Samanta
-
సమంతతో విడాకులు.. అలాంటి కామెంట్లు ఇకనైనా ఆపేయండి: నాగచైతన్య
టాలీవుడ్ హీరో నాగచైతన్య తన మాజీ భాగస్వామి సమంత గురించి మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహబంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగచైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగటివ్ కామెంట్లు వచ్చాయని ఆయన అన్నారు. తను, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ చాలామంది నెగటివ్ కామెంట్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో శోభితతో పెళ్లి గురించి కూడా ఆయన పంచుకున్నారు. 'సమంతతో విడాకుల తర్వాత సోషల్మీడియాలో ఎలాంటి పోస్ట్ షేర్ చేసినా కూడా నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. అవి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని నేనూ చదవుతాను. సమంతతో విడిపోయిన తర్వాత ఇద్దరం కలిసే విడాకుల విషయాన్ని ప్రపంచానికి చెప్పాం. వ్యక్తిగత కారణాల వల్ల వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించాం. ఎవరిదారిలో వారి జర్నీ కొనసాగుతుందని తెలిపాం. మా వ్యక్తిగత జీవితం విషయంలో కాస్త ప్రైవసీ ఇవ్వండి అంటూ అభ్యర్థించాము కూడా.. అయితే, మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాసిప్స్ వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో మళ్లీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. ఆ ఇంటర్వ్యూ నుంచి కూడా మరికొన్ని వార్తలు ప్రసారం అవుతాయి. అందుకే స్పందించలేదు. కానీ, కొన్ని సందర్భాల్లో పలు వేదికలపై ఈ విషయం గురించి అడిగారు. ఆ సమయంలో ఈ టాపిక్ గురించి వదిలేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాను. అయినప్పటికీ అదే విషయంపై ప్రశ్నలు అడుగుతూ.. మళ్లీ ఆ గాయాన్ని గెలుకుతున్నారు. కానీ, మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదు. మా విడాకుల వార్తలు, కామెంట్ల గురించి ఎవరూ ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. అలాంటి వార్తలు రాసే వారు ఇకనైన ఫుల్స్టాప్ పెట్టాలి. నా మీద నెగటివ్ కామెంట్లు చేసే వారు ఇకనైనా ఆపేయండి.. మీ భవిష్యత్ గురించి మంచిగా ఆలోచించండి. విడాకులు అనేది నా జీవితంలో మాత్రమే జరగలేదు. సమాజంలో చాలామంది లైఫ్లో జరిగాయి. నేనేమైనా క్రిమినల్ను కాదు కదా.. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. వెయ్యి సార్లు ఆలోచించే విడాకులు తీసుకున్నాం. మా జీవితంలో విడాకులు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు.. చాలారోజుల పాటు చర్చించిన తర్వాతే ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన అన్నారు.నా లైఫ్లో నిజమైన హీరో ఆమె..నటి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. 'ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ, తన గురించి బ్యాడ్గా మాట్లాడటం చాలా తప్పు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే..' అంటూ పేర్కొన్నారు. -
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫొటోలు)
-
కౌంట్డౌన్ మొదలైంది..చైతూ- శోభిత పెళ్లి పనులపై సమంత పోస్ట్! (ఫొటోలు)
-
పెళ్లి కూతురి లుక్లో సమంత.. వీడియో వైరల్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ తాజాగా ద్రాక్షారామ పరిసర ప్రాంతాల్లో మొదలైంది. ఇందులో భాగంగా ప్రస్తుతం విజయ్, సమంతలపై క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో గమనిస్తే అక్కడ అందరూ ఓ యాగం చేస్తున్నట్లు కనిపించారు. ఓ వైపు సమంత, విజయ్ ట్రెడిషనల్ లుక్లో కనిపించగా.. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ లాంటి స్టార్స్ కూడా ఆ షూట్లో కనిపించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'సలార్' టీజర్ విడుదల) 'ఖుషి'లోని కొన్ని సన్నివేశాల్లో విజయ్-సమంత భార్య భర్తలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సమంత 'ఖుషి' సెట్స్ నుంచి సెల్ఫీ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా స్టోరీలో పోస్ట్ చేశారు. అందులో ఆమె మెడలో నల్లపూసలు కనిపించాయి. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియోలో కూడా సేమ్ శారీలో సమంత కనిపించారు. ఇప్పటికే విడుదలైన 'నా రోజా నువ్వే...' పాటు సూపర్ హిట్ అందుకుంది. వచ్చే వారంలో రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (ఇదీ చదవండి; జ్యువెల్లరీ యాడ్లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) విభిన్న నేపథ్యాలు కలిగిన ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతి పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. విజయ్ - సామ్ల కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. @samantharuthprabhuoffl and @thedeverakonda perform a Pooja at the last schedule of their movie #Kushi ❤️ 🙏#samantha #samantharuthprabhu #nagachaitanya #samantharuthprabhufans #nagachaitanyafans #varundhawan #samantharuthprabhu #SamanthaRuthPrabhu #nagachaitanya pic.twitter.com/dI6z95LBrE — BTown Ki Billi South Cinema (@bkbsouthcinema) July 5, 2023 Look at this goddess🧿❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Kushi pic.twitter.com/N4kbCl0n8D — NARESH (@naresh__off_) July 4, 2023 -
సీనియర్ హీరోయిన్పై మనుసు పడిన రౌడీబాయ్
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచాడు. ఇప్పుడిప్పుడే 'లైగర్' సినిమా గొడవల నుంచి బయటపడుతున్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చాడట. ఇప్పటికే సమంత కాంబినేషన్లో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ .. తర్వాత సినిమాకు కూడా సీనియర్ హీరోయిన్పైనే ఆసక్తి చూపుతున్నాడట. తాజాగా నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరశురాంతో కలిసి ఓ సినిమాను విజయ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలని వారికి సూచించాడట. ఇదే టాపిక్ టాలీవుడ్లో తెగ వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అందరి చర్చ దానిపైనే!) పూజానే ఎందుకు? పూరి డైరెక్షన్లో 'జనగణమన' సినిమాను తెరకెక్కించాలనుకున్న విజయ్కు 'లైగర్' షాక్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇదే సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్గా కూడా ఓకే చేశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ లేదు కాబట్టి.. పరుశురాం సినిమాతో తనను తీసుకోవాలని విజయ్ ప్లాన్ చేశాడట. ఈ విషయంపై మేకర్స్ కూడా ఓకే చెప్పారట. ఏదేమైనా సమంత తర్వాత మరో సీనియర్ హీరోయిన్తో నటించే అవకాశాన్ని విజయ్ దేవరకొండ పొందాడు. (ఇదీ చదవండి: మంచు మనోజ్- భూమా మౌనిక.. ఇంత ఫ్యాషన్గా ఎప్పుడైనా చూశారా?) -
ఫ్యామిలీ మ్యాన్ 2 ని మించే సీన్స్ లో కనిపించనున్న సమంత
-
సమంత ట్వీట్ కి అఖిల్ రిప్లై అదుర్స్
-
అది నన్ను హర్ట్ చేసింది: సమంత
2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్బెర్రీ ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్లాక్ బెర్రీ ఫోన్ పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఈ మేరకు ఇక తమ ఫోన్ల శకం ముగింసిందని ప్రకటించడంతో చాలా మంది వినయోగదారులు నిరాశకు గురయ్యారు. ఇదే తరహాలో టాలీవుడ్ హిరోయిన్ సమంత కూడా ఈ విధంగా ప్రకటించడం తనను కూడా చాలా బాధించింది అని చెబుతోంది. (చదవండి: ‘టైం కి డ్రోన్ రాకపోయుంటే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’) ఈ బ్లాకెబెర్రీ ఫోన్లు 2000 సంవత్సరం ప్రారంభంలో చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వినియోగించేవారు. పైగా వాటిని "క్రాక్బెర్రీస్" అని పిలిచేవారు. అంతేకాదు కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్.. కీ సెటప్తో ప్రత్యేకంగా ఆకర్షించేవి. అలాంటి ఫోన్లు శకం ముగియడంతో సమంత ఈ బ్లాక్బెర్రీఫోన్లకు చాలా బాధగా వీడ్కోలు పలుకుతున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పైగా ఈ విషయం నన్ను ఎందుకింత బాధించిందో తనకు తెలియదు అని ఇన్స్టాలో పేర్కొంది. (చదవండి: షాకింగ్ వీడియో: విధులకు గైర్హాజరు అవ్వడంతో నర్సు పై దాడి) Even though I haven't used it since 2010, I'm sad that my @BlackBerry is now an actual relic of the past. pic.twitter.com/Idvg6OQeuA — Ray Price (@_RayPrice) January 6, 2022 -
బిజీ బిజీగా మన స్టార్ హీరోయిన్లు..
