Navdeep
-
ఓటీటీలో తెలుగు బోల్డ్ సినిమా 'లవ్ మౌళి'
నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందంటూ చిత్ర యూనిట్ భారీగానే ప్రమోషన్స్ చేసింది. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త బోల్డ్ కంటెంట్తో ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా కాస్త అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' అధికారికంగా ప్రకటన చేసింది. 'లవ్ మౌళి' చిత్రం జూన్ 27నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ తెలిపింది. రిలేషన్లో ఉన్న ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అనే కాన్సెప్ట్తో కథ ఉంటుంది.కథేంటి?మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్ని సృష్టించి ఇస్తాడు.కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ? View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
'లవ్ మౌళి' సినిమా రివ్యూ
కొన్నాళ్ల గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందని ప్రమోషన్స్ చేశారు. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త అంచనాలు పెంచాయి. ట్రైలర్లో ముద్దు, బోల్డ్ సీన్స్ వైరల్ అయ్యాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్ని సృష్టించి ఇస్తాడు. కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ?ఎలా ఉందంటే?'లవ్ మౌళి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సాధారణ ప్రేమకథ. కాకపోతే ఓ ఫాంటసీ ఎలిమెంట్ జోడీంచడం వల్ల స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా అనిపించింది. ప్రేమ అంటే ఏంటని వెతికే క్రమంలో ఓ అబ్బాయి ఏం తెలుసుకున్నాడు అనే పాయింట్తో ఈ మూవీ తీశారు. అయితే తొలి సగం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ స్టోరీకి తగ్గట్లు లోకేషన్స్, మ్యూజిక్ అదిరిపోయింది. కథంతా మేఘాలయలోనే ఉంటుంది.సీన్స్ పరంగా చూసుకుంటే ప్రేమ, పెళ్లిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఓ చోట కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాలోని ప్రేమ ఎమోషన్కి మనం కనెక్ట్ అయితే సినిమా బాగా నచ్చేస్తుంది. ముద్దు సీన్స్, బోల్డ్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. చాలా వరకు ముద్దు సీన్స్ సహజంగానే అనిపించినా ఒకటి రెండు బోల్డ్ సీన్స్ మాత్రం అవసరమా అనిపిస్తాయి. కథని ఎంత కొత్తగా చూపించినా చివరకు అందరూ చెప్పేదే చెప్పడంతో ఓస్ ఇంతేనా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ప్రమోషన్స్లో 2.0 అనేలా నవదీప్ యాక్ట్ చేశాడు. బాడీ, సీన్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. హీరోయిన్ చిత్ర పాత్ర చేసిన పంఖురి గిద్వాని సూపర్గా చేసింది. హారికగా నటించిన భావన సాగి పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు ఓకే. రానా దగ్గుబాటి అఘోరాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టేసాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. లొకేషన్స్ అదిరిపోయాయి. మేఘాలయని అద్భుతంగా చూపించారు. దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కావడంతో ఔట్పుట్ అదిరిపోయింది. గోవింద్ వసంత, కృష్ణ ఇచ్చిన సంగీతం సరిగ్గా సరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంటుంది. అవనీంద్ర, దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువల మూవీకి తగ్గట్లు ఉన్నాయి. -
రెండున్నరేళ్లు ఒకే గెటప్లో ఉన్నాను: నవదీప్
‘‘లవ్ మౌళి’ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేశాం. ఎన్నో వ్యయ ప్రయాసలతో అక్కడ షూట్ చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఎప్పుడూ వర్షం పడే ఆ ప్రదేశంలో సినిమా మీద ప్యాషన్తో షూటింగ్ చేశాం. ఈ సినిమాలోని నా పాత్ర కోసం రెండున్నరేళ్లు ఒకే గెటప్లో ఉన్నాను. ‘లవ్ మౌళి’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని హీరో నవదీప్ అన్నారు.ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్తో కలిసి సి స్పేస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ప్రారంభంలో జెట్ స్పీడులో వెళ్లింది. ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనకు తగ్గట్లుగా కెరీర్ మార్చుకోవాలనిపించింది. ఆ సమయంలో విన్న కథే ‘లవ్ మౌళి’. ఇది రెగ్యులర్ ప్రేమకథ కాదు. అందరికీ కనెక్ట్ అవుతుంది.ముఖ్యంగా యువతకు కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ‘లవ్ మౌళి’ విజయంతో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందనుకుంటున్నాను. సరదాగా హీరో రానాకు ఈ చిత్రకథ చెప్పాను. కథ బాగుండటంతో అఘోరా పాత్ర చేశాడు. ప్రస్తుతం తమిళంలో నిత్యా మీనన్తో ఓ సినిమా, అలాగే ‘న్యూసెన్స్ 2’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నేను నటించిన మరికొన్ని వెబ్ సిరీస్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
నా కోసం రానా అఘోరగా నటించాడు : హీరో నవదీప్
‘లవ్ మౌళి’కథను సరదాగా నా స్నేహితుడు రానాకు చెప్పాను. స్టోరీ మొత్తం విన్నాక.. చాలా బాగుందని చెప్పి అందులోని అఘోర పాత్రను చేశాను. నిజంగా చెప్పాలంటే రానాకు ఆ పాత్ర చేయాల్సిన అవసరం లేదు. కానీ నా కోసం చేశాడు. ఈ సినిమాలో రానా అఘోరగా నటించాడని ఇంతవరకు రివీల్ చేయలేదు. ఎందుకంటే దీనిని కమర్షియల్గా వాడుకోవడం ఇష్టం లేదు’అని అన్నారు హీరో నవదీప్. చాలా తర్వాత నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’.రాజమౌళి శిష్యుడు అవనీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ నా కెరీర్ ప్రారంభమైనప్పుడు.. మంచి జెట్స్పీడులో వెళ్లింది. వరుసగా చేసుకూంటూ వెళ్లాను. ఆ తరువాత అన్ని తరహా పాత్రలు చేశాను. ఇప్పుడు జనాల నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాను. వాళ్లు నా గురించి ఆలోచించే తరహాలో మార్పు ఉన్నప్పుడు మనం కూడా మరాలి అనిపించింది. అందుకే నాకు కూడా వాళ్ల ఆలోచన తగిన విధంగా కెరీర్ను మార్చకోవాలినిపించింది. ఆ తరుణంలో విన్న కథే లవ్,మౌళి. ఈ సినిమా కోసం అన్ని మార్చుకున్నాను.⇒ ఈ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలతో షూటింగ్ చేశాం. ఎప్పూడు వర్షం పడే ఆ ప్లేస్లో సినిమా మీద పాషన్తో చిత్రీకరణ చేశాం. రెండున్నర సంవత్సరాలు నేను కూడా అదె గెటప్లో వున్నాను. సినిమా కోసం అందరం కష్టపడి తీశాం. లవ్ మౌళి సినిమా మేకింగ్ అంతా ఓ సాహసం అని చెప్పాలి.⇒ ఇది రెగ్యులర్ లవ్స్టోరీ కాదు. ఈ సినిమా అందరికి కొత్త అనుభూతినిస్తుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కాకుండా మరో భాషల్లో వచ్చి ఉంటే చూసే కోణంలో కూడా తేడా వుండేదెమో.. ఈ సినిమా అందరికి ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుది.⇒ ఈ సినిమా కోసం నేను, దర్శకుడు సింక్లో ఉండి ప్రిపేర్ అయ్యాం. నేను ఏ సినిమా చేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యే వాడిని. ఈ సినిమాతో విజయం నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను.⇒ ఈ సినిమాలో నేపథ్యం సంగీతం హైలైట్ అని చెప్పాలి. సన్నివేశానికి ఎలివెట్ చేసే విధంగా చాలా మంచి పాటలతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. లవ్మౌళి ఎక్స్పీరియన్స్ అందరికి కొత్త అనుభూతిని ఇస్తుంది.⇒ నా రియల్లైఫ్లో ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి. 23 ఏళ్ల నుండి రకరకాల మనుషులను ప్రేమించాను. పర్సనల్గా కూడా ఈ సినిమా కథ నాకు ఎంతో కనెక్ట్ అయ్యింది. సినిమా దర్శకుడు కూడా తన వ్యక్తిగత అనుభవాలను ఇందులో చూపించాడు. అతని ఆలోచనలకు దగ్గర ఈ సినిమా ఉంటుంది. మనం ఏంటో తెలుసుకుని ప్రశాంతంగా ఉండి.. అవతలి వాళ్లను కూడా ప్రశాంతంగా ఉంచితే.. బాగుంటుంది.⇒ న్యూసెన్స్ 2 వెబ్సీరిస్తో పాటు తమిళంలో నిత్యమీనన్తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని వెబ్సీరిస్లు రిలీజ్కు సిద్దంగా ఉన్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో రావాలనుకుంటున్నాను. లవ్, మౌళికి వచ్చిన స్పందన బట్టి నా తదుపరి చిత్రాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. -
లవ్ మౌళి 2.0 అని తె? ఎందుకు పెట్టారు..?
