థ్రిల్‌కి గురి చేస్తుంది! | Navdeep's 'Natudu' at Oct end | Sakshi
Sakshi News home page

థ్రిల్‌కి గురి చేస్తుంది!

Published Mon, Oct 13 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

థ్రిల్‌కి గురి చేస్తుంది!

థ్రిల్‌కి గురి చేస్తుంది!

నవదీప్ కథానాయకునిగా రూపొందించిన చిత్రం ‘నటుడు’. కావ్యాశెట్టి కథానాయిక. ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకుడు. రమేశ్‌బాబు కొప్పుల నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన

నవదీప్ కథానాయకునిగా రూపొందించిన చిత్రం ‘నటుడు’. కావ్యాశెట్టి కథానాయిక. ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకుడు. రమేశ్‌బాబు కొప్పుల నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. ‘‘కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ‘దృశ్యం’, ‘గీతాంజలి’ చిత్రాల విజయాలే నిదర్శనాలు. మా సినిమా కూడా వాటి కోవకే చెందుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ... ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేసే సినిమా ఇది. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. మానవసంబంధాలతో ఆడుకునే యువకుని కథ ఇదని, నవదీప్‌ని కొత్తగా ప్రెజెంట్ చేయడం జరిగిందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: జయసూర్య, సమర్పణ: కొప్పుల రాజేశ్వరీదేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement