
మహేశ్బాబు, రామ్చరణ్, నాని, సందీష్ కిషన్ తదితర హీరోలు నిర్మాతలుగా మారారు. తాజాగా హీరో నాగచైతన్య నిర్మాణరంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భవిష్యత్తులో నిర్మాతను అవుతా’ అని పలు సందర్భాల్లో చైతన్య పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం తర్వాత హీరో రాజ్ తరుణ్, దర్శకుడు శ్రీనివాస్ గావిరెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారట నాగచైతన్య.