకు అవుననీ చెప్పను, కాదనీ చెప్పను అని తెలివిగా ప్రశ్నను దాటవేసింది. అయితే మీరు క్లోజ్ ఫ్రెండ్సా? అని అడగ్గా.. క్లోజ్ ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువే! అని తెలిపింది. కాగా కియారా అద్వానీ ప్రస్తుతం సత్య ప్రేమ్ కీ కథ అనే సినిమా చేస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) చదవండి: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఎలా ఉందంటే... 'ది ఫ్యామిలీ మ్యాన్' తరహాలో.. మరోసారి డేర్ చేస్తున్న సామ్ -
ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా-సిద్దార్థ్, క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్థింగ్, సమ్థింగ్ నడుస్తోందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో దర్శక-నిర్మాత కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ తమ ప్రేమ గురించి చెప్పకనే చెప్పింది ఈ జంట. ఇటీవల షోకు వచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా కియారాతో డేటింగ్పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. చదవండి: అప్పట్లోనే బిగ్బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్గా కవర్ ఫొటో కెరీర్ ప్లాన్ ఏంటని సిద్ధార్థ్ను కరణ్ ప్రశ్నించగా.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్. తాజాగా హీరో షాహిద్ కపూర్తో కలిసి కియారా ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తనకు పరిశ్రమలో అంత్యంత క్లోజ్ ఎవరని అడగ్గా షాహిద్ పేరు చెప్పింది కియారా. అనంతరం సిద్ధార్థ్తో ఉన్న బంధం ఏంటని అడగ్గా. అతడు ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటూ ముసిముసిగా నవ్వింది ఆమె. చదవండి: హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ గౌతమ్ రాజు కుమారుడు ఇంతలో షాహిద్ కల్పించుకుని ‘ఈ ఏడాది చివర్లో ఎప్పుడైన బిగ్ అనౌన్స్మెంట్ రావోచ్చు సిద్ధంగా ఉండండి. కానీ అది సినిమాకు సంబంధించినది మాత్రం కాకపోవచ్చు!’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సిద్ధార్థ్, కియారాలు త్వరలోనే గుడ్న్యూస్ చెప్పబోతున్నారని, ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎట్టకేలక తమ లవ్వీ లవ్బర్డ్స్ పెళ్లి ఒక్కటికాబోతున్నారా? వీరిద్దరు క్యూట్ కపుల్, ఎట్టకేలకు కియార-సిద్ధార్థ్ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారన్నమాట’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కియారా, సిద్ధార్థ్లు ‘షేర్షా’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్ల తెలుస్తోంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
ఎట్టకేలకు కియారాతో డేటింగ్పై నోరు విప్పిన సిద్ధార్థ్, ఏమన్నాడంటే..
ప్రస్తుతం బాలీవుడ్ ప్రేమజంటలో కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల ప్రేమయాణం తరచూ హాట్టాపిక్గా నిలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఈ జంట నేరుగా ఎప్పుడు స్పందించలేదు. ఒకవేళ మాట్లాడిన తాము స్నేహితులమే అంటూ రూమార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా వీరి ప్రేమ, పెళ్లిపై రూమర్లు ఆగడం లేదు. ఇటీవల కియార బర్త్డే వేడుకలో భాగంగా ఈ జంట దుబాయ్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు బయటకు రావడంతో వీరి లవ్ ఎఫైర్ వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. చదవండి: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్కాట్ ట్రెండ్పై హీరో రియాక్షన్ ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఓ షోలో తమ రిలేషన్పై నోరువిప్పాడు సిద్ధార్థ్. కాఫీ విత్ కరణ్ షోకు వచ్చిన సిద్ధార్థ్, కియారాతో ప్రేమలో ఉన్నట్లు పరోక్షంగా ప్రకటించాడు. హీరో విక్కీ కౌశల్తో కలిసి సిద్ధార్థ్ ఈ టాక్ షోలో పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ చేత కియారాతో రిలేషన్ను బయటపెట్టించే ప్రయత్నం చేశాడు కరణ్. ఈ క్రమంలో కెరీర్ ప్లాన్ ఏంటని సిద్ధార్థ్ను ప్రశ్నించాడు.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్. చదవండి: ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ ఈ సందర్భంగా కాఫీ విత్ కరణ్ గత సీజన్లో కియారాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ను సిద్ధార్థ్ కోసం ప్లే చేశాడు కరణ్. అందులో సిద్ధార్థ్ గురించి అడగ్గా.. తామిద్దరం స్నేహితుల కంటే ఎక్కువ అని కియారా చెప్పడం.. సిద్ధార్థ్ ముసిముసి నవ్వడంతో వీరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోతున్నారు. అంతేకాదు తన ప్రశ్నలతో కరణ్, కియారాను ఇబ్బంది పెట్టడం చూసి తనని ఎందుకు అన్ని ప్రశ్నలు అడిగారు? అని అన్నాడు. దీంతో ఒకే మీ పెళ్లేప్పుడు అని సిద్ధార్థ్ను అడగ్గా.. మీరు సెటిల్ అయ్యారు.. మేము అవ్వోద్దా? అని సమాధానం ఇచ్చాడు. ఇక చివకరగా ఒకవేళ తనని పిలవకుండానే పెళ్లి చేసుకుంటే కొడతానంటూ సిద్ధార్థ్ను హెచ్చరించాడు కరణ్. -
ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న దిల్రాజు.. ఏకంగా 36వేల ట్వీట్స్