హీరోలు ఒకేసారి ఒకటీ రెండు సినిమాలు మాత్రమే చేస్తుంటారు. హీరోయిన్లు ఏకకాలంలో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తారు హీరోయిన్లు. ఉదయం ఓ సినిమా – మధ్యాహ్నం మరో సినిమా – సాయంత్రం ఇంకో సినిమా.. ఇలా ఆ సెట్కీ ఈ సెట్కీ తిరుగుతూ షూటింగ్ చేస్తుంటారు. ప్రస్తుతం మన స్టార్ హీరోయిన్లు చేసున్న సినిమాల వివరాలు చూద్దాం. కాజల్ అగర్వాల్: చిరంజీవితో ‘ఆచార్య’, మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’, హిందీలో జాన్ అబ్రహామ్తో ‘ముంబై సాగా’, తమిళంలో కమల్తో ‘భారతీయుడు 2’, దుల్కర్ సల్మాన్ తో ‘హే సినామికా’, ‘గోస్టీ’ చిత్రాలు చేస్తున్నారు. రకుల్ ప్రీత్: నితిన్ తో ‘చెక్’, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, తమిళంలో శివ కార్తికేయన్తో ‘అయలాన్’, కమల్హాసన్తో ‘ఇండియన్ 2’, హిందీలో ‘అటాక్, సర్దార్ అండ్ గ్రాండ్సన్, మే డే, థ్యాంక్గాడ్’ సినిమాలు చేస్తున్నారు. తమన్నా: గోపీచంద్తో ‘సీటీమార్’, నితిన్తో ‘అంధా ధున్ రీమేక్, సత్యదేవ్తో ‘గుర్తుందా శీతాకాలం’, వెంకటేశ్తో ‘ఎఫ్3’, హిందీలో నవాజుద్దిన్ సిద్దిఖీ ‘బోల్ చుడియా’ సినిమాలు చేస్తున్నారు. శ్రుతీహాసన్ : పవన్ కల్యాణ్తో ‘వకీల్ సాబ్’, ప్రభాస్తో ‘సలార్’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘లాభం’ సినిమాలు చేస్తున్నారు. సమంత: గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా, తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్’ సినిమాలు చేస్తున్నారు. కీర్తీ సురేష్: నితిన్ తో ‘రంగ్ దే’, మహేశ్బాబుతో ‘సర్కారువారి పాట’, గుడ్ లక్ సఖి, తమిళంలో రజనీకాంత్తో ‘అన్నాత్తే’, సాని కాయిదం, మలయాళంలో ‘మరక్కార్ : అరబికడలింటే సింహం, వాషి’ చేస్తున్నారు. సాయి పల్లవి: నాగచైతన్యతో ‘లవ్స్టోరీ’, రానాతో ‘విరాటపర్వం’, నానితో ‘శ్యామ్ సింగరాయ్’, పవన్ కల్యాణ్తో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ సినిమాలు చేస్తున్నారు. పూజా హెగ్డే: చిరంజీవి ‘ఆచార్య’, ప్రభాస్తో ‘రాధేశ్యామ్’, అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’, హిందీలో సల్మాన్ఖాన్తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్తో ‘సర్కస్’ చేస్తున్నారు. రష్మికా మందన్నా: అల్లు అర్జున్తో ‘పుష్ప’, శర్వానంద్తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్ తో ‘డాడీ’ సినిమాలు చేస్తున్నారు. రాశీ ఖన్నా: తెలుగులో గోపీచంద్తో ‘పక్కా కమర్షియల్’ తమిళంలో విజయ్ సేతుపతితో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్ మణై 3’, మలయాళంలో ‘భ్రమం’ సినిమాలు చేస్తున్నారు. అనుష్క: ఒకే ఒక్క సినిమా కమిట్ అయ్యారు. ‘రారా కృష్ణయ్య’ దర్శకుడు మహేశ్ పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరికొందరు ‘స్కై ల్యాబ్’, ‘నిన్నిలా నిన్నిలా’ చేస్తున్నారు నిత్యామీనన్ . ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి చేతిలో నాని ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలు ఉన్నాయి. ‘వరుడు కావలెను’, ‘టక్ జగదీష్’, నిన్నిలా నిన్నిలా’ సినిమాలు చేస్తున్నారు రీతూ వర్మ. ‘ఎ1 ఎక్స్ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలు చేస్తున్నారు లావణ్యా త్రిపాఠి. పవన్ కల్యాణ్ – క్రిష్ సినిమా చేస్తున్నారు నిధీ అగర్వాల్. శర్వానంద్తో ‘శ్రీకారం’ , తమిళంలో సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు ప్రియాంకా మోహనన్ . నానీతో ‘టక్ జగదీష్’, సాయితేజ్ ‘రిపబ్లిక్’ చేస్తున్నారు ఐశ్వర్యా రాజేశ్. ‘ఎఫ్ 3’ చేస్తున్నారు మెహరీన్.. ‘అంధా ధున్ ’ రీమేక్లో నటిస్తున్నారు నభా నటేశ్. ‘సిద్ధా ఇదేం లోకం నాయనా’, ‘కళియుగం’ సినిమాలు చేస్తున్నారు శ్రద్ధా శ్రీనాథ్. -
మాల్దీవుల్లో సమంతా సందడి : ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: మాల్దీవుల్లో సెలవులను ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని ఇన్స్టాగ్రామ్ పిక్స్తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తన భర్త నాగ చైతన్యతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిన ఆమె అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అద్బుతమైన ఫోటోలతో సందడి చేస్తున్నారు. గురువారం ఉదయం ఈతకు వెళ్లిన ఆమె బికినీ ఫోటోలను షేర్ చేశారు. నీలినీలి ఆకాశం, బ్లూ సీ రిఫ్లెక్షన్లో రిఫ్రెష్ అవుతున్న మధుర క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె పోస్ట్ చేసిన బాత్టబ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆహ్లాదకరమైన సముద్రతీరంలో, డాల్సిన్లతో ఈత కొడుతూ, సైకిల్పై చక్కర్లు కొడుతూ గడుపుతున్నారు. ఈ సందర్భంగా సమంతా షేర్ చేసిన వీడియో కూడా ఆకట్టుకుంటోంది. (కొడుకుతో నటి క్రికెట్ : ఫోటోలు చూస్తే ఫిదానే) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాను చిత్ర యూనిట్
-
తెలుగు సినిమాకి మంచి కాలం
‘‘ప్రస్తుతం తెలుగు సినిమాకు గ్రేట్ టైమ్. కాన్సెప్ట్ మూవీలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ ధైర్యం వచ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు అక్కినేని సమంత. అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘ఎవరు’. ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటించారు. నవీన్ చంద్ర కీలక పాత్రధారి. వెంకట్ రామ్జీ దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్లో ట్రైలర్ను విడుదల చేసిన సమంత మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగా నచ్చింది. సినిమా మీద ఆసక్తి పెరిగింది. కొత్త కంటెంట్ సినిమాలతో ఇండస్ట్రీని అడివి శేష్ ముందుకు తీసుకెళ్తున్నాడు. అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించారు వెంకట్. రెజీనా మంచి నటి. నవీన్చంద్రతో సహా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు సమంత. ‘‘సమంతలోని పాజిటివ్ వైబ్స్ లక్గా మారతాయి. ‘గూఢచారి’ సమయంలో ఆమె సపోర్ట్ చేశారు. ‘క్షణం’ ముందు వరకు అందరూ నన్ను విలన్గా చూశారే తప్ప... మెయిన్ లీడ్గా ఎవరూ చూడలేదు. ఆ సమయంలో నన్ను నమ్మిన ఒకే ఒక వ్యక్తి పీవీపీగారు. ఆయనకు థ్యాంక్స్. నేను ఎప్పుడూ మంచి సినిమాలో భాగం కావాలనుకుంటాను. ఎందుకంటే మనం ఉండొచ్చు. లేకపోవచ్చు. కానీ మంచి సినిమా ఎప్పుడూ ఉంటుంది. ఈ నమ్మకంతోనే ఈ సినిమా తీశాం. వెంకట్ను ఈ సినిమాను మనసు పెట్టి చేయమన్నాను’’ అన్నారు అడివి శేష్. ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు నవీన్చంద్ర. -
