-
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
-
సెంటిమెంట్... అడ్వెంచర్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తమ్ముడు’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శనివారం (మార్చి 30) నితిన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘భీష్మ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
హీరో నితిన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు..
-
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో నితిన్ నేడు (మార్చి 30) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో నితిన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'తమ్ముడు' అనే టైటిల్ను ఫిక్స్ చేసిన మేకర్స్.. నేడు నితిన్ పుట్టినరోజు కావడంతో ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాని దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న 56వ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లో నితిన్ కాస్త డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్కు సంబంధించిన సీన్ నుంచి ఈ పోస్టర్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నితిన్- దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో మరో సినిమాను రానుంది. వీరిద్దరి కాంబోలో ఇష్క్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నితిన్ భారీ హిట్ అందుకున్నాడు. A story of ambition, courage, and determination🎯 Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥 Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ — Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024 -
రాబిన్హుడ్ టైటిల్ గ్లింప్స్
-
షూటింగ్లో గాయపడ్డ హీరో నితిన్?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్కు గాయాలు అయినట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'తమ్ముడు' అనే సినిమా షూటింగ్లో పాల్గొన్న నితిన్కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్లో పాల్గొన్న నితిన్కు ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్ను క్యాన్సిల్ చేశారట. నితిన్కు సుమారు మూడు వారాలపాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారట. గతేడాదిలో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం 'ఎక్స్ట్రా - ఆర్డినరి మ్యాన్'తో ఆయన అంతగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. దీంతో దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ చిత్రంతో హిట్ కొట్టాలని నితిన్ ఉన్నాడు. గతంలో ఇదే బ్యానర్లో 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంలో ఆయన నటించిన విషయం తెలిసిందే. అక్కా, తమ్ముడు అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే ఈ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. చాలారోజుల నుంచి ఒక సూపర్ హిట్ సినిమా తీసి తన ఫ్యాన్స్కు ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో తమ్ముడు చిత్రం కోసం ఆయన ఎక్కువగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో షూటింగ్ స్పాట్లో ఆయనకు ప్రమాదం జరిగింది అనే వార్త బయటకు రావడంతో నితిన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ప్రమాదం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. -
Extra Ordinary Man OTT: సంక్రాంతికి ఓటీటీలో రానున్న నితిన్ సినిమా
నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం 'ఎక్స్ట్రా - ఆర్డినరి మ్యాన్'. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. మంచి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా డిసెంబర్ 8న విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమాలో ఎక్కవగా కామెడీ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. రైటర్గా మెప్పించిన వక్కంతం వంశీ.. డైరెక్టర్గా మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు కొంత నెగటివ్ టాక్ వచ్చింది. ఇదే సమయంలో నాని నటించిన హాయ్ నాన్న చిత్రం కూడా విడుదలై మంచి టాక్ రావడంతో నితిన్ సినిమా కలెక్షన్స్పై కూడా ప్రభావం చూపింది. ఈ చిత్రంలో నితిన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్గా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన విభిన్నమైన పాత్రలో నటించడం విశేషం. ఈ సంక్రాంతికి ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుందని భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫిషీయల్ ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రాజశేఖర్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, పవిత్రా నరేష్, హైపర్ ఆది తదితరులు నటించారు. -
