త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది! | director trivikram posted his new film photo | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది!

Published Wed, Feb 24 2016 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది!

త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది!

క్రియోటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ..ఆ..'(అనసూయ రామలింగ్ vs ఆనంద్ విహారి) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ..ఆ..' (అనసూయ రామలింగ్ vs ఆనంద్ విహారి) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ తమిళనాడు పొల్లాచిలో తమ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక్కడ సినిమా చిత్రీకరణ ముగియడంతో ఆనందంతో చిత్ర యూనిట్‌ ఓ ఫొటో దిగింది. ఈ ఫొటోను డైరెక్టర్ త్రివిక్రమ్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్టు చేశారు. హీరో నితిన్, హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్‌ తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'అ..ఆ..' చిత్రం ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే షూటింగ్ ఆలస్యం కావటం ఏప్రిల్కు వాయిదా వేశారు. ఏప్రిల్ 22న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ చెప్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement