Trivikram
-
త్రివిక్రమ్ తో ఫ్యామిలీ మూవీ ఆలోచనలో పడిన వెంకీ మామ
-
'కార్తికేయుడి'గా అల్లు అర్జున్.. కొత్త సినిమా కథ ఇదే
‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించారు అల్లు అర్జున్. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి? అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. కాగా ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ సినిమా చేయనున్నారని ఫిల్మ్నగర్ టాక్. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న నాలుగో సినిమా ఇది. ఈప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట.సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుందని సమాచారం. అల్లు అర్జున్ ఇప్పటివరకు చేసిన పాత్రలకి పూర్తి వైవిధ్యంగా కార్తికేయ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
గెట్ రెడీ.. రంగం సిద్ధం?
-
త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. తాజాగా ఆమె మా అసోసియేషన్ను తప్పు పడుతూ ఒక ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. అందుకు కౌంటర్గా మా అసోసియేషన్ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) రియాక్ట్ అయ్యారు. ఆమె నుంచి తముకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు. ఇందుకు సమాధానంగా పూనమ్ మరోసారి రియాక్ట్ అయింది.మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీకి పూనమ్ కౌర్ కౌంటర్గా ఇచ్చింది. గతంలో త్రివిక్రమ్పై (Trivikram Srinivas) తాను చేసిన ఫిర్యాదుకు మా అసోసియేషన్ నుంచి గతంలో వచ్చిన మెసేజ్ని పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. తనను కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటూ ఆమె పేర్కొంది. మా అసోసియేషన్ నుంచి పూనమ్కు వచ్చిన మెసేజ్లో ఇలా ఉంది. (ఇదీ చదవండి: రజనీకాంత్ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్తో సత్కారం)'త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది. మీ అభ్యర్థన మేరకు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ, సమయానికి ఇద్దరు పరిశ్రమకు చెందిన మహిళా సభ్యులతో పాటు మరోఇద్దరు మహిళా పరిశ్రమేతర సభ్యులతో ఇక్కడి ప్యానెల్లో మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశం మొత్తం మహిళా ప్యానెల్గా ఉండాలని మీరు అభ్యర్థించారు. ఈ విషయంలో మేము ఎలా కొనసాగించాలో మీ కేసును స్పష్టమైన పద్ధతిలో చెప్పగలరని ఆశిస్తున్నాము.'త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. సోషల్మీడియా వేదికగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.అయితే, పూనమ్ బయటపెట్టిన ఆధారంతో ఇప్పుడు మా అసోసియేషన్ ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్కు కూడా కాస్త ఇబ్బందులు తప్పవనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. No proceeds after this - thank you 🙏 pic.twitter.com/cW8TiWax0Q— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
త్రివిక్రమ్ ని పక్కన పెట్టి.. కొరటాలకు లైన్ క్లియర్ చేసిన ఐకాన్?
-
అల్లు అర్జున్ తర్వాతి సినిమాపై నిర్మాత కీలక వ్యాఖ్యలు
పుష్ప2 విజయంతో అంతర్జాతీయస్థాయిలో అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఆయన మార్కెట్ కూడా మరింత పెరిగింది. అయితే, అల్లు అర్జున్- త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. వీరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో నాలుగో సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలు తాజాగా నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో నిర్మాత నాగవంశీ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా గురించి ఆయన పలు విషయాలు చెప్పారు. 2025లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బన్నీ పాత్రకు సంబంధించిన గెటప్ ఎలా ఉండాలో వారిద్దరూ కూర్చుని ఫైనల్ చేయనున్నారన్నారు.'పుష్ప2తో అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది. అందుకు సరిపోయేలా ఈ ప్రాజెక్ట్ భారీ రేంజ్లోనే ఉంటుంది. బన్నీ, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన గత చిత్రాలను మించే కథతో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓస్టూడియోను నిర్మిస్తున్నాం. అత్యంత భారీ బడ్జెట్తో వచ్చే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పార్ట్ చాలా ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఇది పాన్ ఇండియా మొదటి సినిమా. అందుకే త్రివిక్రమ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ను రెడీ చేశారు.' అని ఆయన అన్నారు.ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2025 మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారని. ఆయన కూడా టచ్ చేయని జానర్లో ఈ సినిమా ఉంటుందని గతంలోనే నాగవంశీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు కూడా ఆయన అన్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది. -
Trivikram: అప్పట్లో నాకు ముప్పై రూపాయలు మాత్రమే వుండే
-
దుల్కర్ తన రోడ్డు తాను వేసుకున్నాడు: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మమ్ముట్టీగారు మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడలో మొక్కలు బతకవు అని చెబుతుంటారు. కానీ దాన్నుంచి బయటకు వచ్చి, తన రోడ్డు తాను వేసుకున్నాడు దుల్కర్. ‘మహానటి, సీతారామం’ సినిమాలకు భిన్నమైన పాత్రను దుల్కర్ ఈ సినిమాలో చేశాడు. వన్నాఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ. తక్కువ వయసులోనే ఎంతో ప్రేమను... అంతే ద్వేషాన్ని చూశాడు విజయ్.. చాలా గట్టివాడు’’ అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. దుల్కర్ సల్మాన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు త్రివిక్రమ్, హీరో విజయ్ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్’ సినిమా చూశాను. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథను ఇంపాక్ట్ చేస్తుంది. ఓ మధ్య తరగతివాడు ఓ సాహసం చేస్తే నెగ్గాలని మనకు కచ్చితంగా అనిపిస్తుంటుంది. నేనూ అక్కడ్నుంచే వచ్చాను. ఆ అడ్వెంచర్ను వెంకీ సక్సెస్ఫుల్గా తీశాడు. ఈ సినిమా చూసిన తర్వాత తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లిచూపులు’ సినిమా తర్వాత నాకు ఫస్ట్ చెక్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చింది. త్రివిక్రమ్గారు పిలిపించి, మాట్లాడి చెక్ ఇప్పించారు. సితారలో ఇప్పుడు ‘వీడీ 12’ సినిమా చేస్తున్నాను. ‘లక్కీ భాస్కర్’ను వెంకీ బాగా తీశాడనిపించింది. ‘మహానటి, కల్కి 2898 ఏడీ’ సినిమాలో నేను, దుల్కర్ నటించాం. కానీ స్క్రీన్స్ షేర్ చేసుకోలేదు. ‘లక్కీ భాస్కర్ బ్లాక్బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘నాకు నచ్చిన చిత్రాల్లో ‘అల.. వైకుంఠపురములో..’ ఒకటి. త్రివిక్రమ్గారి రైటింగ్లో మంచి డెప్త్ ఉంటుంది.విజయ్ నా లక్కీ చార్మ్. తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘మహానటి’ ఈవెంట్లో ఇతను దుల్కర్ అంటూ ఆడియన్స్ కు నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ ఈవెంట్లో ఉన్నాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ ఈవెంట్లో ఉన్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. వెంకీ స్క్రిప్ట్లోని పాత్రలు మెచ్యూర్డ్గా ఉంటాయి. ఇలాంటి సినిమాను నిర్మించాలంటే చాలా ధైర్యం కావాలి. నాగవంశీ ధైర్యంతో ఈ సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు దుల్కర్ సల్మాన్స్ . ‘‘బ్యాంకింగ్ వరల్డ్పై సినిమా తీయాలని ‘లక్కీ భాస్కర్’ తీశాను. డబ్బు అంటే ఇష్టం, అవసరం అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత చినబాబు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : ఆలియా భట్ 'జిగ్రా'మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహిళలందరూ హీరోలే: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మహిళలందరూ ఎప్పటికీ హీరోలే. మహిళలు లేకుండా తర్వాతి తరాలు లేవు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ కదా. ఈ తొమ్మిది రోజులు (దసరా నవరాత్రులు) ఈ విషయాన్నే మనం ప్రపంచం అంతా చెబుతున్నాం. వీలుంటే మమ్మల్ని (పురుషులు) కొంచెం ఎంపవర్ చేయండి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో, వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.