ప్రముఖ నిర్మాత దిల్రాజు పేరు ఇప్పుడు ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. 'దిల్రాజు గారు మా బాధ వినండి' అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్ చేశారు. ఉన్నట్లుండి దిల్రాజు పేరు నెట్టింట పేరు వైరల్ కావడానికి కారణమేమిటి? తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్8న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒకే ఒక్క పోస్టర్ని మూవీ టీం రిలీజ్ చేసింది. షూటింగ్ ప్రారంభించి ఏడాది కావొస్తున్నా RC15 నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ట్విట్టర్ వేదికగా మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దిల్రాజును ట్యాగ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వాలని ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో దిల్రాజు పేరు ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వచ్చింది. -
హీరోయిన్కు సడెన్గా ముద్దు పెట్టిన హీరో.. వీడియో వైరల్
Varun Dhawan Kisses Kiara Advani And KRK Trolls: తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. వరుసగా ప్రేమ కథా, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల వరుణ్ ధావన్ నటించిన చిత్రం 'జుగ్ జుగ్ జీయో'. జూన్ 24న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ కపూర్, నీతూ కపూర్ సైతం కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించినట్లు సమాచారం. అయితే ఈ మూవీలో వరుణ్కు జోడీగా కియారా అద్వాణీ నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక మేగజైన్ కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చారు. ఈ ఫొటో షూట్లో వరుణ్, కియారా ఇద్దరు కౌగిలించుకుని స్టిల్స్ ఇస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా కియారా బుగ్గపై వరుణ్ ధావన్ ముద్దు పెడతాడు. ఈ అనుకోని పరిణామానికి షాక్ అయి వరుణ్ను పక్కకు నెడుతుంది కియారా. ఈ ఫొటో షూట్ వీడియోను బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు 'షూటింగ్ సమయంలో కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి' అని రాసుకొచ్చాడు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవగా.. 'ఇలా అయితే కష్టం గురూ' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? Jab Aadmi shoot Karte Huwe Mood Main Aa Jata Hai Toh Kuch Aisa Ho Jata Hai. pic.twitter.com/3SzXU6M5WR — KRKBOXOFFICE (@KRKBoxOffice) August 1, 2022 -
Kiara Advani Latest Photos: కైపెక్కించేలా కియారా.. క్యా కియారే అనేలా ఫొటోలు
-
బాయ్ఫ్రెండ్తో బర్త్డే సెలబ్రేషన్!.. అడ్డంగా బుక్కైన స్టార్ హీరోయిన్
Kiara Advani Celebrate Her Birthday With Sidharth Malhotra In Dubai: హిందీ చిత్రపరిశ్రమలో పెళ్లిళ్లు, లవ్ ఎఫైర్లు, చెట్టాపట్టాలు వేసుకోని షికార్లు చేయడం సర్వసాధారణమే. అయితే ఈ విషయాలపై కొందరు సూటిగా సుత్తిలేకుండా వారి రిలేషన్షిప్ గురించి బయటపెడితే, మరికొందరు గుట్టుగా ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా బీటౌన్ బ్యూటీ కియారా అద్వాణీ తన బాయ్ఫ్రెండ్తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈరోజు (జులై 31) కియారా అద్వానీ పుట్టినరోజు. తన బర్త్డేను బాయ్ఫ్రెండ్తో ఫారిన్లో జరుపుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన 30వ పుట్టినరోజును దుబాయ్లో ప్రియుడు సిద్ధార్థ్తో కలిసి జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలోని పలు పోస్ట్లను చూస్తే అర్థమవుతోంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర తాజాగా ఫ్యాన్స్తో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: చివరిగా మమతా మోహన్ దాస్ను ఎంపిక చేశాం: డైరెక్టర్ అయితే వీరిద్దరూ అభిమానులతో విడివిడిగా ఫొజులివ్వడం మనం చూడొచ్చు. ఈ ఫొటోల్లో సిద్ధార్థ్, కియారా విడిగా ఫోజులిచ్చిన.. వారితో దిగిన ఫ్యాన్స్ వేసుకున్న దుస్తులు ఒకేలా ఉండటాన్ని గమనించవచ్చు. దీంతో కియారా తన బర్త్డేను సిద్ధార్థ్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజమని తెలుస్తోంది. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ View this post on Instagram A post shared by SidKiara (@siara_vogue) కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 'షేర్షా' చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి ప్రేమకు బీజం పడినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇటీవల కరణ్ జోహర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ఎపిసోడ్లో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు అనన్య పాండే హింట్ కూడా ఇచ్చింది. కాగా మహేశ్ బాబు 'భరత్ అనే నేను' మూవీతో తెలుగు ప్రేక్షకులను బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మెప్పించిన విషయం తెలిసిందే. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. -
RC15 కోసం మేకోవర్.. రామ్చరణ్ అలా కనిపిస్తాడా?