-
నాలో కొత్త కోణాన్ని చూపించిన చిత్రమిది: నవదీప్
‘‘ప్రస్తుతం అన్ని భాషల్లో కొత్త కంటెంట్తో సినిమాలు వస్తున్నాయి. అదే కోవలో తెలుగులో రాబోతున్న వైవిధ్యమైన సినిమా ‘లవ్ మౌళి’. ప్రేక్షకులను థియేటర్కు రప్పించే సినిమా ఇది. నా 20 ఏళ్ల సినీ కెరీర్ తర్వాత నాలో ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇది’’ అని నవదీప్ అన్నారు. నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ, భావన సాగి, ‘మిర్చి’ హేమంత్, ‘మిర్చి’ కిరణ్ ఇతర పాత్రల్లో నటించారు.నైరా క్రియేషన్, శ్రీకర స్టూడియోస్తో కలిసి సి స్పేస్ నిర్మించింది. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అవనీంద్ర మాట్లాడుతూ– ‘‘నేటి యువతరానికి కావాల్సిన అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారి బంధాలు ఎలా ఉన్నాయి? నేటి యువతరం ప్రేమించి పెళ్లి చేసుకున్నా బ్రేకప్లు అవుతున్నాయి. రాజీపడితే తప్ప బంధాలు నిలబడవా? అనే ప్రశ్నకు నాకు దొరికిన పరిష్కారాన్ని కూడా ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. -
బెంగళూరు రేవ్ పార్టీ.. ఈసారి బతికిపోయానన్న నవదీప్..!
బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు ఉన్నట్లు మొదట సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. నటుడు శ్రీకాంత్, హేమ పేర్లు బయటికి రావడంతో వాళ్లిద్దరూ బయటికి వచ్చి క్లారిటీ ఇచ్చారు. కానీ హేమ ఆ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆ తర్వాత జరిగిన బ్లడ్ శాంపిల్స్ టెస్ట్లో హేమకు పాజిటివ్ రావడంతో నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో హీరో నవదీప్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను నటిస్తోన్న కొత్త సినిమా లవ్ మౌళి ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈసారి మీరు ఫేక్ న్యూస్లో కనిపించడం లేదు కదా సార్ అని కొందరు ప్రశ్నించారు. ఇలాంటి వార్తలొచ్చినప్పుడు మీ పేరు కూడా వినిపించేది కదా సార్ అని అడగడంతో నవదీప్ స్పందించారు.ఈ సారి అంతా మంచే జరిగిందని.. ఈ ఒక్కసారి తనను వదిలేశారని నవదీప్ నవ్వుతూ సమాధానామిచ్చాడు. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆ పార్టీ వేరు వేరు దేశాల్లో వేరే విధంగా ఉంటుందన్నారు. రొమాంటిక్ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన లవ్ మౌళి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో భావన సాగి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ జూన్ 7న విడుదల కానుంది. -
చిన్న హీరో అంటూ ఆ హీరోయిన్ చులకనగా మాట్లాడింది: నవదీప్
జై సినిమాతో హీరో నవదీప్ తన కెరీర్ మొదలుపెట్టాడు. హీరోగానే కాకుండా విలన్గా, సహాయక నటుడిగానూ సినిమాలు చేశాడు. ఓటీటీలోనూ సినిమాలు, సిరీస్లతో ఆకట్టుకుంటున్నాడు. అతడు హీరోగా నటించిన లవ్ మౌళి మూవీ జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచాడు నవదీప్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను గూర్చి మాట్లాడాడు.రెండో సినిమాకే..'నా రెండో సినిమా మనసు మాట వినదు సమయంలోనే కాంట్రవర్సీ మొదలైంది. సక్సెస్కు చాలా గ్యాప్ వచ్చిన పెద్ద హీరోలకు హిట్లు ఇచ్చిన లక్కీ పర్సన్ తానే అని హీరోయిన్ అంకిత ఫీలైంది. అలాంటి నన్ను ఈ చిన్న హీరో డేట్ల కోసం ఇబ్బందిపెడతారా? అని నిర్మాతను ప్రశ్నించింది. అప్పుడు నాకింకా 17 ఏళ్లు. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పటినుంచే..తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. ఆ సినిమా నుంచే నన్ను వివాదాలు చుట్టుముట్టడం మొదలయ్యాయి. రేవ్ పార్టీ, ఈడీ కేసులు.. అని ఏదేదో ప్రచారం చేస్తుంటారు. నాకు సంబంధం లేకపోయినా నా పేరు తీసుకొస్తుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజముండదు. అసలు నాపై ఒక్క కేసు కూడా లేదు' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ -
మృగాడితో రొమాన్స్.. బోల్డ్ సీన్లతో ట్రైలర్
'లవ్ మౌళి'గా చాలారోజుల తర్వాత ప్రేక్షకులు ముందుకు రానున్నారు నవదీప్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అవనీంద్ర డైరెక్ట్ చేయగా.. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇందులో పంఖురి గిద్వానీ హీరోయిన్గా నటించగా. భావన సాగి, మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ అనేది లేకుండా ప్రపంచంలో మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనుషులతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తికి ప్రేమించే వ్యక్తి దొరికితే మనిషి ఎలా మారతాడు అనే విషయాన్ని కాస్త బోల్డ్గానే చెప్పినట్లు ట్రైలర్తో తెలుస్తోంది. ట్రైలర్లో అక్కడక్కడ రొమాన్స్ సీన్లు ఉన్నా.. అందులో ఏదో కంటెంట్ ఉంది అనేలా ట్రైలర్ను మేకర్స్ కట్ చేశారు. 2021లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొని ఆపై అనేక ఒడుదొడుకల నడుమ ఇటీవల ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి అయ్యాయి. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది. -
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
ఏవం సినిమా గురించి నటుడు నవదీప్
-
ఇటీవలే వరుణ్ తేజ్ పెళ్లి..నెక్ట్స్ నేనే అంటోన్న టాలీవుడ్ హీరో!
టాలీవుడ్లో మోస్ట్ బ్యాచలర్ హీరోల్లో నవదీప్ ఒకరు. జై సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన నవదీప్ పలు సినిమాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించారు. గౌతమ్ ఎస్ఎస్సీ, ఆర్య-2, ధృవ, అల వైకుంఠపురములో, నేనే రాజు, నేనే మంత్రి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించారు. అయితే ఈ ఏడాది న్యూసెన్స్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటివరకు బ్యాచ్లర్గానే ఉన్న నవదీప్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ట్విటర్ ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో నవదీప్ మాట్లాడుతూ.. 'పెళ్లిళ్ల మీద నా అభిప్రాయం తెలిసిన మా మదర్ ఇండియా.. పొద్దున్నే నన్ను ఓ క్వశ్చన్ అడిగింది. నిజంగానే పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే.. పాపం పెళ్లిళ్లు వర్కవుట్ అవ్వక విడాకులు తీసుకునేవాళ్లు.. మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటారా? అని అడిగింది.' అని అన్నారు. అంతే కాకుండా వీడియోతో పాటు జరగాలి పెళ్లి అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా పెళ్లి చేసుకునే పనిలో ఉన్నారా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో నవదీప్ త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అన్నా మీ పెళ్లికి మమ్మల్ని కచ్చితంగా పిలవండి అంటూ హీరోను రిక్వెస్ట్ చేస్తున్నారు. నవదీప్ పోస్ట్ను చూస్తే మన హీరో త్వరలోనే పెళ్లిపీటలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గతంలో చాలా సార్లు పెళ్లిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడే చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే చెప్పారు. కాగా.. ఇటీవలే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 😅 pic.twitter.com/5CeV7EPIGY — Navdeep (@pnavdeep26) November 16, 2023 -
Eagle Movie Teaser Stills: రవితేజ 'ఈగల్' మూవీ స్టిల్స్
-
ఆ ఖాతాలకు డబ్బు ఎందుకు పంపారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఈ బ్యాంకు ఖాతాకు మీరు డబ్బు ఎందుకోసం పంపారు? ఈ ఆర్థిక లావాదే వీలు జరిపిన వ్యక్తులు మీకు ఎలా తెలుసు? ఎప్పటి నుంచి ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపుతున్నారు?’ ఇలాంటి అనేక కీలక ప్రశ్నలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నటుడు నవదీప్కు సంధించినట్లు సమాచారం. కొందరు నైజీరియన్ల బ్యాంకు ఖాతాలకు నవదీప్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు వెళ్లినట్టుగా ఈడీ అధికా రులు గుర్తించినట్టు తెలిసింది. 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులతో పాటు ఇటీవల నమో దైన మాదాపూర్ డ్రగ్స్ కేసులలో ఆర్థిక లావాదేవీ లపై ప్రశ్నించేందుకు తమఎదుట హాజరుకావాలంటూ ఈడీ అధికా రులు నటుడు నవదీప్కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఉదయం 10–40 గంటలకు సైఫాబాద్ లోని ఈడీ కార్యాలయానికి నవదీప్ చేరుకున్నారు. సమన్లలో పేర్కొన్న విధంగా బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్కార్డ్ సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆధ్వర్యంలోని ఐదుగురు అధికారుల ప్రత్యేక బృందం నవదీప్ను దాదాపు 8 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా నవదీప్కు చెందిన 3బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలిసింది. నైజీరియన్లతో ఆర్థిక లావాదేవీలు.. 