‘జిగ్రా’ తెలుగు వెర్షన్ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దగ్గుబాటి రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’తో ఆలియా మన ఇళ్లల్లోకి వచ్చారు. ఈ విజయదశమికి ఆమెకు విజయాన్ని కానుకగా ఇచ్చి, మన ఇంటి అడపడుచులా పంపుదాం. తెలుగు, తమిళ, మలయాళం... ఇలా అన్ని చోట్ల ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ నాకు తెలిసి ఒకరు రజనీకాంత్గారు... తర్వాత సమంతగారే అనుకుంటున్నాను. సమంతగారూ ముంబైలోనే కాదు... అప్పుడప్పుడు హైదరాబాద్కు వస్తుండండి. సినిమాలు చేయాలి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఎదిగాను. తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ. హీరోయిన్లుగా మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు వాళ్ల కథలో వాళ్లే హీరోలు అని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. మా కథల్లో మేమే హీరో అని ఆలియా భట్ తన వర్క్తో గుర్తు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం రానా ఓ ఫిమేల్ మూవీని (35: చిన్న కథ కాదు’ సినిమాను ఉద్దేశించి కావొచ్చు) ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ‘జిగ్రా’ను రిలీజ్ చేస్తున్నారు.ప్రతి అమ్మాయికి రానాలాంటి బ్రదర్ ఉండాలేమో ’’ అని మాట్లాడారు. ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘సమంతకు, నాకు కలిపి త్రివిక్రమ్గారు ఓ కథ రాయాలని కోరుకుంటున్నాను. పురుషాధిక్య ప్రపంచంలో స్ట్రాంగ్గా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఆన్స్క్రీన్లోనే కాదు.. ఆఫ్స్క్రీన్లో కూడా సమంత హీరోనే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘జిగ్రా’ పై కూడా ఉండాలి’’ అని తెలిపారు. ‘‘జిగ్రా’ అంటే ధైర్యం. యాక్టింగ్ అంటే ఆలియా’’ అని చెప్పారు వాసన్ బాల. ‘‘సినిమా ప్రమోషన్ విషయంలో ఆలియా అంకితభావం చూస్తుంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్కు కొంత నేర్పాలని అనుకుంటాను’’ అని రానా అన్నారు. ఈ వేడుకలో జాన్వీ నారంగ్, సిమ్రాన్ నారంగ్ పాల్గొన్నారు. -
సమంత-త్రివిక్రమ్తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక
చాలారోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన సమంతని త్రివిక్రమ్, ఆలియా భట్ ఆకాశానికెత్తేశారు. హైదరాబాద్లో జరిగిన 'జిగ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదంతా జరిగింది. కొత్త మూవీ ప్రమోషన్ కోసం భాగ్యనగరానికి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. సినిమా గురించి చెప్పడం కంటే సమంతకి ఎలివేషన్స్ ఇచ్చింది. త్రివిక్రమ్తో మూవీ చేయాలని ఉందనే కోరిక బయటపెట్టింది.(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)సమంత గురించి మాట్లాడిన ఆలియా భట్.. తెరపైనే కాదు తెరముందు కూడా హీరోనే అని సామ్ని ఆకాశానికెత్తింది. పురుషాధిక్య ప్రపంచంలో సమంత ప్రయాణం చాలా స్ఫూర్తి దాయకమని, అలాంటి ఆమె తన సినిమాని ప్రొత్సహించేందుకు ముందుకు రావడం చాలా ఆనందం ఉందని చెప్పింది. మంచి సినిమాలను ప్రేమించడంలో తెలుగువారి తర్వాతే ఎవరైనా అని మనోళ్ల ప్రేమ గురించి పొగిడింది. తమ ఇంటికి తెలుగుతో ఎంతో అనుబంధం ఏర్పడిందని, తన కూతురు.. నాటునాటు పాట వినని రోజే ఉండదని ఆలియా చెప్పింది.అలానే సమంత, తనని లీడ్ రోల్స్లో ఓ సినిమా తీయాలని ఇదే వేడుకకు అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ని ఆలియా భట్ కోరింది. అయితే ఇదేమంత పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. త్వరలో అల్లు అర్జున్తో మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గురూజీ అనుకుంటే బన్నీ సరసన సమంత, ఆలియా భట్ని పెడితే పాన్ ఇండియా తగ్గట్లు సరిపోతుంది. మరి ఆలియా కోరిక త్వరలో తీరుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా) -
భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో బన్నీ త్రివిక్రమ్ మూవీ
-
త్రివిక్రమ్పై పూనమ్ కౌర్ ఆరోపణలు.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆరోపణలు ఇప్పటివీ కాదు. తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా గురూజీపై పూనమ్ విమర్శలు చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ని గట్టిగా ప్రశ్నించాలని ఆమె ట్విటర్ వేదికగా కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.అయితే పూనమ్ కౌర్ ట్వీట్పై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దానిపై ప్రశ్న అడగ్గా.. ఆయన మాట్లాడారు. ఆమె 'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కు ఫిర్యాదు ఎప్పుడు చేసిందో మాకు తెలియదు.. ఒకవేళ అప్పటికే కమిటీ ఏర్పడి ఉంటే.. ఫిర్యాదు బాక్స్లో తన కంప్లైంట్ వేసి ఉంటే సరిపోయేది.. ఎందుకంటే ఆ ఫిర్యాదును 'మా' వాళ్లు పంపించినా దానిపై మేము చర్చించేవాళ్లం. ఇప్పటికైనా మా వరకు ఫిర్యాదు వస్తే కచ్చితంగా స్పందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కాగా.. హైదరాబాద్లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్ హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. త్రివిక్రమ్పై పూనమ్ ట్వీట్త్రివిక్రమ్ గురించి హీరోయిన్ పూనమ్ కౌర్ ఇవాళ ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
కల్కి రేంజ్ లో త్రివిక్రమ్, అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ..?
-
తారక్ కథతో వస్తున్న బన్నీ.. మైథాలజీ మూవీతో మాంత్రికుడు...
-
సీరత్ కపూర్కు గోల్డెన్ ఛాన్స్ దక్కనుందా..?
టాలీవుడ్లో తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్గా కె. విజయ భాస్కర్ గుర్తింపు పొందారు. త్రివిక్రమ్ కూడా తన సినీ కెరీర్ ప్రారంభంలో విజయ్ భాస్కర్ సినిమాలకు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి ఇండిస్ట్రీలో మంచి హిట్ సినిమాలను నిర్మించారు. అయితే, కొంత కాలం తర్వాత త్రివిక్రమ్ డైరెక్టర్గా తనే పలు సినిమాలు తెరకెక్కించి టాప్ రేంజ్కు చేరుకున్నారు. ఈ క్రమంలో విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ మధ్య పలు విభేదాలు వచ్చాయని రూమర్స్ వచ్చాయి. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ కలిసి 'ఉషా పరిణయం' సినిమా సెట్లో కలిశారు. దీంతో ఆ రూమర్స్కు చెక్ పెట్టారు. అయితే, తాజాగా అదే ఫోటోను సీరత్ కపూర్ తన సోషల్మీడియాలో పంచుకుంది.విజయ భాస్కర్ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా స్వీయ దర్శకత్వంలో 'ఉషా పరిణయం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా నటిస్తున్నారు. శ్రీ కమల్కు జోడీగా తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతుంది. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో సీరత్ కపూర్ దుమ్మురేపింది. ఆ పాట షూటింగ్ చివరి రోజులో సెట్స్లో త్రివిక్రమ్ కూడా సందడి చేశారు. ఆ సమయంలో ఆయనతో సీరత్ కపూర్ ఫోటోలు దిగింది. వాటిని ఇప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాటి విషయాలను పంచుకుంది.ఉషా పరిణయం సినిమా సెట్స్లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా త్రివిక్రమ్ సార్ వచ్చారు. మానిటర్ దగ్గర కూర్చొని నా క్లోజ్ అప్ షాట్ని చాలా తీక్షణంగా గమనించారు. ఆప్పుడు నాకు ఆ విషయం తెలియదు. షూట్ పూర్తి అయిన తర్వాత ఆయన నన్ను మెచ్చుకున్నారు. ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాం. అందుకు ఎన్ని ప్రశంసలు వచ్చినా అవన్నీ దర్శకులు విజయ భాస్కర్కు దక్కుతాయి.' అని ఆమె తెలిపింది. అయితే, తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది.సీరత్ కపూర్ టాలెంట్కు ఫిదా అయిన త్రివిక్రమ్ ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తర్వాతి సినిమాలో సీరత్ కపూర్తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు నెట్టింట వార్త వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమాలో ఆమె ఒక్కసారి మెరిస్తే మళ్లీ టాలీవుడ్లో అవకాశాల బాట పట్టడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సీరత్ కపూర్ నటించిన ఉషా పరిణయం సినిమా ఆగష్టు 2న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) -
మొన్న సుకుమార్.. ఇప్పుడు త్రివిక్రమ్.. అల్లు అర్జున్తో కలిసి!
గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్ గురించి తెగ వార్తలొచ్చాయి. 'పుష్ప 2' షూటింగ్ విషయమై డైరెక్టర్ సుకుమార్తో గొడవపడ్డాడని, గడ్డం ట్రిమ్ చేయించుకుని ఫారెన్ టూర్కి వెళ్లిపోయాడని తెగ గాసిప్స్ వచ్చాయి. అయితే ఇవేవి నిజం కాదని నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చేశారు. దీనితోపాటు అల్లు అర్జున్ తర్వాత చేయబోయే మూవీ గురించి లీకులు వదిలారు.(ఇదీ చదవండి: 'అందుకే బన్నీ గడ్డం ట్రిమ్ చేశాడు'.. నిర్మాత బన్నీ వాసు)'పుష్ప 2' తర్వాత బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటనేది క్లారిటీ రాలేదు. తాజాగా 'ఆయ్' మూవీ పాట లాంచ్ ఈవెంట్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ తర్వాత సినిమా గురించి బయటపెట్టారు. త్రివిక్రమ్తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని, ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా ఏడాదిన్నర సమయం పడుతుందని అన్నారు. కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్తో దీన్ని తీయబోతున్నారని చెప్పారు. ఈ రేంజులో చెబుతున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.గతంలో 'రంగస్థలం' తర్వాత సుకుమార్ 'పుష్ప' మూవీ చేశారు. దీంతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవల్లో పరిచయం చేయనున్నాడు. ఒకవేళ ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం ఇప్పటివరకు తెలుగు వరకే పరిమితమైన త్రివిక్రమ్.. పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?) -
జీవితాలను నాశనం చేస్తారంటూ 'పూనమ్' డైరెక్ట్ ఎటాక్
పూనమ్ కౌర్.. సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చాలా క్లియర్గా స్పందించే హీరోయిన్. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరపై నర్మగర్భ ట్వీట్లు కూడా వేస్తుంటుంది. అయితే తాజాగా డైరెక్ట్గానే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పూనమ్ కౌర్ ట్వీట్ చేసిందంటే చాలు కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు కారణం కూడా ఉంది. కొందరి గురించి తాను నోరు విప్పితే వారికి పుట్టగతులు కూడా ఉండవ్ అనేలా రియాక్షన్ ఇచ్చింది. తాజాగా ఆమె మాటల రచయిత త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది.ఏం జరిగింది..? డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందంతో పవన్ కల్యాణ్ మాట్లుడుతున్న సీన్స్లో రేప్ డైలాగ్స్ రన్ అవుతాయ్. ఆ వీడియో చాలామంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఇలా కామెంట్ చేసింది. 'త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది' అని తెలిపింది. అయితే, విజయ్ నగేష్ అనే ఒక నెటిజన్ రియాక్ట్ ఇలా అయ్యాడు 'మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి' అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.జీవితాలను నాశనం చేస్తాడు: పూనమ్పూనమ్ కౌర్కు ఉచిత సలహా ఇచ్చిన సదరు వ్యక్తికి కౌంటర్ కూడా ఇచ్చింది. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. అని పూనమ్ మరోసారి ఫైర్ అయింది. Dialouges written by trivikram- don’t expect anything worthwhile .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 8, 2024 -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఫొటోలు)
-
గ్లోబల్ రేంజ్లో మహేశ్.. ఆఫ్రికాలో 'కుర్చీని మడతపెట్టి'న చిన్నారులు
త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం 'గుంటూరు కారం'. సినిమా విషయంలో మొదట నెగటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్లో ఫ్యామిలీ ఆడియన్స్కు తెగ నచ్చేసింది. తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా రూ. 175 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 'కుర్చీని మడతపెట్టి' సాంగ్ లక్షల వ్యూస్తో రికార్డులు సృష్టించడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేసింది. మహేశ్ బాబు, శ్రీలీల, పూర్ణ ఈ పాటకు డ్యాన్స్తో అలరించారు. ఇది విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ పాటకు ఆఫ్రికన్ పిల్లలు స్టెప్పులు వేశారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో నేషనల్ బాస్కెట్బాల్ గేమ్స్ జరుగుతుండగా.. ఆట మధ్యలో ఏర్పాటుచేసిన వినోద కార్యక్రమంలో కొందరు అమెరికన్స్ ఈ పాటకు డ్యాన్స్ వేశారు. దానిని చూసిన ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లల అదిరిపోయే డ్యాన్స్తో తాజాగా కుర్చీ మడతపెట్టేశారు. స్మాష్ టాలెంట్ ఫౌండేషన్ వారు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ పాటకు థమన్ అందించిన మ్యూజిక్కు తమదైన శైలిలో చక్కగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. From “Smash Talent Foundation Kids”, AFRICA 😯🔥#KurchiMadathapetti goes Global 🌍 #MaheshBabu | #GunturKaaram My Hero @urstrulymahesh 👑 pic.twitter.com/rzkgxzQcCr — VardhanDHFM (@_VardhanDHFM_) April 13, 2024 Dancing to #KurchiMadathapetti on stage - Done ✅🤩🤩🤪 #Goals2024 pic.twitter.com/cuursWK1Ec — Sou😇 (@theChicaCuriosa) April 15, 2024 #KurchiMadathaPetti song at at Pune Ugaadi celebrations 🔥🔥#GunturKaaram pic.twitter.com/slaaxtoQYI — Charan (@charantweetz) April 9, 2024 Em rasika raajuvo mari 💃😻#KurchiMadathapetti pic.twitter.com/KvL4Tx44om — ︎ ︎ (@VamsiPrince_) April 10, 2024 #MaheshBabu𓃵 craze in Orissa#KurchiMadathapetti pic.twitter.com/VCVeH4Oa9U — varapanakoushik Reddy (@varapanakoushik) April 12, 2024 🕋 రంజాన్ పండగా సందర్భంగా 🕋 🪑 #kurchimadathapetti 🪑 Song singing 🎤@shamna_kkasim dance 🔥🪑@urstrulyMahesh #MaheshBabu #GunturKaaram @MusicThaman @Kkdtalkies #SSMB29 pic.twitter.com/JZoclaAZnu — ⭐ god of tollywood ⭐ ssmb ⭐ (@kiranprinc31148) April 14, 2024 #KurchiMadathaPettiGoesGlobal 🌏🎵🔥#KurchiMadathaPetti 💥 pic.twitter.com/VM9okKzJ4v — thaman S (@MusicThaman) April 1, 2024 -
వారిద్దర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది: ఎన్టీఆర్
‘‘విశ్వక్ సేన్కి, సిద్ధుకి చాలాసార్లు చెప్పాను. మీపై నమ్మకం ఉంది.. ఇండస్ట్రీ ముందుకు వెళ్లడానికి చాలా సాయపడతారు, కష్టపడతారు అని. ఈ రోజు వారిద్దర్నీ చూస్తుంటే చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి చిత్ర పరిశ్రమకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ‘డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ టిల్లు స్క్వేర్’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్ అనేలా ‘టిల్లు స్క్వేర్’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్ రామ్గారు ‘టిల్లు స్క్వేర్’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ లేట్ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్) కాలర్ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు చేసింది. ‘దేవర’తో ఎన్టీఆర్ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి’’ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ–‘‘త్రివిక్రమ్గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలకి నీకు ఏవైనా అవార్డులు వచ్చాయా? అని నన్ను చాలామంది అడిగారు. వారందరికీ ఎన్టీఆర్ అన్న నా గురించి మాట్లాడిన వీడియో చూపించి.. ఇంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉందా? అన్నాను’’ అన్నారు. ‘‘అందరి కృషి వల్లే ఈ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది’’ అన్నారు మల్లిక్ రామ్. -
‘రామాయణం*లోకి త్రివిక్రమ్!
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామయణ' పేరుతో సినిమా రానుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్బీర్కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బాలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు మేకర్స్ అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉండటంతో చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ అల్లు అర్జున్తో సినిమా ఉంటుందని గతంలో ఆయన చెప్పారు. అయితే బన్నీ 'పుష్ప2'తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత కూడా ఆయన అట్లీతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రామాయణ టీమ్లోకి త్రివిక్రమ్ చేరడం దాదాపు లాంఛనమే అని చెప్పవచ్చు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్ వుంది. -
అల్లు అర్జున్ బర్త్డే నాడు సూపర్ హిట్ సినిమా రీ-రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 కోసం ఆయన అభిమానులతో పాటు సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ఆయన కొత్త చిత్రం 'పుష్ప 2' టీజర్ విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. బన్నీ పుట్టినరోజున మరో కానుక కూడా ఉంది. తన కెరియర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'జులాయి' మళ్లీ మీ ముందుకు రానుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో రూపొందిన పాటలు కూడా భలేగా అలరించాయి. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 12 ఏళ్లు దాటింది. అయినా కూడా పాటలు, మాటలతో మెప్పించిన ‘జులాయి’ని ఇప్పుడు చూసినా మంచి కిక్ ఇస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న కొన్ని థియేటర్లలో మాత్రమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 8న బన్నీ నుంచి మరో కానుక వచ్చే అవకాశం ఉంది. స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ప్రకటన కూడా రానుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్ 8న రావచ్చిన తెలుస్తోంది. తాజాగా అట్లీ భార్య ప్రియా సైతం 'ఏ6' కథా చర్చలు అంటూ ఓ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. -
త్రివిక్రమ్పై మళ్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్స్
-
పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. త్రివిక్రమ్పై మళ్లీ ట్రోల్స్!
'గుంటూరు కారం' మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్ని మహేశ్ ఫ్యాన్స్ మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకిలా చేశారు అని తెగ బాధపడుతున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం రెండు ఫొటోల వల్లే వచ్చింది. మళ్లీ ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా 'గుంటూరు కారం' తీశారు. అప్పుడెప్పుడో 2021 మేలో లాంచ్ చేశారు. అప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న పూజా హెగ్డేని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. కానీ షూటింగ్ లేటు అయ్యేకొద్ది స్టోరీ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్ ఒక్కొక్కరుగా మారుతూ వచ్చారు. మరి పూజా హెగ్డేని తప్పించారో, తప్పుకొందో తెలీదు గానీ సినిమా నుంచి సైడ్ అయిపోయింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) దీంతో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. మొన్నీమధ్ సంక్రాంతికి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్ని మాములుగా ట్రోల్ చేయలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరో దఫా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అప్పట్లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్తో పాటు పూజా హెగ్డే కూడా కనిపించింది. ఈ ఫొటోల బట్టి చూస్తే శ్రీలీల చేసిన అమ్మూ పాత్ర పూజా చేయాల్సింది. మీనాక్షి చేసిన బుజ్జి పాత్ర శ్రీలీల చేయాలి. తాజాగా రిలీజైన ఫొటోల్లో పూజా లుక్ బాగుంది. దీంతో ఇంత మంచిగా ఉన్న హీరోయిన్ని ఎందుకు తీసేశార్రా బాబు అని నెటిజన్స్ దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. అదీ సంగతి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) -
త్రివిక్రమ్ న్యూ మూవీ షురూ.. తెలుగు హీరో కాదంట!
