Nithin
-
రాబిన్హుడ్కి అతిథి
‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘రాబిన్హుడ్’(Robinhood). శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్ డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. ఆయన ఫస్ట్ లుక్ని శనివారం రిలీజ్ చేశారు. షార్ట్ హెయిర్ కట్, ట్రెండీ దుస్తులు, చిరునవ్వు, కూల్ ఎక్స్ప్రెషన్తో ఉన్న వార్నర్ లుక్ అదుర్స్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.‘‘రాబిన్హుడ్’లో డేవిడ్ వార్నర్ది అతిథి పాత్ర అయినప్పటికీ ఆయనకు ఉన్న ప్రపంచ ప్రజాదరణ, మ్యాసీవ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ సినిమాపై స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: చెర్రీ, కెమేరా: సాయి శ్రీరామ్, సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: హరి తుమ్మల, లైన్ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి. -
హీరోల చేతిలో ముచ్చటగా మూడు
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు ఫుల్ జోష్లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, నాని, నితిన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్ వంటి హీరోల చేతిలో ముచ్చటగా మూడు ప్రాజెక్టులున్నాయి. మరికొందరు నాలుగు సినిమాలు చేస్తున్నారు... ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.. చిరంజీవి... భలే జోరు తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి భలే జోరుమీదున్నారు. ఈ సీనియర్ హీరో వరుసగా ప్రతిభావంతులైన యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి వంటి స్టార్తో అందివచ్చిన అవకాశాన్ని నిరూపించుకుని, ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో దర్శకులు సైతం ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’తో బ్లాక్బస్టర్ అందుకున్న వశిష్ఠ మల్లిడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధం అవుతోంది.చిరంజీవి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత ‘విశ్వంభర’తో రిపీట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ‘విశ్వంభర’ తర్వాత కూడా చిరంజీవి యంగ్ డైరెక్టర్స్తో పని చేయనున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నట్లు చిరంజీవి ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తొలి చిత్రం ‘దసరా’తో (నాని హీరో) సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి పచ్చజెండా ఊపారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ మూవీ రూపొందిస్తున్నారు. మరి చిరంజీవి ముందుగా అనిల్ మూవీని సెట్స్కి తీసుకెళతారా? శ్రీకాంత్ ఓదెల మూవీ చేస్తారా? అనేది వేచి చూడాలి. ఇక ‘వాల్తేరు వీరయ్య’ మూవీ దర్శకుడు బాబీ కూడా చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. పవన్ కల్యాణ్... తీన్మార్‘బ్రో’ (2023) సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరపై కనిపించలేదు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారాయన. ప్రస్తుతం ఆయన చేతిలో కూడా మూడు చిత్రాలున్నాయి. వాటిలో ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రోడక్షన్స్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడనుందని టాక్. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ అనే ఓ మూవీ చేస్తున్నారు పవన్. అలాగే ‘గబ్బర్ సింగ్’ తర్వాత హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్... ఫుల్ స్వింగ్‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు హీరో ప్రభాస్. ఆ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్లో దూసుకెళుతున్నారాయన. గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో (‘కన్నప్ప’ చిత్రంలో అతిథి పాత్ర) బిజీ బిజీగా ఉన్నారు.మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీని ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే విధంగా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. అలాగే మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా అతిథి పాత్ర చేశారు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’కి కొనసాగింపుగా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే.హోంబలే ఫిల్మ్స్పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ 2026లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’తో పాటు మరో రెండు సినిమాలు ప్రభాస్ తమ బ్యానర్లో చేయనున్నట్లు హోంబలే ఫిల్మస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027, 2028లో వరుసగా ఈ సినిమాలు విడుదలవుతాయి. నితిన్... జోరుగా‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ’ మూవీతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ 2024ని మిస్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో జోరుగా ఉన్నారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘రాబిన్హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.అదే విధంగా ‘వకీల్ సాబ్’ మూవీ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నారు నితిన్. ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో నితిన్కి అక్కగా లయ నటిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా మే 9న విడుదల కానుందని ఫిల్మ్నగర్ టాక్. అలానే తొలి మూవీ ‘బలగం’తో బంపర్ హిట్ సాధించిన వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయనున్నారు నితిన్. ఏప్రిల్ లేదా మేలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుందట. ఎన్టీఆర్... యమా స్పీడు ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్ యమా స్పీడుమీదున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్లో ఎన్టీఆర్ని ప్రెజంట్ చేయనున్నారు ప్రశాంత్ నీల్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. కాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘దేవర 2’ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు కొరటాల శివ. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్పైకి వెళుతుందని ఫిల్మ్నగర్ టాక్. నాని... ఫుల్ జోష్హీరో నాని ఫుల్ జోష్లో ఉన్నారు. ఓ వైపు హీరోగా రెండు మూడు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారాయన. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ప్రోడక్షన్స్ తో కలిసి నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్గా పవర్ఫుల్ పోలీస్గా కనిపించనున్నారు నాని.‘హిట్’ సిరీస్లో మూడవ భాగంగా ఈ చిత్రం రానుంది. ఇదిలా ఉంటే... ‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఫుల్ రా రస్టిక్ పాత్ర చేస్తున్నారు నాని.తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు నాని. భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య ఈ మూవీ నిర్మించనున్నారు. శర్వానంద్... బిజీ బిజీహీరో శర్వానంద్ బిజీ బిజీగా ఉన్నారు. ‘మనమే’ (2024) చిత్రంతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన ప్రస్తుతం మూడుప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్న్స్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్గా కనిపించనున్నారు. అదే విధంగా శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య, సంయుక్త కథానాయికలు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ మూవీలో 60ల నాటి పాత్రను పోషించడానికి మేకోవర్ అవుతున్నారు శర్వానంద్. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సిద్ధు జొన్నలగడ్డ... హుషారుగా...‘డీజే టిల్లు’ (2022), ‘టిల్లు స్క్వేర్’(2024) వంటి వరుస హిట్స్తో జోరుగా హుషారుగా దూసుకెళుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘తెలుసు కదా’.ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు ‘టిల్లు క్యూబ్’ కూడా చేయనున్నారు సిద్ధు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే ప్రకటించారు ఆ చిత్రనిర్మాత నాగవంశీ.పైన పేర్కొన్న కథానాయకులే కాదు... మరికొందరు కూడా మూడుప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇంకొందరు హీరోల చేతిలో రెండు సినిమాలు ఉండగా మూడో సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – డేరంగుల జగన్ మోహన్ -
సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న కేతిక శర్మ స్టెప్స్..
-
లవ్ అప్డేట్స్ గురూ
ప్రేమికుల రోజు(Valentine Day) సందర్భంగా ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల నుంచి ‘లవ్ అప్డేట్స్ గురూ’ అంటూ శుక్రవారం కొందరు తమ సినిమాల నుంచి పాటలు, లుక్స్ రిలీజ్ చేయగా, మరికొందరు సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళదాం...⇒ నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వేర్ఎవర్ యు గో’.. అంటూ సాగే రెండో పాటని హీరో మహేశ్బాబు లాంచ్ చేశారు. ఈ పాటని కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ పాడారు. ⇒ సిద్ధు జొన్నలగడ్డ రోగా నీరజా కోన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ⇒ కిరణ్ అబ్బవరం హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సింది. అయితే తాజాగా మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, కిరణ్ అబ్బవరం పోస్టర్ని రిలీజ్ చేశారు. ⇒ సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి సుహాస్, మాళవికా మనోజ్ల సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు.⇒ హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ప్రేమలో..’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు. ⇒ మోహిత్ పెద్దాడ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకత్వంలో దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ని దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ యునిక్గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’’ అన్నారు. -
సరైన డైరెక్టర్ కోసం వెతుకుతున్న నాగార్జున & నితిన్..
-
భార్య, కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ (ఫోటోలు)
-
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన నితిన్ భార్య (ఫోటోలు)
-
డబ్బు కోసం ఏమైనా చేసే 'రాబిన్ హుడ్' టీజర్ విడుదల
'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. -
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
-
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అమరన్. వీరసైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆరు రోజుల్లో రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో బుధవారం నాడు హైదరాబాద్లో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో నితిన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.మా నాన్న కూడా..శివకార్తికేయన్ మాట్లాడుతూ.. అమరన్ సినిమాలో ముకుంద్ క్యారెక్టర్ చేయడానికి కారణం మా నాన్న. ఆయన పోలీసాఫీసర్. డ్యూటీలోనే మరణించారు. సినిమా రిలీజైనప్పటినుంచి నితిన్ ప్రతిరోజు కాల్ చేసి అప్డేట్స్ చెప్తూనే ఉన్నారు అని పేర్కొన్నాడు. అభిమానుల కోసం ఓ పాట కూడా పాడాడు. ఓ ప్రియా ప్రియా.. తెలుసా నీకైనా.. అంటూ నితిన్ ఇష్క్ సినిమాలోని పాటను రెండు లైన్లు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సినిమాఅమరన్ సినిమా విషయానికి వస్తే ఇందులో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ లుక్ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
సత్య టాలెంట్ను మొదట గుర్తించిన హీరో ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారా? అంటే అందులో సత్య ముందు వరుసలో ఉంటాడు. 'మత్తు వదలరా' సీక్వెల్తో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్గా మారాడు. ఎక్కడ చూసినా సత్య కామెడీ క్లిప్పులే కనిపిస్తున్నాయి. ఇంత మంచి నటుడిని టాలీవుడ్కు పరిచయం చేసింది.. తనలో కమెడియన్ను గుర్తించి ఎవరో తెలుసా? హీరో నితిన్.తెలిసేది కాదుఈ విషయాన్ని సత్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరో నితిన్, రచయిత హర్షవర్ధన్, నిర్మాత డీఎస్ రావు.. వీళ్లే నాలో నటుడున్నాడని గ్రహించారు. మొదట్లోనేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. అప్పుడు నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. అందరితోనూ ఒకేలా మాట్లాడేవాడిని. సర్, షార్ట్ రెడీ.. అని పిలిచేవాడిని కాదు.. ఇదిగో మిమ్మల్ని రమ్మంటున్నారు.. వెళ్లండి.. ఇలా అమలాపురం యాసలోనే చెప్పేవాడిని. ఆ హీరో సలహా ఇవ్వడమేగాకనా మాటలు విన్నాక నితిన్ గారు నువ్వు యాక్టర్ అవ్వు, బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా నాతో యాక్టింగ్ చేయించారు. అలా నెమ్మదిగా నటుడిగా మారాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన సత్య అభిమానులు.. ఇంత మంచి నటుడిని అందించిన నితిన్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. కాగా నితిన్ ద్రోణ (2009) సినిమాకు సత్య అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు.కమెడియన్గా, హీరోగాఇతడు జబర్దస్త్ షోలోనూ పాల్గొన్నాడు. పిల్ల జమీందార్ చిత్రంతో గుర్తింపు అందుకున్నాడు. స్వామిరారా మూవీతో కమెడియన్గా పాపులర్గా అయ్యాడు. చలో సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. గతంలో మత్తు వదలరా చిత్రంతో, ఇప్పుడు దాని సీక్వెల్తో ఆడియన్స్కు నవ్వుల విందు వడ్డించాడు. Thanks @actor_nithiin anna oka manchi actor ni maku ichav #MathuVadalara2 #Satya #Devara pic.twitter.com/hYPSWUG5kP— surya k (@naistam2k) September 15, 2024 చదవండి: జాన్వీ కపూర్ టాలెంట్ చూసి షాకయ్యా..: జూనియర్ ఎన్టీఆర్ -
బన్నీ, నాని స్టోరీస్ తో నితిన్ సినిమా..
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ దంపతులు
టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి షాలిని కొద్దిసేపటి క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సోషల్మీడియా ద్వారా నితిన్ ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా నితిన్ పంచుకున్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.2020లో నితిన్, షాలిని కందుకూరిల వివాహం జరిగింది. తన చిరకాల స్నేహితురాలు అయిన షాలినితో ప్రేమలో పడిన నితిన్ ఏడడుగుల బంధంతో కలిసి నడిచారు. వీరిద్దరి పెళ్లి అయి సుమారు నాలుగేళ్లు అవుతుంది. అయితే, ఇప్పుడు నితిన్ ఇంటికి వారసుడు రావడంతో అయన అభిమానులు సందడిగా కామెంట్లు పెడుతున్నారు.గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఎక్స్ట్రా.. ఆర్డినరీ మ్యాన్' అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నితిన్ బలమైన కథతో ఈసారి ముందుకు రానున్నాడు. సరికొత్త కథతో ‘తమ్ముడు’గా అలరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్హుడ్' కూడా లైన్లో ఉంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రాబిన్హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. -
హ్యాట్రిక్పై కన్నేసిన ఎన్టీఆర్ బామ్మర్ది.. ఆ హిట్ మూవీ డైరెక్టర్తో !
మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాలతో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో మరో చిత్రానికి రెడీ అయ్యారు. తాజాగా "శతమానం భవతి" డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంపద హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది.ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ... 'హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా ఉంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్లో దర్శకుడు సతీష్ వేగేశ్నతెరకెక్కించారు .ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి కీలక పాత్రల్లో నటించారు. -
మా అక్క ఎక్కువగా కలవదు మాట్లాడదు
-
ఫుల్ ఫన్ బాత్... ఆయ్: నార్నే నితిన్
‘‘కులం, మతం కంటే స్నేహం చాలా గొప్పది అనే సందేశాన్ని ‘ఆయ్’ సినిమాలో వినోదాత్మకంగా చూపించాం. ఈ నెల 15న చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే మా ‘ఆయ్’ కి ఉండాల్సిన ఆడియన్స్ మాకున్నారని అనుకుంటున్నాం. మంచి వినోదంతో కూడిన గోదావరి నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులైంది. ‘ఆయ్’ని కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం’’ అని నార్నే నితిన్ అన్నారు. హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఆయ్’. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నార్నే నితిన్ మాట్లాడుతూ–‘‘ అంజి కె.మణిపుత్రది అమలాపురం. ఆయన లైఫ్లో చూసినవన్నీ కలిపి చేసిన సినిమానే ‘ఆయ్’. ఈ చిత్రంలో ఫుల్ ఫన్ ఉంటుంది కాబట్టి పోస్టర్స్లో అంతా ఫన్ బాత్ అని పెట్టాం.. ఇది డైరెక్టర్గారి ఆలోచనే. గోదావరి యాసలో ఆయ్ అనే పదాన్ని సాధారణంగా వాడుతుంటాం. ఆ నేపథ్యంలో సాగే ఈ మూవీకి ‘ఆయ్’ కరెక్ట్ టైటిల్ అని అల్లు అరవింద్గారు చెప్పడంతో ఫిక్స్ చేశారు. ‘మ్యాడ్’ చిత్రంలో కథకు తగ్గట్టు బిహేవ్ చేశాను. ‘ఆయ్’లో కథకు తగ్గట్టు నటించాను. గీతా ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థలో సినిమా చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నయన్ సారిక మరాఠీ అమ్మాయి అయినా అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది. తన పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. రామ్ మిర్యాలగారు మూడు పాటలకు సంగీతం అందించారు.అలాగే అజయ్ అరసాడగారు రెండు పాటలకు మ్యూజిక్ ఇవ్వడంతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చారు. ఎన్టీఆర్గారు ‘ఆయ్’ ట్రైలర్ చూశారు. అందులోని కామెడీని ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి అలాంటి స్పందన వస్తే బావుంటుందనిపిస్తోంది. ప్రస్తుతం ‘మ్యాడ్ 2’ మూవీలో నటిస్తున్నా’’ అన్నారు. -
ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?
జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్.. 'మ్యాడ్' సినిమాతో నటుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఓ మాదిరి యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఇతడి రెండో సినిమా 'ఆయ్'. గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్తో తీశారు. ఆగస్టు 15న భారీ చిత్రాలతో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)'ఆయ్' ట్రైలర్ చూస్తే.. విలేజీలో ముగ్గురు కుర్రాళ్లు. అందులో హీరో ఒకడు. ఒకమ్మాయితో ప్రేమ, తర్వాత జరిగిన పర్యవసనాలేంటి? అనేది స్టోరీ లైన్ అనిపిస్తోంది. అయితే ఫుల్ ఆన్ కామెడీగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ట్రైలర్లోనూ డబుల్ మీనింగ్ లాంటి డైలాగ్స్ ఉన్నాయి. అంటే సినిమాలోనూ ఇలాంటివి ఉండొచ్చు. ట్రైలర్ అయితే ఫన్నీగా బాగానే ఉంది. కాకపోతే 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్' సినిమాలతో పోటీని తట్టుకుని ఎంత మేరకు థియేటర్లలో నిలబడుతుందనేద పెద్ద టాస్క్. నిర్మించింది గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్ల పరంగా ఢోకా ఉండకపోవచ్చు. కానీ 'ఆయ్'కి హిట్ టాక్ కూడా ముఖ్యమే. ఒకవేళ మిగతా సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం 'ఆయ్' పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్న. తొలి సినిమా 'మ్యాడ్'తో హిట్ కొట్టిన తారక్ బావమరిది.. రెండో సినిమాతో ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్లు రిలీజ్) -
టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్హుడ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి నితిన్కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో నితిన్ వృద్ధుడి గెటప్లో కనిపించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. వాస్తవంగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆయన గెటప్ ఉంది. ఫేస్ యాప్, ఏఐ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగించి అలా వీడియోను క్రియేట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. రాబిన్హుడ్ సినిమాలో నితిన్ ఇలాగే కనిపించనున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబిన్హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.Pulling each other's legs is our daily routine on #Robinhood sets..@actor_nithiin anna & @sreeleela14 😂🙈 pic.twitter.com/pTp4yiO32o— Venky Kudumula (@VenkyKudumula) July 11, 2024 -
ఏషియన్ గ్రూప్స్తో మరో స్టార్ హీరో మల్టీఫ్లెక్స్ ప్లాన్
టాలీవుడ్ హీరో నితిన్ వరుస సినిమాలతో కొద్దిరోజుల్లో సందడి చేయనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే ఆయన పెరిగారు. అందుకే తన సోదరి నిఖితతో కలిసి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ను స్థాపించి పలు సినిమాలను కూడా నిర్మించారు. తాజాగా నితిన్ మరో అడుగు ముందుకు వేశారు. హైదరాబాద్లో మల్టీఫ్లెక్స్ థియేటర్ను స్థాపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్ పేజీ నుంచి ఒక ఫోటో విడుదలైంది.మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి స్టార్స్ ఇప్పటికే ఏషియన్ సినిమాస్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని మల్టీఫ్లెక్స్లు నిర్మించారు. త్వరలో బెంగళూరులో AMB ప్రారంభం కానుంది. దిల్సుఖ్నగర్లో రవితేజ ART కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే, హీరో నితిన్ కూడా సంగారెడ్డి ప్రాంతంలో ఏషియన్ నితిన్ సితార పేరుతో ఒక మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనకు సంబంధించిన ఫ్యాన్ పేజీలలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే థియేటర్ పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఓపెనింగ్ కానున్నట్లు సమాచారం.నితిన్ సినిమాల విషయానికి వస్తే.. తమ్ముడు త్వరలో విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కాంతార ఫేం సప్తమి గౌడ నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ లయ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్హుడ్' చిత్రంలో కూడా నితిన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by N I T H I I N ✨⚡ (@teamnithiin_) -
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
-
సెంటిమెంట్... అడ్వెంచర్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తమ్ముడు’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శనివారం (మార్చి 30) నితిన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘భీష్మ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
హీరో నితిన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు..
-
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో నితిన్ నేడు (మార్చి 30) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో నితిన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'తమ్ముడు' అనే టైటిల్ను ఫిక్స్ చేసిన మేకర్స్.. నేడు నితిన్ పుట్టినరోజు కావడంతో ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాని దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న 56వ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లో నితిన్ కాస్త డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్కు సంబంధించిన సీన్ నుంచి ఈ పోస్టర్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నితిన్- దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో మరో సినిమాను రానుంది. వీరిద్దరి కాంబోలో ఇష్క్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నితిన్ భారీ హిట్ అందుకున్నాడు. A story of ambition, courage, and determination🎯 Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥 Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ — Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024 -
రాబిన్హుడ్ టైటిల్ గ్లింప్స్
-
షూటింగ్లో గాయపడ్డ హీరో నితిన్?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్కు గాయాలు అయినట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'తమ్ముడు' అనే సినిమా షూటింగ్లో పాల్గొన్న నితిన్కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్లో పాల్గొన్న నితిన్కు ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్ను క్యాన్సిల్ చేశారట. నితిన్కు సుమారు మూడు వారాలపాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారట. గతేడాదిలో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం 'ఎక్స్ట్రా - ఆర్డినరి మ్యాన్'తో ఆయన అంతగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. దీంతో దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ చిత్రంతో హిట్ కొట్టాలని నితిన్ ఉన్నాడు. గతంలో ఇదే బ్యానర్లో 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంలో ఆయన నటించిన విషయం తెలిసిందే. అక్కా, తమ్ముడు అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే ఈ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. చాలారోజుల నుంచి ఒక సూపర్ హిట్ సినిమా తీసి తన ఫ్యాన్స్కు ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో తమ్ముడు చిత్రం కోసం ఆయన ఎక్కువగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో షూటింగ్ స్పాట్లో ఆయనకు ప్రమాదం జరిగింది అనే వార్త బయటకు రావడంతో నితిన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ప్రమాదం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. -
Extra Ordinary Man OTT: సంక్రాంతికి ఓటీటీలో రానున్న నితిన్ సినిమా
నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం 'ఎక్స్ట్రా - ఆర్డినరి మ్యాన్'. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. మంచి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా డిసెంబర్ 8న విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమాలో ఎక్కవగా కామెడీ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. రైటర్గా మెప్పించిన వక్కంతం వంశీ.. డైరెక్టర్గా మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు కొంత నెగటివ్ టాక్ వచ్చింది. ఇదే సమయంలో నాని నటించిన హాయ్ నాన్న చిత్రం కూడా విడుదలై మంచి టాక్ రావడంతో నితిన్ సినిమా కలెక్షన్స్పై కూడా ప్రభావం చూపింది. ఈ చిత్రంలో నితిన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్గా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన విభిన్నమైన పాత్రలో నటించడం విశేషం. ఈ సంక్రాంతికి ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుందని భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫిషీయల్ ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రాజశేఖర్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, పవిత్రా నరేష్, హైపర్ ఆది తదితరులు నటించారు. -
నితిన్ 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' టాక్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ హీరో నితిన్ 32వ సినిమా 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' నేడు (డిసెంబర్ 8) విడుదలైంది. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించగా.. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్ అని సినిమా విడుదలకు ముందు నితిన్ చెప్పడం విశేషం. ప్రేక్షకుల్ని నవ్వించాలన్న ఒకే లక్ష్యంతో ఈ చిత్రాన్ని చేశామని ఆయన చెప్పాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని చెప్పుకొచ్చాడు నితిన్. తాజాగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఫుల్ కామెడీ ఉందని ఎంజాయ్ చేస్తున్నారు. భీష్మ తర్వాత నితిన్కు సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైన ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఎక్స్ట్రా ఆర్డనరీ మ్యాన్ ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్గా నటించడం విశేషం. ఈ క్యారెక్టర్లో ఆయన ఫర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని, అతడి కామెడీ టైమింగ్ కూడా బాగుందని నెటిజన్లు చెబుతోన్నారు. 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' ఫుల్ ఫన్తో కూడిన చిత్రమని చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా నితిన్ సరికొత్త రోల్లో కనిపించి అదరగొట్టాడని నెటిజన్లు తెలుపుతున్నారు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. ఈ సినిమాకు రావు రమేష్ పాత్ర ప్రధాన బలం అని ఒకరు చెబుతుంటే.. ప్రత్యేక పాత్రలో కనిపించిన రాజశేఖర్ కూడా భారీగానే వినోదాన్ని పంచాడని తెలుపుతున్నారు. ద్వితీయార్దంలో అయితే ఫుల్ ఫన్గా కొనసాగుతుందని కామెంట్లు చేస్తున్నారు. రాజశేఖర్ రోల్ తక్కువే అయినా ఆయన కనిపించిన సీన్స్ మొత్తం ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం కథలో ఎలాంటి కొత్తదనం లేదని తెలుపుతున్నారు. అవుట్ డేటెడ్, డిజాస్టర్ అని కామెంట్లు పెడుతున్నారు. వక్కంతం వంశీ ఆర్డినరీ కథనే చెప్పాడని తెలుపుతున్నారు. ద్వితియార్థం నుంచి థియేటర్లో నవ్వులు తెప్పిస్తాయని తెలుపుతున్న నెటిజన్లు.. సినిమా మాత్రం ఎలాంటి డిస్పాయింట్మెంట్కు గురిచేయదని తెలుపుతన్నారు. Hit Kottesam Anna @actor_nithiin #ExtraOrdinaryMan 💓💥 pic.twitter.com/teygT9ygvx — N I T H I I N 🤍🕊 (@MNP_FOLLOWERS) December 8, 2023 One Night Away For #ExtraOrdinaryMan Outdated Music Director @Jharrisjayaraj Asal Edu Mottam Pata Instruments & Worst Production Values @sreshthmoviesoffl Whats Remaining Except Script & Screen Presence Of #ExtraordinaryManFromTomorrow pic.twitter.com/rpUrlet3ut — GK (@Adithya_7M) December 7, 2023 First Half Report: Comedy parledu.#Sreeleela tho unna scenes anni reality ga dooram ga unnai . Story kuda outdated anipinchindhi. But few comedy scenes first half ni save chesayane cheppukovali and same time konni comedy scenes over the top unnai #ExtraOrdinaryMan https://t.co/TwVPvZekiz pic.twitter.com/MEf80ys3SU — Filmy Lagoon (@filmylagoon_) December 8, 2023 #ExtraOrdinaryMan - A decent entertainer after quite a while from Tollywood. Nithin throughout the movie chaala energetic ga chesadu at the same time Ekkada overboard vellaledhu. Leela had a limited screen time and she’s okay. Last song aithey energy anantham Hit movie - 3/5 — Peter (@urstruelypeter) December 8, 2023 #ExtraOrdinaryMan - A decent entertainer after quite a while from Tollywood. Nithin throughout the movie chaala energetic ga chesadu at the same time Ekkada overboard vellaledhu. Leela had a limited screen time and she’s okay. Last song aithey energy anantham Hit movie - 3/5 — Peter (@urstruelypeter) December 8, 2023 just now done 1st half Hilarious Comedy with Good Interval let's see 2nd Half...sree #ExtraOrdinaryMan #ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/YDsqSxJWBS — AK Nellore (@AkNellore) December 8, 2023 -
కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు
‘‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో నేను ఎక్స్ట్రార్డినరీ మ్యాన్. కానీ రియల్ లైఫ్లో శ్రీ లీల ఎక్స్ట్రార్డినరీ ఉమెన్. ఎందుకంటే వ్యక్తిగతంగా తను డాక్టర్. అలాగే స్విమ్మింగ్, హాకీ, కూచిపూడి, భరతనాట్యం, వీణ.. ఇలా ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. ఇక సినిమాల్లో మంచి యాక్టర్, డ్యాన్సర్. నాకు, దర్శకుడు వంశీకి ఈ చిత్రం చాలా ముఖ్యం. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి.. నిర్మాతలకు లాభాలు రావాలి. సినిమా చూసిన నా అభిమానులు, ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని హీరో నితిన్ అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీ లీల జంటగా నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు నేను చేయని పాత్రని ఈ చిత్రంలో ఇచ్చిన వక్కంతం వంశీకి థ్యాంక్స్. రాజశేఖర్గారు హీరోగా చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్న (సుధాకర్ రెడ్డి) డిస్ట్రిబ్యూషన్ ఆరంభించారు. ఆ సినిమా హిట్ అవడం వల్లే నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు.. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను. రాజశేఖర్ గారు లేకపోతే ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ లేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం సూపర్ హిట్ కాబోతోంది. అందరం సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ– ‘‘ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్న నితిన్, సుధాకర్ రెడ్డిగార్లకు థ్యాంక్స్. రాజశేఖర్గారు లేకుంటే ఈ సినిమాని ఊహించుకునేవాణ్ని కాదు. ఈ మూవీతో రెండున్నర గంటల సేపు కుటుంబాన్ని కడుపుబ్బా నవ్విస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాది అతిథి పాత్ర. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు డా. రాజశేఖర్. ‘‘ఈ సినిమా అందర్నీ నవ్విస్తుంది.. థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు శ్రీలీల. -
రాసి పెట్టుకోండి.. అందర్నీ నవ్విస్తాం
‘‘నటుడిగా నా 21 ఏళ్ల కెరీర్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ నా 32వ సినిమా. నేను చేసిన మంచి పాత్రల్లో ఈ చిత్రం నంబర్ వన్ అవుతుంది. వక్కంతం వంశీగారు కథ అందించిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్’ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఉంటుంది. ప్రేక్షకులందర్నీ నాన్ స్టాప్గా నవ్విస్తాం’’ అని హీరో నితిన్ అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్ మెంట్స్పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. మంచి కథ, పాటలు, చక్కని డ్యాన్స్ కూడా ఉంటాయి. డిసెంబర్ 8న హిట్ సాధించబోతున్నాం.. ఇది కచ్చితం.. రాసి పెట్టుకోండి’’ అన్నారు. ‘‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు ఎన్. సుధాకర్ రెడ్డి. ‘‘అద్భుతమైన ఔట్పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. అందర్నీ ఎంటర్టైన్ చేయాలని రెండేళ్లు కష్టపడి చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం’’ అన్నారు వక్కంతం వంశీ. -
నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్
తెలుగులో యాంగ్రీ యంగ్మేన్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్" సినిమా ప్రమోషన్స్లో రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది. 'నాన్నగారికి చాలా రోజుల నుంచి విలన్గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్ స్టోరీ రాలేదు. నితిన్ సినిమాలోని రాజశేఖర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి?
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంకు చెందిన గద్దల బాలయ్య, దేవవ్వ దంపతుల కుమారుడు నితిన్ ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లాడు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్ తల్లిదండ్రులకు ఒక్కాగానొక్క కుమారుడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా.. -
‘మ్యాడ్’ మూవీ రివ్యూ
టైటిల్: మ్యాడ్ నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ సమర్పణ: ఎస్. నాగ వంశీ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ:మ్దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: అక్టోబర్ 06, 2023 కథేంటంటే.. ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. వివిధ ప్రాంతాలకు చెందిన మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు. ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కాలేజీ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఎంటర్టైనింగ్గానే ఉంటాయి. ప్రెండ్షిప్, ర్యాగింగ్, ప్రేమ.. ఈ మూడు అంశాల చుట్టే కథ తిరిగినప్పటీకి..వినోదంలో కొత్తదనం ఉంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మ్యాడ్ కూడా అదే కాన్సెప్ట్తో తెరకెక్కింది. లాజిక్స్ని పక్కకి పెట్టి.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వరుస పంచ్ డైలాగ్స్తో వినోదభరితంగా కథ ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ కథలో కొత్తదనం వెతికితే ఏమి కనిపించదు. కానీ సన్నివేశాలుగా విభజించి చూస్తే..ప్రతీదీ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. కాలేజీలో ర్యాగింగ్.. సీనియర్లతో గొడవలు.. ఓ విషయంలో అంతా ఏకమై పక్క కాలేజీ వాళ్లతో పోటీపడడం.. ఇవన్నీ హ్యాపీడేస్ నుంచి మొన్నటి హాస్టల్ డేస్ వరకు చూసినవే. కానీ మ్యాడ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే.. కామెడీ కొత్తగా ఉండడం. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా.. ఆడియన్స్ నవ్వులో అవి కొట్టుకుపోతాయి. ఇలాంటి కథలకు స్క్రీన్ప్లే రాయడం చాలా కష్టం. పైగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా వారి నుంచి దర్శకుడు తనకు కావాల్సినంత నటనను రాబట్టుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. లడ్డు అనే వ్యక్తి మ్యాడ్ గ్యాంగ్ గురించి ఓ స్టూడెంట్కు వివరిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వారంతా కాలేజీలో చేసిన రచ్చ, ప్రేమ స్టోరీలు.. ర్యాగింగ్.. ఇలా సరదాగా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ కూడా ఫస్ డోస్ మరింత పెరుగుతుంది. వెన్నెల కోసం డీడీ తన టీమ్తో కలిసి లేడీస్ హాస్టల్కి వెళ్లి చేసే రచ్చ.. థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. వెన్నెల ఎవరై ఉంటారనే క్యూరియాసిటీని చివరకు కొనసాగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే సినిమాలో కామెడీ వర్కౌట్ అయినంతగా ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. అలాగే నార్నే నితిన్ ని కోసం యాక్షన్ సీక్వెన్స్ కూడా కథకు అతికినట్లుగా అనిపించాయి. బూతు డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ నవ్వులు పంచడంలో మాత్రం ఈ ‘మ్యాడ్’ గ్యాంగ్ సక్సెస్ అయింది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించవారంతా కొత్తవాళ్లే. అయినా ఈ విషయం తెరపై ఎక్కడా కనిపించారు. డీడీ పాత్రలో నటించిన సంగీత్ శోభన్..తనదైన కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. అశోక్ గా నార్నే నితిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు కానీ.. ఆ సీన్స్ కథకి అతికించినట్లుగా అనిపిస్తాయి. ఇక లవర్బాయ్ మనోజ్గా రామ్ నితిన్ చక్కగా నటించాడు. హీరోయిన్స్ శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. లడ్డు పాత్రలో ‘టాక్సీవాలా’ విష్ణు జీవించేశాడు. అమాయకత్వంతో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అనుదీప్ ఒక సీన్లో కనిపించి వెళ్తాడు. కాలేజీ ప్రిన్సిపల్గా రఘుబాబు, అతని పీఏగా రచ్చ రవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. భీమ్స్ సిసిరోలియోసి పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. పాటలు కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజిశెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
అందరూ మహానటి అని అనుకుంటారు కానీ మహా నాటు
-
యూత్ఫుల్ మ్యాడ్ – నాగవంశీ
‘‘మ్యాడ్’ యూత్ఫుల్ సినిమా అయినప్పటికీ కుటుంబమంతా చూసేలా ఉంటుంది. లాజిక్లు, ట్విస్ట్లు ఉండవు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం’’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ–‘‘నా ‘జాతిరత్నాలు’ కంటే ‘మ్యాడ్’ బాగా నచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో వినోదం మాత్రమే ఉంటుంది’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
మ్యాడ్తో ఎంట్రీ!
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అనతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యన్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్పై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా నిర్మాతలు చినబాబు కుమార్తె, నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాతగా ఎంటర్ అవుతున్నారు. ఎస్. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: షామ్దత్ సైనుద్దీన్, దినేష్ కష్ణన్ బి. -
Social Halchal: చంద్రముఖిలా కంగనా.. భార్యతో నితిన్
► చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్తో కాజల్ అగర్వాల్ ఫోజులు ► స్టైలిష్ లుక్లో మీనాక్షీ చౌదరి ఫోటోలు వైరల్ ► భార్య షాలినీతో నితిన్ రొమాన్స్ ► చంద్రముఖి రూపంలో కంగనా రనౌత్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya🧿🦋 (@vaishnavii_chaitanya) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Shalini Kandukuri (@shalinikandukuri) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Sun Pictures (@sunpictures) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
నితిన్ కౌగిలిలో భార్య షాలిని.. క్యూట్ పెయిర్ ఫోటోలు
-
ఒక హిట్ మూడు ఫ్లాప్లతో దూసుకుపోతున్న హీరోలు
-
హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉంది. 'పుష్ప 2'తోపాటు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె.. నితిన్ సినిమా నుంచి తప్పుకుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే మరో కొత్త విషయం ఒకటి బయటకొచ్చింది. ఈమెపై ఓ వ్యక్తి కుట్ర చేస్తున్నాడని అంటున్నారు. కిరాక్ హిట్తో కన్నడ బ్యూటీ రష్మిక.. డిగ్రీ చదువుతున్న టైంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'కిరిక్ పార్టీ' అనే చిత్రంతో వచ్చీరావడంతో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకుంది. అలా 'ఛలో' మూవీతో తెలుగులోకి వచ్చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో రష్మిక దశ తిరిగిపోయింది. యంగ్ హీరోలతో వరసపెట్టి నటించింది. అల్లు అర్జున్తో చేసిన 'పుష్ప' అయితే ఈమెని పాన్ ఇండియా స్టార్ని చేసేసింది. (ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) నితిన్ ప్రాజెక్ట్ నుంచి ఔట్ ప్రస్తుతం 'పుష్ప 2'తో రష్మిక బిజీగా ఉంది. దీనితోపాటు హిందీలో 'యనిమల్', ద్విభాషా చిత్రం 'రెయిన్ బో' లోనూ నటిస్తూ బిజీగా ఉంది. నితిన్-వెంకీ కుడుముల మూవీలో ఈమెనే హీరోయిన్ గా చేస్తోంది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఈమె తప్పుకొందనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈమె బదులు శ్రీలీలని హీరోయిన్గా తీసుకున్నారని అన్నారు. ఇందులో క్లారిటీ రావాల్సి ఉంది. అతడు వల్ల అయితే కొన్నిరోజుల ముందు రష్మికని మేనేజర్ మోసం చేశాడని న్యూస్ వచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఫ్రొఫెషనల్గా వీళ్లిద్దరూ విడిపోయారు. అప్పుడు ఏం జరిగిందనేది పక్కనబెడితే.. ఇప్పుడు అతడే రష్మిక కెరీర్ ని దెబ్బ కొడుతున్నాడని అంటున్నారు. రష్మికకు తెలుగుపై పెద్దగా ఆసక్తి లేదని అందరీ దగ్గర చెబుతున్నాడట. ఈ కారణంగానే నితిన్ ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకొందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వయానా రష్మిక స్పందిస్తే గానీ అసలు విషయం బయటపడదు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా!) -
హీరో శర్వానంద్ రిసెప్షన్లో టాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి..(ఫొటోలు)
-
ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లి ఫిక్స్?
నితిన్ సరసన 'లై' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఇటీవలే మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఛల్ మోహన్ రంగ, పేట, రాజా రాజా చోర లాంటి తెలుగు సినిమాల్లో కనిపించినా అమ్మడికి మాత్రం భారీ విజయం తలుపుతట్టింది లేదు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం.. అయినా గాయాలతోనే సెట్కు: షాహిద్ కపూర్) తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్సయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతను మేఘా ఆకాష్ కుటుంబానికి స్నేహితుడని తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని.. తర్వలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినున్నారని తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క తన తల్లితో కలిసి నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. గతేడాది ఒక సినిమాను ఒకే చేసి.. తాజాగా సెట్స్ మీదకు తీసుకెళ్లింది. అయితే ఇప్పటివరకు పెళ్లి వార్తలపై మేఘా ఆకాష్ స్పందించలేదు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) -
డైలమాలో ఏజెంట్ డైరెక్టర్...సురేందర్ రెడ్డి
-
గ్రాండ్గా ప్రారంభమైన నితిన్-రష్మిక సినిమా
హీరో నితిన్, రష్మికా మందన్నాలు మరోసారి జంటగా నటించనున్నారు. వెంకీ కుడుమల డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా గ్రాండ్గా ప్రారంభమైంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తం షాట్ను క్లాప్ కొట్టి ఆరంభించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు #VNRTrio అనే హ్యష్ ట్యాగ్తో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో నితిన్-రష్మికలు జోడీగా భీష్మలో నటించి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మరోసారి నితిన్కి జోడీగా రష్మిక మందన్నా.. క్రేజీ అనౌన్స్మెంట్
హీరో నితిన్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి జోడీగా నటించనున్నారు. గతంలో భీష్మ చిత్రంలో వీరు తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై బజ్ను క్రియేట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ను అనౌన్స్ చేయనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్కు ఈ సినిమా అయినా సక్సెస్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. The trio so rare even we are aware!#VNRTrio is back with something more entertaining and more adventurous 💥💥 Watch now! - https://t.co/UxHVoTh7KZ More details soon!@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/IPZWsdJwct — Mythri Movie Makers (@MythriOfficial) March 22, 2023 -
ఎన్టీఆర్ బావమరిది కోసం రంగంలోకి దిగిన ప్రముఖ నిర్మాత
నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది జూ.ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నితిన్ నార్నే కూడా హీరోగా లాంచ్ అయ్యాడు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగ్నేష దర్శకత్వంలో ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’అనే టైటిల్ను కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్లుక్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. కొఆగిపోయిన ఈ సినిమాను నిర్మాత నాగవంశీ భుజాన వేసుకొని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడట. ఎన్టీఆర్కు నాగవంశీ వీరాభిమాని అని పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ అభిమానంతో, కథ కూడా నచ్చడంతో కొన్ని మార్పులు చేసి ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారట. కాలేజీ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఆ స్టార్ హీరోకు వెల్కమ్ చెప్పిన నితిన్.. ట్వీట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సార్ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు(ఫిబ్రవరి17)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నితిన్ మూవీ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. ధనుష్కు టాలీవుడ్కు స్వాగతం అంటూ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. #SIR In cinemas, From Tomorrow!Hearing great things about the film already👏👏 Congrats to my dear Swami #VenkyAtluri & Grand Welcome to @dhanushkraja garu to Telugu. My heartfelt wishes to my hattrick producer @vamsi84 n @sitharaents , each and everyone from the Team #Sir pic.twitter.com/HcYFzxydrt — nithiin (@actor_nithiin) February 16, 2023 -
పెళ్లిపీటలెక్కిన దర్శకుడు, ఫోటో వైరల్
ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటివాడయ్యాడు. పూజ అనే అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. ఈ వివాహానికి హీరో నితిన్ తన భార్య శాలినితో కలిసి హాజరయ్యాడు. అలాగే హీరోయిన్ కీర్తి సురేశ్, డైరెక్టర్ వెంకీ కుడుముల సైతం ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వార్తను నితిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 'జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న వెంకీకి శుభాకాంక్షలు. వెంకీ- పూజ.. ఆనందకరమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని నితిన్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. వెంకీ పెళ్లికి హాజరైన ఫోటోను దీనికి జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా వెంకీ అట్లూరి.. రంగ్దే, మిస్టర్ మజ్ను, తొలి ప్రేమ వంటి చిత్రాలను తెరకెక్కించి డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు ధనుష్తో సార్ అనే సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) -
మరోసారి జంటగా నటించనున్న నితిన్-రష్మిక?
హీరో నితిన్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవునను అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం 2020 ఫిబ్రవరి 21 విడుదలై మంచి హిట్ను అందుకుంది. కాగా మరోసారి భీష్మ కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. ఛలో, భీష్మ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న వెంకీ కుడుముల మూడో చిత్రాన్ని చిరంజీవితో తీయనున్నారనే వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా తన తర్వాతి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్లో చేయనున్నారు వెంకీ కుడుముల. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. ఇందులో హీరో, హీరోయిన్లుగా నితిన్, రష్మిక నటిస్తున్నారని భోగట్టా. భీష్మలో వీరి జోడీకి మంచి మార్కేలే పడటంతో మరోసారి రిపీట్ చేసేందుకు వెంకీ ఆసక్తి చూపుతున్నారు.ఈ ఏడాది చివరల్లో ఈ సినిమా సెట్స్పైకి వెళుతుందని టాక్. -
OTT release : 'యశోద', 'ఊర్వశివో రాక్షసివో' మూవీస్ థియేటర్స్లో మిస్ అయ్యారా?