క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే ఫిజిక్ని అలా మార్చుకోవడానికి రామ్చరణ్ వెనకాడరు. ఇంతకుముందు కొన్ని చిత్రాలకు మేకోవర్ అయిన చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇది యాక్షన్ ఓరియంటెడ్ మూవీ కావడంతో భారీ ఫైట్స్ ఉంటాయి. ఫైట్స్ చేయాలంటే ఫిట్గా ఉండాలి. ఆ ఫిట్నెస్ కోసం, ఒక స్పెషల్ లుక్లో కనిపించడానికే చరణ్ స్పెషల్ వర్కవుట్స్ చేస్తున్నారని టాక్. అలాగే వయసుపరంగా వివిధ దశల్లో కనిపిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగా ఫిజిక్ని మార్చుకుంటున్నారట. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో హైదరాబాద్లో ఈ చిత్రం కొత్త షెడ్యల్ను ఆరంభించనున్నారు. -
వరుణ్, కియారాలపై నెటిజన్ల ఫైర్.. ‘వారిపై చర్యలు తీసుకోండి’
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ కియారా అద్వానీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మెట్రో రైలులో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వీరి తీరుపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా వరుణ్-కియార జంటగా నటించిన తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో భాగంగా మూవీ టీం ముంబై మెట్రో రైలులో సందడి చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్, కియారా మెట్రో రైల్లో వడ పావ్ తింటూ కనిపించారు. చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్ ఈ వీడియోను ప్రముఖ మీడియా పర్సన్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇక మెట్రోలో నిబంధనలకు విరుద్ధం ప్రవర్తించిన కియార, వరుణ్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రోలో ఆహార పదార్థాలు అనుమతి లేదనే విషయం కూడా తెలియదా?’, ‘వీరిపై మెట్రో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటుడు అనిల్ కపూర్, మూవీ యూనిట్ కూడా ఉన్నారు. కాగా కియారలో తెలుగులో రామ్ చరణ్ ఆర్సీ 15 మూవీతో పాటు ఇటీవల కోలీవుడ్లో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్
Kiara Advani Shares Her Near Death Experience In Dharamshala: 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. దెయ్యాలంటే భయమా అని అడిగిన ప్రశ్నకు.. 'నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. రాత్రిపూట ఒక్కదాన్నే నిద్రపోతుంటే భయపడతాను. అందుకే ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్లను.' అని తెలిపింది కియరా. అంతేకాకుండా తన కాలేజ్ రోజుల్లో జరిగిన మరో విషయం గురించి తెలిపింది ఈ ముద్దుగుమ్మ. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ''కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాను. మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు మేం హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ లేదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకలేదు. వేడికోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా ఫ్రెండ్ మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.' అని కియరా పేర్కొంది. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
కోలీవుడ్కి కియారా.. ఆ హీరోతో ఫస్ట్ మూవీ!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తమిళంలో ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శివ కార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు కియారా అద్వానీని సంప్రదించి, కథ కూడా వినిపించారట దర్శకుడు. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు కియారా అద్వానీ. -
శంకర్ భారీ స్కెచ్..షాకిచ్చేందుకు రెడీ అవుతున్న రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ అంటే ఒకప్పుడు బిగ్ మూవీస్,మాస్ మసాలా సబ్జెక్ట్స్. కానీ, రంగస్థలంతో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేయడం మొదలు పెట్టాడు చరణ్. యాక్టింగ్ తో షాక్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సుకుమార్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు క్యారెక్టర్ ఇస్తే.. అందులోకి పరకాయ ప్రవేశం చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి..అల్లూరి సీతారామరాజు పాత్ర(ఆర్ఆర్ఆర్) ఇస్తే, ఆయనే ఆశ్చర్యపడేలా నటించాడు. ఇప్పుడు శంకర్ మూవీలోనూ తన యాక్టింగ్తో షాక్ ఇవ్వబోతున్నాడట మెగా పవర్ స్టార్. ఈ చిత్రంలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని చాలా కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులుగా చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది.అయితే చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ కాదు , ట్రిపుల్ రోల్ చేస్తున్నాడట. తండ్రితో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లో చరణ్ నటిస్తున్నాడని,అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని టాలీవుడ్ లో బాగా డిస్కషన్ జరుగుతోంది. (చదవండి: బిగ్బాస్ 6లో పాల్గొనాలనుకుంటున్నారా? ఇలా చేయండి) శంకర్ ఇచ్చిన ట్రిపుల్ రోల్ టాస్క్ని చాలెజింగ్గా తీసుకున్నాడట చరణ్. ఈసారి కూడా తన యాక్టింగ్ తో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. ఇందులో చరణ్కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. విడుదల తర్వాత శంకర్, చరణ్ ఏరేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారనేది చూడాలి మరి. -
పెళ్లిపై ఆసక్తిగా స్పందించిన కియారా, ఏమన్నదంటే..