-
మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ.. ఎక్కడ తేడా కొట్టిందంటే!
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయనుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి) అయితే ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది బిగ్బాస్ సోహెల్ హీరోగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన చిత్రాలు ఫ్లాఫ్ కావడంపై స్పందించారు. అదే క్రమంలో ఇటీవలే రిలీజైన మహేశ్ బాబు గుంటూరు కారం సక్సెస్ కాకపోవడంపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అక్కడే తేడా కొడుతుందని అన్నారు. అప్పటి టాప్ హీరోల చిత్రమైనా.. గుంటూరు కారం సినిమా అయిన ఇదే జరుగుతుందన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'మహేశ్బాబు స్టార్డమ్కు తగినట్లుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ భావించారు. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. కథను బేస్ చేసుకునే సినిమాలు తీయాలి. అంతేకానీ స్టార్డమ్ను నమ్ముకుంటే అక్కడే తేడా కొడుతుంది. నా సినిమా యమలీల అందుకే పెద్ద హిట్ అయింది. కానీ మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.' అని అన్నారు. -
గుంటూరు కారం ఎఫెక్ట్..త్రివిక్రమ్ నుండి స్టార్ హీరో యూ టర్న్
-
త్రివిక్రమ్ ఎవరితో కమిట్ అవుతాడు..? పెండింగ్ లో ఉన్న సినిమాలు
-
రామ్ తో త్రివిక్రమ్ సినిమా
-
గుంటూరు కారం కలెక్షన్స్.. ఆల్టైమ్ రికార్డ్ సెట్ చేసిన మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం తొలి వారంలో రూ. 212 కోట్లు వసూల్ చేసినట్లు అఫీషియల్గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రాంతీయ భాషలో మాత్రమే విడుదలైన గుంటూరు కారం చిత్రం కలెక్షన్స్ పరంగా అరుదైన రికార్డ్ను క్రియేట్ చేసింది. రిజనల్ ఫిల్మ్ పరంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. మహేశ్ బాబు కెరీర్లో రూ.200+ గ్రాస్ మార్క్ను అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా రూ. 100 కోట్ల క్లబ్లో మహేశ్ బాబు చిత్రాలు ఐదు ఉన్నాయి. టాలీవుడ్లో ఈ రికార్డ్ మహేశ్ పేరుతో మాత్రమే ఉంది. ఈ సినిమా మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 sets the BOX-OFFICE ablaze!! 🔥🕺#GunturKaaram grosses over a SMASHING 𝟐𝟏𝟐 𝐂𝐑 Worldwide in it’s 1st Week ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 (Highest for a regional cinema)💥💥 Watch #BlockbusterGunturKaaram at… pic.twitter.com/KyXpMsIwHf — Haarika & Hassine Creations (@haarikahassine) January 19, 2024 -
నెగెటివిటీతో మా సినిమాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు: గుంటూరు కారం నిర్మాత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఫ్యాన్స్లో గుంటూరు కారంపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే కొందరు అభిమానులు మహేశ్ బాబు సూపర్ హిట్ కొట్టారంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మరికొందరు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేపోయిందని కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటికే గుంటూరు కారంపై వస్తున్న నెగెటివ్ టాక్పై నిర్మాత దిల్రాజు కూడా స్పందించారు. ఇది వ్యాపారమని.. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారని అన్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. మా గుంటూరు కారం సినిమాకు వందలాది ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ నుంచి గుంటూరు కారం చిత్రానికి విపరీతమైన స్పందన వచ్చిందని ట్వీట్లో రాసుకొచ్చారు. గుంటూరుకారం చిత్రంపై నెగెటివీటి వచ్చినప్పటికీ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేవారిపై.. అలాగే మూవీ క్వాలిటీపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. సినిమా విషయంలో చివరికి ఆడియన్స్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు. ఈ విషయం గుంటూరు కారం విషయంలో మరోసారి రుజువైందన్నారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన గుంటూరు కారం సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ నాగవంశీ పోస్ట్ చేశారు. కాగా.. ఈనెల 12న రిలీజైన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. We've been receiving hundreds of such videos with highly positive feedback from family audiences & youth. The initial negativity on the movie cannot deem the quality and enjoyability factor of a film. It's always the audiences who give their final verdict and it is again proved… https://t.co/kkKm8sZ3kY — Naga Vamsi (@vamsi84) January 14, 2024 -
మహేష్ రాజమౌళి సినిమాకి ముహూర్తం ఖరారు..!
-
గుంటూరు కారం మూవీ.. ప్రిన్స్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు కాంబోలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఈ సినిమా అభిమానులు ఆశించినా స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని కొందరు సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!) అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం చిత్రానికి మహేశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టీటౌన్లో టాక్ వినిపిస్తోంది. అయితే మహేశ్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.70 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే గుంటూరు కారం సినిమాకు తక్కువగానే తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ షాకవుతున్నారు. తమ అభిమాన హీరో తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడాన్ని నమ్మలేకపోతున్నారు. స్టార్ హీరోగా ఉన్న మహేశ్ ఇంత తక్కువ తీసుకోవడం ఏంటని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: గుంటూరు కారం రిలీజ్.. ట్రెండింగ్లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే?) -
అమ్మ, నాన్న అన్ని మీరే: మహేష్ బాబు
-
గుంటూరు కారంతో ఆ రికార్డులన్నీ మడతపెట్టేసిన మహేశ్ బాబు
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్లో రికార్డులు బద్దలుకొడుతోంది. సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఊచకోత సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ఆల్టైమ్ రికార్డులకెక్కింది. ఇదివరకు ఈ రికార్డు సలార్ పేరిట ఉంది. ఇటీవల రీలీజైన సలార్ ట్రైలర్కు 24 గంటల్లో 32.50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రీజనల్ సినిమాతోనే మహేశ్ ఇలా రికార్డులు క్రియేట్ చేస్తే.. రేపొద్దున రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా రేంజిలోకి ఎంట్రీ ఇచ్చాక ఇండస్ట్రీలో ఆయన ఊచకోత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ముగ్గురు ఫ్యాన్స్ మృతి.. వారి కుటుంబాలకు అండగా నిలిచిన హీరో యశ్) ఆదివారం (జనవరి 7) రాత్రి 9.09 నిమిషాలకు విడుదలైన ఈ చిత్ర టైలర్ సరిగ్గా 24 గంటల్లో దాదాపు 40 మిలియన్ల మంది వీక్షించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్మీడియా వేదికగా పంచుకుంది. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రం తర్వాత సలార్ 24 గంటల్లో 32.58 M , లియో 31.91M, బీస్ట్ 29.8M, సర్కారు వారి పాట 26.77 M, తెగింపు (అజిత్) 25 M రాధేశ్యామ్ 23.3 M, ఆచార్య 21.86M, బాహుబలి 21.81M, RRR 20.45 M, KGF- 2 19.38 M, బ్రో ది అవతార్ 19.25 M వ్యూస్ సాధించిన జాబితాలో ఉన్నాయి. నేడు గుంటూరులో ప్రీ రిలీజ్: గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగప్రదేశంలో నేడు (జనవరి 9) సాయింత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జనవరి 6న హైదరాబాద్లో జరగాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడకుండా ఉండేందుకు ఏపీలోని గూంటూరులో ఈవెంట్ ఉంటుందని మూవీ మేకర్స్ మరో డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షీ చౌదరి, రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరామ్ ప్రధానంగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి 'గుంటూరు కారం' రానుంది. -
తెలంగాణలో నో పర్మిషన్.. ఏపీకి షిఫ్ట్ అయిన 'గుంటూరు కారం' ఈవెంట్
ఈ సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో హిట్ పెంచేందుకు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు బరిలోకి దిగుతున్నాడు. త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12న విడుదలకు రెడీగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. మంచి రెస్పాన్స్తో యూట్యూబ్ను షేక్ చేస్తుంది. ట్రైలర్తో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు బ్రేక్ పడటంతో కాస్త నిరాశకు గురయ్యరనేది వాస్తవం గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 6న హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు ఏర్పాట్లు కూడా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో రెడీ చేశారు. చివరి క్షణంలో భద్రతా సమస్యల కారణంగా తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ను రద్దు చేసింది. దీంతో మరో తేదీలో ఏర్పాట్లు చేసుకునేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. దీంతో రేపు (జనవరి 9న) గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో జరగనుందని చిత్ర నిర్మాత నాగవంశీ అఫీషియల్గా ప్రకటించారు. గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగప్రదేశంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి లభించడంతో వారు అక్కడ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. అందుకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనవరి 9న సాయింత్రం 5 గంటల నుంచి గుంటూరులో మహేశ్ ఫ్యాన్స్ జాతర గ్యారెంటీ. ఈ వేడుకలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి కూడా ఏపీకి భారీగా ఫ్యాన్స్ రానున్నారు. See you all tomorrow 💥#GunturKaaramPreReleaseEvent https://t.co/Jj8XsMAiET — Naga Vamsi (@vamsi84) January 8, 2024 We've been waiting for the final confirmation regarding permissions for the #GunturKaaram Pre Release Event. We request all the Superfans to wait patiently, until we make an announcement about the event officially from @haarikahassine Hope you all understand and cooperate! — Naga Vamsi (@vamsi84) January 8, 2024 -
మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?