సామ్ నెక్స్ట్ నువ్వే....?
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో చాలెంజ్లు ట్రెండ్ అవుతుంటాయి. ఈ కోవలోనే గతంలో ఐస్ బకెట్ చాలెంజ్, ప్యాడ్మాన్ చాలెంజ్లు ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు ఫిట్నెస్ చాలెంజ్ ట్విటర్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్ పతక విజేత, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ చాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రాజ్యవర్ధన్తో మొదలై విరాట్, హృతిక్, అనుష్క శర్మ, సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్ను స్వీకరించిన వారిలో ఉన్నారు. ఇప్పుడు ఈ కోవలోకి అక్కినేని కుటుంబం చేరింది. తాజాగా నాగచైతన్య ఈ చాలెంజ్ను స్వీకరించి, ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. నాగ చైతన్యను అఖిల్ సవాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య తన భార్య సమంతను, అక్కినేని సుమంత్, నిధి అగర్వాల్కు ఫిట్నెస్ సవాలును విసిరారు. దీని గురించి సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక క్యూట్ మెసేజ్ పోస్టు చేశారు. ‘హమ్ఫిట్తో ఇండియాఫిట్ చాలెంజ్ నాకు చాలా నచ్చింది. కళ్లకు, మనసుకు చాలా తేలికగా అనిపిస్తుంది. చై నేను నీ సవాల్ను స్వీకరిస్తున్నాను. కానీ నువ్వు పోస్టు చేసిన వీడియో చూసి నేను అలసిపోయాను. కాబట్టి రేపు నేను నీ సవాల్ను పూర్తి చేస్తాను’ అంటూ పోస్టు చేశారు. సమంత పోస్టు చేయబోయే ఎక్సర్సైజ్ వీడియో కోసం చై కంటే కూడా సామ్ అభిమానులే ఎక్కువ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మహానటి చిత్రంలో మధురవాణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం యూ టర్న్ సినిమాలో స్వయంగా తానే నటిస్తూ తొలిసారిగా నిర్మాతగా మారారు. The #HumFitTohIndiaFit challenge .. I am quite liking this challenge . So easy on the eyes 😍😍😍 and heart ❤️but mostly eyes 🙃 . I accept your challenge Chay Akkineni But just watching this makes me tired .So tomorrow 😁 A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on May 24, 2018 at 1:28am PDT -
కూకట్పల్లి బిగ్ సిలో సందడి చేసిన సమంత
-
అందరికీ దండాలండోయ్!
తమిళసినిమా: మెర్శల్ చిత్రాన్ని ఆదరిస్తున్న వారికి, అండగా నిలిచిన వారికి దండాలండోయ్ అని అంటున్నారు ఇళయదళపతి విజయ్. ఈ స్టార్ నటుడు కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం మెర్శల్. సమంత, కాజల్అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ మెర్శల్ దీపావళి సందర్భంగా విడుదలై ఎంత సంచలన విజయం దిశగా పరుగులెడుతుందో,అంతగా వివాదానికి తెరలేపింది. జాతీయ స్థాయిలో దుమారం రేపిన మెర్శల్ చిత్ర కథానాయకుడు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.అందులో సంచలన విజయాన్ని సాధిస్తున మెర్శల్ చిత్రం కొన్ని వ్యతిరేక సంఘటనలను ఎదుర్కొంది. అలాంటి చిత్రానికి ఘన విజయాన్ని కట్టబెట్టడంతో పాటు అండగా నిలిచిన నా చిత్రపరిశ్రమకు చెందిన మిత్రులకు, సన్నిహితులకు, నటీనటులకు, సినీ సంఘాలు దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి, దక్షిణ భారత నటీనటుల సంఘం, నిర్మాతలమండలి నిర్వాహకులకు, అభిమానులకు, ఇతర ప్రేక్షకులకు నా తరఫున, మెర్శల్ చిత్ర యూనిట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని విజయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
తెలుగు ప్రేక్షకులు నాకిచ్చిన పెళ్లి బహుమతి ఇది – సమంత
‘‘అమ్మకు ఆస్ట్రాలజీ అంటే నమ్మకం. ఓ సారి ఓ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లినప్పుడు... ‘మీరు కొత్త పాత్రలు చేస్తే తప్పకుండా హిట్’ అన్నారు. అప్పట్నుంచి ఎప్పుడు కొత్త పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రాజుగారి గదిలో అందరూ డబ్బులు నిండుతున్నాయంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే, గదిలో ప్రశంసలు నిండటం చాలా హ్యాపీగా ఉంది. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ కన్నా పెద్ద హిట్టా మావయ్యా?’ అనడుగుతోంది సమంత. ఆ విషయం తనకు తర్వాత చెబుతా’’ అని నవ్వేశారు నాగార్జున. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత, శీరత్ కపూర్, అశ్విన్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ ముఖ్య తారలుగా పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరైన్మెంట్స్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన సినిమా ‘రాజుగారి గది–2’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్మీట్ ఆదివారం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఫ్యాన్స్ ఫోన్ చేసి... ‘మా హీరో ఇలాంటి సినిమా చేశాడని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాం’ అన్నారు. ఇలాంటి పాత్రలే చేయమని అడుగుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? కొత్త కోడలు బ్లాక్ బ్లస్టర్ ఇచ్చింది. ఈ హిట్కి నిర్మాతలు, ఓంకార్, తమన్, అబ్బూరి రవి నాలుగు స్తంభాలుగా నిలిచారు’’ అన్నారు. ‘‘ఈ విజయాన్ని తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన పెళ్లి బహుమతిగా భావిస్తున్నా. క్లైమాక్స్లో నా క్యారెక్టర్ బాగా రావడానికి, నేను బాగా నటించడానికి హెల్ప్ చేసిన మావయ్యకు థ్యాంక్స్’’ అన్నారు సమంత. ‘‘నైజాంలో ‘ఊపిరి’ ఫస్ట్డే షేర్ 80 లక్షలు అయితే... ‘రాజుగారి గది–2’కి కోటిన్నర వచ్చింది. సినిమా ఎంత హిట్టనేది చెప్పడానికే ఈ లెక్కలు చెప్పా. నాగార్జునగారి కెరీర్లో మరో మైల్స్టోన్గా నిలుస్తుందనుకుంటున్నా. అక్కినేని ఫ్యామిలీకి సమంత లక్కీ లేడీ’’ అన్నారు పీవీపీ. ‘‘పీవీపీగారితో హ్యాట్రిక్ హిట్ అందుకున్నందుకు హ్యాపీగా ఉంది. సినిమా పైరసీ కాపీలు వచ్చేశాయని విన్నాం. ప్లీజ్... కిల్ పైరసీ. థియేటర్లోనే సినిమా చూడండి’’ అన్నారు ‘మ్యాట్నీ’ జగన్. ‘‘ఓ ఫైట్ లేదు, పాట లేదు. అయినా... నాగార్జునగారు కథను నమ్మారు. ఆయన ఫ్యాన్స్ ఆయన్ను వేరేలా ఎక్స్పెక్ట్ చేస్తారేమోనని భయపడ్డా. కానీ, సినిమాను ఆదరించారు. అక్కినేని కోడలు ఇచ్చిన తొలి హిట్ తీసిన దర్శకుడిగా నాకు క్రెడిట్ దక్కినందుకు హ్యాపీ’’ అన్నారు ఓంకార్. శీరత్ కపూర్, అభినయ, అశ్విన్, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు. రాజుగారి గది 2 సక్సస్ మీట్ వీడియో -
బ్యాచిలర్ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్!
బ్యాచిలర్స్ పార్టీల్లో ఎవరెవరు కనిపిస్తుంటారు? పెళ్లి చేసుకోబోయే అబ్బాయి లేదా అమ్మాయి స్నేహితులు. బహుశా... శనివారం రాత్రి అయ్యుండొచ్చు! అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇచ్చారట! రామ్చరణ్, చైతూ తమ్ముడు అఖిల్ నుంచి మొదలుకొని చైతూ–సమంత స్నేహితులు ఎందరో పార్టీకి వచ్చారు. వాళ్లలో ఒకతనున్నాడు... మీసం లేదు, గడ్డం లేదు, మాంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీ! అతన్ని ఎవరైనా కాస్త దూరం నుంచి చూస్తే 30 ప్లస్ వ్యక్తి అనుకోవడం గ్యారెంటీ. దగ్గరకు వెళితే... అతనెవరో కాదు, ‘కింగ్’ నాగార్జున అని తెలిసి, కొంతమంది ఆశ్చర్యపోయారట. యస్... చైతూ–సమంత బ్యాచిలర్ పార్టీలో ఎవర్గ్రీన్ మన్మథుడు నాగార్జున స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారట! కుమారులతో నాగార్జున ఎప్పుడూ ఓ తండ్రిలా కాకుండా, ఫ్రెండ్లా ఉంటుంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందువల్లే, చైతూ తండ్రిని స్పెషల్గా పిలిచుంటారు. అఖిల్ కూడా ‘ఎ నైట్ ఎమాంగ్ స్టార్స్... మై త్రీ ఓల్డర్ బ్రదర్స్’ అని ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. అందులో చరణ్, చైతూ, అఖిల్ కాస్త గడ్డాలతో కనిపిస్తుంటే... క్లీన్ షేవ్ లుక్తో నాగ్ హ్యాండ్సమ్గా ఉన్నారు. ఈ పార్టీతో చైతూ–సమంతల పెళ్లి సందడి మొదలైంది. వచ్చే నెల 6న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి షాపింగ్లో బిజీగా ఉన్నారట!! -
సమంత కొత్త హాబీ..!
-
సమంత కొత్త హాబీ..!
పెళ్లి వార్తల తరువాత సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిన స్టార్ హీరోయిన్ సమంత, మరో ఇంట్రస్టింగ్ వీడియోతో అభిమానులను ఖుషీ చేసింది. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్లో మాత్రమే కానిపించిన ఈ బ్యూటీ, కర్రసాము చేస్తున్న వీడియో అభిమానులకు షాక్ ఇచ్చింది. 'నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం. అందుకే కొత్త హాబీ సిలంబం (కర్రసాము). త్వరలోనే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాధించాలనుంది' అంటూ ట్వీట్ చేసింది. అయితే సమంత హాబీగానే ఈ విద్య నేర్చుకుంటుందా..? లేక ఏదైనా సినిమా కోసమా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి రాజుగారి గది 2తో పాటు రామ్ చరణ్, సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ రెండు సినిమాల తరువాత మరో రెండు తమిళ సినిమాలకు ఓకె చెప్పింది. ఈ మధ్యలోనే నాగచైతన్యతో తన పెళ్లితంతును ముంగించేందుకు ప్లాన్ చేసుకుంటుంది. Because I like a challenge -
త్రివిక్రమ్ 'పొల్లాచి' షెడ్యూల్ పూర్తయింది!
క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ..ఆ..' (అనసూయ రామలింగ్ vs ఆనంద్ విహారి) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ తమిళనాడు పొల్లాచిలో తమ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఇక్కడ సినిమా చిత్రీకరణ ముగియడంతో ఆనందంతో చిత్ర యూనిట్ ఓ ఫొటో దిగింది. ఈ ఫొటోను డైరెక్టర్ త్రివిక్రమ్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్టు చేశారు. హీరో నితిన్, హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్ తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'అ..ఆ..' చిత్రం ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే షూటింగ్ ఆలస్యం కావటం ఏప్రిల్కు వాయిదా వేశారు. ఏప్రిల్ 22న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ చెప్తోంది. -
దేవరాంపల్లిలో షూటింగ్ సందడి
చేవెళ్ల మండలం దేవరాంపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద శుక్రవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. హీరో నితిన్, హీరోయిన్ సమంతలతో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ(చిన్నబాబు) నిర్మిస్తున్న చిత్రం సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిం చారు. ఓ ఫైట్ సీన్ను బ్రిడ్జిపై షూట్ చేశారు. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అ...ఆ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. రెండుమూడురోజుల పాటు గ్రామ సమీపంలో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. షూటింగ్ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రావడంతో సందడి నెలకొంది. - చేవెళ్ల రూరల్ -
ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు!