Kiara Advani Intresting Comments On Marraige: భరత్ అనే నేను మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. అటూ బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె చేతి పలు హిందీ చిత్రాలతో పాటు తెలుగు పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె నటించిన భూల్ భులయ్యా-2’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఇక త్వరలోనే తన తదుపరి మూవీ జగ్ జగ్ జియో చిత్రం కూడా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల సినిమా ట్రైలర్ను లాంచ్ చేసిన సంగతి తెలిసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా వరుణ్ ధావన్ సరసన నటించింది. చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్ ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కియారాకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. పెళ్లి చేసుకుని ఎప్పుడు సెటిల్అవుతారని ఓ విలేఖరి ప్రశ్నించగా దీనిపై కియారా ఆసక్తిగా స్పందించింది. ‘పెళ్లి చేసుకోకపోయిన నేను బాగానే సెటిల్ అయ్యాను. సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను పని చేస్తున్నా. బాగా సంపాదిస్తున్నా. హ్యాపీగా ఉన్నాను. సెటిల్ అవ్వడమంటే ఇదే కదా’ అంటూ కియారా సమాధానం ఇచ్చింది. కాగా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా కొంతకాలంగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపిస్తున్న క్రమంలో కియారా పెళ్లిపై ఇలా స్పందించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా కియార ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ఆర్సీ15లో నటిస్తోంది. చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి -
జగ్జగ్ జియో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జిగేల్మన్న కియారా అద్వానీ
-
నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు: యంగ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ నటించిన తాజా చిత్రం 'భూల్ భులయ్యా 2'. 2007లో వచ్చిన అక్షయ్ కుమార్ సూపర్ హిట్ సినిమా 'భూల్ భులయ్యా'కు సీక్వెల్గా తెరకెక్కింది ఈ మూవీ. అనీస్ బజ్మీ దర్శకత్వంలో వచ్చిన 'భూల్ భులయ్యా 2' మే 20న విడుదలైంది. హారర్ కామేడీగా వచ్చిన ఈ సినిమా మంచి విజయంతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ రావడంతో తనకే టికెట్లు దొరకట్లేదని ట్వీట్ చేశాడు హీరో కార్తీక్ ఆర్యన్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'భూల్ భులయ్యా 2' సినిమా చూసేందుకు కార్తీక్ ఆర్యన్ ముంబైలోని గైటీ థియేటర్కు వెళ్లాడు. అక్కడ హీరోను చూసిన అభిమానులు అతడి వద్దకు గుంపులుగా చేరారు. తర్వాత అతను టికెట్లు కూడా పొందలేకపోయానని చెబుతూ హౌస్ఫుల్ బోర్డ్ ఫొటోను చూపించాడు. ''ఈ రోజు కోసం నటులుగా మేము ఎంతో కోరుకుంటాం. ఇది హౌస్ఫుల్ బోర్డ్. నేను కూడా టికెట్లు పొందలేకపోయాను. 'భూల్ భులయ్యా 2' ఆన్ ఫైర్. ప్రేక్షకులకు ధన్యవాదాలు.'' అని ట్వీట్ చేశాడు కార్తీక్. చదవండి: గులాబీ పూలతో వెంటపడిన అమ్మాయిలు.. సిగ్గు పడిన హీరో కాగా ఈ మూవీ సంజయ్ లీలా భన్సాలీ 'గంగూబాయి కతియావాడి', రణ్వీర్ సింగ్ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమాలను దాటి తొలి రోజు రూ. 14.11 కోట్లు రాబట్టి బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. రెండో రోజు రూ. 18.34 కోట్లు వసూళ్లు సాధించింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 32.45 కోట్లను కొల్లగొట్టింది. చదవండి: 20 కోట్ల రూపాయలిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా? -
నవ్వులు పూయిస్తున్న 'జగ్ జగ్ జీయో' ట్రైలర్
JugJugg Jeeyo Trailer: Varun Dhawan Kiara Advani Love Drama: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వాణీ జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం (మే 22) మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ యాక్టింగ్ చూస్తుంటే సినిమాకే హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్, కియరా, నీతూ కపూర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ తరహాలో సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. హీరోహీరోయిన్ల పెళ్లి, విడాకుల కథాంశంగా సినిమా రూపొందించారు. ఈ సినిమాను యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం నవ్వు తెప్పించేలా ఉన్నట్లు తెలుస్తోంది. -
బ్రేకప్ కాదు.. బ్రేక్ ఇచ్చారంతే.. జంటగా కియారా-సిద్ధార్థ్.. వీడియో వైరల్
Sidharth Malhotra Kiara Advani Back Together After A Break: బీటౌన్లో అప్పటిదాగా జంటగా కలిసి కనిపించిన లవ్ బర్డ్స్, దంపతులు ఒక్కసారిగా విడిపోతున్నారని రూమర్స్ రావడం పరిపాటే. ఇలాంటి సంఘటన ఇటీవల బీటౌన్లో జరిగింది. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్తలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏ ఒక్కరు స్పందించలేదు. తాజాగా ఈ రూమర్స్కు చెక్ పెడుతూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కియారా-సిద్ధార్థ్ విడిపోయారని వార్తలు వచ్చి ఫ్యాన్స్ను షాక్ గురి చేయగా వారు కలిసి చెట్టాపట్టాలేసుకుని కనిపించిన వీడియో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటీవల సల్మాన్ ఖాన్ నిర్వహించిన ఓ వేడుకలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియరా అద్వానీ తళుక్కుమన్నారు. ఒకరొకరు నవ్వుకుంటూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇది చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఒకవైపు రొహిత్ శెట్టి పోలీస్ సిరీస్ కోసం సిద్ధార్థ్ ఇస్తాంబుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు భూల్ భులయా 2 ప్రమోషన్లలో కియరా బిజీగా మారింది. ఈ టైట్ షెడ్యూల్స్ వల్ల వారి మధ్య కొంత బ్రేక్ వచ్చినట్లయింది. ఈ బ్రేక్ వల్లే వారు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయని వారి సన్నిహితులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియోతో వారు చెప్పిందే నిజమని తెలుస్తోంది. చదవండి: సౌత్ ఇండస్ట్రీపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ షేర్షాలో కలిసి నటించారు. ప్రమోషన్ల సమయంలో వారి మధ్య సన్నిహిత్యం చూసి వారు లవ్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్యాన్స్. తర్వాత వచ్చిన బ్రేకప్ పుకార్లు అభిమానులను అసంతృప్తికి గురిచేశాయి. చదవండి: ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్పిరిట్లో ఎవరు?