సూపర్స్టార్ మహేశ్బాబు 'గుంటూరు కారం' సినిమా మరో వివాదంలో చిక్కుకునేలా కనిపిస్తుంది. అవును మీరు సరిగానే విన్నారు. ఈ మూవీ కథని ఓ నవల నుంచి కాపీ కొట్టారనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో విడుదలకు ముందే మరోసారి ఈ మూవీ చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? 'గుంటూరు కారం' రిలీజ్ సంగతేంటి? మహేశ్-త్రివిక్రమ్ అంటే బెస్ట్ కాంబో అని చెప్పొచ్చు. వీళ్లిద్దరూ కలిసి చేసిన 'అతడు', 'ఖలేజా'.. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఆ తర్వాత మాత్రం కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. అలా ఇప్పుడు 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే రెండేళ్ల క్రితమే ఈ సినిమా మొదలైనప్పటికీ.. హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్స్, పాటలపై.. ఇలా చాలా మార్పులతో ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధమైంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న 'గుంటూరు కారం' సెన్సార్.. తాజాగా పూర్తయింది. సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని అన్నారు. అదే టైంలో ఈ చిత్రానికి.. యద్దనపూడి సులోచనరాణి 'కీర్తి కిరీటాలు' అనే నవలకు దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది థియేటర్లలోకి మూవీ వస్తే గానీ తెలియదు. ఇకపోతే గతంలోనూ త్రివిక్రమ్ సినిమాలపై ఇలా కాపీ కామెంట్స్ వినిపించాయి. 'అఆ' సినిమాని కూడా యద్దనపూడి 'మీనా' నవల ఆధారంగా తీశారని అన్నారు. ఆ వివాదం ఆ తర్వాత సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మహేశ్ సినిమాకు 'కీర్తి కిరీటాలు' నవలకు సంబంధం ఉందని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం రిలీజ్ తర్వాత వివాదం లాంటిది ఏమైనా జరగొచ్చు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే 'గుంటూరు కారం' రిలీజ్ కావాల్సిందే. (ఇదీ చదవండి: గురూజీ త్రివిక్రమ్ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్ పూనమ్ కౌర్) -
'గుంటూరు కారం' విషయంలో ఫ్యాన్స్కు స్ట్రాంగ్గా చెప్పిన నాగవంశీ
ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. సుమారు 8 సినిమాలు రేసులో ఉన్నాయి. ఇందులో కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా.. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రవిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న గుంటూరు కారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ‘గుంటూరు కారం’ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రతి ఏరియాలో రాజమోళి కలెక్షన్స్కు దగ్గరగా వెళ్తామని ఆ ఇంటర్వ్యూ ద్వారా నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం సినిమా కంటెంట్ విషయంలో తాను ఎంతో నమ్మకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అంటే RRR కలెక్షన్స్ను బీట్ చేయలేకపోయిన వాటికి దగ్గరగా గుంటూరు కారం కలెక్షన్స్ ఉంటాయని పరోక్షంగా ఆయన ఇలా చెప్పారు. ఆ వీడియోతో పాటు ఆయన ఇలా తెలిపారు. 'డియర్ సూపర్ ఫ్యాన్స్.. మీకు మళ్లీ చెబుతున్నా.. మేము అదే మాట మీద ఉన్నాం. 'గుంటూరు కారం' చిత్రాన్ని భారీగా విడుదల చేస్తాం. అంతేకాకుండా ఎక్కువ థియేటర్స్లలో రికార్డ్ రేంజ్లో విడుదల ఉంటుంది. రిలీజ్ విషయం మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే' అని వంశీ తెలిపారు. తాజాగా 'కుర్చీ మడతపెట్టి' అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాలో ఈ పాట భారీగా వైరల్ అవుతుంది. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉన్న ఈ సాంగ్లో మహేశ్, శ్రీలీల డ్యాన్స్తో దుమ్ములేపారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పలువురు అభిమానులు వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో #WeDemandRecordReleaseForGK అనే హ్యాష్ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ తాజాగా ఈ ట్వీట్ చేయడం విశేషం. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. Dear superfans... Meeku Malli strong ga chebutunna, Memu adhe maata meeda unnamu.. #GunturKaaram ki record release in record number of theatres lo untundhi. Release maaku odileyandi, Celebrations ye mathram thaggakunda chuskune badhyata meedi 😎🔥 pic.twitter.com/YnATOeMZh1 — Naga Vamsi (@vamsi84) December 31, 2023 -
'గుంటూరు కారం' సాంగ్.. సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోన్న సాంగ్ ఒకటే. అదేనండి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలోని పాట. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన 'కుర్చినీ మడతబెట్టి' అనే మాస్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రిన్స్ అభిమానులతో పాటు సినీ ప్రియులను ఊపేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఆడియన్స్ నుంచి ఈ సాంగ్కు విశేషణమైన ఆదరణ లభిస్తోంది. ఈ పాటకు తమన్ బాణీలు అందించారు. టాలీవుడ్లో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. తాజాగా మరోసారి తమన్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ పాటలోని ఓ ట్యూన్ను కాపీ కొట్టారంటూ తెగ వైరల్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలోని 'పేట్రాయి సామీదేవుడా' అనే సాంగ్ ట్యూన్ కాపీ చేశారంటూ పెద్దఎత్తున వైరలవుతోంది. మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పెళ్లిసందడి భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.మీనాక్షీ చౌదరి, ప్రకాశ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. Blockbuster re-mix 🧐pic.twitter.com/WwN97I4SDc#GunturuKaaram — BiggBossTelugu7 (@TeluguBigg) December 30, 2023 Blockbuster re-mix 🧐pic.twitter.com/WwN97I4SDc#GunturuKaaram — BiggBossTelugu7 (@TeluguBigg) December 30, 2023 -
మహేష్ బాబు సినిమాలో ఈ పాటలు ఏంటి ..?
-
'దయచేసి ఆ పదాన్ని తీసేయండి'.. మహేశ్బాబుకు విజ్ఞప్తి!
ఇప్పుడంతా ఎక్కడ చూసిన సోషల్ మీడియానే శాసిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లోనే వైరలవుతోంది. అలా కొన్నాళ్ల ముందు ఓ తాత తన మాటలతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. డైలాగ్లో ఓ బూతు పదం కూడా ఉన్నప్పటికీ.. చాలామందికి ఇదో ఊతపదంలా మారిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏకంగా మాస్ పాట చేసేశారు. తాజాగా మహేశ్ బాబు నటించిన గుంటూరుకారం చిత్రంలోని పాటకు ఈ పదాన్ని వాడేశారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్గామారింది. అయితే ఈ చిత్రంలో కుర్చీని మడతబెట్టి పదం వినియోగించడంపై ఓ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అయ్యే మీలాంటి స్టార్ సినిమాలో ఈ బూతు పదాన్ని తొలగించాలని చిత్రబృందానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి బూతు పదాలు చూసి పిల్లలు చెడిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. -
హైదరాబాద్లో ఆటాపాట
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 21 నుంచి హైదరాబాద్లో జరగనుంది. ‘‘గుంటూరు కారం’ సినిమాలో నాలుగుపాటలు, ఓ బిట్ సాంగ్ ఉన్నాయి. వాటిలో మూడుపాటలు, బిట్ సాంగ్ పూర్తయ్యాయి. మిగిలిన ఓపాటను ఈ నెల 21 నుంచి చిత్రీకరించేలా ప్లాన్ చేశాం’’ అని సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. -
మహేష్ బాబుతో మల్టీస్టారర్.. నానితో త్రివిక్రమ్ సినిమా
-
షూటింగ్ లో బిజీ బిజీ గా మహేష్.. సంక్రాంతి బరిలోకి గుంటూరు కారం
-
సోషియో ఫ్యాంటసీ సినిమాలో అల్లు అర్జున్, చిరంజీవి!
-
గుంటూరు కారం జోరు మామూలుగా లేదుగా..!
-
గుంటూరు కారం నుంచి భయంకరమైన లీక్
-
పాన్ ఇండియా హీరోయిన్ తో అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా...
-
మాస్ అవతార్
మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. దసరా సందర్భంగా ‘గుంటూరు కారం’ నుంచి కొత్త పోస్టర్ను రిలీజ్ చేసి, త్వరలోనే తొలి పాటను విడుదల చేయనున్నామని, ఈ సినిమాలో అల్ట్రా మాస్ అవతార్లో మహేశ్బాబు ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఆ విషయం లో పూజ కి హాట్స్ ఆఫ్ చేయాలి..!
-
అదో చేదు అనుభవం : Jr. ఎన్టీఆర్
-
రాయలసీమ యాస మాట్లాడటం చాలా ఇష్టం..!