‘‘ఆ దేవుడు నన్నెప్పుడూ చిన్న చూపు చూడలేదు. హీరోయిన్గా మంచి హోదాలో నిలబెట్టాడు. ఎంతోమంది అభిమానులు నా సొంతం అయ్యేలా చేశాడు. ఇక, ఈ ఏడాదైతే ఫుల్గా ఆశీర్వదించేశాడు. అలా ఎందుకు అంటున్నానంటే ప్రస్తుతం నా చేతిలో ఉన్నవన్నీ మంచి సినిమాలే. ఈ సినిమాల తాలూకు ఫలితం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాను. అందుకే, విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సమంత అంటున్నారు. కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు.. విడిగా బోల్డన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారామె. అలా చేయడానికి ప్రేరణగా నిలిచింది మా అమ్మగారే అని సమంత చెబుతూ - ‘‘ఒకప్పుడు మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అయినప్పటికీ మా అమ్మగారు ఇతరులకు సహాయం చేసేవారు. నా కలలో కూడా నాకు దేవుడు బోల్డంత డబ్బులిస్తాడనుకోలేదు. కానీ, ఇచ్చాడు. అందుకే, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
షాపింగ్ మాల్ ప్రారంభించిన సమంత
-
సదా మీ సేవలో..
చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదిమందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. మరెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సవూజం కోసం మీరు చేతులు కలిపి.. చేసిన చేతల వివరాలు మాకు తెలియజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్డమ్కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సమంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను మాకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. వీటిలో ఉన్నతమైన వాటిని ఎంపిక చేసి.. సదరు సేవా సంస్థలు, వ్యక్తులను సమంత పలకరిస్తారు. ఒక్క సమంత మాత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి మరెందరో సెలిబ్రిటీలు ముందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేస్తున్న చారిటీ వివరాలు sakshicityplus@gmail.com -
సమంతకు మద్దతుగా సుచిత్ర చిత్ర ప్రదర్శన
సినీనటి సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలకు మద్దతుగా, ఆమె ఆధ్వర్యంలోని ప్రత్యూష ఫౌండేషన్కు నిధుల సేకరణ కోసం ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ భార్య, చిత్రకారిణి సుచిత్రా కృష్ణమూర్తి ఆదివారం నగరంలోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో ఆమె తాను రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. సుచిత్రా కృష్ణమూర్తి చిత్రకళా ప్రదర్శన ఆదివారం రాత్రి 7.00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది వారం రోజులు కొనసాగుతుంది. తన సేవా కార్యక్రమాలకు సుచిత్ర చేయూతనివ్వడంపై సమంత హర్షం వ్యక్తం చేశారు. -
సమంతకు వైరాగ్యం!
ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న సమంత మాట తీరు చూస్తుంటే ఇటీవల ఆమెకు వైరాగ్యం ఆవహించినట్లుంది. అక్కినేని నాగచైతన్యతో 'ఏం మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్లో జెండాపాతి, ఆ తరువాత వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టింది. దాంతో ఈ ముద్దుగుమ్మ గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకుంది. ఈ బొమ్మ నటించిన మూవీ హిట్ అని టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఏర్పడిపోయింది. ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాంటి టాప్ హీరోయిన్కు కూడా కష్టాలొచ్చి పడ్డాయి. జీవితం అంటే ఇదే. ఓవర్ నైట్లో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయిన సమంత ఇప్పుడు కోలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయింది. రెండు భాషల్లోనూ దుమ్మురేపుతున్న సమయంలోనే సమంత కెరీర్ కాస్త స్లో అయింది. ఈ మధ్య వచ్చిన సినిమాలు సమంత రేంజ్కు తగ్గట్టుగా లేవని టాక్ నడుస్తోంది. దానికి ప్రధాన కారణం అంతకు ముందు కాస్త సాంప్రదాయబద్దంగా దుస్తులు వేసుకొని నటించిన ఈ చిన్నది ఈ మధ్య అందాలు ఆరబోయడం మొదలు పెట్టింది. ఎక్స్పోజింగ్ చేయాలన్నా శరీరసౌష్టవం దానికి తగినట్లుగా ఉండాలి. అదేంలేకుండా చీలికలు, పీలికల దుస్తులు, బికినీలు వేసుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయం అర్ధంకానట్లుంది. పరిస్థితి సమంతకు అర్ధమైనట్లుంది. తన మనసులోని మాటలు ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. మార్కెట్ తగ్గిన తర్వాత కాకుండా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న టైంలోనే నటనకు స్వస్తి చెబుతానని చెప్పింది. ఎదురుదెబ్బలు తగులుతున్నాయి కాబట్టే సమంత ఇలా మాట్లాడుతోందని ఫిలింనగర్ జనాల అభిప్రాయం. అంతేకాదు, ఈ మధ్య సమంత ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అందేంటో తెలుసా? పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలు సినీ పరిశ్రమలోకి రావద్దని చెప్పింది. ఇదంతా చూస్తుంటే సమంతకు వైరాగ్యం వచ్చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. ఏ హీరోయిన్కైనా ఒడిదుడుకులు సహజం. మరి సమంత ఎందుకంత ఇదై పోతుందో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ** -
అనుష్కానా, సమంతానా?