హీరో ప్రభాస్ సరసన నటించే చాన్స్ కొట్టేసేది ఎవరు? రష్మికా మందన్నానా? కియారా అద్వానీయా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్లో ఒకటి. ఈ చర్చ జరుగుతున్నది ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ‘స్పిరిట్’ చిత్రం గురించే. ఈ చిత్రం కోసం రష్మికా మందన్నా, కియారా అద్వానీలను సందీప్ సంప్రదించారట. వీరిద్దరిలో ఒకర్ని కథానాయికగా ఎంపిక చేయనున్నారని టాక్. ఆ ఒక్కరు ఎవరు? అనే చర్చ జరుగుతోంది. కాగా ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్గా సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’లో కియారా హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’లో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఇలా.. ఈ ఇద్దరి హీరోయిన్లూ సందీప్ దర్శకత్వంలో చాన్స్ దక్కించుకున్నారు. అయితే ఈ రెండూ హిందీ సినిమాలే. మరి.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్పిరిట్’లో ఈ ఇద్దరిలో ఒకరు కథానాయికగా కనిపిస్తారా లేక ఈ ఇద్దరూ కాకుండా వేరే తార తెరపైకి వస్తారా? అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. -
సౌత్ ఇండస్ట్రీపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్ రీమేక్ చిత్రాల్లో నటించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానంది. ఆమె హీరోయిన్గా నటించిన భూల్ భులాయా 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఓటీటీలు విస్తృతంగా వ్యాప్తి చెందకముందు కబీర్ సింగ్ సినిమా చేశాను, దాన్ని ఇప్పుడు మరోసారి చేయమన్నా సరే కళ్లు మూసుకుని ఓకే చెప్తాను. కానీ ఏదైనా రీమేక్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉందంటే దాన్ని చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. కొన్ని చిన్న చిత్రాలు రత్నాల్లా ఉంటాయి. వాటిని నిర్దిష్ట భాషలోనే తీస్తారు కనుక ఎక్కువమంది జనాలకు చేరదు. అలాంటప్పుడు దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కాబట్టి ఆ సినిమాల్లోని కథను తీసుకుని దానికి కొన్ని మార్పుచేర్పులు చేసి ఎక్కువమంది జనాలు చూసేలా నిర్మించడంలో తప్పు లేదు' అని చెప్పుకొచ్చింది కియారా. కాగా భూల్ భలాయా మే 20న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక అదే రోజు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన ధాకడ్ చిత్రం కూడా విడుదల కానుంది. చదవండి: భళా తందనాన మూవీ ఎలా ఉందంటే.. ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్ -
వైజాగ్కు మకాం మార్చిన రామ్చరణ్,ఎందుకంటే..
వైజాగ్కు మకాం మార్చారు రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే రామ్చరణ్ వైజాగ్ వెళ్లారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ అమృత్సర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో కాలేజీ బ్యాక్డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. తదుపరి షెడ్యూల్ను వైజాగ్లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో రామ్చరణ్తో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్చరణ్ క్యారెక్టర్లో రెండు షేడ్స్ ఉంటాయని సమాచారం. కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తారట. శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. -
ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే..