-
నా జీవితాన్ని తను ఊహించలేనంతగా మార్చేశాడు
-
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో పూజ హెగ్డే ఫిక్స్ అయ్యిందా..?
-
సునీల్ రోడ్డు మధ్యలో కారుని ఆపి డాన్సులు చేసేవాడు
-
ఆ రూమర్స్పై క్లారిటీ ఇచ్చిన మహేశ్
సూపర్స్టార్ మహేశ్బాబుని స్క్రీన్పై చూసి ఏడాది దాటిపోయింది. 'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' చేస్తున్నాడు. దీని షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ పడుతూ లేస్తూ వచ్చింది. ఒకానొక దశలో అయితే ఈ మూవీ ఉంటుందా లేదా అని కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లపై స్వయంగా మహేశ్ స్పందించాడు. మహేశ్, హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే 'గుంటూరు కారం' గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన మహేశ్.. 'సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ హ్యాపీగా ఉంటారు' అని చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకీ 'గుంటూరు కారం' రిలీజ్ విషయంలో సందేహాలు ఎందుకొచ్చాయో తెలుసా? (ఇదీ చదవండి: రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్తోపాటు) మహేశ్-త్రివిక్రమ్ సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే మొదలుపెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ అన్నారు. మహేశ్తో ఓ ఫైట్ సీన్ తీశారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో చాలా మార్పులు జరిగాయి. సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల.. మెయిన్ లీడ్ అయింది. ఇప్పటివరకు జరిగిన పార్ట్ అంతా కాకుండా కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాదన్నట్లు ఇప్పటివరకు కేవలం లుక్స్తో పోస్టర్స్, చిన్న గ్లింప్స్ వీడియో తప్ప లిరికల్ సాంగ్స్ ఏం రాలేదు. అలానే సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం లాంటివి జరిగేసరికి సంక్రాంతి రిలీజ్ కష్టమే అని అభిమానులు కూడా అనుకున్నారు. కానీ మహేశ్ స్వయంగా జనవరి 12న పక్కా అని చెప్పడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. చూడాలి అనుకున్నట్లు ముగ్గుల పండక్కి తీసుకొస్తారో లేదో? (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) -
ట్రెండింగ్లో మహేశ్ బాబు ఫోటో.. ఫ్యాన్స్కు గుడ్న్యూస్
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. సినిమా షూటింగ్కు బ్రేక్ ఇచ్చి ఇటీవలే వెకేషన్కు వెళ్లిన ఆయన.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. (ఇదీ చదవండి: పవన్తో విడాకుల టైమ్లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) తాజాగ ఆయన జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఆ ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. కొత్త సినిమా కోసమే మహేశ్ ఇదంతా చేస్తున్నారని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. నేటి నుంచి గుంటూరు కారం సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుందట. శుక్రవారం ఆగష్టు 18 నుంచి మహేశ్ బాబు కూడా సెట్స్లోకి రానున్నట్లు సమాచారం. అతడు, ఖలేజ' తర్వాత త్రివిక్రమ్- మహేశ్ చేస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం' కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. షూటింగ విషయంలో చాలా ఆలస్యం అవుతుందని ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉంటున్న సమయంలో మహేశ్ చేసిన ఈ పోస్ట్తో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ముందుగా అనుకున్నట్లే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
'గుంటూరు కారం' కొత్త పోస్టర్.. ఫ్యాన్స్కి నచ్చిందా?
సూపర్స్టార్ మహేశ్బాబు 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్నాడు. బుధవారం ఇతడి పుట్టినరోజు సందర్భంగా క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో లుంగీ లుక్, నోటిలో బీడీతో మహేశ్ డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే అభిమానులు మాత్రం ఓ విషయంలో బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంతకీ ఏంటి విషయం? గందరగోళం? మహేశ్బాబు-త్రివిక్రమ్ కాంబో అంటే వేరే లెవల్ క్రేజ్. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి 'అతడు', 'ఖలేజా' చిత్రాలు చేశారు. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. టీవీ, యూట్యూబ్లో బ్లాక్బస్టర్ హిట్స్. వాటికి కోట్లాదిమంది ఫ్యాన్స్. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ సినిమా అనేసరికి ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. కానీ జరుగుతున్నది మాత్రం వేరు. అప్డేట్స్ సరిగా ఇవ్వట్లేదు. ఏం జరుగుతుందో ఫ్యాన్స్కి అస్సలు అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: మహేశ్ - నమ్రత లవ్ మ్యారేజ్.. మొదట ప్రపోజ్ చేసింది ఎవరంటే..!) రిలీజ్ డేట్ మార్పు? మహేశ్ చేస్తున్న ఈ సినిమాకు 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి సినిమాని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రిలీజ్ తేదీ మారింది. జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. మరి ఈసారైనా చెప్పిన డేట్కి వస్తుందా లేదా అని చూడాలి. హీరోయిన్ల ఛేంజ్? దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టారు. తొలుత పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. కారణం ఏంటో తెలీదు గానీ పూజ, ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసింది. సెకండ్ హీరోయిన్ శ్రీలీల మెయిన్ లీడ్ అయింది. హీరోయిన్ మీనాక్షి చౌదరి కొత్తగా వచ్చి చేరింది. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ తప్పుకొన్నారని రూమర్స్ వచ్చాయి. అలానే తమన్ని కూడా తప్పించారని మాట్లాడుకున్నారు. కానీ ఇది రూమర్ మాత్రమే అనే తేలింది. మహేశ్ పుట్టినరోజున ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి, వాళ్లని డిసప్పాయింట్ చేశారు. #HBDSuperstarMahesh 🥳💥#GunturKaaram pic.twitter.com/2mf80iWpgQ — Haarika & Hassine Creations (@haarikahassine) August 8, 2023 (ఇదీ చదవండి: సౌత్ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్ మహేష్ సొంతం) -
హనీట్రాప్ కలకలం.. కపిల్పై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో హనీట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మంగళవారం సీపీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్కు చెందిన హనీట్రాప్ కేసులో కపిల్పై కేసు నమోదు చేశాం. కపిల్ వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్కు పంపించాము. కానిస్టేబుల్ కపిల్ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్కు చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం అతడు సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో పనిచేస్తునే పేస్బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్పై అంతరంగిక భద్రత చట్టం కింద కేసులు పెట్టామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం జగన్ సాయం -
'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!
'ఆచార్య' తర్వాత మెగాహీరోలు చేస్తున్న మల్టీస్టారర్ 'బ్రో'. యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పవన్ కల్యాణ్ హీరో కంటే తక్కువ-అతిథి పాత్ర కంటే ఎక్కువ ఉండే రోల్ చేశాడు. ఈ శుక్రవారం అంటే జూలై 28న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ వరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. మిగతా ప్రేక్షకులు మాత్రం 'బ్రో' మీద 50-50 నమ్మకంతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరో సాయిధరమ్ తేజ్.. ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) 2021 డిసెంబరులో విడుదలైన సినిమా 'వినోదయ సీతం'. సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజైంది. 99 నిమిషాల నిడివితో ఉన్న ఈ చిత్రం.. తెలుగులోనూ డబ్ అయింది. దీన్ని తెలుగులో 'బ్రో'గా రీమేక్ చేశారు. ఇక్కడ కాస్త డ్యూరేషన్ పెంచారు. ఒరిజినల్లో ఓ పెద్దాయన పాత్ర-సముద్రఖని ఉంటారు. ఇందులో పెద్దాయన స్థానంలో సాయితేజ్, సముద్రఖని ప్లేసులో పవన్ వచ్చారు. విడుదలకి వారం ముందు కూడా 'బ్రో'పై పెద్దగా హైప్ లేదు. దీంతో పవన్ పాత పాటని మరోసారి రీ క్రియేట్ చేశారు. 42 సెకన్లున్న ఈ వీడియోని తాజాగా రిలీజ్ చేయగా, కాస్తంత హైప్ వచ్చింది. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉంటుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇప్పుడు వాళ్లకు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. అదే విషయాన్ని సాయిధరమ్ తేజ్.. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దీన్నిబట్టి 'బ్రో' ఫ్యాన్స్.. ఆ పాట బిగ్ స్క్రీన్ పై కష్టమే. అంతగా చూడాలనుకుంటే యూట్యూబ్లో చూసుకోండి. Promotional song ..!#BroTheAvatar #Bro pic.twitter.com/ByoLJoXEfb — ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) July 26, 2023 (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) -
మహేశ్-త్రివిక్రమ్ మూడు సినిమాలకు అదే ప్రాబ్లమ్!?