దక్షిణ భారత సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ ప్రేక్షకులలో మంచి క్రేజీ ఉన్న సమంత అని విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆదాయ లెక్కలతో పోల్చితే సమంత కంటే బిగ్ పర్సనాలిటితో టాలీవుడ్ని ఏలుతున్న యోగా టీచర్ అనుష్క అని చెబుతున్నారు. సమంతకు సక్సెస్ఫుల్ హీరోయిన్ అన్న పేరు ఉన్నప్పటికీ అనుష్క భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తోంది. 2014 సంవత్సరం ఆదాయానికి సంబంధించిన లెక్కలను పరిశీలిస్తే సెక్సీ క్వీన్ అనుష్క సంపాదన 15 కోట్ల రూపాయల వరకు చేరుకుందని అంచనా. సినిమాలతోపాటు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, బ్రాండింగ్ తరహా క్యాంపెన్ల వంటి సంపాదనంతా లెక్కగడితే ఇంత సంపాదించినట్లు తేలిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోయిన్స్ ఎవరు అన్న దానిపై కోలీవుడ్లో ఇటీవల ఓ మ్యాగజైన్ సర్వే నిర్వహించింది. అందులో అనుష్క మొదటి స్థానం ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఆ తరువాతి స్థానంలో గోల్డెన్ లెగ్గా పేరు సంపాదించిన సమంత ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అనుష్క దక్షిణ భారత చలనచిత్ర రంగంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్లో ఒకరు అనేది అందరికీ తెలిసిన విషయమే. అనుష్క తెలుగు, తమిళ భాషలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 4 సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలైన 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాల్లో అనుష్క నటిస్తోంది. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'లింగా', అజిత్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ నాలుగు క్రీజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నప్పటికీ అనుష్క గత సంవత్సర కాలంగా కాస్త గ్యాప్ కూడా తీసుకోలేదు. అనుష్క తీరికలేకుండా నటనకు ప్రాధాన్యత గల పాత్రలలో నటిస్తూ, పాత్రల పరంగా శ్రమిస్తూ సంపాదిస్తోందని అంటున్నారు. ** -
కుర్రకారుకి కునుకు పట్టనివ్వని హీరోయిన్
సినీ ప్రపంచంలో ఒక్కో హీరోయిన్ ఒక్కోసారి ఓ వెలుగు వెలిగిపోతుంటుంది. ఇప్పుడు అది సమంత వంతైంది. ఈ ముద్దు గుమ్మ ఇటు టాలీవుడ్లోనూ, అటు కోలీవుడ్లోను కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు నిద్రపట్టడంలేదు. మరోవైపు నిర్మాతలకు కనక వర్షం కూడా కురిపిస్తోంది. సమంత నటిస్తే సినిమా హిట్టే అనే టాక్ కూడా వచ్చింది. దాంతో నిర్మాతలు ఆమె కోసం బారులు తీరుతున్నారు. ఈ రెండు భాషలలోనూ స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలు వాటంతట అవే వచ్చేశాయి. నటనలో కూడా పరిణతి చూపుతూ అదే స్థాయిలో ఆమె దూసుకుపోతోంది. ఈ రేంజ్లో ఉన్న సమంతకు ఇప్పుడు ఓ చిక్కువచ్చి పడింది. ఆమె స్పీడ్కు మరో హీరోయిన్ బ్రేకులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంతతో శృతిహాసన్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతోంది. తెలుగులో మాత్రం సమంత మరే హీరోయిన్కు అందనంత ఎత్తులో కొనసాగుతోంది. ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ కొట్టాయి. దాంతో తెలుగులో బాగా క్రేజ్ ఏర్పడింది. ఈ ఊపుతో సొంత భాష తమిళంలో కూడా హవా కొనసాగించాలని ఈ అమ్మడు చూస్తోంది. అనుకున్నట్లు ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్లో కూడా యామ స్పీడ్గా టాప్ ప్లేస్కు చేరుతోంది. ఇదే సమయంలో సమంతకు పోటీగా మరో ముద్దుగుమ్మ శృతిహసన్ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొన్నటివరకు బాలీవుడ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన శృతి తాజాగా తమిళంలో స్థిరపడాలన్న ఆలోచనతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ఉద్దేశంతోనే తమిళ చిత్రాల పట్ల ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం విశాల్ సరసన పూజై సినిమాలో నటిస్తోంది. మళ్లీ ఇటీవలే స్టార్ హీరో విజయ్తో కలసి నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. త్వరలో మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాలకి కూడా ఈ నాజూకు సుందరి సంతకం చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వరుసగా తమిళ సినిమాలను శృతి తన ఖాతాలో వేసుకుంటూ సమంత ఆశలపై నీళ్ళు చల్లుతోంది. వీరిద్దరిలో కోలీవుడ్లో ఎవరు అగ్రస్థానానికి చేరతారో కొంతకాలం వేచి చూడవలసిందే. - శిసూర్య -
బ్రాండెడ్ చెప్పులకు క్రేజ్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెప్పులు అనగానే పాదరక్షలు అన్న భావన ఇప్పుడు తొలగిపోయింది. ప్రత్యేకతను చూపించుకోవడానికి ఒక సాధనంగానూ మారిపోయాయి. పురుషులు సాధారణంగా ఆఫీసుకు ఒకటి, రోజూ వేసుకోవడానికి ఒకటి ఇలా ఏటా రెండు జతలు కొంటే.. యువతులైతే ఏకంగా నాలుగు జతలకు తక్కువ కాకుండా మెయింటెయిన్ చేస్తున్నారట. ఇంట్లో, ఆఫీసుకు, వాకింగ్కు, షాపింగ్కు, శుభకార్యానికి ప్రత్యేకంగా చెప్పులను కొంటున్నారు. కస్టమర్లు పాదరక్షల విషయంలో నాణ్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందుకోసం బ్రాండెడ్ వైపు మళ్లుతున్నారని ప్రముఖ కంపెనీ ప్యారగాన్ అంటోంది. బ్రాండెడ్ ధరలు తగ్గడం కూడా మరో కారణమని చెబుతోంది. రంగులమయం.. చెప్పుల అడుగు భాగంలో నలుపు రంగును మాత్రమే కస్టమర్లు ఆదరిస్తున్నారు. పై భాగంలో ఫ్యాన్సీ రంగులున్న వాటిని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పురుషులైతే నలుపుతోపాటు సంప్రదాయ రంగులు కోరుతున్నారు. మహారాష్ట్రలో నలుపు రంగు సాండల్స్ అధికంగా అమ్ముడవుతున్నాయి. ఇక సైజు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 10, 11 నంబరు చెప్పులకు ఎక్కువ డిమాండ్. దీనికి కారణం ఇక్కడివారి పాదం పెద్దగా ఉండడమే. పశ్చిమ బెంగాల్లో 8వ నంబరు అమ్మకాలే అధికం. 9, 10 నంబరు అతి స్వల్పం. మొత్తంగా సగటు వినియోగం భారత్లో 2.1 జతలు. పశ్చిమ దేశాల్లో 11 జతలుంది. ధరలు తగ్గాయి కాబట్టే.. పాదరక్షల అమ్మకాల్లో 60 శాతం వాటా రూ.250 లోపుండే వెరైటీలదే. బ్రాండెడ్ కంపెనీలు కూడా ఈ ధరలో వివిధ వెరైటీలను ఆఫర్ చేస్తున్నాయి. మూడు నాలుగేళ్ల క్రితం బ్రాండెడ్ చెప్పుల ఖరీదు దాదాపు రూ.350 నుంచి ఉండేది. ఇప్పుడు రూ.129 నుంచి లభిస్తున్నాయని ప్యారగాన్ పాలిమర్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ థామస్ మణి తెలిపారు. బ్రాండెడ్ కంపెనీలు ధరలు తగ్గించడంతో అవ్యవస్థీకృత రంగ కంపెనీల ఉత్పత్తులకు ఆదరణ తగ్గుతోందని పేర్కొన్నారు. కస్టమర్లు సైతం మన్నికకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టైల్, సౌకర్యం, అందుబాటు ధర ఈ మూడు అంశాలు కీలకమయ్యాయని వివరించారు. చైనాలో కార్మికులకయ్యే వ్యయం అధికమవుతుండడంతో ఆ దేశం నుంచి చవక పాదరక్షల దిగుమతి తగ్గుతోందని వెల్లడించారు. రూ.27,000 కోట్ల మార్కెట్.. చెప్పులు, సాండల్స్, స్పోర్ట్స్, ఫార్మల్, లెదర్ షూస్ అన్నీ కలిపి వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగంలో దేశంలో పాదరక్షల పరిశ్రమ రూ.27 వేల కోట్లుంటుందని అంచనా. వ్యవస్థీకృత రంగంలో సాండల్స్, చెప్పుల పరిశ్రమ 20 శాతం వృద్ధి రేటుతో రూ.6-7 వేల కోట్లుంది. పాలీ యురెథేన్తో(పీయూ) తయారైన పాదరక్షలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తడి ఉన్నప్పటికీ జారకుండా ఉండడం వీటి ప్రత్యేకత. 2013-14లో 3.2 కోట్ల జతల పీయూ చెప్పులను ప్యారగాన్ విక్రయించింది. ఇక పిల్లల పాదరక్షల మార్కెట్ రూ.2,500 కోట్లుండొచ్చని సమాచారం. పెద్దల కంటే పిల్లల పాదరక్షలే ఖరీదెక్కువ. సమంత.. బ్రాండ్ అంబాసిడర్ పాదరక్షల తయారీలో ఉన్న ప్యారగాన్ సినీ తార సమంతను ప్రచార కర్తగా నియమించింది. మహిళలకు రోజువారీ వినియోగం కోసం రూపొందించిన సోలియా శ్రేణి చెప్పులకు మూడేళ్లపాటు ఆమె ప్రచారం చేస్తారు. 100 డిజైన్లు ఆఫర్ చేస్తున్నామని, వీటి ధరలు రూ.129-199 మధ్య ఉన్నాయని కంపెనీ తెలిపింది. 2013-14లో కంపెనీ రూ.1,375 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. 12.92 కోట్ల జతల చెప్పులను విక్రయించింది. ఇందులో 35% వాటా మహిళల పాదరక్షలదేనని మార్కెటింగ్ ఈడీ నవీన్ థామస్ శుక్రవారమిక్కడ తెలిపారు. ఫార్మల్, లెదర్ షూస్ విభాగంలోకి రెండేళ్లలో ప్రవేశిస్తామని చెప్పారు. ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు, ఈ-కామర్స్ భవిష్యత్ ప్రణాళికలని వెల్లడించారు. కంపెనీ నెలకు 35 కొత్త డిజైన్లను ప్రవేశపెడుతోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కంపెనీకి 45 శాతం మార్కెట్ వాటా ఉంది. -
ఆ రెండు చిత్రాలకూ పారితోషికం తగ్గించుకున్నాను!