Is Sidharth Malhotra, Kiara Advani Broken Up: బాలీవుడ్ లవ్బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల బ్రేకప్ బి-టౌన్లో హాట్టాపిక్ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్గా డేటింగ్ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారనుకుంటే ఇలా ఎవరి దారి వారదే అని విడిపోవటం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది స్పష్టత లేదు. చదవండి: అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ కానీ, బ్రేకప్ రూమర్స్పై ఈ జంట ఇంతవరకు స్పందించకపోవడంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారందరికి ఊరటనిస్తూ ఈ జంట విడిపోలేదని వారి సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కియారా, సిద్ధార్థ్లు కలిసి లేరనేది వాస్తవమే కానీ, అది గొడవల వల్ల కాదని చెబుతున్నారు. షూటింగ్లతో బిజీగా ఉండటం కారణంగా కొద్ది రోజులు ఈ జంట విడిగా ఉంటున్నారని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ షూటింగ్లో భాగంగా టర్కిలో ఉండగా.. కియారా తన తాజా చిత్రం ‘భూల్ భులయ్యా-2’ మూవీ ప్రమోషన్తో బిజీగా ఉందట. చదవండి: పిల్లలతో వెకేషన్లో శ్రీజ కొణిదెల.. ఫోటోలు వైరల్ అందువల్లే వీరిద్దరు కలుసుకోవడం లేదని, సిద్ధార్థ్ టర్కి నుంచి రాగానే మీకే క్లారిటీ వస్తుందని కియారా, సిద్ధార్థ్ల మ్యూచువల్ ఫ్రెండ్స్ నుంచి సమాచారం. కాగా వీరిద్దరు తొలిసారి జంటగా నటించిన షేర్షా మూవీ షూటింగ్ సమయంలో కియారా, సిద్ధార్థ్లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్బీర్ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్లో ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్లు విడిపోయినట్లు ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. -
‘అందులో ఉన్న ఆత్మ సామాన్యమైనది కాదు'.. ఆసక్తిగా ట్రైలర్
కార్తీక్ఆర్యన్, కియారా అద్వానీ నటిస్తున్న సినిమా ‘భూల్ భులయ్యా-2’. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2007లో వచ్చిన సూపర్ హిట్ ‘భూల్ భులయ్యా’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోందీ చిత్రం. అక్షయ్కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళం, తెలుగులోనూ చంద్రముఖి పేరుతో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భూల్ భూలైయా చిత్రం వచ్చి దాదాపు 15 ఏళ్ళు అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం సీక్వెల్ రాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.‘పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరో ఆ తలుపును తట్టారు. అందులో ఉన్నది సామాన్యమైన ఆత్మ కాదు. అందులో ఉంది మంజులిక’ అంటూ టబు చెప్తుండటంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రాజ్పాల్ యాదవ్, పరేశ్ రావల్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బాలీవుడ్లో మరో బ్రేకప్.. పెళ్లిదాకా వచ్చి విడిపోయిన స్టార్ కపుల్
బాలీవుడ్లో మరో జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే లైగర్ బ్యూటీ అనన్య ప్రియుడు ఇషాన్ ఖట్టర్తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యూటీఫుల్ కపుల్ తమ రిలేషన్కి ఎండ్ కార్డ్ వేసేశారు. బాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హ్రోత్రా బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ సడెన్గా ఏం జరిగిందో తెలియదు.. వీరు తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా షేర్షా మూవీతో కలిసి తొలిసారి కలిసి నటించిన కియారా- సిద్దార్థ్లు ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్బీర్ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్లు విడిపోయినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. -
రామ్ చరణ్కి జోడిగా అంజలి!, ఏ సినిమాలో అంటే..
Anjali Team Up With Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్- తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో RC15 రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తరచూ ఈ మూవీ నుంచి ఏదొక అప్డేట్ బయటకు వస్తూ సినిమాపై మరింత ఆసక్తికని పెంచుతుంది. ప్రస్తుతం ఇందులో రామ్ చరణ్ విభిన్న పాత్రలపై ఆసక్తి నెలకోగా తాజాగా మరో క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరపై మరో కథానాయిక పేరు వినిపిస్తోంది. ఇందులో తెలుగు అమ్మాయి అంజలి నటిస్తున్నట్లు సమాచారం. చదవంది: వైరల్ అవుతున్న రామ్ చరణ్ షాకింగ్ లుక్, పంచెకట్టుతో సైకిల్పై ఇలా చరణ్కు జోడిగా అంజలి కనిపించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే చరణ్ ఇందులో తండ్రికొడుకులుగా కనిపంచనున్నాడట. సీనియర్ రామ్ చరణ్కు సరసన అంజలి నటిస్తుండగా, జూనియర్ చరణ్తో కియారా రొమాన్స్ చేయనన్నట్లు తెలుస్తోంది. చరణ్ పంచెకట్టుతో సైకిల్పై వెళుతున్నట్లు ఉన్న ఓ లుక్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది RC15లోని సీనియర్ రామ్చరణ్కు సంబంధించిన లుక్ అంటూ లీకైంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇంటీవల రాజమండ్రిలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ ఇవ్వగా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుందట. అయితే ఈ షెడ్యూల్ షూటింగ్ దుబాయ్, హైదరాబాద్లో జరగనుందని వినికిడి. -
పన్నెండేళ్ల తర్వాత మళ్లీ కాలేజీ బాట పట్టిన రామ్ చరణ్!