నితిన్ 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' టాక్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ హీరో నితిన్ 32వ సినిమా 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' నేడు (డిసెంబర్ 8) విడుదలైంది. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించగా.. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్ అని సినిమా విడుదలకు ముందు నితిన్ చెప్పడం విశేషం. ప్రేక్షకుల్ని నవ్వించాలన్న ఒకే లక్ష్యంతో ఈ చిత్రాన్ని చేశామని ఆయన చెప్పాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని చెప్పుకొచ్చాడు నితిన్. తాజాగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఫుల్ కామెడీ ఉందని ఎంజాయ్ చేస్తున్నారు. భీష్మ తర్వాత నితిన్కు సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైన ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఎక్స్ట్రా ఆర్డనరీ మ్యాన్ ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్గా నటించడం విశేషం. ఈ క్యారెక్టర్లో ఆయన ఫర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని, అతడి కామెడీ టైమింగ్ కూడా బాగుందని నెటిజన్లు చెబుతోన్నారు. 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' ఫుల్ ఫన్తో కూడిన చిత్రమని చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా నితిన్ సరికొత్త రోల్లో కనిపించి అదరగొట్టాడని నెటిజన్లు తెలుపుతున్నారు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. ఈ సినిమాకు రావు రమేష్ పాత్ర ప్రధాన బలం అని ఒకరు చెబుతుంటే.. ప్రత్యేక పాత్రలో కనిపించిన రాజశేఖర్ కూడా భారీగానే వినోదాన్ని పంచాడని తెలుపుతున్నారు. ద్వితీయార్దంలో అయితే ఫుల్ ఫన్గా కొనసాగుతుందని కామెంట్లు చేస్తున్నారు. రాజశేఖర్ రోల్ తక్కువే అయినా ఆయన కనిపించిన సీన్స్ మొత్తం ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం కథలో ఎలాంటి కొత్తదనం లేదని తెలుపుతున్నారు. అవుట్ డేటెడ్, డిజాస్టర్ అని కామెంట్లు పెడుతున్నారు. వక్కంతం వంశీ ఆర్డినరీ కథనే చెప్పాడని తెలుపుతున్నారు. ద్వితియార్థం నుంచి థియేటర్లో నవ్వులు తెప్పిస్తాయని తెలుపుతున్న నెటిజన్లు.. సినిమా మాత్రం ఎలాంటి డిస్పాయింట్మెంట్కు గురిచేయదని తెలుపుతన్నారు. Hit Kottesam Anna @actor_nithiin #ExtraOrdinaryMan 💓💥 pic.twitter.com/teygT9ygvx — N I T H I I N 🤍🕊 (@MNP_FOLLOWERS) December 8, 2023 One Night Away For #ExtraOrdinaryMan Outdated Music Director @Jharrisjayaraj Asal Edu Mottam Pata Instruments & Worst Production Values @sreshthmoviesoffl Whats Remaining Except Script & Screen Presence Of #ExtraordinaryManFromTomorrow pic.twitter.com/rpUrlet3ut — GK (@Adithya_7M) December 7, 2023 First Half Report: Comedy parledu.#Sreeleela tho unna scenes anni reality ga dooram ga unnai . Story kuda outdated anipinchindhi. But few comedy scenes first half ni save chesayane cheppukovali and same time konni comedy scenes over the top unnai #ExtraOrdinaryMan https://t.co/TwVPvZekiz pic.twitter.com/MEf80ys3SU — Filmy Lagoon (@filmylagoon_) December 8, 2023 #ExtraOrdinaryMan - A decent entertainer after quite a while from Tollywood. Nithin throughout the movie chaala energetic ga chesadu at the same time Ekkada overboard vellaledhu. Leela had a limited screen time and she’s okay. Last song aithey energy anantham Hit movie - 3/5 — Peter (@urstruelypeter) December 8, 2023 #ExtraOrdinaryMan - A decent entertainer after quite a while from Tollywood. Nithin throughout the movie chaala energetic ga chesadu at the same time Ekkada overboard vellaledhu. Leela had a limited screen time and she’s okay. Last song aithey energy anantham Hit movie - 3/5 — Peter (@urstruelypeter) December 8, 2023 just now done 1st half Hilarious Comedy with Good Interval let's see 2nd Half...sree #ExtraOrdinaryMan #ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/YDsqSxJWBS — AK Nellore (@AkNellore) December 8, 2023 -
కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు
‘‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో నేను ఎక్స్ట్రార్డినరీ మ్యాన్. కానీ రియల్ లైఫ్లో శ్రీ లీల ఎక్స్ట్రార్డినరీ ఉమెన్. ఎందుకంటే వ్యక్తిగతంగా తను డాక్టర్. అలాగే స్విమ్మింగ్, హాకీ, కూచిపూడి, భరతనాట్యం, వీణ.. ఇలా ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. ఇక సినిమాల్లో మంచి యాక్టర్, డ్యాన్సర్. నాకు, దర్శకుడు వంశీకి ఈ చిత్రం చాలా ముఖ్యం. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి.. నిర్మాతలకు లాభాలు రావాలి. సినిమా చూసిన నా అభిమానులు, ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని హీరో నితిన్ అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీ లీల జంటగా నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు నేను చేయని పాత్రని ఈ చిత్రంలో ఇచ్చిన వక్కంతం వంశీకి థ్యాంక్స్. రాజశేఖర్గారు హీరోగా చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్న (సుధాకర్ రెడ్డి) డిస్ట్రిబ్యూషన్ ఆరంభించారు. ఆ సినిమా హిట్ అవడం వల్లే నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు.. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను. రాజశేఖర్ గారు లేకపోతే ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ లేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం సూపర్ హిట్ కాబోతోంది. అందరం సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ– ‘‘ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్న నితిన్, సుధాకర్ రెడ్డిగార్లకు థ్యాంక్స్. రాజశేఖర్గారు లేకుంటే ఈ సినిమాని ఊహించుకునేవాణ్ని కాదు. ఈ మూవీతో రెండున్నర గంటల సేపు కుటుంబాన్ని కడుపుబ్బా నవ్విస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాది అతిథి పాత్ర. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు డా. రాజశేఖర్. ‘‘ఈ సినిమా అందర్నీ నవ్విస్తుంది.. థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు శ్రీలీల. -
రాసి పెట్టుకోండి.. అందర్నీ నవ్విస్తాం
‘‘నటుడిగా నా 21 ఏళ్ల కెరీర్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ నా 32వ సినిమా. నేను చేసిన మంచి పాత్రల్లో ఈ చిత్రం నంబర్ వన్ అవుతుంది. వక్కంతం వంశీగారు కథ అందించిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్’ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఉంటుంది. ప్రేక్షకులందర్నీ నాన్ స్టాప్గా నవ్విస్తాం’’ అని హీరో నితిన్ అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్ మెంట్స్పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. మంచి కథ, పాటలు, చక్కని డ్యాన్స్ కూడా ఉంటాయి. డిసెంబర్ 8న హిట్ సాధించబోతున్నాం.. ఇది కచ్చితం.. రాసి పెట్టుకోండి’’ అన్నారు. ‘‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు ఎన్. సుధాకర్ రెడ్డి. ‘‘అద్భుతమైన ఔట్పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. అందర్నీ ఎంటర్టైన్ చేయాలని రెండేళ్లు కష్టపడి చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం’’ అన్నారు వక్కంతం వంశీ. -
నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్
తెలుగులో యాంగ్రీ యంగ్మేన్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్" సినిమా ప్రమోషన్స్లో రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది. 'నాన్నగారికి చాలా రోజుల నుంచి విలన్గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్ స్టోరీ రాలేదు. నితిన్ సినిమాలోని రాజశేఖర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి?
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంకు చెందిన గద్దల బాలయ్య, దేవవ్వ దంపతుల కుమారుడు నితిన్ ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లాడు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్ తల్లిదండ్రులకు ఒక్కాగానొక్క కుమారుడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా.. -
‘మ్యాడ్’ మూవీ రివ్యూ
టైటిల్: మ్యాడ్ నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ సమర్పణ: ఎస్. నాగ వంశీ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ:మ్దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: అక్టోబర్ 06, 2023 కథేంటంటే.. ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. వివిధ ప్రాంతాలకు చెందిన మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు. ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కాలేజీ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఎంటర్టైనింగ్గానే ఉంటాయి. ప్రెండ్షిప్, ర్యాగింగ్, ప్రేమ.. ఈ మూడు అంశాల చుట్టే కథ తిరిగినప్పటీకి..వినోదంలో కొత్తదనం ఉంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మ్యాడ్ కూడా అదే కాన్సెప్ట్తో తెరకెక్కింది. లాజిక్స్ని పక్కకి పెట్టి.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వరుస పంచ్ డైలాగ్స్తో వినోదభరితంగా కథ ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ కథలో కొత్తదనం వెతికితే ఏమి కనిపించదు. కానీ సన్నివేశాలుగా విభజించి చూస్తే..ప్రతీదీ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. కాలేజీలో ర్యాగింగ్.. సీనియర్లతో గొడవలు.. ఓ విషయంలో అంతా ఏకమై పక్క కాలేజీ వాళ్లతో పోటీపడడం.. ఇవన్నీ హ్యాపీడేస్ నుంచి మొన్నటి హాస్టల్ డేస్ వరకు చూసినవే. కానీ మ్యాడ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే.. కామెడీ కొత్తగా ఉండడం. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా.. ఆడియన్స్ నవ్వులో అవి కొట్టుకుపోతాయి. ఇలాంటి కథలకు స్క్రీన్ప్లే రాయడం చాలా కష్టం. పైగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా వారి నుంచి దర్శకుడు తనకు కావాల్సినంత నటనను రాబట్టుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. లడ్డు అనే వ్యక్తి మ్యాడ్ గ్యాంగ్ గురించి ఓ స్టూడెంట్కు వివరిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వారంతా కాలేజీలో చేసిన రచ్చ, ప్రేమ స్టోరీలు.. ర్యాగింగ్.. ఇలా సరదాగా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ కూడా ఫస్ డోస్ మరింత పెరుగుతుంది. వెన్నెల కోసం డీడీ తన టీమ్తో కలిసి లేడీస్ హాస్టల్కి వెళ్లి చేసే రచ్చ.. థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. వెన్నెల ఎవరై ఉంటారనే క్యూరియాసిటీని చివరకు కొనసాగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే సినిమాలో కామెడీ వర్కౌట్ అయినంతగా ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. అలాగే నార్నే నితిన్ ని కోసం యాక్షన్ సీక్వెన్స్ కూడా కథకు అతికినట్లుగా అనిపించాయి. బూతు డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ నవ్వులు పంచడంలో మాత్రం ఈ ‘మ్యాడ్’ గ్యాంగ్ సక్సెస్ అయింది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించవారంతా కొత్తవాళ్లే. అయినా ఈ విషయం తెరపై ఎక్కడా కనిపించారు. డీడీ పాత్రలో నటించిన సంగీత్ శోభన్..తనదైన కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. అశోక్ గా నార్నే నితిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు కానీ.. ఆ సీన్స్ కథకి అతికించినట్లుగా అనిపిస్తాయి. ఇక లవర్బాయ్ మనోజ్గా రామ్ నితిన్ చక్కగా నటించాడు. హీరోయిన్స్ శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. లడ్డు పాత్రలో ‘టాక్సీవాలా’ విష్ణు జీవించేశాడు. అమాయకత్వంతో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అనుదీప్ ఒక సీన్లో కనిపించి వెళ్తాడు. కాలేజీ ప్రిన్సిపల్గా రఘుబాబు, అతని పీఏగా రచ్చ రవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. భీమ్స్ సిసిరోలియోసి పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. పాటలు కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజిశెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
అందరూ మహానటి అని అనుకుంటారు కానీ మహా నాటు
-
యూత్ఫుల్ మ్యాడ్ – నాగవంశీ
‘‘మ్యాడ్’ యూత్ఫుల్ సినిమా అయినప్పటికీ కుటుంబమంతా చూసేలా ఉంటుంది. లాజిక్లు, ట్విస్ట్లు ఉండవు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం’’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ–‘‘నా ‘జాతిరత్నాలు’ కంటే ‘మ్యాడ్’ బాగా నచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో వినోదం మాత్రమే ఉంటుంది’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
మ్యాడ్తో ఎంట్రీ!
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అనతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యన్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్పై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా నిర్మాతలు చినబాబు కుమార్తె, నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాతగా ఎంటర్ అవుతున్నారు. ఎస్. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: షామ్దత్ సైనుద్దీన్, దినేష్ కష్ణన్ బి. -
Social Halchal: చంద్రముఖిలా కంగనా.. భార్యతో నితిన్
► చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్తో కాజల్ అగర్వాల్ ఫోజులు ► స్టైలిష్ లుక్లో మీనాక్షీ చౌదరి ఫోటోలు వైరల్ ► భార్య షాలినీతో నితిన్ రొమాన్స్ ► చంద్రముఖి రూపంలో కంగనా రనౌత్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya🧿🦋 (@vaishnavii_chaitanya) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Shalini Kandukuri (@shalinikandukuri) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Sun Pictures (@sunpictures) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
నితిన్ కౌగిలిలో భార్య షాలిని.. క్యూట్ పెయిర్ ఫోటోలు
-
ఒక హిట్ మూడు ఫ్లాప్లతో దూసుకుపోతున్న హీరోలు
-
హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉంది. 'పుష్ప 2'తోపాటు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె.. నితిన్ సినిమా నుంచి తప్పుకుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే మరో కొత్త విషయం ఒకటి బయటకొచ్చింది. ఈమెపై ఓ వ్యక్తి కుట్ర చేస్తున్నాడని అంటున్నారు. కిరాక్ హిట్తో కన్నడ బ్యూటీ రష్మిక.. డిగ్రీ చదువుతున్న టైంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'కిరిక్ పార్టీ' అనే చిత్రంతో వచ్చీరావడంతో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకుంది. అలా 'ఛలో' మూవీతో తెలుగులోకి వచ్చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో రష్మిక దశ తిరిగిపోయింది. యంగ్ హీరోలతో వరసపెట్టి నటించింది. అల్లు అర్జున్తో చేసిన 'పుష్ప' అయితే ఈమెని పాన్ ఇండియా స్టార్ని చేసేసింది. (ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) నితిన్ ప్రాజెక్ట్ నుంచి ఔట్ ప్రస్తుతం 'పుష్ప 2'తో రష్మిక బిజీగా ఉంది. దీనితోపాటు హిందీలో 'యనిమల్', ద్విభాషా చిత్రం 'రెయిన్ బో' లోనూ నటిస్తూ బిజీగా ఉంది. నితిన్-వెంకీ కుడుముల మూవీలో ఈమెనే హీరోయిన్ గా చేస్తోంది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఈమె తప్పుకొందనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈమె బదులు శ్రీలీలని హీరోయిన్గా తీసుకున్నారని అన్నారు. ఇందులో క్లారిటీ రావాల్సి ఉంది. అతడు వల్ల అయితే కొన్నిరోజుల ముందు రష్మికని మేనేజర్ మోసం చేశాడని న్యూస్ వచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఫ్రొఫెషనల్గా వీళ్లిద్దరూ విడిపోయారు. అప్పుడు ఏం జరిగిందనేది పక్కనబెడితే.. ఇప్పుడు అతడే రష్మిక కెరీర్ ని దెబ్బ కొడుతున్నాడని అంటున్నారు. రష్మికకు తెలుగుపై పెద్దగా ఆసక్తి లేదని అందరీ దగ్గర చెబుతున్నాడట. ఈ కారణంగానే నితిన్ ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకొందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వయానా రష్మిక స్పందిస్తే గానీ అసలు విషయం బయటపడదు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా!) -
హీరో శర్వానంద్ రిసెప్షన్లో టాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి..(ఫొటోలు)
-
ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లి ఫిక్స్?
నితిన్ సరసన 'లై' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఇటీవలే మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఛల్ మోహన్ రంగ, పేట, రాజా రాజా చోర లాంటి తెలుగు సినిమాల్లో కనిపించినా అమ్మడికి మాత్రం భారీ విజయం తలుపుతట్టింది లేదు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం.. అయినా గాయాలతోనే సెట్కు: షాహిద్ కపూర్) తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్సయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతను మేఘా ఆకాష్ కుటుంబానికి స్నేహితుడని తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని.. తర్వలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినున్నారని తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క తన తల్లితో కలిసి నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. గతేడాది ఒక సినిమాను ఒకే చేసి.. తాజాగా సెట్స్ మీదకు తీసుకెళ్లింది. అయితే ఇప్పటివరకు పెళ్లి వార్తలపై మేఘా ఆకాష్ స్పందించలేదు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) -
డైలమాలో ఏజెంట్ డైరెక్టర్...సురేందర్ రెడ్డి
-
గ్రాండ్గా ప్రారంభమైన నితిన్-రష్మిక సినిమా
హీరో నితిన్, రష్మికా మందన్నాలు మరోసారి జంటగా నటించనున్నారు. వెంకీ కుడుమల డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా గ్రాండ్గా ప్రారంభమైంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తం షాట్ను క్లాప్ కొట్టి ఆరంభించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు #VNRTrio అనే హ్యష్ ట్యాగ్తో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో నితిన్-రష్మికలు జోడీగా భీష్మలో నటించి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మరోసారి నితిన్కి జోడీగా రష్మిక మందన్నా.. క్రేజీ అనౌన్స్మెంట్
హీరో నితిన్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి జోడీగా నటించనున్నారు. గతంలో భీష్మ చిత్రంలో వీరు తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై బజ్ను క్రియేట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ను అనౌన్స్ చేయనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్కు ఈ సినిమా అయినా సక్సెస్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. The trio so rare even we are aware!#VNRTrio is back with something more entertaining and more adventurous 💥💥 Watch now! - https://t.co/UxHVoTh7KZ More details soon!@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/IPZWsdJwct — Mythri Movie Makers (@MythriOfficial) March 22, 2023
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
ఏపీలో అల్లర్లు చేసింది వీరే..
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
కర్నూల్ లో వజ్రాల వేట
యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్..
హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
తప్పక చదవండి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
- అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
Advertisement