2017లో తెలంగాణ ఎక్సైజ్శాఖ నమోదు చేసిన డ్రగ్స్ కేసులలో కీలక నిందితుడు కెల్విన్ పట్టుబడిన తర్వాత టాలీవుడ్ డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. దీంతో హీరో నవదీప్ సహా పలువురిని ఎక్సైజ్ అధికారులు విచారించారు. ఈడీ మనీలాండరింగ్పై దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా కేసు నమోదు చేసిన అధికారులు 2021లో నవదీప్తో పాటు పలువురు టాలీవుడ్ నటులను ప్రశ్నించారు. ఇప్పటికే ఒకసారి నవదీప్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు తాజాగా మంగళవారం నాటి విచారణలోనూ ఆయన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. నవదీప్కు ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వరంగల్కు చెందిన రామ్చంద్ అత్యంత సన్నిహితుడు. రామ్చంద్ బెంగళూరులో షెల్టర్ తీసుకుంటున్న నైజీరియన్లు అమోబి చుక్వుడి, మైకేల్, థామస్ అనఘల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో కస్టమర్లకు అమ్మేవాడని తేలింది. కాగా హీరో నవదీప్ కూడా డ్రగ్స్ అందించేవాడని దర్యాప్తు సంస్థలు అనుమా నిస్తున్నాయి. ఈ క్రమంలోనే నైజీరియన్లతో నవదీప్ ఆర్ధికపరమైన లావాదేవీలు జరిపినట్టుగా ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తాజా డ్రగ్స్ కేసులతో పాటు 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ నుంచి వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. విచారణ అనంతరం మంగళవారం రాత్రి ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళుతున్న నవదీప్ను మీడియా ప్రతినిధులు పలు అంశాలపై ప్రశ్నించారు. అయితే ఆయన ఏమీ స్పందించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ పూర్తి.. మొత్తం 9 గంటలు!
డ్రగ్స్ కేసు విషయమై తెలుగు ప్రముఖ నటుడు నవదీప్ని ఈడీ విచారించడం ముగిసింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయానికి వచ్చిన నవదీప్.. సాయంత్రం 7 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంటే దాదాపు 9 గంటల పాటు అతడిని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ గురించి.. అలానే డ్రగ్స్ అమ్మేవాళ్లతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాల గురించి విచారణలో అడిగినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అనసూయ? హాట్ యాంకర్ సమాధానమిదే!) ఇంతకీ ఏం జరిగింది? గుడిమల్కాపూర్ పరిధిలో కొన్నిరోజులు క్రితం డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 10న విచారణకు హాజరవ్వాలని నటుడు నవదీప్కి ఈడీ నోటీసులు జారీ చేసింది. పోలీసులకు చిక్కిన నైజీరియన్ డ్రగ్ పెడ్లర్తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్లను విచారించడంతో నవదీప్ పేరు బయటపడింది. ఈ క్రమంలోనే నవదీప్ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్ పోలీసులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. తాజాగా ఈడీ అధికారులు ఏకంగా 9 గంటలు విచారణ చేశారు. (ఇదీ చదవండి: చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?) -
నవదీప్ తో పాటు పలువురిని ప్రశ్నిస్తున్న ఈడీ
-
హీరో నవదీప్ మెడకు బిగుస్తున్న డ్రగ్స్ ఉచ్చు
-
సినీ నటుడు నవదీప్ కు ఈడీ నోటీసులు
-
టాలీవుడ్ హీరో నవదీప్కు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో నవదీప్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవలే నవదీప్ను నార్కోటిక్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. అయితే.. నార్కోటిక్ బ్యూరో కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన నవదీప్ను హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. (ఇదీ చదవండి: నార్కోటిక్ విచారణ పూర్తి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ) అసలేం ఏం జరిగింది? ఈ ఏడాది సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ని నిందితుడుగా చేర్చిన పోలీసులు.. ఇటీవలే అతడిని విచారించారు. (ఇది చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
'సగిలేటి కథ' నుంచి 'చికెన్ సాంగ్' లాంచ్
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకుడు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలరిస్తుంది. తాజాగా ఓ క్రేజీ గీతాన్ని విడుదల చేశారు. (ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత) హీరో నవదీప్ ఆధ్వర్యంలో తెలుగు యంగ్ డైరెక్టర్స్ 'బేబీ' ఫేమ్ సాయి రాజేశ్, వెంకటేష్ మహా, సందీప్ రాజ్.. ఈ సాంగ్ లాంచ్కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని, అలానే ఈ మూవీలో కామెడీ అందరిని నవ్విస్తుందని, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతిఒక్కరికీ చికెన్ తినాలనిపిస్తుందని నవదీప్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది. (ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ) -
పోలీస్ స్టేషన్ లో నన్ను చాలా కొట్టారు
-
సినీ భాషలోనే డ్రగ్స్ దందా!