సినీ అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే పండగే. ఎందుకంటే సినిమాలు చాలావరకు ఆరోజే రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. థియేటర్లో సినిమా మిస్ అయిన వాళ్లు ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. మరి ఒకేరోజు ఓటీటీలో మూడు సినిమాలు విడుదలైతే? ఈ శుక్రవారం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. సమంత ప్రధాన పాత్రలో నటించి యశోద సినిమా రీసెంట్గా హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ బజ్ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ. 30కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీని థియేటర్స్లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. రేపు( శుక్రవారం) యశోద సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. హీరో నితిన్, కృతిశెట్టి హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. హీరో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేట్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా శిరీష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది.డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే ఊర్వశివో రాక్షసివో. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
మరోసారి రిపీట్ కానున్న 'భీష్మ' కాంబినేషన్
నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన చిత్రం భీష్మ. ఈ సినిమా నితిన్ కెరీర్కు మంచి బ్రేక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగానూ దుమ్మురేపిందీ చిత్రం. ఈ సినిమా తర్వాత నితిన్కు మళ్లీ ఆ స్థాయిలో హిట్ పడలేదు. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రానున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా వెంకీ కుడుముల ఓ కథను చెప్పడం, నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. -
' ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన నితిన్
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్ను రిలీజ్ చేశారు. నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా .. నా చేతి గీతలో కొత్తరేఖవైనావా .. లచ్చిమీ .. నీ ఎనక ఎనక వస్త కనకలచ్చిమి " అనే సాంగ్ను హీరో నితిన్ విడుదల చేశారు. ఈ పాటను జావేద్ అలీ ఆలపించారు. నాంది మూవీ తర్వాత అల్లరి నరేశ్ నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను పలకరించనుంది. -
Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. సినీ, క్రీడా, కళా రంగాల ప్రముఖు లను ఆకర్షించే పనిని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్లో శనివారం మధ్యాహ్నం భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్తో, సాయంత్రం సినీ నటుడు నితిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వారు బీజేపీలో చేరుతారా, లేక కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయ, సాంస్కృతిక అంశాలపై... శనివారం రాత్రి నోవాటెల్కు వచ్చిన సినీ నటుడు నితిన్ జేపీ నడ్డాతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమాలతోపాటు రాజకీయ అంశాలపై వారు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ హీరోగా నితిన్ ఎదగడాన్ని జేపీ నడ్డా అభినందించారని.. సినిమా శక్తివంతమైన మాధ్యమమని, ప్రజల్లో మార్పునకు ఒక సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నారని తెలిపాయి. తాను ప్రధాని మోదీ నుంచి స్ఫూర్తి పొంది అభిమానిగా మారానని, రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని నితిన్ పేర్కొన్నట్టు వెల్లడించాయి. ఈ సమావేశం అనంతరం జేపీ నడ్డా తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణలో ఈ రోజు ప్ర ముఖ నటుడు నితిన్ను కలవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. నితిన్ తన రాబోయే సినిమాల గురించీ చెప్పారు. అతనికి శుభాభినందనలు తెలియజేశాను..’’అని తన ట్వీట్లో నడ్డా పేర్కొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం: మిథాలీరాజ్ ప్రధాని మోదీ హయాంలో దేశంలో క్రీడలకు ప్రాధాన్యం పెరిగిందని నడ్డాతో భేటీలో మిథాలీరాజ్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో శిక్షణ, మౌలిక వసతుల కల్పన పెరిగిందని.. క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. 20ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న తనకు క్రీడారంగంలో గత 8 ఏళ్లలో చోటుచేసుకున్న సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో భారత్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మునుగోడు’పై పకడ్బందీ కార్యాచరణ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధించే దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ నేతలకు జేపీ నడ్డా సూచించారు. శనివారం రాత్రి నోవాటెల్ హోటల్లో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరులు నడ్డాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్లాలని, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. బీజేపీకి ప్రజా మద్దతును కూడగట్టాలని ఆదేశించారు. ప్రచారానికి ఓకే అన్న మిథాలీరాజ్, నితిన్: కె.లక్ష్మణ్ నితిన్, మిథాలీరాజ్లతో నడ్డా జరిపిన భేటీల్లో పాల్గొన్న ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశానికి సరైన నాయకత్వం అందిస్తున్నట్టు వారు పేర్కొన్నారని కె.లక్ష్మణ్ చెప్పారు. మోదీ కోసం తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని.. ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ప్రధాని మోదీని స్వయంగా కలవాలని వారు కోరారని.. దీంతో వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని నడ్డా తనకు సూచించారని తెలిపారు. చదవండి: (జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్ భేటీ) -
తెలుగు హీరోలతో బీజేపీ అగ్ర నేతల భేటీలు.. అందుకేనా?
దక్షిణాదిపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. సౌత్లో పార్టీని పటిష్టం చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసిక కమలం పార్టీ మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలపడేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. వివిధ రంగాలను చెందిన ప్రముఖులను తమవైపు తిప్పుకోవడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. వీరి భేటీపై స్థానిక నాయకులకు కూడా సమాచారం లేదంటే బీజేపీ అగ్రనాయకత్వం ఎంత ప్లాన్డ్గా ముందుకెళుతుందో అర్థమవుతుంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హీరో నితిన్పై సమావేశమయ్యారు. అయితే ఈ రెండు మర్యాదపూర్వక భేటీలని కమలనాథులు చెబుతున్నా.. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలూ లేకపోలేదు. భారత మహిళల క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్తోనూ నడ్డా సమావేశం కావడం ఈ వాదనలకు మరింత బలాన్నిస్తోంది. ఇంకాస్త ముందుకెళితే ప్రధాని నరేంద్ర మోదీని అంబేద్కర్తో పోల్చి ప్రశంసించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సీటు దక్కింది. కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా బీజేపీ ఆశీస్సులతో పెద్దల సభలో అడుగుపెట్టారు. ఆర్ఎస్ఎస్ సమాజానికి అందిస్తున్న సేవలపై సినిమా తీస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం. కళాతపస్వి కె. విశ్వనాథ్ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో బీజేపీ సర్కారు సత్కరించిన విషయం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రముఖ నటీమణులు విజయశాంతి, ఖుష్బూ ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్నారు. (క్లిక్: హైదరాబాద్పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..) తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలంటే మునుగోడులో కచ్చితంగా గెలవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో కమలం పార్టీ అగ్రనాయకులు తెలంగాణకు వరుస కడుతున్నారు. శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాలతో పాటు సినిమా ప్రముఖులతో భేటీలు నిర్వహిస్తూ ప్రజల దృష్టి తమపై పడేలా చేసుకుంటున్నారు. బీజేపీ ఎత్తుగడలు ఏమేరకు ఫలిస్తాయో భవిష్యత్లో తెలుస్తుంది. (క్లిక్: కేసీఆర్ను ప్రజలే ఇంట్లో కూర్చోబెడతారు) -
నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి: హీరో నితిన్
‘‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని నమ్మాను.. ఈ సినిమాతో నా నమ్మకం మరోసారి నిజమైంది’’ అని నితిన్ అన్నారు. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా, కృతీ శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటింన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలయింది. శనివారం థ్యాంక్స్ మీట్లో నితిన్ మాట్లాడుతూ– ‘‘చాలాకాలం తర్వాత నా జోనర్ని మార్చి యాక్షన్లోకి వెళ్లాను.. ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. యాక్షన్, కామెడీ సీన్స్కి ప్రేక్షకుల చప్పట్లు, విజిల్స్ నాలో ఉత్సాహాన్నిచ్చాయి. ఈ సమయంలో ఇంత మంచి ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్’’ అన్నారు నిఖితా రెడ్డి. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. ‘‘మా చిత్రం తొలి రోజే రూ. 10కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు కృతీ శెట్టి. -
భార్యతో కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా చూసిన నితిన్
హిట్లు ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు(ఆగస్టు12)న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా హీరో నితిన్ భార్య షాలినితో కలిసి హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను వీక్షించారు. వీరితో పాటు నిర్మాత శిరీష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
కలెక్టర్గా నితిన్ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ
టైటిల్: మాచర్ల నియోజకవర్గం నటీనటులు: నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి దర్శకత్వం: ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్ల విడుదల తేది: ఆగస్టు 12, 2022 నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా హీరోహీరోయిన్లుగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘'మాచర్ల నియోజకవర్గం'’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్టు 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ: సిద్ధార్థ రెడ్డి (నితిన్) ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ పొందుతాడు. అక్కడ కొన్ని ఏళ్లపాటు ఎన్నికలు జరగవు. అందుకు కారణం రాజప్ప అని తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో సిద్ధార్థ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: ఎప్పుడు ప్రేమకథా చిత్రాలతో అలరించిన నితిన్.. అందుకు భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ముందుకొచ్చాడు. సినిమాలో పాలిటిక్స్, కలెక్టర్ విధులు చూపిస్తూనే కామెడీని పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి. కొత్త డైరెక్టర్ కొత్త ఫార్ములాతో వస్తే బాగుండేది. కానీ రెగ్యూలర్ రొటీన్ ఫార్ములాతో తెరపై 'మాచర్ల నియోజకవర్గం'ను ఆవిష్కరించాడు. అక్కడక్కడ స్క్రీన్ప్లే కొద్దిగా స్లో కావడంతో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక నితిన్ను కొత్తగా చూపించారు. కలెక్టర్గా నితిన్ చెప్పే డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎవరెలా చేశారంటే? గుంటూరు కలెక్టర్ సిద్ధార్థ రెడ్డిగా నితిన్ కొత్తగా కనిపించాడు. స్టైలిష్ లుక్ నుంచి నటన, అభినయం వరకు ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాలతోపాటు ఫైటింగ్ సీన్లలో మెప్పించాడు. ఇక స్వాతి పాత్రలో హీరోయిన్ కృతీశెట్టి నటన అలరిస్తుంది. కేథరీన్ థ్రేసా తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్ర ఖని విలనిజం, వెన్నెల కిశోర్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. తదితర పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సన్నివేశాలు తగినట్లుగా బీజీఎం ఆకట్టుకుంది. ఇక అంజలి మెరిసిన రారా రెడ్డి ప్రధానాకర్షణగా నిలిచింది. ఫైనల్గా రొటీన్ ఫార్ములాతో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ఉంది. -
నితిన్కి రాఖీ కట్టిన సింగర్ మంగ్లీ.. గిఫ్ట్ ఇచ్చిన హీరో
నితిన్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది. తాజాగా నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సింగర్ మంగ్లీ నితిన్తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకున్న నితిన్కు ఇంటర్వ్యూ చివర్లో మంగ్లీ రాఖీ కట్టింది. దీంతో నితిన్ ఆమెకు బ్యూటిఫుల్ గిఫ్ట్ను అందించారు. -
'మాచర్ల నియోజకవర్గం' నటుడిగా సంతృప్తినిచ్చింది: సముద్ర ఖని
మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేరట్స్కి వస్తారు. రీసెంట్గా 'సీతారామం', 'బింబిసార' చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సక్సెస్ను మాచర్ల నియోజకవర్గం కొనసాగిస్తుందని నమ్ముతున్నాను అన్నారు దర్శక, రచయిత-నటుడు సముద్ర ఖని. నితిన్, కృతిశెట్టి జంటగా ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేసిన సముద్ర ఖని మాట్లాడుతూ.. ''ఇందులో రాజప్ప అనే పాత్ర చేశాను. నటనకు మంచి ఆస్కారం ఉండటంతో సవాల్గా తీసుకొని నటించాను. ఈ చిత్రకథ తరమాలోనే తమిళనాడులోని ఓ ప్రాంతంలో 25 ఏళ్లు ఎలక్షన్స్ జరగలేదు. చివరికి ఉదయ్శంకర్ అనే ఓ ఐఏఎస్ ఆఫీసర్ చొరవ తీసుకుని స్థానికులతో మాట్లాడి ఎలక్షన్స్ జరిగేలా చేశారు. ఈ అంశాన్ని రాజశేఖర్తో షేర్ చేసుకున్నాను అన్నారు. ఇంకా మాట్లాడుతూ రచన అంటే నాకు ప్రాణం. లొకేషన్లో ఖాళీ సమయం దొరికినప్పుడు కథలు రాస్తుంటాను. ప్రస్తుతం చిరంజీవిగారి గాడ్ఫాదర్, నానీ దసరా సినిమాల్లో నటిస్తున్నాను'' అన్నారు. -
ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్
Nithiin About Macherla Niyojakavargam Movie: యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ 'రారా రెడ్డి'లో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలవుతున్న నేపథ్యంలో హీరో నితిన్ మీడియా సమావేశంలో నితిన్ పంచుకున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్ర విశేషాలివి. ►కథ కొత్తగా యూనిక్ గా వుంటుంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. నేను ఐఎఎస్ పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మాస్ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్ లో చాలా ఫ్రెష్ నెస్ వుంటుంది. నేను సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి రోజు మొదటి ఆటకి నేనూ థియేటర్ కి వెళ్తా. ►ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏమీ లేదు. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రేమ కథలు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్ గా చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనే అలోచనతో 'మాచర్ల నియోజకవర్గం' చేశా. ఇది ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. పవర్ ఫుల్ రోల్. మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ►కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో ఉండే కథ చాలా యూనిక్గా వుంటుంది. పొలిటికల్ నేపథ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మాచర్ల లో ఉండే పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. కమర్షియల్ ఫార్మెట్ లో ఉంటూనే కొత్త పాయింట్ తో ఉంటుంది. ►2017 'లై 'షూటింగ్ సమయంలో తన ఎడిటింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నపుడు తను ఇన్ పుట్స్ కూడా బావుండేవి. ''నువ్వు డైరెక్టరైతే బావుంటుంది'' అని అప్పుడే చెప్పాను. నేను చెప్పిన తర్వాత తనలో ఆలోచన మొదలైయింది. కోవిడ్ సమయంలో ఇంట్లో ఉంటూ కథ రాసుకున్నాడు. నాకు చెప్పినపుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశాను. ►శేఖర్ ఎడిటర్ కావడం వలన షాట్ కటింగ్స్, సీన్ ఓపెనింగ్స్, లెంత్ విషయంలో చాలా క్లారిటీ వుంది. తను ఏది చెప్పాడో స్క్రీన్ మీద అదే కనిపించింది. శేఖర్ ఎడిటర్ కావడం వల్ల .. ఎంత కావాలో అంతే తీశాడు. దీంతో వృథా తగ్గింది. మాచర్లలో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కాష్టం. ఐతే శేఖర్ నేను అనుకున్న దానికి కంటే అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. చాలా అనుభవం ఉన్న దర్శకుడి లాగా తీశాడు. ►శేఖర్ ఒక ఫీల్డ్ మార్చి మరో ఫీల్డ్ కి వస్తున్నాడు. ఇక్కడ ఏదైనా తేడా వస్తే మళ్లీ ఆ ఫీల్డ్ కి వెళ్లాలి. అందుకే ఈ సినిమా నాకంటే కూడా తనకే ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ►ఈ విషయంలో దర్శకుడు శేఖర్ చాలా హోం వర్క్ చేశారు. చాలా మంది ఐఏఎస్ అధికారులని కలవడం, వాళ్ల బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, షూటింగ్ సమయంలో ఎక్కడ హుందా గా ఉండాలి, ఎక్కడ మాస్గా ఉండాలనేది తనే చెప్పాడు. ►మాచర్ల నియోజకవర్గం కంప్లీట్ ఫిక్షనల్ స్టొరీ. దర్శకుడు శేఖర్ది గుంటూరు. మాచర్ల అనే టైటిల్లో ఒక ఫోర్స్ ఉంది. అందుకే మాచర్ల నియోజికవర్గం అని టైటిల్ పెట్టాం. సముద్రఖని గారికి శేఖర్ కథ చెప్పినపుడు.. తమిళనాడులో ఇలాంటి ఇన్సిడెంట్ ఉందని సముద్రఖని గారు అన్నారు. ►ఐఏఎస్ అంటే క్లాస్ అనుకుంటాం. కానీ ఆ పాత్ర మాస్ గా ఉంటే ఎలా ఉంటుందనే కొత్త అలోచనతోనే ఫ్రెష్ గా వెళ్లాం. ►ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ కామెడీ వుంటుంది. నేను, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ గా వుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఫన్ వుంటుంది. ఊర మాస్ లా కాకుండా మాస్ కూడా క్లాస్ టచ్ తో వుంటుంది. ►మాచర్ల నియోజకవర్గం ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యుమర్, ఫన్ , మాస్, క్లాస్ అన్నీ వుంటాయి. ►కేథరీన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ కథలో చాలా కీలకం. ఒక కీ పాయింట్ ఆ పాత్రలో వుంటుంది. ►చాలా రోజుల తర్వాత చేసిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఫైట్స్, లుక్ విషయంలో కొంచెం ఎకువ శ్రద్ధ తీసుకున్నా. ►కృతి శెట్టి షూటింగ్ లో ప్రతిది చాలా లాజికల్ గా అడుగుతుంది. కృతి అడిగే ప్రశ్నలు చాలా స్మార్ట్ గా వుంటాయి. హీరోయిన్స్ లో అరుదైన క్యాలిటీ ఇది. ►ఇది వరకు నా చిత్రాలలో ఫైట్స్ వున్నాయి. కానీ మాచర్ల ఫైట్స్ మాత్రం చాలా స్పెషల్. పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్, స్టయిలీష్ గా వుంటాయి. ఒకొక్క ఫైట్ ఒక్కోలా వుంటుంది. షూటింగ్ లో ఫైట్స్ అలవాటే. కానీ మాచర్ల ఫైట్స్ విషయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి తీసుకున్నాను. అలాగే షూటింగ్ లో గాయాలు కూడా అయ్యాయి. ►ఫస్ట్ లాక్ చేసిన కథనే తీశాం. కోవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాకి ఇంకా స్కోప్ పెరిగింది. సాఫ్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్, హ్యుమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి. ►కోవిడ్ తర్వాత ప్రేక్షకుల మూడ్ స్వింగ్ ఏమిటో అర్ధం కావడం లేదు. ఏ సినిమా చూస్తున్నారు.. ? ఏ సినిమాకి వస్తున్నారో సరిగ్గా అర్ధం కావడం లేదు. టీజర్, ట్రైలర్ లో ఏదో నచ్చి వస్తున్నారు. సినిమా నచ్చితే అది నడుస్తుంది. అయితే ఏ సినిమా నడుస్తుందనేది ఊహించలేం. ►సాగర్ నాకు మంచి మ్యూజిక్ ఇస్తాడు. మా ఇద్దరి సింక్ బావుంటుంది. మాచర్ల పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగా చేశాడు. నేపథ్య సంగీతంలో మణిశర్మ గారిని మైమరపించాడు. ►ఒక నెలలో సమస్యలకు పరిష్కారం దొరికి మళ్లీ షూటింగులు మొదలవుతాయని ఆశిస్తున్నాను. ►సలహా అంటే .. సినిమా కొనమని మాత్రమే చెప్పాను. రేట్లు జోలికి మాత్రం వెళ్లను (నవ్వుతూ). విక్రమ్ చూసి వారం రోజులు నిద్రపట్టలేదు. సినిమా అంటే ఇలా వుండాలి కదా, ఇలా తీయాలి కదా అనిపించింది. ఒకే మూసలో వుండే ఫార్ములా కాకుండా.. కథని బలంగా నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి. భవిష్యత్ లో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తా. ►ఇరవై ఏళ్ల ప్రయాణంలో చాలా హిట్స్ చూశాను. కొన్ని అపజయాలు కూడా చూశాను. ప్రస్తుతం మంచి స్థితిలో వుండటం తృప్తిగా వుంది. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనేదే నా ప్లాన్. ►ఇండియాలో ఎక్కువ ఫ్లాఫ్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరు అని గూగల్ చేసేవాడిని (నవ్వుతూ) అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు వచ్చేవి. వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని. కొన్ని విమర్శలు బాధ కలిగించేవి. అయితే ఆ విమర్శలనే పాజిటీవ్ గా తీసుకొని ప్రయాణం కొనసాగించాను. ►'రాను రాను' అనే పాట ఆలోచన నాదే. ఏదైనా పాట రీమిక్స్ చేద్దామని అన్నప్పుడు జయం హైలెట్స్ లో ఒకటైన 'రాను రాను' పాటని రీమిక్స్ చేద్దామని చెప్పాను. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఆ పాట క్రేజ్ తగ్గలేదు. ఈ చిత్రం లో మూడు పాటలు డ్యాన్స్ వేశాను. డ్యాన్సులన్నీ బావుంటాయి. ►హైదరాబాద్, విశాఖ పట్నంలో షూట్ చేశాం. పాటల కోసం విదేశాలకు వెళ్లాం. ప్రసాద్ మురెళ్ల గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ►పాన్ ఇండియా సినిమా చేద్దామనుకొని చేస్తే కుదరదని నా అభిప్రాయం. సరైన కథ కుదిరినప్పుడే అది జరుగుతుంది. అలాంటి కథలు వస్తే చేస్తాను. ►వక్కంతం వంశీ గారితో ఒక సినిమా చేస్తున్నా. -
పోరాట దృశ్యాల కోసం ఇంత కష్టపడతారా?
Nithiin Macherla Niyojakavargam Making Video Released: హిట్లు ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్ హీరోయిన్స్ కృతీ శెట్టి, కేథరిన్ ట్రేసా కథానాయికలుగా అలరించనున్నారు. పలు సినిమాలకు ఎడిటర్గా పనిచేసిన ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. పలు యాక్షన్ సన్నివేశాలు, సాంగ్స్ షూటింగ్స్ను ఈ వీడియోలో చూడొచ్చు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించేందుకు ఎంత కష్టపడతారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే డ్యాన్స్ విషయంలో తీసుకునే శ్రద్ధ కనిపిస్తుంది. షూటింగ్లో బ్రేక్ సమయంలో నితిన్, కృతిశెట్టి కబుర్లు చెప్పుకుని నవ్వుకోవడం సరదాగా ఉంది. కాగా పొలిటికల్ యాక్షన్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజేంద్ర ప్రసాద్, సముద్ర ఖని, శుభలేక సుధాకర్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. -
మరో ఇరవై ఏళ్లు మీ కోసం కష్టపడతా
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు, అభిమానుల సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు.. మీ అభిమానం, ప్రేమకి థ్యాంక్స్. మరో ఇరవై ఏళ్లు అయినా మీ కోసం నేను ఇలాగే కష్టపడతాను.. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి’’ అని నితిన్ అన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతీశెట్టి, కేథరిన్ హీరోయిన్లు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ– ‘‘నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. నేపథ్య సంగీతానికి మణిశర్మగారు కింగ్ అంటారు. కానీ మా సినిమా చూశాక తండ్రికి తగ్గ తనయుడు కాదు.. తండ్రిని మించిన తనయుడిగా స్వరసాగర్ నేపథ్య సంగీతం కొట్టాడు. ఈ సినిమా మీకందరికీ ఫుల్ మీల్స్. ఈ చిత్రంతో రాజశేఖర్ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నాను. ఆగస్టు 12న గట్టిగా కొట్టబోతున్నాం’’ అన్నారు. అతిథిగా పాల్గొన్న దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘దిల్’ సినిమా తర్వాత నితిన్ని కలిసి భయం భయంగా ఓ కథ చెప్పాను. అప్పుడు తను ఇచ్చిన ధైర్యంతో వెళ్లి ‘అతనొక్కడే’ సినిమా చేశా. అప్పటి నుంచి నితిన్తో సినిమా చేయాలనుకునే వాణ్ణి.. భవిష్యత్లో తప్పకుండా చేస్తా. ‘మాచర్ల నియోజకవర్గం’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నేను ఈ స్థాయికి రావడానికి పదిహేనేళ్లు పట్టింది. ఇండస్ట్రీలో ఎడిటర్గా బ్రేక్ ఇచ్చిన పూరి జగన్నాథ్గారికి థ్యాంక్స్. ఎడిటర్గా ఉన్న నన్ను డైరెక్టర్ని చేసిన నితిన్కి థ్యాంక్స్. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టబోతున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహ నిర్మాత హరి, దర్శకులు హను రాఘవపూడి, వక్కంతం వంశీ, మేర్లపాక గాంధీ, మెహర్ రమేశ్, నటులు బ్రహ్మాజీ, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు. -
సాంగ్ చూపించేశాం మావా...
పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకులను థియేటర్కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. పాటలు బాగుంటే సినిమా కూడా బాగుంటుందని థియేటర్కి వెళ్లేవారు. ఇప్పుడు ‘సాంగ్ చూపించేశాం మావా..’ అంటూ పాట వీడియోను కూడా చూపించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా మేకింగ్ మారినట్లుగానే పబ్లిసిటీలో కూడా కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల వీడియో పాటలను ఓ లుక్కేద్దాం.. ఐయామ్ రెడీ.. ‘‘నేను రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ నితిన్ని ఆటపట్టించారు అంజలి. వీరిద్దరి మధ్య వచ్చే ఈ మాస్ సాంగ్ ‘మాచర్ల నియోజక వర్గం’ లోనిది. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీ శెట్టి, క్యాథరిన్ హీరోయిన్లు. అంజలి స్పెషల్ సాంగ్ చేశారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి..’, ‘అదిరిందే..’ అంటూ సాగే పాటల ఫుల్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘మాచర్ల సెంటర్లో మాపటేల నొనొస్తే.. ఐయామ్ రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ అంజలి, నితిన్లపై చిత్రీకరించిన సాంగ్, నితిన్, కృతీపై తీసిన ‘అదిరిందే పసిగుండె.. తగిలిందే హై ఓల్టే’ పాటల వీడియోలు మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. పలికిందేదో ప్రాణం.. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం.. ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం’ అంటూ ఉల్లాసంగా పాడారు కల్యాణ్ రామ్. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీతో ఉంటే చాలు..’ అనే ఫుల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం..’ అంటూ సాగే ఈ ఫ్యామిలీ సాంగ్కి మంచి స్పందన వస్తోంది. అడిగా.. నన్ను నేను అడిగా... ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని..’ అంటూ అనుపమా పరమేశ్వరన్ని అడుగుతున్నారు నిఖిల్. ఈ ప్రేమ పాట నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’లోనిది. కాలభైరవ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని, అడిగా.. నిన్ను నేను అడిగా.. నే నిన్నలా నేనని..’ అంటూ సాగే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. నిఖిల్, అనుపమల మధ్య వచ్చే ఈ ఫీల్ గుడ్ సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవే కాదు... మరికొన్ని చిత్రాల్లోంచి కూడా వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించడానికి కొంతవరకైనా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. -
అదిరిపోయిన నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్..
Nithin Macherla Niyojakavargam Movie Trailer Released: హిట్లు ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్ హీరోయిన్స్ కృతీ శెట్టి, కేథరిన్ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్ అయితే అధిక వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్ హీరోల స్టెప్పులను సింక్ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. దీంతో ప్రమోషన్స్లో జోరు పెంచిన చిత్రబృందం తాజాగా మూవీ ట్రైలర్ను విడుదల చేసింది. 3 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, యాక్షన్ సీన్లతో ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్లో చూపించిన డైలాగ్లు, నితిన్ యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగున్నాయి. 'ఇంకా డైరెక్ట్ యాక్షనే' అంటూ ఈ మూవీ ట్రైలర్ను ట్వీట్ చేశాడు నితిన్. కాగా ఈ మూవీలో నితిన్ కలెక్టర్గా నిటిస్తున్న విషయం తెలిసిందే. -
పోలీసులను ఆశ్రయించిన మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్
మాచర్ల నియోజకవర్గం సినిమాకు కొత్త చిక్కు వచ్చిపడింది. డైరెక్టర్ ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఓ వ్యక్తి ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి కొన్ని వర్గాలను కించపరిచేలా కామెంట్లు చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ కాగా ఆ మాటలు అన్నది డైరెక్టరే అనుకుని మాచర్ల నియోజకర్గాన్ని బహిష్కరించాలంటూ పలువురూ కామెంట్లు చేస్తున్నారు. ఎవరో పనికట్టుకుని ఇదంతా చేస్తున్నారని ఆగ్రహించిన డైరెక్టర్ బుధవారం నాడు పోలీసులను ఆశ్రయించాడు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుగా పోస్ట్ చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజశేఖర్ అనే పేరుతో ఉన్న ఓ అకౌంట్ నుంచి కొందరు మూడేళ్ల క్రితం కొన్ని కులాలను తిడుతూ ఓ ట్వీట్ చేశారని, దాన్ని తనకు అంటగడుతూ, మాచర్ల ముచ్చట్లు అంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు. ఆ అకౌంట్ తనది కాదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫేక్ ట్వీట్ల స్క్రీన్షాట్లను పోలీసులకు అందించాడు. దర్శకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: బ్రేకప్ చెప్పుకున్న బాలీవుడ్ లవ్బర్డ్స్ అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ -
'అదిరిందే' అంటూ అదరగొట్టిన నితిన్, కృతీ శెట్టి..
Macherla Niyojakavargam: హిట్లు ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్ హీరోయిన్స్ కృతీ శెట్టి, కేథరిన్ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్ అయితే అధిక వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్ హీరోల స్టెప్పులను సింక్ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. 'అదిరిందే పసిగుండే' అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ను శనివారం (జులై 23) ఉదయం రిలీజ్ చేశారు. ఈ పాటలో నితిన్, కృతీశెట్టి తమ డ్యాన్స్తో అదరగొట్టారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించగా పాటను సంజిత్ హెగ్డే ఆలపించారు. ఫ్యాక్షన్, పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి కృతీ లుక్
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా కృతీశెట్టి లుక్ను వదిలింది. ఇందులో కృతీ స్టైలిష్గా కాఫీ కప్ పట్టుకుని కనిపించింది. ఇందులో ఆమె స్వాతి పాత్రలో అలరించనుందట. పొలిటికల్ ఎలిమెంట్స్తో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం రూపొందింది. Introducing our ‘Swathi' aka @IamKrithiShetty ❤️ One of the core persons from #MacherlaNiyojakavargam 🚩 Get Ready to fall in Love with her from August 12th😍#MNVFromAug12th pic.twitter.com/vexAUuWYOV — nithiin (@actor_nithiin) July 17, 2022 -
నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్
Mahesh Babu Dance To Nithin Song Goes Viral: హిట్ ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ హీరో 'జయం' సినిమా హీరోగా నితిన్కు ఎంత గుర్తింపు తెచ్చిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సాంగ్ యూత్ను ఒక ఊపు ఊపేసింది. తాజాగా ఈ పాటకు అనుగుణంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నితిన్ 'వావ్' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పాటకు మహేశ్ బాబు నిజంగా స్టెప్పులు వేయలేదు. ఇదంతా కేవలం ఎడిటింగ్తో చేసిన ప్రయోగం. నితిన్ తాజాగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీలో 'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్లో హీరోయిన్ అంజలి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట చివర్లో 'రాను రానంటూనే చిన్నదో' సాంగ్ను రీమిక్స్ చేసి జోడించారు. ఇప్పుడు ఈ రీమిక్స్కు అనుగుణంగా 'సర్కారు వారి పాట'లోని 'మ.. మ.. మహేశా' స్టెప్పులతో ప్రత్యేకంగా వీడియో క్రియేట్ చేశాడు ఓ నెటిజన్. ఈ స్పెషల్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా అది కాస్త ట్రెండ్ అయింది. ఈ వీడియోకు నితిన్ 'వావ్.. సూపర్.. పర్ఫెక్ట్ సింక్' అంటూ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ చలరేగిపోతోంది. చదవండి: నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య Wowww!! SUPERB and PERFECT SYNC 🔥🔥 https://t.co/KvXrbnzo7t — nithiin (@actor_nithiin) July 12, 2022 -
సీరియల్స్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరో నితిన్!
యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయిక. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో సరికొత్తగా కనిపించనున్నాడు. రాజకీయ నేపథ్యంతో వస్తున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆగస్టు 12న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్లో భాగంగా నితిన్ కొత్త రూటు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర సీరియల్స్లో కనిపించి ప్రేక్షకులను తన సినిమా చూడమని అడగనున్నాడట ఈ హీరో. అంటే కొద్ది క్షణాల పాటు సీరియల్లో అలా ప్రత్యక్షమై ఇలా మాయమవుతాడన్నమాట. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే నితిన్ సీరియల్స్లో కనిపించడం ఇదే తొలిసారి అవడం ఖాయం. చదవండి: పురిట్లోనే మరణించిన బిడ్డ కోసం తల్లడిల్లిపోతున్న సింగర్ భార్య ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు -
నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్
Amma Rajasekhar Fires On Nithin And Get Emotional: హిట్ ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం నితిన్ నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన రారా రెడ్డి అనే పాట యూట్యూబ్లో వైరల్ అయింది. ఈ పాటలో నితిన్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడని ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో నితిన్కు డ్యాన్సే రాదని ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యారు. నితిన్ మాటిచ్చి హ్యాండిచ్చాడని, అది తనకు అవమానకరంగా ఉందని స్టేజ్పైనే ఎమోషనల్కు గురయ్యాడు. విషయంలోకి వెళితే.. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (జులై 10) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నితిన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సినట్లు తెలుస్తోంది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో నితిన్ హాజరు కానట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మ రాజశేఖర్.. పది రోజుల క్రితమే నితిన్ను ఈ ప్రోగ్రామ్కు రావాల్సిందిగా ఆహ్వానించా. ఆయన వస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట నమ్మి.. అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్ కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్ చేయించా. నితిన్కు అసలు డ్యాన్సే రాదు. ఆయనకు డ్యాన్స్ నేర్పించి, ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్ అయినా పంపమని కోరాను. అది కూడా ఇవ్వలేదు. నితిన్కే కాదు హీరోలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్లినా.. అందుకు సహాయపడినవారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నితిన్.. నువ్ రాలేను అనుకుంటే రానని నేరుగా చెప్పేయాల్సింది. వస్తానని చెప్పి రాకుండా నన్ను ఎంతో అవమానించారు. నాకెంతో బాధగా ఉంది. అని అమ్మరాజేశేఖర్ ఎమోషనల్ అయ్యారు. కాగా నితిన్ నటించిన 'టక్కరి' మూవీకి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ -
'మాచర్ల నియోజకవర్గం' నుంచి నితిన్, కృతిశెట్టి కొత్త లుక్..
Nithin Krithi Shetty New Look From Macherla Niyojakavargam: నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ నితిన్, కృతీశెట్టి లుక్ విడుదల చేసింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మిగిలిన ఒక పాటను త్వరలో చిత్రీకరించనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ 12న సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు Except for one song, the entire talkie part of @actor_nithiin's #MacherlaNiyojakavargam has been completed ✅🔥 Ready to take charge on Theatres from August 12th! ⚠️💥#MNVFromAug12th ✨@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #MahathiSwaraSagar @SreshthMovies @adityamusic pic.twitter.com/WyIlhS1d9E — Sreshth Movies (@SreshthMovies) June 24, 2022 -
ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్
Nithin Emotional Post On His 20 Years Cinema Journey: 'జయం' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు యంగ్ హీరో నితిన్. దిల్, సై, ఇష్క్ వంటి తదితర సినిమాలతో మంచి బ్రేక్ తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీతో ఆగస్టు 12న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే 2002లో 'జయం' సినిమాతో కెరీర్ ప్రారంభించిన నితిన్ 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, దర్శక-నిర్మాతలకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. 'డియర్ ఫ్రెండ్స్.. 20 ఏళ్ల కిందట నా మొదటి సినిమా అయిన జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. దీన్ని ఎలా వర్ణించాలో మాటలు కూడా రావడం లేదు. నాలోని నటుడిని గుర్తించి నాకు జయం సినిమాలో అవకాశం ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా సినీ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, వ్యక్తిగత సిబ్బంది.. ఇలా నాతో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో. ఈ అందమైన ప్రయాణంలో నాకు ఎంతోమంది అండగా నిలిచారు. కెరీర్లో కష్టాలు ఎదురైనప్పుడు ఎంతో సహకరించారు. ఇన్నేళ్లుగా అభిమానిస్తూ, నాపై నమ్మకాన్ని ఉంచి నా వెన్నంటే ఉంటూ వచ్చిన నా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.' అని ట్విటర్లో ఎమోషనల్గా పోస్ట్ చేశాడు నితిన్. ❤️❤️❤️ pic.twitter.com/WbhRMZMac3 — nithiin (@actor_nithiin) June 14, 2022 -
రామ్ చరణ్ చేతుల మీదుగా ‘విక్రమ్’ తెలుగు ట్రైలర్
లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో నితిన్ రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పతాకంలో నితిన్ ‘విక్రమ్’ సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు(మే 20) సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పొలిటికల్ యాక్షన్ థ్లిల్లర్గా సాగే ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళీ పాపులర్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్కు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించారు. జూన్ 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. The Action now begins in Telugu💥💥 MegaPower🌟@AlwaysRamCharan to Launch @ikamalhaasan’s #VikramHitlist Telugu Trailer Today @ 5 PM 🤟#Vikram #VikramTrailer #VikramFromJune3❤️🔥@Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial @actor_nithiin @RKFI @SreshthMovies pic.twitter.com/80UzoM10EE — Sreshth Movies (@SreshthMovies) May 20, 2022 -
'మాచర్ల నియోజకవర్గం' కొత్త రిలీజ్ డేట్ ఇదే..
Nithin Macherla Niyojakavargam New Release Date: యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎమ్ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. అయితే ఇటీవల రిలీజ్ చేసిన టీజర్లో మాచర్ల నియోజకవర్గం సినిమాను జూలై 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పలు అనివార్య కారణాల వల్ల రిలీజ్ డేట్ను వాయిదా వేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించారు దర్శకనిర్మాతలు. మూవీ కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. 'డేట్ మారింది అంతే.. కలెక్టర్ సార్ యాక్షన్ కాదు..' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టర్లో వైట్ షర్ట్లో మాస్ లుక్తో ఆకట్టుకున్నాడు నితిన్. కాగా మాచర్ల నియోజకవర్గంలోని గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో అలరించనున్నాడు నితిన్. చదవండి: 'మాచర్ల నియోజకవర్గం'లో కేథరిన్ Date lo change anthe ⚠️ Collector Saab Action lo kaadhu 😎 Youth🌟 @actor_nithiin’s PAKKA MASS Entertainer #MacherlaNiyojakavargam Arriving in Theatres on August 12th, 2022🔥@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar @SreshthMovies @adityamusic#MNVfromAug12th pic.twitter.com/xQcG0Jydx3 — Sreshth Movies (@SreshthMovies) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ను స్పీడ్గా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్తో చిట్చాట్ నిర్వహించాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ చిట్చాట్లో హరీశ్ శంకర్ పలు ప్రశ్నలు ఉడగ్గా.. చిరంజీవి ఆసక్తికర సమాధానలు చెప్పారు. చిరంజీవిని డ్యాన్స్కు సంబంధించిన ప్రశ్న అడిగాడు హరీశ్ శంకర్. 'మీరిద్దరు (చిరంజీవి, రామ్ చరణ్) కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరని అనుకుంటున్నారు' అని చిరంజీవిని అడిగాడు హరీశ్ శంకర్. ఇందుకు 'చాలా మంది డ్యాన్సర్స్ ఉన్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్, రామ్, నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు' అని చిరంజీవి చెప్పగా రామ్ చరణ్ మధ్యలో కల్పించుకుని 'నా దృష్టిలో తారక్, బన్నీ బెస్ట్ డ్యాన్సర్స్' అని తెలిపాడు. ఇకపోతే 'ఆచార్య' మూవీలో 'బంజారా' పాటకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: 'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య' బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొత్త సినిమా ప్రారంభించిన నితిన్, హీరోయిన్ ఎవరంటే..
యంగ్ హీరో నితిన్ వరస ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న మాచెర్ల నియోజకవర్గం ఇంకా సట్స్పైనే ఉంది. ఈ నేపథ్యంలో నితిన్ మరో కొత్త సినిమాను సెట్స్పైకి తీసుకువచ్చాడు. దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ ఓ కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా హైదరాబాద్లో గ్రాండ్గా లాంచ్ అయ్యింది. ఆదివారం(ఏప్రిల్ 3) ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని జరుపుకోగా.. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత పి. రామ్మోహన్రావు క్లాప్ కొట్టారు. ఇందులో నితిన్కు జోడిగా ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీలా నటిస్తోంది. ఆదిత్యా మ్యూజిక్ ఉమేశ్ గుప్తా కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రొడక్షన్ నెంబర్ 9 పేరుతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. #Nithiin32 Launched today on an auspicious note with a formal pooja ceremony🪔 Starring Youth🌟@actor_nithiin & @sreeleela14♥️ 🎬@VamsiVakkantham 🎶@Jharrisjayaraj 🎥 #SaiSrinivas 🖌@sahisuresh#SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies Shoot commences soon🤘 pic.twitter.com/jQgQtz362S — Sreshth Movies (@SreshthMovies) April 3, 2022 -
'మాచర్ల నియోజకవర్గం' ఫస్ట్ ఎటాక్ వచ్చేసింది.. సినిమా అప్పుడే విడుదల
Macherla Niyojakavargam Movie Teaser And Release Date Released: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎమ్ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్కు జోడిగా కృతిశెట్టి నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి నితిన్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మూవీ టీజర్ను రిలీజ్ చేసింది. ఈ టీజర్తోపాటు సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించారు మూవీ మేకర్స్. మాచర్ల నియోజకవర్గం సినిమాను ఫస్ట్ ఎటాక్ అంటూ టీజర్ లాంచ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా జూలై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు టీజర్ రిలీజ్తోపాటు సినిమా విడుదల తేదిని ప్రకటించి గిఫ్ట్గా ఇచ్చారు మేకర్స్. మాచర్ల నియోజకవర్గంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో అలరించనున్నాడు నితిన్. ఈ పాత్రలో నితిన్ చాలా అద్భుతంగా ఉన్నాడు. పూర్తిస్తాయి మీసాలు, కత్తిరించిన గడ్డం గెటప్తో మాస్గా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ టీజర్లో విలన్లు నితిన్పై ఎటాక్ చేసే యాక్షన్ సీన్ చూపించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ను వెంకట్ మాస్టర్ తెరకెక్కించారు. రాజకీయ నేపథ్యంతో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. ఇందులో నితిన్ను మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్లో చూడనున్నట్లు తెలుస్తోంది. -
‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి నితిన్ ఫస్ట్లుక్ అవుట్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి ఇందులో నితిన్కి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి నితిన్ లుక్ను విడుదల చేసింది చిత్రం బృందం. ఈ మేరకు శ్రీ ఎన్ సిద్ధార్థరెడ్డి ఐఏఎస్ గుంటూరు కలెక్టర్ ఈ రోజు ఫస్ట్ చార్జ్ తీసుకున్నారంటూ అంటూ ఫస్ట్లుక్ పోస్టర్ను ఈ రోజు ఉదయం 10గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేశారు మేకర్స్. గుంటూరులో జిల్లా కలెక్టర్గా హీరో ఎదుర్కోబోయే సవాళ్లను ఈ మూవీలో చూపించనున్నారు. రాజకీయ నేపథ్యంతో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్లో కనిపించనున్నాడు. Its time to take my First Charge ✍️ Reporting as SIDDHARTH REDDY 😎 Meeku Nachhe , Meeru Mechhe MASS tho Vastunaa :))) #MacherlaNiyojakavargam🔥@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies @adityamusic pic.twitter.com/7vaf5h9YjK — nithiin (@actor_nithiin) March 26, 2022 -
జూ.ఎన్టీఆర్ బావమరిది మూవీ టైటిల్, ఫస్ట్లుక్ వచ్చేసింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శ్రీ వేదాక్షర మూవీస్పై రామారావు చింతపల్లి, ఎమ్ఎస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘నితిన్కు మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదం ఉండాలి’’ అన్నారు వేగేశ్న సతీష్. ఈ సినిమాకు కైలాస్ మీనన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్, విలన్, మిగతా నటీనటులను త్వరలోనే ప్రకటించనున్నారు. -
స్పెషల్ మాస్ సాంగ్లో చిందేసిన నితిన్
Nithin's Macherla Niyojakavargam Movie: విలన్స్ని రఫ్ఫాడించిన నితిన్ కొంచెం కూల్ అయ్యేందుకు ఓ స్పెషల్ మాస్ సాంగ్లో చిందేశారు. ఈ ఫైటు, పాటలను విజువల్గా వెండితెరపై చూడాల్సిందే. నితిన్ హీరోగా, కృతీశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎడిటర్ ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘‘అనల్ అరసు కంపోజ్ చేసిన ఓ యాక్షన్ ఎపిసోడ్ను పూర్తి చేశాను. ఆ వెంటనే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఓ మాస్ సాంగ్ చేశాను. ఫస్ట్లుక్, టీజర్ల అప్డేట్స్ను త్వరలోనే చెబుతాం’’ అని నితిన్ పేర్కొన్నారు. ఈ సినిమాకు సంగీతం: మహతి స్వరసాగర్, లైన్ ప్రొడ్యూసర్: జి.హరి. -
నితిన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి ఇందులో నితిన్కి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలాను సంప్రదించారు. స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఏప్రిల్ 29న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. -
భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్డే సెలబ్రేట్ చేసిన నితిన్..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. బాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులు, హీరోహీరోయిన్లు వరసగా కరోనా బారిన పడుతున్నారు. అలాగే టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మి, నిన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాజాగా యంగ్ హీరో నితిన్ భార్య శాలిని సైతం కరోనా బారిన పడింది. అయితే నేడు ఆమె పుట్టిన రోజు. చదవండి: ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్కు అమెజాన్ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే.. అయితే భార్యకు కరోనా సోకినప్పటికి నితిన్ తన భార్య బర్త్డేను సెలబ్రేట్ చేసి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. భార్య బర్త్డే వినూత్నంగా సెలబ్రేట్ చేసిన నితిన్ ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ భార్యపై ప్రేమ కురిపించాడు. ‘కోవిడ్కి సరిహద్దులు ఉన్నాయేమో, మన ప్రేమకి సరిహద్దులు లేవు, హ్యాపీ బర్త్ డే టు మై లవ్. లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదవండి: కరోనా ఎఫెక్ట్.. మరో భారీ బడ్జెట్ చిత్రం వాయిదా చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ భార్యకు కరోనా సోకినప్పటికి వేరువేరుగా ఉంటూ నితిన్ బర్త్డే సెలబ్రేట్ చేయడం చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక భార్య పట్ల నితిన్కు ఉన్న ప్రేమను మెచ్చుకుంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తన వైఫ్కు కరోనా రావడంతో వాళ్ళ ఇంట్లో పైన ఒక రూమ్లో ఆమె ఐసోలేషన్లో ఉంది. దీంతో ఆమె కిటికి లోంచి చూస్తూ ఉంటే కింద గార్డెన్ ఏరియాలో నితిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి విషెష్ తెలియచేశాడు. కింద నుంచే కేక్ చూపించి తిను అన్నట్లు చెప్పాడు నితిన్. ఇలా దూరం దూరంగా ఉండి నితిన్ తన వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశాడు. COVID has barriers… But LOVE has no BARRIERS.. HAPPY BIRTHDAY MY LOVE❤️ LIFE lo 1st time nuvvu negative kavalani korukuntunnanu 😘😘 pic.twitter.com/5zFuOOIaqe — nithiin (@actor_nithiin) January 6, 2022 -
మాచర్ల నియోజకవర్గం: కలెక్టర్గారు వచ్చేది అప్పుడే!