దక్షిణాదిన ‘మోస్ట్ వాంటెడ్’ అనిపించుకున్న తర్వాత ఏ హీరోయిన్కైనా తదుపరి లక్ష్యం ‘బాలీవుడ్’ మీద ఉంటుంది. కానీ, సమంతకు మాత్రం అలాంటి ఆశయాలేవీ లేవు. ‘‘హిందీ సినిమాలు చేస్తే, మార్కెట్ పెరుగుతుంది కదా?’’ అనడిగితే... ‘‘తెలుగు, తమిళ భాషల్లో నా మార్కెట్ బాగానే ఉంది కదా’’ అని సమంత చెబుతారు. తమన్నా, కాజల్ అగర్వాల్లాంటివాళ్లు హిందీ సినిమాలు చేస్తున్నారు కదా? అని ఓ ఆంగ్ల పత్రిక సమంతను అడిగితే -‘‘నేనిక్కడి అమ్మాయిని కాబట్టి, తమిళ సినిమాలు ఎక్కువగా చేయాలని ఉంటుంది. వాళ్లు ముంబయ్ నుంచి వచ్చినవాళ్లు కాబట్టి, హిందీ సినిమాలు చేయాలనే తపన ఉంటుంది. కానీ, బాలీవుడ్ పై నాకు దృష్టి లేదు. నాకిక్కడ మంచి మంచి అవకాశాలొస్తున్నాయి. మనకు కథానాయికల కొరత కూడా ఉంది. అలాంటప్పుడు నేనిక్కడ్నుంచి ఎందుకు వెళ్లడం’’ అన్నారు. ఇక్కడైతే ‘నంబర్ వన్’ అనిపించుకోవచ్చనే ఆలోచన కూడా ఉందా? అన్న ప్రశ్నకు -‘‘నంబర్ గేమ్ని నమ్మను. ప్రతి శుక్రవారం ఓ సినిమా విడుదలవుతుంది. ఏ సినిమా హిట్టయితే, అందులో నటించిన కథానాయిక ‘నంబర్ వన్’ అవుతుంది. వారానికి మారిపోయే స్థానం గురించి ఆలోచించడం వృథా. నేనెవరితోనూ పోటీపడను. మంచి పాత్రలు చేయాలనుకుంటాను. నటిగా నిరూపించుకోవడానికి ఆస్కారం ఉందనిపించిన సినిమాలకు పారితోషికం తగ్గించుకోవడానికి వెనకాడను. ఈగ, ఏమిటో ఈ మాయ చిత్రాలే అందుకు ఉదాహరణ’’ అని చెప్పారు. -
సమంతకు చెమటలు పట్టిస్తున్న ప్రణీత
-
8 ఐస్క్రీంలు, బిర్యానీ తెగ లాగించేశా!!
వారాంతం అయిపోయింది. శని, ఆది వారాలంటే అందరికీ ఆటవిడుపే. మరి సెలబ్రిటీలు ఈ రెండు రోజుల్లో ఏం చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఆ వివరాలు మీ కోసం సేకరించి మరీ ఇస్తున్నాం. సోషల్ నెట్వర్కింగ్ మైక్రో సైట్ ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉండే కొంతమంది సెలబ్రిటీలు ఈ రెండు రోజుల్లో ఏవేం చేశారో చూస్తే ఒక్కొక్కళ్లూ ఒక్కోలా గడిపారు. హీరోయిన్ సమంత అయితే ఈ రెండు రోజుల్లో తిండిమీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. 8 ఐస్క్రీంలు, బిర్యానీ, చాట్, రసమలై.. ఇలా తనకు ఇష్టమైనవన్నీ లాగించేసింది. దాంతో బ్రహ్మాండంగా నిద్ర కూడా పట్టేసిందట. ఏకంగా ఫుడ్ కోమా వచ్చేసిందని తన ట్విట్టర్ అకౌంట్లో సమంత చెప్పింది. 8 ice creams,biryani,chaat,rasmalai... Food food and more food has been consumed in the last 2 days.. Food coma has happened.happy days over — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) February 9, 2014 ఇక హీరో నితిన్ , తన హార్ట్ ఎటాక్ సినిమా గురించే చూసుకున్నాడు తప్ప పెద్దగా విశ్రాంతి తీసుకున్నట్లు కనపడలేదు. తొమ్మిదో రోజు తన హార్ట్ ఎటాక్ సినిమా బాగా ఊపందుకుందని, ప్రధానంగా నగరాల్లో ఈ సినిమాను జనం బాగా చూశారని ట్వీట్ చేశాడు తప్ప, ఈ రెండు రోజుల్లో తానేం చేశాడో మాత్రం చెప్పలేదు. అంటే, సినిమా గురించిన టాక్ మీదే నితిన్ దృష్టి పెట్టాడన్నమాట. #HeartAttack Day9 Picked Up Very Well Especially In Cities!!! — TFIBoxOffice.Com (@TFIBoxOffice) February 9, 2014 హీరో సిద్ధార్థ మాత్రం కార్తీక్ సుబ్బరాజ్ తీసిన జిగర్తండా చిత్రం టీజర్ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశాడు. దీనికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడని చెప్పాడు. దానికి ఎవరెవరు ఎలా స్పందించారో చూశాడు. Here is the teaser of my new film... Karthik Subbaraj's JIGARTHANDA. http://t.co/SSYhzSMntN DOP- Gavmic Ary. Music - Santosh Narayan. — Siddharth (@Actor_Siddharth) February 8, 2014 బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు ఇప్పటికీ అభిమానుల సందడి ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోలతో సమానంగా ఆయన కోసం అభిమానులు వెల్లువెత్తుతున్నారు. ఆదివారం అయితే అమితాబ్ బచ్చన్ను చూసేందుకు వేలాదిమంది జనం తరలి వెళ్లారు. వాళ్లందరినీ చూసి ఆయనకు కడుపు నిండిపోయింది. అందరికీ అభివాదం చేసి, వారితో తన సంతోషాన్ని పంచుకున్నారు. వాళ్లంతా వచ్చిన ఫొటో కూడా అమితాబ్ ట్వీట్ చేశారు. T 1383 -Overwhelming moment of Sundays .. today a little too boisterous - almost broke the cordon and moved in ! pic.twitter.com/HjL4SST2UJ — Amitabh Bachchan (@SrBachchan) February 9, 2014 ప్రతి అరగంటకు కూడా తన ట్విట్టర్ అకౌంట్ను అప్డేట్ చేసే రాజకీయ నాయకుల్లో నరేంద్ర మోడీ ఒకరు. ఆయన ఎప్పుడు ఏం చెప్పినా, ఏం చేసినా వెంటనే ట్విట్టర్లో ప్రత్యక్షం అవుతుంది. ఆదివారం నాడు కేరళలో పర్యటించిన నరేంద్ర మోడీ, అక్కడి కమ్యూనిస్టులపై మండిపడ్డారు. కేరళను 'దేవుడి సొంత దేశం' అని పిలుస్తారని, కానీ.. అక్కడి యువత ఉద్యోగాల కోసం దేశ విదేశాలకు ఎందుకు వెళ్లిపోతారని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆయన మండిపడ్డారు. Kerala is called 'God's Own Country' but why are youngsters leaving in search of jobs? Centre & State Govts have failed to create jobs. — Narendra Modi (@narendramodi) February 9, 2014 -
వివాదంరేపిన పోస్టర్ ఇదే!