సూపర్స్టార్ మహేశ్బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ఏ ముహుర్తాన మొదలైందో తెలీదు గానీ బండికి బ్రేకులేసినట్లు ఆగుతూ పోతోంది. సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాక అభిమానులు బుర్ర గోక్కుంటున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు. త్రివిక్రమ్ పేరు చెప్పగానే మనకు డీసెంట్ సినిమాలు, అందులోని పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. అయితే ఈ దర్శకుడు తీసిన వాటిలో 'అతడు', 'ఖలేజా' మూవీస్కి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం మ్యాజిక్ ఉందో తెలీదు గానీ ఈ రెండు చిత్రాలు ఎప్పుడూ చూసిన ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. మనస్ఫూర్తిగా నవ్విస్తాయి. (ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్లు!) అయితే మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేసిన ఫస్ట్ మూవీ 'అతడు'. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో తీసిన ఈ సినిమా.. 2005లో విడుదలైంది. థియేటర్లలో చెప్పుకోదగ్గ సక్సెస్ కానప్పటికీ.. టీవీలో టెలికాస్ట్ అయి టీఆర్పీలో రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టింది. కారణాలు ఏంటో కరెక్ట్గా తెలియనప్పటికీ తీయడం మాత్రం ఆలస్యమైంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' విషయంలో దాదాపు ఇలానే జరిగింది. ఈ సినిమాతో త్రివిక్రమ్ కాస్త డిఫరెంట్గా ట్రై చేశారు. కాకపోతే అప్పట్లో ప్రేక్షకులకు ఇది ఎక్కలేదు. టీవీలో ప్రసారమైతే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా తీయడానికి ఏకంగా మూడేళ్లు పట్టింది. పైన రెండింటికి ఎలా అయితే జరిగింతో ఇప్పుడు 'గుంటూరు కారం' విషయంలోనూ సేమ్ సీన్ రిపీటవుతుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఇది రిలీజ్ అంటున్నారు. మరి అనుకున్నట్లు జరుగుద్దో లేదంటే వాయిదా పడుతుందో వేచి చూడాలి. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
'గుంటూరు కారం' నుంచి తమన్ ఔట్.. త్రివిక్రమే అసలు సమస్యా?
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసిందే. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్కు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి ప్రేక్షకులల్లో మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు కేవలం డిజిటల్ హక్కులే రూ. 80 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొన్నదని ప్రచారం జరిగింది. ఇంత పాజిటివ్ ఎనర్జీతో వస్తున్న ఈ సినిమా చుట్టూ ఏదో ఒక సమస్య క్రియేట్ అవుతూనే ఉంది. దీంతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్) ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన ప్లేస్లో రవి కె చంద్రన్ పేరు వినిపిస్తోంది. ఇది నిజమేనని ఇండస్ట్రీలో టాక్. తాజాగా మరో షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది. గతంలో తమన్ స్థానంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటున్నారని వచ్చిన వార్తలపై.. అలాంటిదేమి లేదని నిర్మాత నాగవంశీతో పాటు తమన్ కూడా ఖండించారు. దీంతో ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా మళ్లీ ఇదే విషయంలో మరోసారి రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గుంటూరు కారం పాటలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మహేష్ బాబుకు నచ్చలేదట. త్రివిక్రమ్ చెప్పారని మాత్రమే ఆయన్ను కొనసాగిస్తున్నారట. ఇక తప్పని పరిస్థితిలో తమన్ను పక్కన పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఆయన ప్లేస్లోకి 'ఖుషి ఫేం హేశం అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరిలియో'లను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇదే విషయాన్ని మహేష్ బాబు ముందు ఉంచారట మేకర్స్. ఈ ప్రపోజల్కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఇదే నిజమైతే సినిమా పాటలు మరింత హిట్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు మెలడీతో ప్రేక్షకులను మెప్పిస్తే.. మరోకరు మాస్ బీట్తో దంచికొడతారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైట్ మాస్టర్స్, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ కంపోజర్, స్క్రిప్ట్లో మార్పు.. ఇలా మూవీకి కావాల్సిన కీలకమైన వాళ్ల విషయంలోనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది.. వీటిలో ఇప్పటికే కొన్ని నిజం అయ్యాయి కూడా.. ఫైనల్గా గుంటూరు కారంలో ఎక్కడ తేడా కొడుతుందో అనేది ఎవరికీ అర్థం కావడం లేదని ఇండస్ట్రీలో టాక్. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా త్రివిక్రమ్కు చాలా క్లోజ్. వీరిద్దరూ చాలా సినిమాలే చేశారు. అలాంటిది అతనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే అసలు సమస్య మహేష్ కాదని, త్రివిక్రమ్ ధోరణితోనే చాలా సమస్య వస్తోందని పరిశ్రమలో టాక్. ఇవన్నీ క్లియర్ కావాలంటే మహేష్బాబు వివరణ ఇస్తే కానీ క్లారిటీ రాదు. ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. -
రానా సినిమాలో త్రివిక్రమ్ ఎంట్రీ కోపంతో రగిలిపోతున్న గుణశేఖర్
-
గుంటూరు కారం కోసం మహేష్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!
ప్రిన్స్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ‘గుంటూరు కారం’ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తీయాలనకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల దీనిని రీజనల్ మూవీగానే 2024లో సంక్రాతి కానుకగా విడుదల చేయనున్నారు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్కే ట్వీట్) ఈ సినిమా కోసం మహేష్ రూ. 78 కోట్ల రూపాయలతో పాటు జిఎస్టిని అందుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ మన ఇండియా హీరోలు సుమారు వంద కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ మహేష్ బాబు రీజనల్ సినిమా కోసమే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో గుంటూరు కారం సినిమాను నిర్మించనున్నారు. (ఇదీ చదవండి: వాళ్లు అన్యాయం చేస్తే.. ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్) రీజనల్ సినిమాలకు సంబంధించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వారి జాబితాలో మహేష్ బాబు టాప్లో ఉంటారు. ఈ సినిమా తర్వాత SS రాజమౌళి యొక్క SSMB 29 పాన్ ఇండియా సినిమా హిట్ట్ అయితే ఆయన రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే. -
దేవుడు ఉన్నాడు.. దీని వెనుక ఎవరున్నా వదలను: గుణశేఖర్
రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాక్షస రాజు హిరణ్యకశిపుడుగా రానా నటిస్తుండగా. కథ త్రివిక్రమ్ అందిస్తుండగా డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయం మీద పరోక్షంగా గుణశేఖర్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్కే ట్వీట్) ఏపీలోని ఆళ్లగడ్డకు దగ్గరలో ఉన్న 'అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి' దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. 'దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది. అని ఆయన కామెంట్ చేశాడు. 'హిరణ్యకశిప' ప్రాజెక్టు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే గుణశేఖర్ చేయడంతో ఈ కామెంట్ 'రానా' మూవీ గురించే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో గుణశేఖర్ ఏమన్నారంటే సమంత-గుణశేఖర్ కాంబోలో వచ్చిన 'శాకుంతలం' ప్రమోషన్స్ కార్యక్రమంలో హిరణ్యకశిప ప్రాజెక్టుపై గుణశేఖర్ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'నేను హిరణ్యకశిప ప్రాజెక్టు మీ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు చేస్తే మీరు చేయాలి లేదంటే తప్పుకోవాలి కానీ అదే ప్రాజెక్టును వేరే వాళ్లతో సెట్స్పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ విషయంలో నాకు అన్యాయం జరిగితే ఎవరినీ వదలను, అలాంటి వారిపై ఎంతవరకైనా వెళ్తాను. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే నేను వెనక్కు తగ్గను.' అంటూ గతంలో ఆయన కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే హిరణ్యకశిప మూవీకి డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్లో గుణశేఖర్ లేకపోవడంతో ఇలా ముందే హెచ్చరిస్తున్నాడని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Gunasekhar (@gunasekhar1) (ఇదీ చదవండి: నేడు సితార పుట్టినరోజు.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గుంటూరు కారంలో ఒక్కడు... రాజమౌళితో మహేష్ మార్షల్ ఆర్ట్స్
-
'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’ . ఇందులో పూజా హెగ్డే , శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా తప్పుకుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ను లీక్ చేసింది. (ఇదీ దచవండి: బిగ్బాస్లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే) గుంటూరు కారం సినిమాలో తను నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా విజయ్ ఆంటోనీ సరసన హత్య అనే సినిమాలో హీరోయిన్గా నటించిన మీనాక్షి.. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గుంటూరు కారం సినిమా గురించి ఇలా మాట్లాడింది. 'నేను మహేష్ బాబు గారికి పెద్ద అభిమానిని. గుంటూరు కారం సినిమాలో నాకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మహేష్-త్రివిక్రమ్లది హిట్ పెయిర్. వారితో కలిసి నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూట్ కూడా పూర్తి అయింది. మహేష్ గారి పక్కన మొదటి షాట్ చిత్రీకరణ ఎప్పటికీ మర్చిపోలేను.' అని మీనాక్షి తెలిపింది. (ఇదీ చదవండి: ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్) ఈ ప్రాజెక్ట్ నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శ్రీలీలను తీసుకొని మరొక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. హర్యానాకు చెందిన మినాక్షి చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా రవితేజ ఖిలాడీ, హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. -
ఆ హీరోయిన్కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!
పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేవి మూడు పెళ్లిళ్లు. ఎప్పటికప్పుడు దీన్ని పవన్ సమర్థించుకుంటాడు గానీ ఏది ఏమైనా సరే ఇది ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా రెండో పెళ్లి చేసుకోవడానికే వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది పవన్ ఏకంగా మూడుసార్లు చేసుకున్నాడు. వాళ్లలో ఒకరు తెలుగు, ఇంకొకరు మరాఠీ, మరొకరు రష్యన్. ఇలా ప్రపంచం మొత్తాన్ని పవన్.. తన పెళ్లిళ్లతో కవర్ చేశాడు. ఈ సంగతి ఇక్కడివరకే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే సినిమా హీరోయిన్లు-పవన్కు మధ్య అప్పట్లోనే బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ ఉండాల్సిందే పవన్ కల్యాణ్ చేసిన వాటిలో చాలావరకు రీమేక్ సినిమాలే ఉంటాయి. తెలుగు మూవీస్ గురించి తెలిసిన ఎవరిని అడిగినా సరే ఈ విషయం ఇట్టే చెప్పేస్తారు. బయటకు అనుకోరు గానీ ఫ్యాన్స్ అయితే దీని గురించి ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. మళ్లీ ఎక్కడ చెబితే పక్కనోడు ఫీలవుతాడని అస్సలు బయటపెట్టరు. అలానే పవన్ ఏ సినిమా చేసినా సరే స్టోరీతో సంబంధం లేకుండా అందులో కచ్చితంగా హీరోయిన్ ఉండి తీరాల్సిందే. 'వకీల్ సాబ్'నే తీసుకోండి.. స్టోరీకి హీరోయిన్ అవసరం లేదు అయినాసరే శ్రుతిహాసన్ని తీసుకొచ్చారు. ఓ పాట, లవ్ ట్రాక్ పెట్టారు. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్కి అవమానం!) పార్వతికి గిఫ్ట్ పవన్ కల్యాణ్కి ఉన్న ఒకటో రెండో హిట్స్లో 'జల్సా' ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ పుణ్యామా అని అది హిట్ అయిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో పవన్కి హీరోయన్లుగా ఇలియానా, పార్వతి మెల్టన్ చేశారు. అయితే షూటింగ్ టైంలో పవన్-పార్వతికి ఎక్కడో కుదిరిసిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. దానికి ఓ కారణముంది. అప్పట్లో ఓ పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం.. 'జల్సా' రిలీజైన తర్వాత ఓ సందర్భంలో, హీరోయిన్ పార్వతి మెల్టన్ వద్దూ వద్దంటున్నాసరే రూ.24 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ని పవన్ ఆమెకి గిఫ్ట్గా ఇచ్చాడట. 2 గంటలు హోటల్లో? తొలుత డైమండ్ నెక్లెస్ని పవన్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో ఏమో అని పార్వతి సింపుల్గా నో చెప్పేసిందట. కానీ తనని ఓ ఫ్రెండ్లా భావించమని, అలా ఈ నెక్లెస్ తీసుకోమని పవన్ ఆమెతో అన్నాడట. ఇది జరిగిన తర్వాత వీళ్లిద్దరూ ఓ హోటల్లో దాదాపు 2 గంటలు పాటు కలిసి భోజనం చేశారట. అంతే కాకుండా స్వయంగా పార్వతి మెల్టన్ని పవన్ తన కారులో ఎక్కించుకుని ఎయిర్ పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చాడట. తర్వాత ఏమైందో ఏమో గానీ పార్వతి టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తాలుకు పేపర్ క్లిప్ తాజాగా మరోసారి వైరల్ అయింది. అలా ఇది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. (ఇదీ చదవండి: రజనీ, కమల్ తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్తో!) -
గుంటూరు కారంపై ఇంట్రెస్ట్ చూపించని త్రివిక్రమ్..
-
ప్రభాస్ స్టోరీతో అల్లు అర్జున్...భారీ పాన్ ఇండియా సినిమా
-
నిన్న తారక్..నేడు మహేష్...త్రివిక్రమ్ ఎందుకిలా చేస్తున్నాడు ?
-
సంయుక్త కోసం బుట్టబొమ్మకి హ్యాండ్ ఇచ్చిన త్రివిక్రమ్ ?
-
'గుంటూరు కారం' టీంకు షాక్.. బుట్టబొమ్మ గుడ్ బై చెప్పనుందా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, బుట్టబొమ్మ పూజా హేగ్డే జంటగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కూడా హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మహేష్ బాబుతో విబేధాలు.. వాళ్లందరికీ ఇచ్చిపడేసిన థమన్) గుంటూరు కారంలో మెయిన్ హీరోయిన్గా చేస్తున్న పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్, స్క్రిప్ట్, మరిన్నీ మార్పుల కారణంగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పూజా హెగ్డే స్థానంలో విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటించే అవకాశముందని టాలీవుడ్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొన్ని కారణాలతో గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్స్ మారుతూ వస్తున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. గతంలో ఓ షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత నుంచి షూటింగ్ అస్సలు కుదరట్లేదు. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ కూడా రీషూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాలతో స్క్రిప్ట్లో కూడా మార్పులు జరగడంతో పూజా హెగ్డే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.!) తమన్ వివాదం అయితే ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్ను తప్పిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆయన ప్లేస్లో అనిరుధ్ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా వీటికి తమన్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. నా ఆఫీసు దగ్గర మజ్జిగ పంచుతున్నా.. కడుపుమంట ఉన్నవాళ్లు వచ్చి తాగి వెళ్లండి' అంటూ కాస్త గట్టిగానే స్పందించారు. -
మహేష్ ఫాన్స్ కు మరో షాక్ ఇచ్చిన త్రివిక్రమ్
-
మహేష్ 'గుంటూరు కారం'.. సంక్రాంతి రిలీజ్ కష్టమేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు చివరగా 'సర్కారు వారి పాట'లో కనిపించాడు. ఆ సినిమా వచ్చి ఏడాది పైనే అయిపోయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' మూవీ చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. ఎందుకో ఆ కష్టాలు మాత్రం వదలట్లేదు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ కి లేనిపోని సందేహాలు వస్తున్నాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా గతేడాది అనౌన్స్ చేయగానే అందరూ తెగ ఎగ్జైట్ అయిపోయారు. 'అతడు', 'ఖలేజా'కి మించి ఉండబోతుందనే అంచనాలు పెంచేసుకున్నారు. కానీ రియాలిటీలో మాత్రం షూటింగ్ నత్తనడకన సాగుతోంది. గతంలో ఓ షెడ్యూల్ చేశారు ఆ తర్వాత నుంచి షూటింగ్ అస్సలు కుదరట్లేదు. (ఇదీ చదవండి: Adipurush Review: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) రీసెంట్ గా మహేష్ తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా 'గుంటూరు కారం' టీజర్- ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. యూట్యబ్ లో ఇది ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తోంది. మరోవైపు జూన్ 7న కొత్త షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉంది. ఏమైందో ఏమో గానీ జూన్ 12కి, ఆ తర్వాత జూన్ 20కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏకంగా జూలైకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. హీరో మహేష్ బాబు రెడీగా ఉన్నాసరే కొందరు కీలకమైన యాక్టర్స్ డేట్స్ దొరకలేదని, అందుకే షూటింగ్ వరసగా వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే జనవరి 13న సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఈ వాయిదాలు చూస్తుంటే మాత్రం అది కష్టమేనేమో అనిపిస్తుంది. మరి మహేష్-త్రివిక్రమ్ కలిసి ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: Jee Karda Review: 'జీ కర్దా' వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ) -
'గుంటూరు కారం' శ్రీలీల ఫస్ట్ లుక్.. ఇది గమనించారా?
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ హిట్ కొట్టి నిలబడేవాళ్లు మాత్రం చాలా తక్కువ. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీలీల. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ అంతంతమాత్రంగా ఆడినప్పటికీ.. అవకాశాల మాత్రం వెల్లువలా వచ్చేశాయి. (ఇదీ చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) గతేడాది 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీ అయిపోయింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం'లోనూ శ్రీలీల వన్ ఆఫ్ ది హీరోయిన్. బుధవారం ఈమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రకారం విలేజీ బ్యూటీగా శ్రీలీల కనిపించనుంది. లంగా ఓణీలో కాలికి నెయిల్ పాలిష్ పెడుతున్న లుక్ ని రిలీజ్ చేశారు. ఇలా శ్రీలీలని చూస్తుంటే.. 'గుంటూరు కారం'లో హీరో మహేష్ బాబునే డామినేట్ చేస్తుందా అనిపించేలా ఉంది. త్రివిక్రమ్ తీస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. అలానే రామ్-బోయపాటి మూవీలో శ్రీలీల ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో మోడ్రన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: కోపమొస్తే తల్లి అని కూడా చూడను, తిట్టేస్తా: శ్రీలీల) Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! 🤩 - Team #GunturKaaram 🔥🌶️#HBDSreeLeela ✨ Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf — Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023 -
ఇక షురూ
‘గుంటూరు కారం’ మళ్లీ షురూ అంటున్నారు మహేశ్బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొం దుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 12న హైదరాబాద్లోప్రారంభం కానుందని ఫిల్మ్నగర్ టాక్. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులకు పైగా ఉంటుందట. ఈ షెడ్యూల్లో సినిమాలోని ప్రధాన తారాగాణంపాల్గొంటారని సమాచారం. ‘గుంటూరు కారం’ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. -
మరో డైరెక్టర్ ని పాన్ ఇండియా కి తీసుకు వెళ్లనున్న అల్లు అర్జున్
-
చిరంజీవి దారిలో దూసుకుపోతున్న బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్