Nithins Macherla Niyojakavargam Movie Locks Its Release Date: నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎంఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో నితిన్ సరసన కృతీశెట్టి హీరోయిన్గా కనిపిస్తారు. జిల్లా కలెక్టర్ పాత్రలో నితిన్ కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘నితిన్ను కొత్త అవతారంలో చూపించే సినిమా ఇది. ఈ చిత్రంలో రాజకీయ అంశాలు హైలైట్గా ఉంటాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. -
బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు!
Comedian Brahmanandam Sacked From Nithiin Movie?: ఒకప్పుడు ఏడాది పొడవునా వరుస పెట్టి సినిమాలు చేసే టాలీవుడ్ హాస్యబ్రహ్మ, ప్రముఖ నటుడు బ్రహ్మానందం కొంతకాలంగా సినిమాల సంఖ్యను తగ్గించాడు. వయస్సు రీత్యా ప్రస్తుతం ఆయన పరిమిత స్థాయిలో సినిమాలకు మాత్రమే టైం కేటాయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ దరకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి బ్రహ్మానందంను తొలిగించి నితిన్ ఆయనకు షాక్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో ఈ వార్త హాట్టాపిక్గా మారింది. నితిన్కు బ్రహ్మీకి మధ్య ఏం జరిగిందని, ఆయనను సినిమా నుంచి తొలగించేంత పెద్ద విషయం ఏం జరిగిందా? అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. దీనికి కారణం ఇదేనంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కోసం మూవీ టీం వైజాగ్ వెళ్లారని, ఈ 10 రోజుల షూటింగ్ షెడ్యూల్కు నితిన్తో పాటు బ్రహ్మానందం కూడా పాల్గొనాల్సి ఉందట. కానీ బ్రహ్మానందం అనుకున్న సమయానికి షూటింగ్కు రాకపోవడం, డైరెక్టర్ చెప్పినట్టు చేయకపోవడంతోనే ఆయనను సినిమా నుంచి తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట. అయితే దీనిపై డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ నుంచి ఎలాంటి కామెంట్ రాలేదు. ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం తీరుతో విసుగిపోయిన నితిన్ ఆయనను పక్కకు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాకు బ్రహ్మీ ఒక్క రోజుకు 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అంటే 10 రోజులకు రూ. 50 లక్షలన్నమాట. ఈ పారితోషికాన్ని అడ్వాన్స్గానే చెల్లించాడట నితిన్. అయితే పారితోషికం నష్టపోయిన ఫర్వాలేదు కానీ ఆయనను భరించాల్సి అవసరం లేదని మేకర్స్ అభిప్రాయపడ్డంటూ టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే నితిన్ కానీ, మూవీ టీం కానీ ఈ రూమార్స్పై స్పందించే వరకు వేచి చూడాలి. -
మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్ గాంధీ కూతురు
Tamanna Fan Cried After Watching Maestro: మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకు హీరోయిన్గా కుర్రకారును ఆకట్టుకుంటూ లేడీ ఫ్యాన్స్ను అలరిస్తూ వచ్చింది. ప్పుడూ అల్లరి, అమాయక పాత్రలు పోషించి అందరి మదిని దోచిన ఈ బ్యూటీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. అలాంటి సమంత తన తాజాగా చిత్రం ‘మాస్ట్రో’ నెగిటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.ఇందులో తమన్నా వరుస హత్యలు చేస్తూ సైలెంట్ కిల్లర్ పాత్ర పోషించి ఫ్యాన్స్ను భయపెట్టింది. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో ఒక్కసారిగా తన నెగిటివ్ షెడ్ను చూపించేసరికి ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. చదవండి: సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్ ఈ క్రమంలో తమన్నాను అలా చూసి ఏకంగా ఓ చిన్నారి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి ఎవరో కాదు డైరెక్టర్ మేర్లపాక గాంధీ చిన్న కూతురు లిపి. ఆమె తమన్నాకు పెద్ద ఫ్యాన్ అట. ఈ క్రమంలో నిన్న మాస్ట్రో మూవీ చూసిన లిపి తమన్నాను అలా చూసి ఏడుపు మొదలు పెట్టిన వీడియోను హీరో నితిన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. దీనికి ‘వాట్ యా.. నీ ఫ్యాన్ను ఏడింపించావు. ఈ రోజు నేను చూసిన క్యూట్ వీడియో ఇది. దర్శకుడు గాంధీ చిన్నకూతురు లిపి.. నీకు పెద్ద ఫ్యాన్’ అంటూ తమన్నాను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన తమన్నా ‘తప్పకుండా ఆ చిన్నారికి హగ్ ఇవ్వాల్సిందే’ అని కామెంట్ చేసింది. చదవండి: ‘మ్యాస్ట్రో’ మూవీ రివ్యూ ఇక ఈ వీడియోలో ఆ చిన్నారి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా.. గాంధీ తమన్నా బ్రెయిన్ మార్చేశాడు అంటూ కన్నీరూ పెట్టుకుంటుంటే ఆమె తండ్రి డైరెక్టర్ గాంధీ తమన్నా నీ ఫేవరేట్ హీరోయిన్ హా అని అడుగుతాడు. అవును అనగానే అయితే ఇప్పుడు ఏమైందీ అనడంతో ఆ పాప తను ఎందుకు అలా అందరిని చంపుతుంది అంటూ ఏడ్చేసింది. ఆ తర్వాత ఆమె తల్లి అది సినిమాలే అంటూ నచ్చజెప్పింది. కాగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మాస్ట్రో మూవీ శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైంది. బాలీవుడ్ చిత్రం ‘అంధాదున్’కు రీమేక్గా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో అందుడిగా నితిన్, లేడీ విలన్గా తమన్నా పాత్రలకు మంచి రెస్పోన్స్ వస్తోంది. @tamannaahspeaks what ya… you made your fans cry? 😂… this was the cutest video I saw today .. Thats Gandhi’s little daughter Lipi who’s a big fan of you 🤗 MAESTRO only on @DisneyPlusHS pic.twitter.com/PtbwPMlG43 — nithiin (@actor_nithiin) September 17, 2021 -
ఈ సమయంలో మాస్ట్రో అవసరమా అనుకున్నా: నితిన్
‘‘అంధాధున్’ కాస్త కల్ట్ సినిమా. తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నప్పుడు కొంచెం భయం వేసింది. ఈ సమయంలో అవసరమా? కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోవచ్చు కదా? అని. కానీ ఒక నటుడిగా రిస్క్ తీసుకోవాలి. ఇలాంటి ఆర్టిస్టిక్ సినిమా చేయాలని ఒప్పుకున్నా’’ అన్నారు నితిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాస్ట్రో’. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న డిస్నీప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ.. ‘‘అంధాధున్’ రీమేక్కి డైరెక్టర్ ఎవరు? అనుకుంటే మా అందరి ఛాయిస్ మేర్లపాక గాంధీ. ఒరిజినల్ సోల్ మిస్ కాకుండా హ్యమర్ యాడ్ చేసి బాగా తీశాడు. ‘అంధా ధున్’ ఎంత బాగుంటుందో ‘మాస్ట్రో’ కూడా అంతే బాగుంటుంది. హిందీలో నటీనటులే ‘అంధాధున్’ని ఒక లెవల్కి తీసుకెళ్లారు. మన తెలుగులో నేను, తమన్నా, నభాతో పాటు అందరం బాగా చేశాం. కొన్ని రిస్క్లు కూడా తీసుకున్నాం. ఈ సినిమాలో మంగ్లీతో యాక్టింగ్ చేయించడం ఒక డేరింగ్ స్టెప్’’ అన్నారు. చిత్రసమర్పకులు రాజ్కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ.. ‘‘అంధా ధున్’ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి రీమేక్గా రుపొందిన ‘మాస్ట్రో’ చిత్రానికి నటీనటులను ఎంచుకోవడం పెద్ద ఛాలెంజ్. నితిన్, తమన్నా, నభా నటేశ్, నరేశ్.. ఇలా అందరి పాత్రలు చాలా బాగుంటాయి. మేర్లపాక గాంధీ ప్యాషనేట్ డైరెక్టర్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిగార్లతో కలసి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. నిఖితా రెడ్డి మాట్లాడుతూ..‘‘మేర్లపాక గాంధీ ఈ రీమేక్ని చాలా బాగా చేశారు. నితిన్, తమన్నా, నభా నటేశ్తో పాటు అందరూ వారి వారి పాత్రలకు సరిగ్గా సరిపోయారు’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ.. ‘అంధా ధున్’ లాంటి సినిమాకి భాష అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో వస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనుకున్నాను. ఇప్పుడు వస్తోంది. లవ్స్టోరీ కాకుండా ఓ డిఫరెంట్ మూవీలో నితిన్తో కలిసి యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది. అంధుడిగా యాక్ట్ చేయడం చాలా కష్టం. నితిన్ అలాంటి పాత్రకు ఓకే చెప్పి ధైర్యంగా ముందడుగు వేశారు. ఓ సక్సెస్ఫుల్ సినిమాను మేర్లపాక గాంధీగారు తనదైన స్టైల్లో తీశారు. ఆయన కష్టం ప్రేక్షకులకు నచ్చుతుందను కుంటున్నాను’’ అని అన్నారు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ‘‘నితిన్ అన్నతో ఓ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ‘అంధాధున్’ లాంటి మంచి ఆర్టిస్టిక్ ఫిల్మ్ని తనతో చేయడం హ్యాపీ. ‘అంధా ధున్’కు, ‘మాస్ట్రో’కు పోలికలు పెట్టవద్దన్నా పెడతారు. నిందించడానికో లేదా అభినందించడానికో అయినా సరే.. సినిమా చూడండి’’ అన్నారు. ఈ వేడుకలో నభా నటేష్, వీకే నరేశ్, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్, పాటల రచయితలు కాసర్ల శ్యామ్, భాస్కర భట్ల, గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ అంటారు!
‘‘రీమేక్ సినిమాకి పోలికలు పెడతారు. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే కాపీ, పేస్ట్ అని ఆరోపిస్తారు. మార్పులు చేస్తే ఒరిజినల్ ఫిల్మ్ సోల్ను చెడగొట్టారని విమర్శిస్తారు. రీమేక్స్కి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ఇకపై రీమేక్స్ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు మేర్లపాక గాంధీ. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్’కి రీమేక్గా రూపొందిన ‘మాస్ట్రో’కు మేర్లపాక గాంధీ దర్శకుడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ చెప్పిన విశేషాలు. ►‘అంధా ధున్’లోని థ్రిల్లింగ్, డార్క్ హ్యూమర్ అంశాలు నచ్చి, రీమేక్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత నితిన్, సుధాకర్ రెడ్డిగార్లు ఈ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారు. మన నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్స్టోరీని మార్చాం. ఒరిజినల్ సినిమాలోని కొన్ని ఫ్రేమ్స్ను అలాగే వాడాం. ‘మాస్ట్రో’లో నితిన్ అంధుడిగా బాగా నటించారు. హిందీలో టబు చేసిన రోల్కు తమన్నాను తీసుకోవాలన్నది నా ఆలోచనే. ►ఒక స్క్రిప్ట్ అనుకుని డెవలప్ చేస్తూ, కొన్ని నెలలు ట్రావెల్ చేశాక ఎగై్జటింగ్గా అనిపించకపోతే ఇంకో కొత్త స్క్రిప్ట్ను స్టార్ట్ చేస్తా. అందుకే నా సినిమాల మధ్య గ్యాప్ వస్తోంది. సినిమాలను ఫాస్ట్గా తీస్తాను కానీ కథలు రాయడంలో మాత్రం కాస్త లేట్. మా నాన్న (రచయిత మేర్లపాక మురళి)గారు నావెల్స్ రాస్తుంటారు.‘ఏక్ మినీ కథ’ సినిమా కథ నాదే. నాన్నగారు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సినిమా నచ్చుతుందనుకుని చేశాను. పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. -
ప్రారంభమైన నితిన్ కొత్త చిత్రం, ఆకట్టుకుంటున్న మోషన్ పోస్టర్
యంగ్ హీరో నితిన్ 31వ సినిమా ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో నితిన్కు జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ రోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి క్లాప్ కోట్టారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ను ఖారారు చేస్తూ టైటిల్, మోషన్ పోస్టర్లను విడుదలను చేశారు మేకర్స్. హీరో నితిన్ వెనుక భాగం చూపిస్తూ వదిలిన ఈ పోస్టర్లో మూవీ పేరు ‘మాచర్ల నియోజకవర్గం’గా వెల్లడించారు. ఇక మోషన్ పోస్టర్లో విధ్వంసం సృష్టించిన విలన్ గ్యాంగ్ తన వైపుకు దూసుకు వస్తుంటే, ధైర్యంగా వాళ్లకి ఎదురు నిలిచిన యువకుడిగా నితిన్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఈ మూవీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థపై నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ను జరుపుకోనుంది. -
నితిన్ మాస్ట్రో మూవీ ఇంట్రెస్టింగ్ వీడియో
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్లో సెప్టెంబర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్లుక్, టీజర్, ట్రైలర్ మంచి స్పందన వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లో అంధుడిగా నితిన్ లుక్, తమన్నా రోల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉండగా నేడు(ఆగష్టు 30) క్రిష్ణాష్టమి సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో బయటకు వచ్చింది. క్రిష్ణాష్టమి పండుగ సందర్భంగా నితిన్ అభిమానుల కోసం స్నీక్పీక్ పేరుతో మేకర్స్ ఈ విడియోను విడుదల చేశారు. చదవండి: సెప్టెంబర్ 17న నితిన్ మాస్ట్రో: హాట్స్టార్ ప్రకటన Here's the Sneak Peek of #MAESTRO's World🎹 ▶️ https://t.co/IPzacMAkMa Set your clock! #MaestroOnHotstar from Sep17th only on @DisneyPlusHS @actor_nithiin @tamannaahspeaks@NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #RajKumarAkella pic.twitter.com/AK4Ylg340M — Sreshth Movies (@SreshthMovies) August 30, 2021 నితిన్ పియానో వాయిస్తుండగా పిల్లి మెట్లపై నడుచుకుంటూ వస్తున్న ఈ వీడియో మూవీపై మరింత హైప్ను క్రియేట్ చేస్తోంది. హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాధూన్’ను తెలుగు రీమేక్గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కింది. ఇది నితిన్ 30వ మూవీ కావడం విశేషం. నితిన్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ మూవీకి ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నభా నటేష్, తమన్నాలు కథానాయికలుగా నటిస్తున్నారు. చదవండి: ఆయనో స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ.. -
సెప్టెంబర్ 17న నితిన్ మాస్ట్రో: హాట్స్టార్ ప్రకటన
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్లో సెప్టెంబర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా డిస్నీహాట్ స్టార్ సంస్థ దీనిపై అధికారిక ప్రకట ఇచ్చింది. హీరో నితిన్ ఇది 30వ చిత్రం. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ను తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్లో నితిన్ నల్లటి కళ్లద్దాలు ధరించి చేతిలో కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. చదవండి: పవన్ ఫ్యాన్స్కు బండ్ల గణేశ్ గుడ్ న్యూస్.. థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ #Maestro Premiers Sept 17 on HOTSTAR. pic.twitter.com/S0danwjiOV — Christopher Kanagaraj (@Chrissuccess) August 28, 2021 ఈ సినిమాలోని ప్రధాన తారాగణంతో ఈ పోస్టర్ను విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్ర పోషించింది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై ఎన్.సుధాకర్ రెడ్డి-నికిత రెడ్డిలు ఈ మూవీని నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. -
ఆకట్టుకుంటున్న కల్యాణ్దేవ్ ‘కిన్నెరసాని’ టీజర్
'విజేత' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఈ మెగా హీరో ప్రస్తుతం కిన్నెరసాని అనే సినిమాలో నటిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది క్యాప్షన్. తాజాగా ఈ మూవీ టీజర్ను హీరో నితిన్ విడుదల చేశారు. ‘అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి, ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి. అది ద్వేషానికైనా..ప్రేమకైనా'.. అనే డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా టీజర్ ఆద్యంతం సస్పెన్స్ను క్రియేట్ చేస్తుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ శీతల్ ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తుంది. మహతి స్వరసాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. Happy to launch the interesting #KinnerasaniTeaser💥 Wishing the director @RamanaTeja9, dear @IamKalyaanDhev, producer @itsRamTalluri and the entire team all the luck🤗 👉 https://t.co/hRBIGpIP87#Kinnerasani@SRTmovies @annsheetal1 @RavindraVijay1 @Desharaj12 @mahathi_sagar — nithiin (@actor_nithiin) August 27, 2021 చదవండి :మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు! -
ఏదో మిస్సవుతోంది!
నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్ట్రో’ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. ‘కళ్లు కనబడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు. కానీ అందులో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి’, ‘బట్ సమ్థింగ్ ఈజ్ మిస్సింగ్’ (ఏదో మిస్సవుతోంది)’ అనే సంభాషణలు ట్రైలర్లో ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
ఆసక్తిగా నితిన్ ‘మాస్ట్రో’ మూవీ ట్రైలర్, సరికొత్తగా తమన్నా..
హీరో నితిన్- నభా నటేశ్ జంటగా రూపొందుతున్న చిత్రం మాస్ట్రో. నితిన్ 30వ సినిమాగా మేర్లపాక గాంధీ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్స్టార్లో సెప్టంబర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చిత్ర బృందం ట్రైలర్ని విడుదల చేసింది. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సాగిని ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. అంధుడిగా నితిన్ నటన మెప్పిస్తోంది. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. ఇక తమన్నా ఇందులో నెగిటివ్ రోల్లో భయపెట్టనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది’ అంటూ తమన్నా చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ముఖ్యం నితిన్-తమన్నా మధ్య సాగే సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇలా ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేస్తోంది. కాగా మాస్ట్రో హిందీ చిత్రం ‘అంధాధున్’కు రీమేక్గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డిలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. (చదవండి: నాని బాటలోనే హీరో నితిన్.. ‘మాస్ట్రో’ నిర్మాతల క్లారిటీ) చదవండి: ఫుట్బోర్డ్ చేస్తూ సమంత, నయన్, విజయ్.. వీడియో వైరల్ -
నాని బాటలోనే హీరో నితిన్.. ‘మాస్ట్రో’ నిర్మాతల క్లారీటీ
ఇప్పటికీ థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో పెద్ద సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయంటూ కొద్ది రోజులు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో నాని టక్ జగదీష్, నితిన్ మాస్ట్రో, నాగచైతన్య లవ్స్టోరీ, గోపిచంద్ సిటీమార్తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. అయితే ఇవి వట్టి పుకార్లేనని సదరు సినీ మేకర్స్ ఖండిస్తూ వచ్చారు. అయితే ఈ రూమార్లను నిజం చేస్తూ టక్ జగదీష్ మూవీ ఓటీటీలోనే విడుదల అవుతున్నట్లు ఇప్పటికే హీరో నాని ప్రకటించగా తాజాగా ఆయన బాటలోనే నితిన్ కూడా చేరాడు. చదవండి: Nani Tuck Jagadish: థియేటర్ల యాజమానుల అసంతృప్తి నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం మాస్ట్రో. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కాబోతుందని నితిన్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అలాగే మేకర్స్ సైతం ‘మాస్ట్రో’ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనితోపాటు ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు సినిమా ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. నితిన్, నభా, తమన్నాలతో కూడిన పోస్టర్ విడుదల చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు మేకర్స్. ఈ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రానికి తెలుగు రీమేక్గా రూపొందింది. చదవండి: నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లగా మాస్ట్రో తెరకెక్కింది. ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనుండా ఆయనకు జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. ఎప్పుడు షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎప్పుడో విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. Trailer of #MAESTRO will b out on 23rd AUGUST at 5p.m 😃😃 #MaestroTrailerOn23rd https://t.co/9cnc8X9F6f — nithiin (@actor_nithiin) August 20, 2021 -
ప్రేమకథ చీకటిని మిగిల్చిందంటున్న నితిన్
Vennello Aadapilla Full Song: ఈ ఏడాది రెండు వరుస ఫ్లాఫులతో నిరాశలో ఉన్నాడు హీరో నితిన్. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆశపడుతున్నాడు. అతడు అంధుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నభా నటేష్ హీరోయిన్గా తమన్నా భాటియా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమాలోని‘అనగనగా అందమైన కథగా మొదలైన ఈ మనసే.. వెన్నెల్లో ఆడపిల్లే తనా.. ఈ చీకటై మిగిలానా..’ పూర్తి పాట రిలీజైంది. ఈ ఫీల్గుడ్ మెలోడీ సాంగ్ జనాలను ఆకట్టుకుంటోంది. అందంగా మొదలైన తన ప్రేమకథ చివరకు చీకటిని మిగిల్చిందని బాధపడుతున్నాడీ హీరో. మరి హీరో పాటతో హీరోయిన్ మనసు కరిగిందా? వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందా? అన్నది సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ పాటను స్వీకర్ అగస్తి ఆలపించారు. శ్రీజో–కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై ఎన్.సుధాకర్ రెడ్డి–నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్. -
వెన్నెల్లో ఆడపిల్లే తనా.. ఈ చీకటై మిగిలానా
Maestro Song: నితిన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. నభా నటేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర చేశారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై ఎన్.సుధాకర్ రెడ్డి–నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘అనగనగా అందమైన కథగా మొదలైన ఈ మనసే.. వెన్నెల్లో ఆడపిల్లే తనా.. ఈ చీకటై మిగిలానా..’ అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటకు సంగీతం అందించగా, స్వీకర్ అగస్తి ఆలపించారు. శ్రీజో–కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ పూర్తి పాటని ఈ నెల 6న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్. -
'మాస్ట్రో' :ఆ ఒక్క సాంగ్ కోసం అరకోటి ఖర్చుపెట్టారట!
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్కు రీమేక్ ఇది. నితిన్కు జోడీగా నభా నటేశ్ నటిస్తుండగా, హిందీలో 'టబు' చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రలు పోషించిన నటీనటులపై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారట. హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఒక్క పాట కోసమే మేకర్స్ దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమా ప్రమోఫన్స్లో ముఖ్యంగా ఈ పాటనే వాడతారట. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
‘మాస్ట్రో’ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది...