రామ్చరణ్ ఇటీవల ఓ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారని తెలిసింది. ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ దర్శకుడు శంకర్. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అమృత్సర్లో జరగనుంది. ఈ చిత్రంలో రామ్చరణ్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. స్టూడెంట్గా కనిపించి, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తారట. అంతేకాదండోయ్.. ఈ సినిమాలో 1930 సమయంలో ఓ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఉందని భోగట్టా. ఈ సీన్స్లో అంజలి కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి టైమ్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. 2010లో వచ్చిన ‘ఆరెంజ్’లో పూర్తిస్థాయి స్టూడెంట్ పాత్రలో కనిపించారు రామ్చరణ్. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం పన్నెండేళ్ల తర్వాత కాలేజీకి వెళ్తున్నారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే.. రామ్చరణ్ ఓ కీలక పాత్ర చేసిన ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
స్టార్ హీరోయిన్ను 'ఆంటీ' అంటున్న కియరా అద్వానీ
Kiara Advani Reveals She Calls Juhi Chawla As Aunty: బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్నబ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. ఎంఎస్ ధోనీ, కబీర్ సింగ్, లక్ష్మీ, లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాల్లో నటించిన కియరా ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. హిందీలో 'కబీర్ సింగ్' సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్న కియరా 'షేర్ షా' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈ బ్యూటీ పాపులర్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా, చెర్రీ జంటగా వస్తున్న రెండో చిత్రం ఇది. చదవండి: నన్నైతే పిలవలేదు.. బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది కియరా అద్వానీ. ఇందులో స్టార్ హీరోయిన్ జూహీ చావ్లాపై ప్రశంసలు కురిపించింది. తన తండ్రి జగ్దీప్ అద్వానీకి హీరోయిన్ చిన్ననాటి స్నేహితురాలని చెప్పుకొచ్చింది. 'జూహీ ఆంటీ మా నాన్న చిన్ననాటి స్నేహితులు. ఆమె చాలా మంచింది. జూహీ ఆంటీ అంటున్నందుకు ఆమె నన్ను చంపేస్తుందని నేను అనుకోవట్లేదు. ఆమెను పెద్ద నటిగా నేను ఎప్పుడూ చూడలేదు. నా పేరెంట్స్కు ఫ్రెండ్గా మాత్రమే తెలుసు. ఆమె పిల్లలతో కూడా నేను ఆడుకున్నాను.' అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అలనాటి నటుడు అశోక్ కుమార్ తనకు బంధువు అవుతాడని తెలిపింది కియరా. 'మా తాతయ్య పెళ్లి చేసుకున్న మా నాన్నమ్మ అశోక్ కుమార్ కుమార్తె. కాబట్టి వీరి పెళ్లి ద్వారా నాకు అశోక్ కుమార్ బంధువు అవుతారు. కానీ నేను ఎప్పుడూ వారిని కలవలేదు.' అని కియరా పేర్కొంది. చదవండి: లగ్జరీ కారు కొన్న కియారా అద్వానీ.. ధర ఎంతంటే? -
త్వరలో పెళ్లి పీటలెక్కబోతోన్న మరో బాలీవుడ్ లవ్బర్డ్స్!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. . అయితే వీరి రిలేషన్పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి రిలేషన్ను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మధ్య బాలీవుడ్ ప్రేమ జంటలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంగా సిద్ధార్థ్-కియారాలు కూడా ఏడడుగులు వేయాలని అనుకుంటున్నారట. చదవండి: ఆ బడా నిర్మాత కొడుకుతో ‘గని’ మూవీ హీరోయిన్ ప్రేమయాణం.. అయితే ఇప్పటివరకు తమ రిలేషన్పై నోరు విప్పని ఈజంట విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ల తరహాలోనే సీక్రెట్ వేడ్డింగ్కు ప్లాన్ చేసుకుంటున్నారని వినికిడి. ఇదిలా ఉంటే కియారా-సిద్ధార్థ్లు కలిసి చేసింది ఒక్క సినిమానే. దీంతో తెరపై వీరి కెమిస్ట్రీ చూసి చూడ చక్కని జంటని అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఇక వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తెలుస్తోంది. దీంతో 2022 మధ్యలో లేదా, ఏడాది చివరిలో పెళ్లికి ప్లాన్ చేసుకుంటున్నారట ఈ లవ్బర్డ్స్. మరి ఈ వార్తలపై కియారా-సిద్ధార్థ్లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. కాగా గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైన కత్రినా-విక్కీలు చివరి వరకు వారి రిలేషన్ను సీక్రెట్గా ఉంచిన సంగతి తెలిసిందే. చదవండి: పుష్ప పార్ట్ 2 షూటింగ్ను నార్త్లో ప్లాన్ చేస్తున్న సుక్కు? బాలీవుడ్ హీరోకు కీ రోల్! -
అర్జున్రెడ్డితో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ కియారా
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆగస్టు25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక లైగర్ షూటింగ్ అనంతరం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా ప్రస్తుతం రామ్చరణ్తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం విజయ్తో ఈ బ్యూటీ జోడీ కట్టనుంది. చదవండి: త్రివిక్రమ్పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్పై స్పందించిన బండ్లగణేష్ -
దయచేసి అలా చేయకండి, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. చదవండి: మెగా ఫాన్స్కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'! ‘‘కథ రీత్యా ఎక్కువమంది జనం ఉండే ఓపెన్ ఏరియాల్లో మా సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో మా సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి, చట్టవిరుద్ధంగా షేర్ చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మేం తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. దయచేసి సహకరించండి’’ అని శంకర్ అండ్ కో ఓ నోట్ను విడుదల చేసింది. -
కియారాతో రామ్ చరణ్ స్టెప్పులు!
