
నాకైతే నచ్చింది
శ్రీబాలాజీ, కృష్ణ, రఘు ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరి దర్శకుడు. ఎ.పి. రాధాకృష్ణ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ 8న పాటలను విడుదల చేసి, అదే నెలలో సినిమాను విడుదల చేస్తామని కార్యనిర్వాహక నిర్మాత బి.ఆర్.రాజు తెలిపారు. మైండ్గేమ్ నేపథ్యంలో సాగే కథ ఇదని నిర్మాత చెప్పారు. సోని చరిష్టా, రిషిక, సిరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సాగ, మాటలు: చందు, సికిందర్, కెమెరా: పి.ఆర్.కె.రాజు, ఎడిటింగ్: నందమూరి హరి.