నితిన్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాదున్కు తెలుగు రీమేక్గా వస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని బేబీ..ఓ బేబి లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతులేని కళ్లలోకిలా అందం వచ్చి దూరితే ఎలా అంటూ సాగుతున్న ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రీజో లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి ఈ పాటను పాడారు. 'భీష్మ'తో నితిన్ కు మ్యూజికల్ హిట్ ఇచ్చిన మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు సిద్ధం కానుంది. -
‘మాస్ట్రో’ అప్డేట్ : లిరికల్ సాంగ్ ప్రోమో
నితిన్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా తమన్నా కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని బేబీ..ఓ బేబి సాంగ్ లిరికల్ ప్రోమో వీడియోను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. హిందీ హిట అంధాదున్కు తెలుగు రీమేక్గా ‘మాస్ట్రో’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
బేబమ్మ హవా.. మరో రెండు క్రేజీ ఆఫర్లు కొట్టేసిన కృతీ శెట్టి
తొలి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ అంతా క్రేజ్ సంపాదించుకుంది కన్నడ భామ కృతీ శెట్టి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఉప్పెన మూవీలో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ భారీ హిట్ సాధించి 100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే తొలి మూవీ విడుదలకు ముందే కృతీ తెలుగులో పలు ప్రాజెక్ట్స్కు సంతకం చేసింది. నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీతో పాటు సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో రూపొందుతున్న ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనే రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్గా ఆఫర్ కొట్టెసింది. అలాగే లిగుస్వామి, రామ్ పోతినేని కాంబినేషన్లో రాబోతోన్న ఉస్తాద్ మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరో రెండు ప్రాజెక్ట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జున్ అక్కినేని హీరోగా బంగార్రాజు మూవీ రానున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయన మూవీకి సిక్వెల్గా కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడు. త్వరలోనే ఈ సిక్వెల్ను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు నాగార్జున రెడీ అవుతున్నాడు. అయితే ఈ మూవీలో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండగా ఆయనకు జోడీగా కృతీ శెట్టిని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే చైకి జోడిగా సమంత, మలయాళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా బజ్ ప్రకారం మేకర్స్ కృతీ శెట్టిని నాగ చైతన్యకు జోడిగా తీసుకోవాలని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. బేబమ్మ (కృతిశెట్టి) బంగార్రాజు తారాగణంలో చేరిపోతుందా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. దీనితో పాటు కృతీ యంగ్ హీరో నితిన్తో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. -
వామ్మో.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న పూజా హెగ్డే
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్తో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతుంది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్నవి దాదాపు పాన్ ఇండియా సినిమాలే. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట. ప్రస్తుతం నితిన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న ఓ సినిమాకు పూజా సైన్ చేసినట్లు సమాచారం. ఈ మూవీకి గాను ఏకంగా రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. ఇందుకు నిర్మాతలు కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే దక్షిణాదిన భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల లిస్ట్లోకి పూజా హెగ్డే కూడా చేరిపోయింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య, ప్రభాస్తో రాధే శ్యామ్ పాన్ ఇండియా చిత్రాలతో పాటు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలోనూ నటిస్తుంది. ఇవి కాకుండా తమిళంలో విజయ్తో బీస్ట్, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో ‘కభీ ఈద్... కభీ దీవాలి’ చిత్రంలోనూ నటిస్తుంది. చూస్తుంటే మరో రెండేళ్ల పాటు బుట్టబొమ్మ డేట్స్ ఫుల్ బిజీగా ఉన్నట్లున్నాయి. -
నితిన్ స్పీడ్ మామూలుగా లేదుగా..
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో సూపర్ హిట్ అయిన అంధాదున్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నితిన్కు జోడీగా నభా నటేష్ నటిస్తుండగా, తమన్నా నెగిటివ్ షేడ్లో కనిపించనుంది. కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలె మొదలైంది. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టిన తొలి తెలుగు హీరో నితిన్ నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముగిసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. అతి త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. ఇక తెలంగాణలో లాక్డౌన్ను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రం థియేటర్లో విడుదల కానున్నట్లు సమాచారం. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాకు జె యువరాజ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. చదవండి : ప్రశాంత్ వర్మ హనుమాన్ : కీలక పాత్రలో 'జయమ్మ' 'రాజా విక్రమార్క'గా కార్తికేయ..ఫస్ట్లుక్ విడుదల -
నితిన్ డేరింగ్ స్టెప్: షూటింగ్ మొదలు
గతేడాది భీష్మతో భారీ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. కానీ ఏడాది మాత్రం అతడు నటించిన రెండు సినిమాలు చెక్, రంగ్దే నిరాశనే మిగిల్చాయి. దీంతో అతడు అంధుడిగా నటిస్తున్న మాస్ట్రోతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ అర్ధాంతరంగా ఆగిపోయింది. తాజాగా హైదరాబాద్లో మాస్ట్రో ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నారట. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టిన తొలి తెలుగు హీరో నితినే కావడం విశేషం. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న మాస్ట్రోలో నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: రంగ్దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే -
‘రంగ్దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ రీలీజైన నాటి నుంచి చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నితిన్-కీర్తి చేసిన ప్రమోషన్ వీడియోలు ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. జూన్ 12 నుంచి జీ5లో రంగ్దే సినిమా స్ర్టీమింగ్ కానుంది. దీనికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. Miru entagano eduruchustunna rangu rangula prema indrajalam #RangDe premieres 12th June nunchi #ZEE5 lo matrame.https://t.co/0VsbNRwblf#RangDeOnZEE5 #Premieres12thJune #ZEE5@actor_nithiin @KeerthyOfficial #VenkyAtluri @ThisIsDSP pic.twitter.com/l2K9iSuEPQ — ZEE5 Telugu (@ZEE5Telugu) May 28, 2021 -
Its Official: చెక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
గతేడాది భీష్మతో హిట్టు కొట్టిన యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్తో అభిమానుల ముందుకొచ్చాడు. కానీ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి అందించిన డిఫరెంట్ కాన్సెప్ట్ జనాలకు కొత్తదనాన్ని పంచింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూళ్లు కురిపించనప్పటికీ మంచి ప్రశంసలైతే దక్కాయి. ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మే 14 నుంచి సన్ నెక్స్ట్లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది కథ. కాగా ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో ప్రేయసిగా, రకుల్ ప్రీత్ సింగ్ న్యాయవాదిగా నటించారు. సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. కల్యాణీ మాలిక్ సంగీతం అందించాడు. ఏదేమైనా కోవిడ్ భయంతో థియేటర్లో చూడలేని వాళ్లు, లేదా ఇంకోసారి చూడాలనుకునేవాళ్లు ఇప్పుడు హాయిగా ఇంట్లోనే సన్ నెక్స్ట్ యాప్లో చూసేయొచ్చు. Youth Star @actor_nithiin 's #Check ♟️ will be Streaming on @sunnxt from May 14th. A @yeletics' s Film.#CheckOnSunnxt @Rakulpreet #PriyaPrakashVarrier @kalyanimalik31 @ShakthisreeG @HaricharanMusic @ShreeLyricist @BhavyaCreations @adityamusic pic.twitter.com/k2Ok60xjll — BARaju (@baraju_SuperHit) May 12, 2021 చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ -
కన్నడ రీమేక్లో నితిన్ హిట్ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా!
తేజా డైరెక్షన్లో నితిన్ హీరోగా పరిచమైన చిత్రం ‘జయం’. 2002లో వచ్చిన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ మూవీలో నటించిన హీరోహీరోయిన్తో పాటు మిగతా నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక గోపిచంద్ విలన్గా ఏ రేంజ్ నటించాడో అందరికి తెలిసిందే. ఇందులో నితిన్ సరసన కథానాయికగా సదా నటించిన విషయం తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ అదే పేరుతో తమిళంలో కూడా రీమేక్ అయ్యింది. ఇందులో హీరోగా రవి నటించగా.. అక్కడ కూడా సదానే హీరోయిన్గా నటించింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలోనూ సూపర్ హిట్ అయ్యింది. దీంతో హీరో రవి పేరు కాస్తా ‘జయం’ రవిగా మారిపోయింది. ఈ సినిమా వచ్చి నేటికి 18 ఏళ్లు. కాగా.. ఇన్నేళ్ల తర్వాత ‘జయం’ కన్నడలో రీమేక్కు సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రీమేక్కు ‘కేజీఎఫ్’ హీరో, కన్నడ రాక్స్టార్ యశ్ను హీరోగా పరిచయం చేసిన శశాంక్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడట. కర్ణాటకకు చెందిన ప్రవీణ్ అనే డాక్టర్ ఈ సినిమాతో హీరో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్న ప్రవీణ్ ఆ తర్వాత ఈ రీమేక్లో నటించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ఈమూవీ కన్నడ ప్రేక్షకులను ఎంతటి స్థాయిలో ఆకట్టుకంటుందో వేచి చూడాల్సిందే. -
డాషింగ్ డైరెక్టర్తో నితిన్ సినిమా, హీరోయిన్గా ఆ బ్యూటీ..
యంగ్ హీరో నితిన్ జోరుమీదున్నాడు. ఈ ఏడాది 'చెక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం అతడు హిందీ రీమేక్ 'మ్యాస్ట్రో' సినిమా చేస్తున్నాడు. ఇందులో అతడు అంధుడిగా కనిపించనున్నాడు. దీని తర్వాత నితిన్ వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ లవ్స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫిదా భామ సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇదిలా వుంటే నితిన్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో ఓ సినిమా చేయనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' పర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుండటం ఫిల్మీదునియాలో హాట్టాపిక్గా మారింది. ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతీశెట్టిని హీరోయిన్గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న పూరీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక నితిన్ సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది. చదవండి: నితిన్కు జోడీగా హైబ్రిడ్ పిల్ల... ఈసారైనా ఒప్పుకుంటుందా! ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేశారు: కీర్తి సురేశ్ -
నితిన్కు జోడీగా హైబ్రిడ్ పిల్ల... ఈసారైనా ఒప్పుకుంటుందా!
‘ప్రేమమ్’ సినిమాతో కేవలం మలయాళ ప్రేక్షకులనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది హైబ్రిడ్ పిల్లా సాయి పల్లవి. ఆ తర్వాత నటించిన ‘ఫిదా’ సినిమాలో సహజమైన నటన, తెలంగాణ యాసలో మాట్లాడి అందరి చూపు తనవైపుకు తిప్పుకుందామె. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికి ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది సాయి పల్లవి. దీనికి కారణం ఆమె ఎంచుకునే పాత్రలేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెమ్యునరేషన్ కంటే కూడా సినిమాలో తన పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది ఈ అమ్మడు. తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలోనే ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటోంది పల్లవి. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి హీరో నితిన్తో జత కట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’ సినిమాలో నటిస్తోన్న నితిన్ తన తర్వాతి చిత్రాన్ని వక్కంతం వంశీతో చేయనున్నట్లు టాలీవుడ్లో టాక్. రోమాంటిక్ లవ్స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రంలో సాయిపల్లవిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించి కథ వివరించినట్లు సమాచారం. దీనిపై ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిం ఉందట. అయితే గతంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ సినిమాలో హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత లేదన్న కారణంగా సాయి పల్లవి ఆ సినిమాకు నో చెప్పిందని వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. మరి ఇప్పుడైనా సాయిపల్లవి నిజంగానే నితిన్తో జతకడుతుందా లేదా అన్నది వేచి చూడాలి. -
నితిన్ బర్త్డే: మాస్ట్రో టీజర్ వచ్చేసింది
యంగ్ హీరో నితిన్ బర్త్డే నేడు. ఈ సందర్భంగా నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. మొదట అంధాదున్ అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ ప్రారంభించి ఈ మూవీకి ‘మాస్ట్రో’ అనే టైటిల్ ఖారారు చేసినట్లు మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. అంతేగాక నితిన్ బర్త్డే సందర్భంగా ఈ రోజు సాయంత్ర మూవీ నుంచి మరో అప్డేట్ కూడా రానున్నట్లు మూవీ యూనిట్ చెప్పింది. చెప్పినట్లుగానే మేకర్స్ ‘మాస్ట్రో’ టీజర్ను విడుదల చేసి అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చారు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. టీజర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకంటోంది. ఈ మూవీలో నభా నటేష్ నితిన్తో జతకట్టనుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తుంది. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ 11న ఈ మూవీ విడుదల కానుంది. చదవండి: నితిన్ బర్త్డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు -
పెళ్లి గురించి పెదవి విప్పిన కీర్తి సురేశ్
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్దే'. మార్చి 26న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ టాక్ అందుకుంది. రీల్ అండ్ రియల్ లైఫ్లో టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే వీళ్లిద్దరూ ఇటీవల సాక్షి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'మహానటి' కీర్తి సురేశ్ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది. మానవత్వం మెండుగా ఉండాలని కండీషన్ పెట్టింది. అంటే మనిషి మంచోడై ఉంటే అదే చాలు అని పేర్కొంది. ఇంకా తను పెళ్లాడే వ్యక్తి గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించట్లేదు అని చెప్పుకొచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనకు తెలియకుండానే మూడు నాలుగు సార్లు పెళ్లిళ్లు చేశారని నవ్వేసింది. అయితే తను నిజంగా పెళ్లి పీటలెక్కడానికి ఇంకా బోలెడంత టైమ్ ఉందని చెప్పుకొచ్చింది. హీరో నితిన్ హోలీ పండగ గురించి మాట్లాడుతూ.. హోలీ వేడుకల్లో రంగులైపోతే కోడి గుడ్లు, బురద కూడా పూసుకుంటామని చెప్పాడు. తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ అయినా చేయడం తన డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు. వీళ్లింకా ఏమేం విషయాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూసేయండి.. చదవండి: రవితేజ ‘ఖిలాడి’ టీమ్కి ఊహించని షాక్ ‘రంగ్దే’ మూవీ రివ్యూ -
నితిన్ బర్త్డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు
సాక్షి, హైదరాబాద్ : తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నితిన్. నేడు (మార్చి30)న 38వ ఏటలోకి అడుగుపెట్టాడు. పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే కావడంతో భార్య షాలిని సహా అత్యంత సన్నిహితుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి నితిన్ ఇంట్లో జరిగిన ఈ బర్త్డే వేడుకల్లో సింగర్ సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునీత-రామ్ దంపతులకు ఇటీవలె పెళ్లి అయిన సంగతి తెలిసిందే. వీరి ప్రీ వెడ్డింగ్కు సంబంధించిన ఓ పార్టీని హీరో నితిన్ స్వయంగా ఏర్పాటు చేశాడు. సునీత భర్త రామ్తో నితిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా నితిన్ బర్త్డే వేడుకల్లో అత్యంత సన్నిహితులే పాల్గొన్నారు. ఈ లిస్ట్లో సింగర్ సునీత దంపతులు కూడా ఉండటం విశేషం. కాగా ఈ ఏడాది చెక్సినిమాతో వచ్చిన నితిన్..రంగ్దే చిత్రంతో సక్సెస్ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. చదవండి : నితిన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? రామ్ అలా ప్రపోజ్ చేశాడు : సింగర్ సునీత -
హోలీగా..జాలీగా..నితిన్ బర్త్డే వేడుక
ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు హోలీ పండుగ సంబరాలను వినూత్నంగా నిర్వహిస్తోంది. హ్యాపీ మూడ్లో ఉండే వీక్షకుల ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోంది. దీనిలో భాగంగా రంగ్ దే ప్రేమ పేరుతో సాయంత్రం 6గంటలకు ప్రసారం చేసే హోలీ ఈవెంట్లో హీరో నితిన్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. అదే సమయంలో ఆయన తన పుట్టినరోజు వేడుకలు కాస్త ముందస్తుగా (మార్చి 30) నిర్వహిస్తుండడం విశేషం. అంతేకాకుండా హోలీ సందడికి ఊపునిస్తూ ‘తెల్లవారితే గురువారం’ సినిమా నటీ నటులు కూడా ఇందులో పాల్గొననున్నారు. ఇక జీ కుటుంబంలో హిట్ పెయిర్గా పేరొందిన జంటలు... అషికా–చందు, అనుష–ప్రతాప్, కల్కి–పూజ, సిద్ధార్ధ–మేఘన, ఆకర్ష్–భూమి...లు తమదైన నత్యాలతో అలరించనున్నారు. కుటుంబ విలువలను వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ రూపొందిన కొత్త ఫిక్షన్ షో కూడా హోలీ రోజునే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2.30గంటలకు మిఠాయి కొట్టు చిట్టమ్మ పేరుతో పిక్షన్ షో లాంచ్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయ పురంకు చెందిన చిట్టెమ్మ అనే మహిళ జీవిత కధ చుట్టూ ఈ షో తిరుగుతుంది. చదవండి : హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్ ‘రంగ్దే’ మూవీ రివ్యూ -
‘నాకన్నా నితిన్, కీర్తి ఎక్కువ నమ్మారు’
‘‘నా జీవితంలోని ప్రేమకథలనే నేను సినిమాలుగా తీస్తున్నానని కొందరు అంటారు. అది కరెక్ట్ కాదు. నా జీవితంలో ప్రేమకథలే లేవు. నా తొలి రెండు చిత్రాలు ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’లో ఎంటర్టైన్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. ‘రంగ్ దే’లో హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి’’ అన్నారు వెంకీ అట్లూరి. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘రంగ్ దే’ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు. ► ‘రంగ్ దే’ కథను నితిన్ కు చెప్పినప్పుడు ఆయన కమర్షియల్ సినిమా ‘భీష్మ’ చేస్తున్నారు. అలాగే ‘పవర్పేట’ అనే ఓ పొలిటికల్ మూవీ కమిటయ్యారు. ఈ సమయంలో నా కథకు ఓకే చెబుతారా? అనిపించింది. కానీ ఓకే అన్నారు. ఫస్ట్ సిట్టింగ్లోనే నితిన్, కీర్తి సినిమాకు ఓకే చెప్పారు. ఈ కథను ఇద్దరూ నాకన్నా ఎక్కువగా నమ్మారు. వారి నమ్మకం నాలో ధైర్యాన్ని పెంచింది. ► పక్క పక్క ఇళ్లల్లో ఉండే ఓ అమ్మాయి, అబ్బాయిల మధ్య చదువు, కెరీర్... ఇలా ప్రతి విషయంలోనూ పోలిక పెడుతుంటారు. అందుకే మొదట్లో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అన్నదే ‘రంగ్ దే’ కథ. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కెమెరా మ్యాన్ పీసీ శ్రీరామ్గారితో వర్క్ చేయడం వల్ల దర్శకుడిగా మెరుగయ్యాను. నా తర్వాతి సినిమాను సితార, ‘దిల్’ రాజు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. -
హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్
నితిన్- కీర్తి సురేష్లు జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్లో టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకున్న వీరిద్దరూ రియల్లైఫ్లోనూ తెగ హంగామా చేసేస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో ఇది స్ఫష్టంగా కనిపిస్తుంది. రంగ్ దే షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి అల్లరికి హద్దు లేకుండా పోయింది.షూటింగ్ గ్యాప్లో చిన్న కునుకు తీస్తే దాన్ని ఫొటో తీసి రచ్చ చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో నితిన్. దీంతో వీళ్ల మీద కక్ష కట్టిన కీర్తి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. అన్నట్లుగానే వెంకీని పరిగెత్తించి మరీ సరదాగా కొట్టింది. ఇక నితిన్ ఫొటోను ఎడిట్ చేసి ఆడుకుంది. ఇటీవలె అను కనిపించడం లేదంటూ హీరోయిన్ కీర్తి రెండు జడలు వేసుకున్న చిన్నప్పటి ఫొటోను షేర్ చేసి ఆమెను ఆటపట్టించారు నితిన్. తాజాగా కీర్తి సురేష్ వల్ల తమ బతుకు బస్టాండ్ అయ్యిందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఓ ఈవెంట్ అనంతరం రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తిందామని రెడీగా పెట్టుకున్న తమకు కీర్తి షాకిచ్చిందని, మేం తినే తిండి మొత్తం కీర్తి ఒక్కతే తింటుందంటూ బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. అంతేకాకుండా నితిన్కి సపోర్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చేరి అహా నా పెళ్ళంట సినిమాలోని వివాహ భోజనంబు అనే పాట పాడుతూ కీర్తిని ఆట పట్టించారు. అయితే ఇవేమీ పట్టించుకోని కీర్తి...హ్యాపీగా తనకు ప్లేట్లోని ఐటెమ్స్ను తింటూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా నితిన్- కీర్తి చేస్తున్న అల్లరి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మొదటిసారి వీరిద్దరూ జోడిగా కలిసి నటించిన రంగ్దే చిత్రం మార్చి 26న రిలీజ్ అవుతోంది. All Our DINNER being eaten by One Person.. ANU.. 🙈🙈🙈 BusStande BusStande Ika Bathuke BusStande.. 😂🤣😂🤣@actor_nithiin @KeerthyOfficial @dirvenky_atluri @vamsi84 @SitharaEnts @ShreeLyricist @pcsreeram @haarikahassine pic.twitter.com/KeiPEPh8N1 — DEVI SRI PRASAD (@ThisIsDSP) March 24, 2021 చదవండి : కీర్తి సురేశ్ మిస్సింగ్: నితిన్ ఫిర్యాదుకు పోలీసుల రిప్లై! హీరో ఊరించాడు.. కంట్రోల్ చేసుకోలేకపోయిన నటి -
హీరోయిన్పై పిడిగుద్దులు కురిపించిన నితిన్!