Ram Charan and Kiara Advani Shoot Start With Song: రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ షెడ్యూల్ను ఫిబ్రవరి రెండో వారంలో ఓ పాట చిత్రీకరణతో ప్రారంభించాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. సునీల్, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
రామ్ చరణ్ సినిమాకు రూ.200 కోట్ల భారీ ఆఫర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం వస్తోన్న విషయం తెలిసిందే. ఇక దానికి తోడు ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ఏంటంటే ఆ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ను ఓ ప్రముఖ సంస్థ దాదాపు రూ.200 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. -
నా స్థానంలో హీరో ఉంటే అలాంటి కామెంట్స్ చేయరేమో: కియారా
Kiara Advani Resonds On Being Trolled After Elderly Man Saluted Her: కబీర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్ కియారా అద్వానీ. గత కొన్నాళ్లుగా సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో మునిగితేలుతున్న ఆమె ఆ మధ్య ఓసారి ప్రియుడి ఇంటికి వెళ్లి ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. సిద్దార్థ్ అపార్ట్మెంట్కి కియారా ఎంటర్ కాగానే అక్కడున్న సెక్యురిటీ సిబ్బందైన వృద్ధుడు కారు డోర్ తెరిచి ఆమెకు సెల్యూట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కియారా ప్రవర్తనపై నెటిజన్లు మండిపడ్డారు. కారు డోరు కూడా తీసుకోవడం చేతకాదా? ముసలి వాళ్లతో ఇలాంటి పనులు చేయించుకోవడం సిగ్గుచేటంటూ కియారాపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కియారా దీనిపై స్పందించింది. 'నా స్థానంలో ఒక హీరో ఉండి ఉంటే ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లు కాదేమో. అయినా ఎవరూ సెల్యూట్ చేయమని అడగరు. ఆయన సెక్యూరిటీ గార్డ్ కాబట్టి స్వతహాగా అలా చేశారు. కారులోంచి దిగుతుండగా ఫోటోగ్రాపర్స్ వీడియో తీసి తెగ వైరల్ చేశారు. నిజానికి ఇది అవనరమైన ట్రోలింగ్' అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
రిలేషన్ షిప్ స్టేటస్ను బయటపెట్టనున్న కియారా..
Kiara Advani And Sidharth Malhotra Relationship: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. . అయితే వీరి రిలేషన్పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి ప్రేమాయణాన్ని గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్కి వెళ్లడం,ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రేమజంట తమ రిలేషన్ షిప్ను బయటపెట్టాలని చూస్తున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా ఇద్దరూ తమ ప్రేమను అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి సిద్ధమైనట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అంతేకాకుండా త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. కాగా కాగా సిద్దార్థ్, కియారాలు తొలిసారి జంటగా‘షెర్షా’మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని బీటౌన్ టాక్. -
లగ్జరీ కారు కొన్న కియారా అద్వానీ.. ధర ఎంతంటే?
బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటి కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. ఎంఎస్ ధోనీ, కబీర్ సింగ్, లక్ష్మీ, లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇటీవలే ఈ బ్యూటీ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్కు జోడీగా నటించే చాన్స్ కొట్టేసింది. కియారా, చెర్రీ జంటగా వస్తున్న రెండో చిత్రం ఇది. ఇలా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న కియారా.. వ్యక్తిగత జీవితాన్ని కూడా రిచ్గానే ఎంజాయ్ చేస్తుంది. ఈ అమ్మడుకి కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె దగ్గర బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెజ్ బెంజ్ ఈ-క్లాస్, బీఎండబ్ల్యూ 530డీ వంటి విలావంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా వీటి జాబితాలో ఆడి ఏ8 ఎల్ కూడా చేరింది. ఆడి ఈ మోడల్ను గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ.1.56 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. Progress and creativity go hand in hand. We’re happy to welcome @advani_kiara to the Audi experience.#FutureIsAnAttitude #AudiA8L pic.twitter.com/CuGimQDJok — Audi India (@AudiIN) December 15, 2021 -
నన్నైతే పిలవలేదు.. బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు
Kiara Advani Comments On Katrina And Vicky Wedding: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం ప్రస్తుతం బీటౌన్ హాట్ టాపిక్ అని తెలిసిన సంగతే. వీరిద్దరూ డిసెంబర్ 9న రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో పెళ్లి చేసుకోబోతునట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివాహం కోసం ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వివాహం గురించి ఇటు కత్రీనా, అటు విక్కీ అధికారికంగా పెదవి విప్పలేదు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ధ్రువీకరించలేదు. ఇదిలా ఉంటే వీరి షాదీకి హాజరయ్యేవారు ఎవరెవరూ అనేది ఇంకో టాపిక్గా మారింది. అయితే క్యాట్, విక్కీ వివాహంపై బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం (డిసెంబర్ 3) ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వారి పెళ్లి గురించి అడిగితే కియార మొదట ఆశ్చర్యపోయింది. 'నిజంగానా ? వార్తలు విన్నాను, కానీ నాకేం తెలీదు. నన్నైతే ఇప్పటివరకు ఆహ్వానించలేదు.' అని చెప్పుకొచ్చింది 'కబీర్ ఖాన్' ముద్దుగుమ్మ. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అతని సోదరీమణులు అల్విరా, అర్పిత, వారి కుటుంబ సభ్యులు కత్రీనా, విక్కీల వివాహం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. వారికి కూడా ఇంతవరకూ ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మాధోపూర్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసి, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారని సమాచారం. డిసెంబర్ 4 నుంచి 12 మధ్య వివాహ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందట. డిసెంబర్ 7న 'సంగీత్', మరుసటి రోజు 'మెహందీ' కాగా పెళ్లి తర్వాత ఈ నెల 10న ప్రత్యేక రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుకకు సుమారు 120 మంది బాలీవుడ్ పెద్దలు అతిథులుగా విచ్చేయనున్నారని సమాచారం. ఇదీ చదవండి: విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్ రియాక్షన్ ఇలా ఉంటుందా..!