హైదరాబాద్: మహేష్ బాబు తాజా చిత్రం ‘1-నేనొక్కడినే' పోస్టర్ విడుదల చేశారు. అది పెద్ద వివాదం రేపింది. ఇక సినిమా ఎంత సంచలనం సృష్టిస్తోందోనని సినీవర్గాల చర్చ. పైన పోస్టర్లో హీరో మహేష్ బాబు బీచ్లో నడుస్తుంటే హీరోయిన్ కృతి సనన్ అతని కాలి అడుగులను మోకాళ్లు, చేతులతో పాకుతూ అనుసరిస్తూ ఉంది. ఈ పోస్టర్ను దృష్టిలోపెట్టుకొనే హీరోయిన్ సమంత సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేసిన వ్యాఖ్యలపై ట్విట్ల యుద్ధం జరుగుతోంది. సమంతకు సంఘీభావంగా హీరో సిద్ధార్ధ కూడా ట్వీట్ చేశారు. ఈ పోస్టర్పై సమంత పరోక్షంగా విమర్శలు చేయడంపట్ల ప్రిన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి సమంత హీరో పేరుగానీ, సినిమా పేరుగాని తన ట్విట్లో ప్రస్తావించలేదు. 'విడుదలకు సిద్ధమవుతున్న ఓ సినిమా పోస్టర్ను ఈ మధ్య నేను చూశాను. ఆ పోస్టర్లో హీరో, హీరోయిన్ని చూస్తుంటే మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది' అంటూ ట్వీట్ చేసింది. ఈ కామెంట్ '1-నేనొక్కడినే' సినిమా పోస్టర్పైనేనని ప్రిన్స్ అభిమానుల అభిప్రాయం. ఇక అభిమానుల యుద్దం ఎలా ఉంటుందో అదరికీ తెలిసిందే. వారి స్టైల్లో కొందరు నిరసన తెలుపుతుంటే, మరి కొందరు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా యుద్ధం చేస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కొందరు మహేష్ బాబుకు మద్దతు పలుకుతుంటే, మరికొందరు సమంతను సమర్ధిస్తున్నారు. సినిమాల విషయంలో ఇవన్నీ పట్టించుకోవలసిన అవసరంలేదని కొందరంటుంటే, కొంత మందికి మాత్రం ఈ పోస్టర్ అగ్రహాన్ని తెప్పించిన మాట వాస్తవం. ఈ పోస్టర్ ఆడవాళ్లను కించపరిచే విధంగా వుందని విమర్శిస్తున్నారు. -
లక్కీ గాళ్
-
‘ఆటోనగర్ సూర్య’దీపావళికి వస్తున్నాడు
‘ఆటోనగర్ సూర్య’ హంగామా చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. బ్యాలెన్స్ వర్క్ని పూర్తి చేసి, దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘ఏమాయ చేసావె’ తర్వాత నాగచైతన్య, సమంత కలిసి చేస్తున్న సినిమా ఇది. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న దేవా కట్టా ఈ మాస్ చిత్రాన్ని క్లాస్గా డీల్ చేస్తున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 10న చివరి షెడ్యూలు మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ షెడ్యూల్లో ఒక పాట, రెండు రోజుల ప్యాచ్వర్క్ పూర్తి చేస్తాం. ఆ తర్వాత మలేసియాలో పాట చిత్రీకరిస్తాం. దాంతో సినిమా పూర్తవుతుంది. మరోపక్క నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలుపెట్టాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్రెడ్డి, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్. -
'కాటం రాయుడా'కు పవర్ 'స్టార్' క్లిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గళం విప్పాడు. తమ్ముడు, ఖుషి చిత్రాల్లో జానపద గీతాలు పాడిన అతను తన తాజా చిత్రం 'అత్తారింటికి దారేది'లో ఓ పాట పాడాడు. అలనాటి చిత్రం 'సుమంగళి'లోని 'కాటం రాయుడా' పాటను ఆలపించాడు. ఈ పాట ప్రస్తుతం యుట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో 3,70,000 మంది ఈ వీడియోని వీక్షించారు. ఈ పాటను పవన్ ఈజీగా .... అరగంటలో పాడేశాడట. అయితే చిత్ర యూనిట్ ఆడియో విడుదల చేసేటప్పుడు మాత్రం ఈ పాట గురించి గోప్యంగా ఉంచారు. ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యంలో ముంచేందుకు ఈ పాటను ఇటీవల విడుదల చేసిన ఆడియో ఆల్బంలో పెట్టలేదు. ఇదే విషయాన్ని ఆడియో రిలీజ్ రోజు హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమాలో ఇంకో పాట ఉందని.. అది బయటపెడితే తనను చంపేస్తానన్నారని చెప్పిన విషయం తెలిసిందే. 'అత్తారింటికి దారేది'లో పవన్ సరసన సమంత...ప్రణీత హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈనెల 9న 'అత్తారింటికి దారేదీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరో మహేష్ బాబు కూడా ఓ అతిథి పాత్ర పోషించారు. ఓ పక్క పవన్ పాటతో పాటు, ప్రిన్స్ గెస్ట్ రోల్ చూసేందుకు ఇద్దరు హీరోల అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.