రంగ్ దే ట్రైలర్లో హీరోహీరోయిన్లు నితిన్, కీర్తి సురేశ్ టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటారు. రియల్ లైఫ్లోనూ అంతే.. వీరిద్దరూ కీచులాడుకుంటారు. కాకపోతే సీరియస్గా కాదు, సరదాగా! ఇక రంగ్ దే షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి అల్లరికి హద్దు లేకుండా పోయింది. షూటింగ్ గ్యాప్లో చిన్న కునుకు తీస్తే దాన్ని ఫొటో తీసి రచ్చ చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో నితిన్. దీంతో వీళ్ల మీద కక్ష కట్టిన కీర్తి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. అన్నట్లుగానే వెంకీని పరిగెత్తించి మరీ సరదాగా కొట్టింది. ఇక నితిన్ ఫొటోను ఎడిట్ చేసి ఆడుకుంది. అయితే నితిన్ ఊరుకుంటాడా? కీర్తి సురేశ్ కనిపించడం లేదు అంటూ ఆమె పాస్పోర్టు ఫొటోను షేర్ చేయడం.. 'ఏం భయపడకండి, మేము చూసుకుంటాం' అని పోలీసులు అభయమివ్వడం చకచకా జరిగిపోయాయి. తాజాగా నితిన్ తన ముఖం మీద పంచ్లు కురిపించిన వీడియోను షేర్ చేసింది కీర్తి. 'ఫేక్ పంచ్ నిజంగా మారితే ఇలా ఉంటుంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో కోపంతో ఊగిపోతున్న నితిన్ బాక్సర్గా మారి హీరోయిన్ ముఖం మీద ఒక్కటిచ్చాడు. దీంతో కళ్లు బైర్లు కమ్మి కీర్తి పడిపోగా ఆమె చేతిలో ఉన్న రిమోట్ లాక్కున్నాడు. ఇక ఈ వీడియోపై నితిన్ స్పందిస్తూ.. నిజంగా కావాలని కొట్టలేదు అను అని కొంటెగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Nijanga KAVALANI kottaledhu anu 😜😜😈😈😈#RangDeOn26thMarch https://t.co/kWTdMFtq0b — nithiin (@actor_nithiin) March 23, 2021 చదవండి: కీర్తి సురేశ్ మిస్సింగ్: నితిన్ ఫిర్యాదుకు పోలీసుల రిప్లై! -
జీవితంలోని ఏడురంగులను చూపించే సినిమా 'రంగ్ దే'
‘‘అన్ని జంతువులూ నవ్వలేవు. కేవలం మనిషి మాత్రమే నవ్వగలడు అంటారు. అలాగే అన్ని జంతువులకు వస్తువులు బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి. మనుషులకు మాత్రమే ఏడురంగులు చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా కూడా మీకు జీవితంలో ఉన్న ఏడురంగులను చూపిస్తుంది’’ అన్నారు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్. నితిన్ , కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూశాను. అర్జున్ , అను నాకు బాగా నచ్చారు. నేను తీసిన ‘అఆ’ సినిమాలో అఅ ఉన్నాయి. ఈ సినిమాలో (అర్జున్, అను) క్యారెక్టర్స్ ఉన్నాయి. ’అఆ!’ను మించి ‘రంగ్ దే’ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నితిన్ నాకు బ్రదర్. అతను నటించిన ఏ సినిమా అయినా హిట్ కావాలని కోరుకుంటాను. ఎలాంటి పరిస్థితులనుంచైనా పాటను ఇవ్వగలడు దేవిశ్రీ ప్రసాద్.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’అని అన్నారు. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ వేదికపై నా ‘అఆ!’ సినిమా ఫంక్షన్ జరిగింది. దర్శకుడు వెంకీ ఈ సినిమాను బాగా తీశాడు. ఈ నిర్మాతలతో ఇది నా మూడో సినిమా. నా ఫ్లాప్ మూవీస్ తర్వాత నాకో హిట్ ఇస్తున్న నిర్మాతలు పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, చినబాబులకు థ్యాంక్స్. దేవిశ్రీతో నాది ఫస్ట్ కాంబినేషన్ . మంచి ఆల్బమ్ ఇచ్చారు’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘అర్జున్ , అను క్యారెక్టర్లకు ప్రాణం పోసిన నితిన్ , కీర్తీ సురేష్కు థ్యాంక్స్. కోవిడ్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్లు జరగకపోయినా చిత్రయూనిట్ జీతాలు చెల్లించారు నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ. నిర్మాతలంటే నాకు మరింత గౌరవం పెరిగింది. పీసీ శ్రీరామ్గారితో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన దగ్గర నేను రోజుకో విషయం నేర్చుకున్నాను’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలకు నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేయాల్సింది.. కుదర్లేదు. ఈ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. యూత్ఫుల్గా ఉండే మెచ్యూర్డ్ లవ్స్టోరీ ‘రంగ్ దే’. నితిన్ కెరీర్లో ఈ సినిమా మరో హిట్గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
'రంగ్దే' మూవీ ట్రైలర్ లాంచ్ ఫోటోలు
-
హీరోయిన్ కనబడుట లేదు: డోంట్ వర్రీ అంటున్న పోలీసులు
సినిమా షూటింగ్ను కూడా పిక్నిక్ స్పాట్గా మార్చేసి తెగ అల్లరి చేసింది ఎవరా అంటే రంగ్దే టీమ్ పేరే వినిపిస్తుంది. ఆ మధ్య సెట్స్లో కీర్తి సురేశ్ కాసేపు కునుకు తీస్తే నితిన్, దర్శకుడు వెంకీ అట్లూరి ఆమె వెనకాల చేరి ఫొటో దిగడం, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కోపగించుకున్న కీర్తి వారిద్దరి మీదా ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. అన్నట్లుగానే డైరెక్టర్ను పరిగెత్తించి మరీ కొట్టింది. తర్వాత నితిన్ మాట్లాడుతున్నట్లుగా ఉండే ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది ఇదిలా వుంటే కీర్తిని మరోసారి ఆటపట్టించాడు నితిన్. MISSING KANABADUTALEDHU Dear anu, nuvvu ekkadunna RANG DE promotions lo join avvalani maa korika.. Itlu nee arjun 😈😈😈😈 #Rangdeonmarch26 pic.twitter.com/fpnv06ebCb — nithiin (@actor_nithiin) March 20, 2021 'కనబడుటలేదు.. డియర్ అను, నువ్వు ఎక్కడున్నా రంగ్దే ప్రమోషన్స్లో జాయిన్ అవ్వాలని మా కోరిక.. ఇట్లు నీ అర్జున్..' అని ట్వీట్ చేశాడు. దీనికి హీరోయిన్ రెండు జడలు వేసుకున్న చిన్నప్పటి ఫొటోను జత చేశాడు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందిస్తూ.. 'భయపడకండి నితిన్.. మేము చూసుకుంటాం' అని సరదాగా రిప్లై ఇచ్చారు. వాళ్ల కామెంట్కు చేతులు జోడిస్తూ నితిన్ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. మొత్తానికి వీరి సరదా ట్వీట్లు నెట్టింట అందరినీ నవ్విస్తున్నాయి. కాగా రంగ్దే చిత్రం మార్చి 26న రిలీజ్ అవుతోంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) చదవండి: ఈ సారి గొడవ కలవడానికి చెయ్.. గెలవడానికి చేయకు రంగ్దే ట్రైలర్ లాంఛ్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆమె వల్లే పెద్ద వెధవనయ్యానంటున్న నితిన్
హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘రంగ్దే’. ఇటీవల ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా జరపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘రంగ్దే’ ట్రైలర్ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్లను ప్రేక్షకుల అంచనాలు పెంచుతున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీకి మరింత హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఇందులో ‘మనం ప్రేమించిన వాళ్ల విలువ మనం వద్దనుకున్నప్పుడు కాదు.. వారు మనల్ని అక్కర్లేదు అనుకున్నపుడు తెలుస్తుంది’ అంటూ నితిన్ ఎమోషనల్గా చెప్పె డైలాగ్ ప్రేమికులను టచ్ చేస్తోంది. ‘తొలిప్రేమ’,‘మజ్ను’ వంటి వైవిధ్యమైన ప్రేమ కథాచిత్రాలను ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ‘నేను అర్జున్. నాకొక గర్ల్ ఫ్రెండ్ని ప్రసాదించమని దేవుణ్ని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకండ్కే ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసింది.. నా జీవితాన్ని’ అంటూ నితిన్ డైలాగ్తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ‘మీకు చేసిన దానికి వాడిపై కోపం రావడం లేదా’ అని కీర్తిని ప్రశ్నిస్తాడు. దీనికి కీర్తి ‘చంపేస్తే ఒక్కసారే పోతాడు.. అందుకే పెళ్లి చేసుకున్నా’ అంటూ చెప్పె డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. మొత్తానికి ఈ టైలర్ చూస్తుంటే మూవీలో నితిన్, కీర్తి సురేశ్లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటారని అర్థం అవుతోంది. ఇక నితిన్ కీర్తికి భయపడుతూ చెప్పె కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. -
హీరో ఊరించాడు.. కంట్రోల్ చేసుకోలేకపోయిన నటి
మనముందు ఎన్నో టేస్టీ వెరైటీలు ఊరిస్తున్నా డైట్ పేరుతో నోరు కట్టేసుకుంటాం. అయితే మన కళ్లముందే కావాలని మనల్ని ఊరిస్తూ తింటే అస్సలు ఆగలేం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే నటి కీర్తి సురేష్కు సైతం ఎదురైంది. పాపం డైట్లో ఉన్న కీర్తి..తన మానాన ఫ్రూట్స్ తింటుండగా, హీరో నితిన్ మాత్రం పిజ్జాతో ఊరిస్తుంటాడు. మొదట నో పిజ్జా అని భీష్మించుకున్నా...కాసేపటికే నోట్లో నీళ్లు ఊరిపోయాయి. దీంతో డైట్ని పక్కన పెట్టేసి చీటింగ్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోగా, ఇది నెటిజన్లను ఆకట్టుకుంటుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) ప్రస్తుతం నితిన్- కీర్తి సురేష్ జంటగా ‘రంగ్దే’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవలె విడుదలైన ‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. చదవండి : (రంగ్దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!) ('ఆ నటుడితో డేటింగ్లో ఉన్నా.. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో') -
రంగ్దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న మూవీ ‘రంగ్దే’. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘రంగ్దే’ను విదేశీ హక్కుల కింద ఫార్స్ ఫిల్మ్స్ 1.5 కోట్ల రూపాయలకు స్వాధీనం చేసుకోగా.. ప్రీ రిలీజ్ వ్యాపారం మొత్తం రూ. 37.5 కోట్లుగా ఉన్నట్లు తాజాగా బిజినెస్ రిపోర్టు విడుదలైంది. కాగా గతంలో నితిన్-రష్మిక మండన్నా జంటగా వచ్చిన ‘భీష్మ’ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్లో వచ్చిన ‘చెక్’ మూవీ ఇటీవల విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బొల్తా పడింది. దీంతో నితిన్ ‘రంగ్దే’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మరోసారి హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా నితిన్కు ఇది హిట్ను ఇస్తుందా లేదా అనేది మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసిందిగా... అక్కినేని అభిమానులకు ఆర్జీవీ సర్ప్రైజ్ నరేష్తో లిప్లాక్పై నటి ఆమని కామెంట్ -
‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసిందిగా...
సాక్షి, హైదరాబాద్: నితిన్ లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ ప్రమోషన్లో భాగంగా ప్రిన్స్ మహేహ్బాబు అందమైన మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు.‘‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట లిరికల్ వీడియోను అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సింగర్ సిధ్ శ్రీరాంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాక్ స్టార్, అమేజింగ్ అంటూ ఇద్దరినీ పొగడ్తల్లో ముంచెత్తారు సూపర్ స్టార్. అటు డీఎస్పీ, సిద్ శ్రీరాం డెడ్లీ కాంబినేషన్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చస్తున్నారు.విడుదలైన కొన్ని క్షణాల్లోనే లక్షకుపైగా వ్యూస్తో దూసుకుపోతుండటం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్దే' మూవీలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు చెక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ ఈ సినిమా కూడా బంపర్హిట్ అనే అంచనాలతో ఉన్నారు. -
బస్టాండే.. బస్టాండే...
బస్టాండే... బస్టాండే.. సింపుల్గుండే లైఫు.. టెంపుల్ రన్లా మారే.. ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే లవ్లీగుండే కళలే.. లైఫే లేనిదాయే స్మైలీ లాంటి ఫేసే.... స్మైలే లేనిదాయే’ హీరోయిన్కి తాళి కట్టే ముందు హీరో పాడే పాట ఇది. ఈ బాధ ఎందుకు? అనేది ‘రంగ్ దే’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నితిన్, కీర్తీ సురేష్ హీరో హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ఇది. పీడీవీ ప్రసాద్ సమర్పకులు. నితిన్, కీర్తిపై చిత్రీకరించిన ఈ చిత్రంలోని రెండో పాట ‘సింపుల్గుండే లైఫు..’ని శనివారం విడుదల చేశారు. ‘‘ఫస్ట్ పాటకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. రెండో పాట కూడా వీనులవిందుగా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుంటాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
ఆ తర్వాత నా బలం మొత్తం పోయినట్లనిపించింది
‘‘భిన్నమైన పాత్రలు చేయాలని ఆలోచించి స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకోను. నేను సెట్కి వెళ్లే ప్రతిరోజూ ఎగ్జయిటింగ్గా ఉండాలి. ఆ ఎగ్జయిట్మెంట్ లేకపోతే సరిగ్గా పని చేయలేం. కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి. కొన్ని వర్కౌట్ కావు. కానీ జర్నీ ఎప్పుడూ ఎగ్జయిటింగ్గా ఉండాలి’’ అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. నితిన్, రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రకుల్ చెప్పిన విశేషాలు. ► ‘చెక్’లో మానస అనే లాయర్ పాత్ర చేశాను. మొదట భయపడే మనస్తత్వం ఉన్నా చివర్లో ధైర్యంగా మారుతుంది నా పాత్ర. ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేశాను. చంద్రశేఖర్ యేలేటిగారి సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆయన డైరెక్షన్లో నటించడం సంతోషంగా ఉంది. క్యారెక్టర్స్ ఎలా ఉండాలి? ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలని చాలా వర్క్ చేస్తారు. సెట్లో తెలుగులో మాట్లాడేవాళ్లం. ఓ రోజు చందూగారు సీ¯Œ ని ఇంగ్లీష్లో చెబుతుంటే ‘ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారెందుకు’ అని నవ్వుకున్నాం. ఈ మధ్య హిందీ సినిమా చిత్రీకరణలో అర్జు¯Œ కపూర్ అయితే ‘నీ పేరులో ప్రీత్ సింగ్ తీసేస్తే నువ్వు తెలుగమ్మాయివే’ అని అన్నారు. ► కోవిడ్ ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందరికీ చెప్పింది. ఫిట్నెస్ చాలా అవసరం అని తెలియజేసింది. నాకూ కోవిడ్ వచ్చింది. అయితే నన్ను పెద్ద ఇబ్బంది పెట్టలేదు. రెండు వారాల తర్వాత మళ్లీ నా పని చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ కోవిడ్ వచ్చి వెళ్లిన తర్వాత నా బలం మొత్తం పోయినట్టు అనిపించింది. కోవిడ్ మనకు రాకుండా ఉండటమే కాదు.. మనం వేరే వాళ్లకు అంటించకూడదు అనే బా«ధ్యతతో అందరూ ఉండాలి. ► క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాను. అందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. మేకప్ లేకుండా నటించాను. హిందీలో అర్జు¯Œ కపూర్తో ‘సర్దార్ గ్రాండ్స¯Œ ’లో సౌతిండియ¯Œ అమ్మాయిగా, ఆయుష్మా¯Œ ఖురానాతో ‘డాక్టర్ జీ’లో గైనకాలజిస్ట్గా, అజయ్ దేవగణ్తో ‘మే డే’లో పైలెట్ పాత్ర చేస్తున్నాను. తమిళంలో ‘అయలా¯Œ ’ సినిమా చేశాను. -
షూటింగ్లో నితిన్పైకెక్కి కింద పడ్డ ప్రియా ప్రకాశ్
కన్ను గీటు భామ, కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్, యంగ్ హీరో నితిన్ నటించిన ‘చెక్’ మూవీ ఇవాళ(ఫిబ్రవరి 26) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ ‘చెక్’ మూవీ షూటింగ్లో సమయంలో జరిగిన ఓ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. మూవీ షూటింగ్లోని ఓ రోమాంటిక్ సన్నివేశం చిత్రీకరణలో నితిన్ నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ తర్వాత వెనకాలే ప్రియా ప్రకాశ్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా నితిన్ వీపుపైకి ఎగిరి ఎక్కుతుంది. దీంతో పట్టు తప్పి నెలపై వెల్లకిలా పడిపోయింది. ఆమె పడిపోగానే చూట్టు ఉన్న మూవీ యూనిట్ సభ్యులు ఆమె దగ్గరి వచ్చి పైకి లేపారు. అయితే తనకి ఏమి కాలేదు అన్నట్లు ప్రియా సైగ చేసి కొద్ది సమయం తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటుంది. దీనికి ‘జీవితంలో కింద పడిపోతున్న ప్రతిసారి నేను విశ్వాసంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడానికి ఈ వీడియో ప్రాతినిథ్యం వహిస్తుంది’ అంటూ షేర్ చేసింది. కాగా వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్కు జోడిగా ప్రియా ప్రకాశ్, రకుల్ ప్రిత్ సింగ్లు కథానాయికలుగా నటించారు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) చదవండి: రకుల్ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?! -
ఆ దర్శకుడికి నేను పెద్ద ఫ్యాన్: జూనియర్ ఎన్టీఆర్
సినిమా హిట్టు కాలేదంటే కథ బాగోలేదని దర్శకుడిని నిందించలేం. ఎందుకంటే ఫ్లాప్ అయిందన్నా, యావరేజ్ టాక్ తెచ్చుకుందన్నా దానికి బోలెడు కారణాలు ఉంటాయి. వైవిధ్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి సినిమాలు కొన్ని పెద్దగా హిట్టవ్వలేదు. దీంతో కొంత నిరుత్సాహపడ్డ ఆయన ఐదేళ్ల విరామం తర్వాత చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నితిన్ హీరోగా, ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని హామీ ఇస్తున్నాడు. ఈ సినిమా రేపు(ఫిబ్రవరి 26న) విడుదల కానుంది. ఈ సందర్భంగా చెక్ యూనిట్కు ఆల్ద బెస్ట్ చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వినూత్నమైన కథలతో అలరించే చంద్రశేఖర్ యేలేటికి తనెప్పుడూ అభిమానినే అంటూ ట్వీట్ చేశాడు. చెక్ చాలా ఆసక్తికరంగా ఉందని సినిమాపై ప్రశంసలు కురిపించాడు. కాగా చంద్రశేఖర్ చెప్పిన 15 నిమిషాల కథ విని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా అని నితిన్ ఆ మధ్య స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరని, ఇందులో తన నటన వినూత్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతం అందించాడు. Always been a fan of Chandu @yeletics 's unique themes and storytelling. #Check looks super interesting. Best wishes to Chandu, @actor_nithiin and the whole team for the release tomorrow pic.twitter.com/RRwtQmSIVk — Jr NTR (@tarak9999) February 25, 2021 చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్ కాలంతో పాటు వెళ్లడమే మంచిది: చంద్రశేఖర్ యేలేటి -
రకుల్ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్
'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'సాహసం' వంటి వినూత్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చెక్. ఈ సినిమా టీజర్ చూడగానే థియేటర్కు వెళ్లి సినిమా చూడాలనిపించిందని, కథాంశం అంత వైవిధ్యంగా ఉందని టాప్ డైరెక్టర్ రాజమౌళే కితాబిచ్చారంటే ఈ టీజర్ జనాలను ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ చిత్రం నుంచి 'నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను..' పాట ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో తన ప్రియురాలు ప్రియా ప్రకాశ్ వారియర్ను చూడలేకుండా ఉండలేకపోతున్నానని పాడుతున్నాడు నితిన్. అక్కడేమో ప్రియా తన అందంతో హీరోనే కాదు కుర్రకారును కూడా తన వెంటపడేలా చేస్తోంది. ఈ సాంగ్ ప్రోమో రిలీజైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో #PriyaPrakashVarrier అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో నిలిచింది. ఈ సినిమాలో రకుల్ కన్నా ఫ్లాష్బ్యాక్లో వచ్చే ప్రియానే బాగుందంటున్నారు కొందరు నెటిజన్లు. చెక్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ప్రియా వచ్చీరావడంతోనే రకుల్ను డామినేట్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అవకముందే ఈ మలయాళీ ముద్దుగుమ్మ అందచందాలు, నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా తర్వాత ప్రియాకు తెలుగులో ఇంకెన్ని అవకాశాలు వస్తాయో చూడాలి! కాగా చెక్ సినిమాలో ప్రియా హొయలను చూడాలన్నా, ఉగ్రవాదిగా నితిన్, లాయర్గా రకుల్ ఏ మేరకు మెప్పిస్తారో తెలియాలన్నా ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే! చదవండి: కాలంతో పాటు వెళ్లడమే మంచిది: దర్శకుడు హైదరాబాద్లో పవన్ షూటింగ్.. భారీ సెట్ -
‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
ఆ హద్దుల్ని చెక్ చెరిపేస్తుందనుకుంటున్నాను
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా టీజర్ రిలీజ్ అవగానే థియేటర్కి వెళ్లి సినిమా చూసేయాలనిపించింది. కథాంశం వైవిధ్యంగా ఉంది. మాస్ సినిమా, క్లాస్ సినిమాకు ఉన్న హద్దుల్ని ఈ సినిమా చెరిపేస్తుందనుకుంటున్నాను. వైవిధ్యమైన సినిమాను కూడా ప్రేక్షకులు ఓ మాస్ సినిమాలా ఆదరిస్తారనుకుంటున్నాను. నితిన్ అన్ని రకాల సినిమాలు చేయగలడనిపించుకుంటున్నాడు’’ అన్నారు. ‘‘చెక్’ పెద్ద బ్లాక్బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నా నటన వేరేలా ఉంటుంది. నాకు వచ్చిన నటనను మార్చుకుని కొత్తగా నేర్చుకుని ఈ సినిమా చేశాను. యేలేటిగారు ఈ సినిమాకు చాలా డబ్బులు రావాలి అన్నారు. తప్పకుండా వస్తాయి. ఈ సినిమాకి కల్యాణీ మాలిక్ మ్యూజిక్ పెద్ద బలం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఎవ్వర్నీ నిరుత్సాహపరచదు’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. ‘‘రెండు సక్సెస్ల (ఓ పిట్ట కథ, మిడిల్ క్లాస్ మెలోడీస్) తర్వాత మూడో చిత్రంతో వస్తున్నాం. నితిన్కి గుర్తుండిపోయే చిత్రమిది’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో రమా రాజమౌళి, హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్, దర్శకులు గోపీచంద్ మలినేని, వెంకీ కుడుముల, నటుడు సంపత్ మాట్లాడారు. -
నితిన్ అంధుడిగా కనిపించేది అప్పుడే!
బాలీవుడ్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం 'అంధాధున్'. తెలుగులో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ రీమేక్ బాధ్యతను తన భుజానెత్తుకున్నాడు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 11న థియేటర్లలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. నితిన్ అంధుడిగా, సంగీతకారుడిగా కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్ నభా నటేశ్ అతడితో జోడీ కడుతోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న టబు పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. JUNE 11th is the Date!! #Nithiin30 @tamannaahspeaks @NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies_ pic.twitter.com/jTGdMRLslA — nithiin (@actor_nithiin) February 19, 2021 అంధుడైన హీరో ఓ హత్యకు ఎలా సాక్షిగా మారతాడనేది ఈ చిత్ర ప్రధాన కథ. బాలీవుడ్లో ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మరి నితిన్కు ఈ సినిమా ఎన్ని ఫలాలనిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే అతడు దేశదద్రోహిగా నటించిన 'చెక్' ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'రంగ్దే' మార్చి 26న ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ తీసుకుని 'అంధాధున్' రీమేక్తో అభిమానులను అలరించేందుకు రానున్నాడు. చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్ ముంబైలో ఇళ్లు కొన్న బుట్టబొమ్మ -
15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా
‘‘నా కెరీర్లో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ జానర్ సినిమాలు చాలా ఉన్నాయి. ‘చెక్’ లాంటి యునిక్ కథతో సినిమా చేయడం ఇదే మొదటి సారి. చంద్రశేఖర్ యేలేటిగారు చెప్పిన 15 నిమిషాల కథ విని సినిమా చేసేందుకు ఒప్పుకున్నా’’ అని హీరో నితిన్ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియిర్ హీరోయిన్లు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరు. ఈ సినిమా కోసం ఫిజికల్గా చాలా కష్టపడ్డా. అవుట్పుట్ చూశాక మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనిపించింది. కల్యాణీ మాలిక్ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది’’ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ–‘‘చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తన తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకున్నాడనేది ‘చెక్’ సినిమా కథ. ఇంతకుముందు నితిన్తో ఓ కథ అనుకుని సెకండాఫ్ వర్కవుట్ కాక వదిలేశాం. తను లేకపోతే ‘చెక్’ సినిమా లేదు’’ అన్నారు. ‘‘మా సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ‘చెక్’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. ‘‘ఈ సినిమాలో నటించడం పద్మ అవార్డు అందుకున్నంత సంతోషంగానూ ఉంది’’ అన్నారు నటుడు సాయిచంద్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్, ప్రియా ప్రకాశ్ వారియర్, అన్నే రవి తదితరులు పాల్గొన్నారు. -
నేనెవరికీ పోటీ కాదు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో 16 సినిమాలు మాత్రమే చేశా. సంగీత దర్శకుల్లో నేనెవరికీ పోటీ కాదు.. నాకెవ్వరూ పోటీ అనుకోను’’ అన్నారు కల్యాణీ మాలిక్. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. ఈ నెల 26న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ – ‘‘ఐతే’ తర్వాత 17 ఏళ్లకు చందూ (చంద్రశేఖర్ యేలేటి)తో ‘చెక్’ చేశా. సంగీత దర్శకుడిగా ‘ఐతే’ నా తొలి సినిమా. అప్పుడు పని పట్ల ఎలాంటి భయం–భక్తి, ఎగ్జయిట్మెంట్తో ఉన్నానో... ఇప్పటికీ అలాగే ఉన్నాను. నా కెరీర్లో హిట్, ఫ్లాప్లు ఉన్నాయి కానీ బ్లాక్బస్టర్ సినిమా లేదు. ‘చెక్’ బ్లాక్బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో ఒక పాటే ఉంది. నేపథ్య సంగీతం ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నేపథ్య సంగీతానికి 30 రోజులు పైనే పట్టింది. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్లకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. -
ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?!
యంగ్ హీరో నితిన్ ఖైదీగా నటిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్ ప్రారంభమైంది. జైల్లో ఓ పెద్దాయన ఒంటరిగా చెస్ ఆడుతుండటం చూసిన ఆదిత్య(నితిన్) ప్రత్యర్థి ఉంటేనే కిక్కు.. అంటూ ఆటలో దిగాడు. తర్వాత అతడు వేసే ఒక్కో ఎత్తుగడ చూసి ఆశ్చర్యపోవడం పెద్దాయన వంతైంది. అయితే ఆదిత్య ఆటతీరును చూసిన ఆయన చెస్లో ఉన్న ఒక్కో పావు గుణగణాలను చెప్తూ దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు. అలా ఏనుగు, గుర్రం, ఒంటె గురించి చెప్తున్న కొద్దీ దానికి సరిగ్గా సరిపోయే పాత్రలను తెరమీద చూపించారు. మొత్తానికి కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదిత్య చదరంగంలో తోపు అని తెలుస్తోంది. (చదవండి: నితిన్ ‘చెక్’ ఫస్ట్ గింప్స్ వచ్చేసింది) కానీ టెర్రరిస్టుతో చెస్ ఆడిస్తారా? అని నిలదీస్తున్నాడో వ్యక్తి. పైగా అతడిని దేశద్రోహి అని పోలీసులు ఛీ కొడుతున్నారు. దీంతో దేశద్రోహి అన్న ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది లాయర్ రకుల్. ఉరిశిక్ష పడ్డ ఆదిత్యకు క్షమాభిక్ష అవకాశం ఏమైనా ఉందా అని దారులు వెతుకుతోంది. కానీ ఒకానొక సమయంలో ఆ కేసు నుంచి ఎందుకు తప్పుకునేంది ఆసక్తికరంగా మారింది. రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి అన్న వ్యక్తికి 'యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి' అని రివర్స్ కౌంటరిస్తున్నాడు ఆదిత్య. సమయం దొరికినప్పుడు తోటి ఖైదీలను చితక్కొడుతున్నాడు కూడా! అసలు నితిన్ దేశద్రోహి ఎందుకయ్యాడు? అతడు ఉరి శిక్షను తప్పించుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఎత్తులకు పై ఎత్తులతో ఈజీగా చెక్ పెడుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత నితిన్ మరో చిత్రం 'రంగ్దే' రిలీజ్ అవుతోంది. (చదవండి: 'ఆర్ఆర్ఆర్’లో నా క్యారెక్టర్ అదే : రామ్చరణ్) -
నితిన్ ‘చెక్’ విడుదల తేదీ ఖరారు
యంగ్ హీరో నితిన్... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘రంగ్ దే’, ‘చెక్’, అంధాధున్ రీమెక్లో నటిస్తున్నారు. అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘రంగ్ దే’ విడుదలవుతుందని ఆ తరవాతే ‘చెక్’ వస్తుందని అందరూ భావించారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. రంగ్ దే( మార్చి 26న విడుదల) కంటే ముందే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్’ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 19న ‘చెక్’ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. -
భార్య బర్త్డే, పార్టీ ఇచ్చిన నితిన్!
టాలీవుడ్ హీరో నితిన్ ఏకకాలంలో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంత బిజీబిజీగా ఉన్న సమయంలోనూ భార్య పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు. పైగా పెళ్లి తర్వాత షాలిని కందుకూరికి ఇదే తొలి బర్త్డే కావడంతో ఆమెకు ఏ లోటూ లేకుండా అన్నీ దగ్గరుండి పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి బంధుమిత్రులతో పాటు నటుడు వెన్నెల కిషోర్, దర్శకుడు వెంకీ కుడుముల సహా పలువురు సెలబ్రిటీలు విచ్చేశారు. ఈ బర్త్డేకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. 'నీతో గడిపిన క్షణాలు నా జీవితంలోనే అత్యంత మధురమైనవి' అంటూ నితిన్ షాలినితో దిగిన ఫొటోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: 'వకీల్ సాబ్' టీజర్ టైమ్ ఫిక్స్) ఇక ఈ మధ్యే నితిన్ దంపతులు తిరమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నితిన్ భార్యను కారులో కొండపైకి పంపించి ఆయన మాత్రం సామాన్య భక్తుల మాదిరిగా నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాగా జూలై 26న హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో నితిన్-షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ఎక్కువగా ఆహ్వానాలు పంపకపోవడంతో కొద్ది మంది సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. ఇక నితిన్ నటిస్తున్న 'రంగ్దే' చిత్రం మార్చి 26న విడుదల కానుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు 'అంధాధున్' తెలుగు రీమేక్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో 'చెక్' సినిమాల్లో నటిస్తున్నాడు. (చదవండి: ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. దీవించండి’) Happy Birthday to my lovely wife! ❤️ The happiest parts of my day are the times I've spent with you. Here’s to a lifetime of being in love with you. 🤗 pic.twitter.com/HmtQuGITAD — nithiin (@actor_nithiin) January 7, 2021 -
కాలి నడకన తిరుపతి కొండెక్కిన యంగ్ హీరో
దేవుడి ముందు అందరు సమానమే. సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా ఆ పరమాత్ముడు ఒక్కడే. కానీ ఆ దేవుడిని దర్శించుకునే విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయి. సామాన్యులు దేవుడిని దర్శించుకుంటే అది సర్వసాధారణం. కానీ, సెలబ్రిటీలు దేవుడి దర్శనం కోసం వెళ్తే అది విశేషం. అందులోనూ సినిమా నటులు దైవ దర్శనం చేసుకుంటే అక్కడున్నవాళ్లకు అది ఆసక్తికరం. ఇలాంటి ఆసక్తికర ఘటన బుధవారం తిరుమలలో చోటుచేసుకుంది. యంగ్ హీరో నితిన్ కాలినడక తిరుమల వెళ్లాడు. సామాన్య భక్తుల మాదిరి నడుచుకూంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య షాలినితో కలిసి బుధవారం ఉదయం నితిన్ హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన నితిన్.. షాలిని కారులో కొండపైకి పంపించి, ఒక్కడే నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు. కాగా, నితిన్ కాలి నడకన తిరుమల వెళ్తున్న వీడియోను ఒక అభిమాని ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ వీడియోను రీట్వీట్ చేసిన నితిన్.. ‘‘ఓం నమో వెంకటేశాయ’’ అని రాశారు. 2.20 గంటల్లో తిరుమల మెట్లు ఎక్కి ఆ ఏడుకొండలవాడిని దర్శించుకున్నాడట. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్దే’. ఈ సినిమా మార్చి 26న విడుదల కానున్నది. ఈ సినిమాతో పాటు అంధాధున్ తెలుగు రీమేక్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ‘చెక్’ సినిమాల్లో నితిన్ నటిస్తున్నాడు. Om Namoo Venkateshayaa 🙏🙏 https://t.co/s3MC21NXsb — nithiin (@actor_nithiin) January 6, 2021 . -
చెక్ మాస్టర్
ఆదిత్య ఓ అద్భుతమైన చెస్ ప్లేయర్. ఎత్తులు పైఎత్తులతో ఈజీగా చెక్ పెట్టగలడు. కానీ ౖజñ ల్లో చిక్కుకున్నాడు. ఈ చెస్ ప్లేయర్ కారాగారంలో ఎలా చిక్కుక్కున్నాడు? అనేది ‘చెక్’ చూసి తెలుసుకోవాలి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియాప్రకాశ్ వారియర్ కథానాయికలు. వి. ఆనందప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ను ఆదివారం విడుదల చేశారు. చెస్ ప్లేయర్ ఆదిత్య పాత్రలో నితిన్ నటించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవుట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణీ మాలిక్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. -
చెక్ ఫస్ట్ గ్లింప్స్: దేశ ద్రోహిగా మారిన నితిన్
గతేడాది ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నితిన్... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం నితిన్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ‘రంగ్ దే’ మార్చి 26న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు అంధాధున్ తెలుగు రీమేక్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ‘చెక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ జంటగా రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ‘చెక్’ ఫస్ట్ గింప్స్ని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్ ఆదిత్య అనే ఖైది పాత్రలో నటిస్తున్నాడు. ‘జైలులో ఆదిత్య అనే ఖైది చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు’ అని ఒక వ్యక్తి చెబుతుంతే.. ‘అద్భుతంగా అంటే? అని మరో వ్యక్తి ప్రశ్నించగా, విశ్వనాథ్ ఆనంద్, కస్పరోవ్ లాగా అని మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఇక పోలీస్ ఆఫీసర్ అయిన సంపత్ రాజ్.. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి ఇది నీ గుర్తింపు అంటూ నితిన్ని హేళన చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే.. ఒక తెలివైన వ్యక్తి అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని శిక్ష అనుభవిస్తాడని, దాని నుంచి ఎలా బయటపడ్డారనేది కథలో చూపించనున్నారు. జీవితాన్ని ముడిపెడుతూ, చెస్ లో నైపుణ్యం వున్న ఓ యువకుడి జీవితాన్ని నెరేట్ చేస్తూ అందిస్తున్న సినిమా ఇది. మనమంతా లాంటి ఫీల్ గుడ్, ఎమోషనల్ మూవీ తరువాత చంద్రశేఖర్ యేలేటి చేస్తున్న సినిమా 'చెక్' సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పింస్తుందో చూడాలి మరి. -
మార్చిలో రంగ్దే
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్దే’. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 26 ‘రంగ్దే’ థియేటర్లలో విడుదలకానుందని వీడియో ద్వారా విడుదల చేశారు. నితిన్, కీర్తీల డ్యాన్స్తో ఈ వీడియో ఉంది. ‘‘కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమకథే ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు నాగవంశి. నరేశ్, వినీత్, రోహిణి,‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.సి శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
‘రంగ్ దే’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి సరికొత్త అప్డేట్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రంగ్ దే చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలతో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దర్శకుడు వెంకీ అట్లూరి ట్విటర్లో షేర్ చేశారు. చదవండి: నితిన్ 30వ సినిమా షూటింగ్ షురూ Love, Romance & Lot's of Entertainment coming to theatres near you from 26th March. 💖 #RangDeOn26thMarch ▶️ https://t.co/TvzL1VV9r3#RangDe @actor_nithiin @KeerthyOfficial @pcsreeram @thisisdsp @vamsi84 @sitharaents @adityamusic @SVR4446 @ShreeLyricist @navinnooli pic.twitter.com/B961KC8FBx — Atluri Venky (@dirvenky_atluri) January 1, 2021 ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పాటలు, సన్నివేశాలు అన్ని కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నరేష్, వినీత్, రోహిణి, వెన్నెల కిషోర్, గాయత్రి రఘురామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ మ్యాజికల్ మెలోడీ సాంగ్ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. `ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది…` అంటూ సాగే పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం అందించారు. హరిప్రియ, కపిలన్ లు ఆలపించారు. హీరో నితిన్, కీర్తి సురేష్లపై రొమాంటిక్ మెలోడీగా వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా ఈ పాటని దర్శకుడు వెంకీ అట్లూరి చిత్రీకరించారు. -
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ విషెస్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ న్యూ ఇయర్ సందర్భంగా మ్యూజికల్ న్యూఇయర్ శుభాకాంక్షలతో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన వాయిద్యం సితార్ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ సితార్ ప్లేయర్ కిషోర్ను పరిచయం చేశారు. అప్ కమింగ్ మూవీ రంగ్దే లోని సాంగ్ను కిషోర్ ప్లే చేసిన వీడియోను షేర్ చేస్తూ అభిమానులకు మ్యూజికల్ విషెస్ అందించారు. అందమైన సంగీత నూతన సంవత్సరంలో అద్భుతమైన ఆశలు, పప్రేమతో రంగులమయం కావాలంటూ ఆకాంక్షించారు. అలాగే ఈ సాంగ్ను రేపు(జనవరి 1, శుక్రవారం) విడుదల చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న రంగ్దే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ మ్యాజికల్ మెలోడీ సాంగ్ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. A small MUSICAL VIDEO for all of you.. To Step into a BEAUTIFUL MUSICAL NEW YEAR filled with AMAZING HOPE🙏🏻.. LOVE❤️& COLOURS..🌈#RangDe#RangDeRecordingSession#HappyNewYear2021 https://t.co/sBBEtdjEFs — DEVI SRI PRASAD (@ThisIsDSP) December 31, 2020 -
సునీత ప్రీ వెడ్డింగ్.. హాజరైన రేణు దేశాయ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సింగర్ సునీత కు వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక జనవరిలో రామ్ను వివాహం చేసుకుంటున్నట్లు సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో వీరిద్దరూ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ హజరయ్యారు. (చదవండి: అతికొద్ది మంది సమక్షంలో సునీత పెళ్లి) కేవలం కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, యాంకర్ సుమ కనకాలలు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సునీత-రామ్ల ప్రీ వెడ్డింగ్కు హీరో నితిన్ హోస్ట్గా వ్వవహరించి.. కార్యక్రమానికి సంబంధించి అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నాడట. మరో విషయం ఏంటంటే సునీతకు కాబోయే భర్త రామ్కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంలో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) -
నితిన్ 30వ సినిమా షూటింగ్ షురూ
యూత్ స్టార్ నితిన్ హీరోగా మెర్లపాకా గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. నితిన్- నభా నటేష్ జంటపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. నితిన్కి ఇది 30 వ సినిమా. ఈ మూవీ ప్రారంభోత్సవం గురించి నితిన్ స్వయంగా వెల్లడిస్తూ ఒక లైవ్ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. బాలీవుడ్ లో సూపర్ హిట్గా నిలిచిన ‘అంధాదున్’ సినిమాకి రీమేక్ ఇది. (చదవండి : ప్రభాస్ మూవీపై కామెంట్.. సారీ చెప్పిన సైఫ్ అలీఖాన్) నితిన్ షేర్ చేసిన ఫొటోలో ఆయన షర్టుపై స్వెటర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా భాటియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జనవరి నుంచి జరిగే తదుపరి షెడ్యూల్ షూటింగ్లో ఆమె పాల్గొననున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఇక నితిన్, కీర్తి సురేష్ నటించిన ‘రంగ్ దే’ షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది. #Nithiin30 shoot starts!! @GandhiMerlapaka @tamannaahspeaks @NabhaNatesh #sagarmahati pic.twitter.com/HDRjnFpKQa — nithiin (@actor_nithiin) December 6, 2020 -
దర్శకుడి వెంటపడి చితకబాదిన హీరోయిన్
నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కోవిడ్ బ్రేక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని పాటల చిత్రీకరణ కోసం యూనిట్ దుబాయ్కి వెళ్లింది. ఈ క్రమంలో సినిమా సెట్లో 'మహానటి' కీర్తి సురేశ్ కాసేపు కునుకు తీస్తుండగా డైరెక్టర్ వెంకీతో కలిసి నితిన్ ఆమె వెనకాల చేరి సెల్ఫీ దిగారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోందని నితిన్ అక్కసు వెళ్లగక్కారు. (చదవండి: సన్నీ డియోల్కు కరోనా) ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా కీర్తి సైతం స్పందించారు. షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదన్న గుణపాఠం నేర్చుకున్నానని, కానీ డైరెక్టర్, హీరోపై మాత్రం పగ తీర్చుకుంటానని శపథం చేశారు. అన్నట్లుగానే ఆమె ఈ ఇద్దరిలో ఒకరిపై తొందరగానే పగ తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. చేతికి ఓ గొడుగు దొరకడంతో వెంకీ అట్లూరిని కీర్తి చితకబాదారు. ఆయనను పరిగెత్తించి మరీ కొట్టారు. అయితే అదంతా సరదాగానే చేశారు. ఇక నితిన్ ఒక్కడే మిగిలాడని, అతనిపై ప్రతీకారం తీర్చుకుంటే కానీ తన పగ చల్లారదంటున్నారు. చూస్తుంటే నితిన్ కూడా ఏదో ఒక రోజు ఆమె చేతిలో అడ్డంగా దొరికిపోతాడని అనిపిస్తోంది. కాగా రంగ్ దే సినిమాను చిత్రబృందం సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తోంది. (చదవండి: భాష లేని ఊసులాట!) -
చివరి షెడ్యూల్లో చెక్
నితిన్ హీరోగా రకుల్ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘చెక్’. వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నూతన షెడ్యూల్ ఈ నెల పదో తేదీన హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్’ అని టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వచ్చింది. వచ్చే నెల 5వరకు జరగనున్న ఈ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. ప్రస్తుతం నితిన్, రకుల్ప్రీత్, సంపత్రాజ్, సాయిచంద్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు. -
పూర్తి చేశాం
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్దే’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే కోవిడ్ బ్రేక్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించారు. ఆ షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేశాం అని తెలిపారు నితిన్. ‘‘రంగ్ దే’ తాజా షెడ్యూల్ను అన్ని జాగ్రత్తలతో సురక్షితంగా పూర్తి చేశాం’’ అని చిత్రబృందంతో దిగిన సెల్ఫీని ట్విట్టర్లో షేర్ చేశారు నితిన్. నెక్ట్స్ పాటల చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లనున్నారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. -
ఛలో ఇటలీ
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభం అయింది. ఈ సినిమాలో కొన్ని పాటలు, కీలక సన్నివేశాలను ఫారిన్లో చిత్రీకరించాలనుకున్నారు. కరోనా వల్ల ఆ షెడ్యూల్ను ఇండియాలో చేయాలనుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు ఫారిన్లోనే చిత్రీకరణ జరపడానికి చిత్రబృందం రెడీ అయింది. ఇటలీలో మూడువారాల పాటు పాటల్ని, సన్నివేశాలను షూట్ చేయనున్నారు. త్వరలోనే ‘రంగ్ దే’ టీమ్ ఇటలీ ప్రయాణించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
చెక్ ఎవరికి?
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను, ప్రీ లుక్ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఈ సినిమా గురించి ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం చూస్తారు. సినిమాలో ఎవరు ఎవరికి చెక్ పెడతారన్నది సస్పెన్స్’’ అన్నారు. ‘‘ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్ కనిపిస్తారు. చదరంగం నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, సాయిచంద్, సంపత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. -
ప్రీలుక్ రిలీజ్: ‘చెక్’ పెట్టనున్న నితిన్
ఈ ఏడాది ‘భీష్మ’ సినిమాతో అందరిని ఆకట్టుకున్న హీరో నితిన్ ప్రస్తుతం ‘రంగ్దే’ సినిమా చేస్తున్నాడు. కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రంగ్దే సినిమానే కాకుండా నితిన్.. బాలీవుడ్ ‘అంధాధున్’ రీమేక్తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్రెడ్డి(నితిన్ తండ్రి), నిఖితారెడ్డి(నితిన్ సోదరి) నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నవంబరులో సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మధ్యే పెళ్లి చేసుకున్న నితిన్ ఇటు కొత్త సినిమాలను కూడా వెనువెంటనే ఓకే చెప్పెస్తున్నాడు. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే నితిన్ త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. (అన్ని జాగ్రత్తలతో సెట్స్ పైకి...) ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం,సాహసం, మనమంతా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో కొత్త సినిమాను చేసేందుకు నితిన్ తయారయ్యాడు. దీనికి సంబంధించిన ప్రకటనను ఈ రోజు(గురువారం) డైరెక్టర్ కొరటాల శివ అధికారికంగా విడుదల చేశారు. సినిమా పేరును చెక్గా ప్రకటిస్తూ ప్రీ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘నాకు ఇష్టమైన దర్శకుడు చంద్రశేఖర యేలేటి, హీరో నితిన్ల కొత్త సినిమా ప్రీ లుక్ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. Happy and delighted to launch the title and pre look of my favourite director #ChandraSekharYeleti and @actor_nithiin’s new movie. Wishing all the best to #BhavyaCreations pic.twitter.com/bmyT8KPPjy — koratala siva (@sivakoratala) October 1, 2020 వీ ఆనంద్ నిర్మాతగా వ్యవహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ సోస్టర్ను చూస్తుంటే చేతికి సంకేళ్లు, చెస్లోని కాయిన్స్తోపాటు ఇనుప కంచె కన్పిస్తోంది. దీంతో డిఫరెంట్ జోనర్లో సాగే థ్రిల్లర్ మూవీగా, ఇప్పటి వరకు నితిన్ నటించిన అన్ని సినిమాల కంటే కాస్తా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉత్తమ జాతీయ అవార్డుతోపాటు చంద్రశేఖర్ రెండు నంది అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. (డైరెక్టర్కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నితిన్) -
అన్ని జాగ్రత్తలతో...
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్దే’. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ మధ్యే హీరో నితిన్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అలాగే లాక్డౌన్ కారణంగా షూటింగ్కి బ్రేక్ పడింది. బుధవారం మళ్లీ షూటింగ్ను హైదరాబాద్లో ప్రారంభించారు. ప్రభుత్వం విధించిన జాగ్రత్తలు పాటిస్తూ, ఈ షూటింగ్ను జరుపుతున్నారు. కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ తో ఈ సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు నిర్మాతలు. నరేశ్, వినీత్, రోహిణి, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్.