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాల్లో నమోదైన ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారు మాదకద్రవ్యాల దందాను వారి పారిభాషిక పదాలనే కోడ్ వర్డ్స్గా వినియోగించే చేస్తున్నట్లు వెల్లడైంది. మరోపక్క టీఎస్ నాబ్ అధికారులు నటుడు నవదీప్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ను విశ్లేషిస్తున్నారు. న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ పొందిన నిందితులు మంగళవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఇటీవల కాలంలో టాలీవుడ్తో లింకులు ఉన్న డ్రగ్స్ కేసులు రెండు నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న కేపీ రెడ్డికి సంబంధించిన కేసు మాదాపూర్ ఠాణాలో నమోదైంది. టీఎస్ నాబ్ అధికారులు గుట్టురట్టు చేసిన వెంకట రమణరెడ్డి లింకులకు సంబంధించిన కేసు హైదరాబాద్ కమిషనరేట్లోని గుడిమల్కాపూర్ ఠాణాలో రిజిస్టరైంది. ఈ కేసులోనే హీరో నవదీప్ పేరు బయటపడింది. ఈ రెండు కేసుల్లోనూ అనేక మంది టాలీవుడ్ నటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు మోడళ్ళు సైతం డ్రగ్స్ వినియోగదారులుగా ఉన్నట్లు బయటపడింది. వీళ్ళు రహస్య ప్రాంతాల్లో, పొరుగు రాష్ట్రాల్లో పార్టీలు నిర్వహించుకుంటూ, మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా డ్రగ్స్ క్రయవిక్రయాల్లో వాటి పేర్లను డైరెక్టుగా వాడరు. ఎవరికి వాళ్ళు కొన్ని కోడ్ వర్డ్స్ పెట్టుకుని పని పూర్తి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సినీ రంగానికి చెందిన వారు ఆ పారిభాషిక పదాలతోనే డ్రగ్స్కు కోడ్ వర్డ్స్ రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. నటులు, దర్శకులు, నిర్మాతలతో పాటు మోడల్స్ సైతం ఎక్కువగా కొకై న్ను వినియోగిస్తుంటారని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ డ్రగ్కు స్క్రిప్ట్ అనే కోడ్ వర్డ్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మాదకద్రవ్యాలు సరఫరా చేసే డ్రగ్ పెడ్లర్కు రైటర్ అని, డ్రగ్స్ రావాలని అడగటానికి ‘షెల్ వీ మీట్’ అని కోడ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి వారి ఫోన్లు విశ్లేషించినప్పుడు ఈ పదాలే కనిపించాయని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. మరోపక్క నవదీప్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ విశ్లేషణ ప్రారంభమైంది. ఈ ఫోన్ను పోలీసులకు అప్పగించే ముందే నవదీప్ ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే దర్యాప్తులో గుర్తించిన అంశాలను బట్టి ఈ డ్రగ్స్ క్రయవిక్రయాలన్నీ స్నాప్చాట్ ఆధారంగా జరిగాయి. ఈ సోషల్మీడియా యాప్లో ఉన్న డిజ్అప్పీర్ ఆప్షన్ను పెడ్లర్లు, వినియోగదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గుడిమల్కాపూర్ కేసులో నిందితులుగా ఉండి, న్యాయస్థానం నుంచి మందస్తు బెయిల్ తీసుకున్న వ్యాపారి కలహర్రెడ్డి, పబ్ నిర్వాహకుడు సూర్య కాంత్ సహా మరో వ్యక్తి మంగళవారం దర్యాప్తు అఽధికారి ఎదుట హాజరయ్యారు. గుడిమల్కాపూర్ ఠాణాలో ష్యూరిటీలు సమర్పించడంతో పాటు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతాయని హామీ ఇచ్చారు. కలహర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘హైకోర్టు ఆదేశాల మేరకు గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్ లో లొంగిపోయా. నాకు, డ్రగ్స్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. విచారణకు పూర్తిగా సహకరించాను.. తర్వాత కూడా సహకరిస్తాను. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు’ అని అన్నారు. -
డ్రగ్స్ కేసులు..పబ్బు గొడవలు.. నిత్యం వివాదాల్లో హీరో నవదీప్!
నవదీప్.. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరితమైన వ్యక్తి. జై సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ నటుడు.. వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్గా గుర్తింపు పొందాడు. అయితే సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయ్యాడు నవదీప్. డ్రగ్స్ కేసులు..పబ్బు గొడవలు అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ-29గా నవదీప్ ఇటీవల హైదరాబాద్ మాదాపూర్లోని విఠల్నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ వ్యవహారంతో మరోమారు నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో పట్టుబడిన రామ్చంద్ ఇచ్చిన సమాచారం మేరకే హీరో నవదీప్పై కేసు నమోదైంది. నవదీప్ కు డ్రగ్స్ ముఠా తో సంబంధం ఉందని, అతను సైతం ఈ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్ఎన్ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. రిమాండ్ రిపోర్ట్లో ఏ 29 గా నవదీప్ని చేర్చారు. నిన్న విచారణకు కూడా హాజరయ్యాడు. విచారణ కొత్తేమి కాదు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం నవదీప్కు కొత్తేమి కాదు. 2017లో టాలీవుడ్ను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ నవదీప్ విచారణ ఎదుర్కొన్నాడు. నవదీప్తో పాటు రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను అధికారులు విచారించారు. అప్పట్లో నవదీప్ పేరే అందరికంటే ఎక్కువగా వినిపించింది. వివాదాలకు కేంద్రబిందువుగా నవదీప్ సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు నవదీప్. డ్రగ్స్ ఆరోపణలే కాదు.. పబ్ గొడవలు.. విద్యార్థులపై దాడి..తదితర ఆరోపణలు కూడా నవదీప్పై ఉన్నాయి. 2011లో స్నేహితులతో కలిసి అనుమతి లేకుండా నాగార్జున సాగర్లో పడవ ప్రయాణం చేశాడు. ఈ విషయంపై అప్పట్లో నవదీప్పై కేసు కూడా నమోదైంది. అదే ఏడాది హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులతో నవదీప్ గొడవపడ్డాడు. ఓ విద్యార్థిపై దాడి కూడా చేశాడు. ఈ గొడవ విషయంలోనూ మాదాపూర్ ఠాణాలో నవదీప్పై కేసు నమోదైంది. గతంలో బంజారాహిల్స్లో అతివేగంగా వాహనం నడుపుతూ పోలీసుకులకు పట్టుపట్టాడు. ఆ సమయంలో పోలీసులతో అనుచితంగా వ్యవహరించడంతో కేసు నమోదు చేశారు. ఇప్పుడు రెండోసారి డ్రగ్స్ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నా..
హిమాయత్నగర్: మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని... ఇటీవల కాలంలో ఎప్పుడూ వాటి జోలికి పోలేదని నటుడు నవదీప్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) అధికారులకు తెలిపాడు. ఇటీవల హైదరాబాద్ మాదాపూర్లోని విఠల్నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ వ్యవహారంలో మరోమారు నవదీప్ పేరు తెరపైకి రావడం, అతడు సైతం డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్ఎన్ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ప్రకటించిన నేపథ్యంలో టీఎస్ఎన్ఏబీ నుంచి నోటీసులు అందుకున్న హీరో నవదీప్ శనివారం ఉదయం 11 గంటలకు టీఎస్ఎన్ఏబీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యాడు. ఏసీపీ కె.నర్సింగరావుతో కలసి టీఎస్ఎన్ఏబీ (వెస్ట్) ఎస్పీ సునీతారెడ్డి నవదీప్ను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడుతూ నార్కోటిక్ బ్యూరో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానన్నాడు. మళ్లీ ఎప్పుడు పిలిచినా తాను వచ్చేందుకు సిద్ధమని తెలియజేశాడు. ఈమధ్య కాలంలో డ్రగ్స్ తీసుకోలేదు... డ్రగ్స్ వ్యవహారంలో రామ్చంద్ అనే వ్యక్తిని టీఎస్ఎన్ఏబీ పోలీసులు విచారించగా తన పేరు చెప్పాడని... అతనిచ్చిన వాంగ్మూలం మేరకు నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించారని హీరో నవదీప్ వివరించాడు. తాను మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానే తప్ప ఇటీవల కాలంలో తీసుకోలేదన్నాడు. 15 ఏళ్లుగా పరిచయమున్న రామ్చంద్ ఏ కారణంతో తన పేరు చెప్పాడో తెలియదని పేర్కొన్నాడు. డ్రగ్ పెడ్లర్లు వెంకటరమణారెడ్డి, బాలాజీలతో ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలంటూ నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించగా 2017 నాటి డ్రగ్స్ కేసు విషయం, ఆనాటి పెడ్లర్ల ద్వారా వారు పరిచయమయ్యారని అతను చెప్పినట్లు తెలిసింది. 2017లో ఎక్సైజ్ అధికారులు విచారణకు పిలిచినప్పుడు వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని నవదీప్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆ 81 మందిపై ఆరా... హీరో నవదీప్ మొబైల్ను స్వా«దీనం చేసుకున్న నార్కోటిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధానంగా 81 ఫోన్ నంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. అందులో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారుల పేర్లు ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. దీంతో వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. నవదీప్కు చెందిన ఎస్బీఐ ఖాతాను పరిశీలిస్తున్న పోలీసులు... ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే కోణంలో విచారిస్తున్నారు. అదేవిధంగా అతని మొబైల్లోని స్నాప్చాట్, వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు, అతను ఎవరెవరితో కలసి డ్రగ్స్ తీసుకున్నాడనే విషయాలన్నీ స్నాప్చాట్, టెలిగ్రామ్ల చాటింగ్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో నవదీప్ను విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. భయం వేసి పారిపోయా.. డ్రగ్స్ తీసుకోకుంటే పారిపోవాల్సిన అవసరం ఏముందని ఎస్పీ సునీతారెడ్డి నవదీప్ను ప్రశ్నించగా మీడియాలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పదేపదే వార్తలు రావడం వల్ల భయానికి గురయ్యానని హీరో నవదీప్ పేర్కొన్నట్లు తెలిసింది. మీడియా ఒత్తిడి వల్ల తనను నార్కోటిక్ బ్యూరో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి పారిపోయినట్లు విచారణలో అతను చెప్పాడని సమాచారం. 45 మందికి తరచూ ఫోన్లు.. డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్ను విచారించాం. మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని చెప్పాడు. విచారణకు వచ్చే సమయంలో మొబైల్లోని డేటా అంతా తొలగించి.. తల్లికి చెందిన మొబైల్ ఫోన్తో వచ్చాడు. అతని మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించగా.. మరమ్మతుల్లో ఉందన్నాడు. దీనిపై క్రాస్ చెక్ చేయగా మొబైల్ షాప్ వ్యక్తి కూడా అదే సమాధానం ఇచ్చాడు. పాత, కొత్త మొబైల్తోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఇప్పటివరకు 81 లింకులను గుర్తించాం. వాటిలో ప్రధానంగా 45 మందికి నవదీప్ తరచూ ఫోన్కాల్స్, మెసేజ్లు చేసేవాడు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం – ఎస్పీ సునీతారెడ్డి -
నార్కోటిక్ విచారణ పూర్తి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డ్రగ్స్ కేసులో భాగంగా తెలుగు నటుడు నవదీప్ని నార్కోటికి అధికారులు విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు పలు ప్రశ్నలు అడిగారు. ఇదంతా పూర్తయిన తర్వాత బయటకొచ్చిన నవదీప్.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సంబంధం లేదంటూనే కొత్త విషయాల్ని బయపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? నవదీప్ ఏం చెప్పాడు? ఏం జరిగింది? ఈ సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ని నిందితుడుగా చేర్చిన పోలీసులు.. తాజాగా అతడిని విచారించారు. ఈ క్రమంలోనే శనివారం దాదాపు 6 గంటలకు పైగా ఈ విచారణ సాగింది. ఇది పూర్తయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నవదీప్ కామెంట్స్ 'డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చినందుకు నేను విచారణకు వచ్చాను. రామచందర్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ అది పదేళ్ల క్రితం విషయం. నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో ఓ పబ్ని నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు. గతంలో సిట్, ఈడీ విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ విచారిస్తుంది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరముంటే మళ్లీ పిలుస్తామని చెప్పారు. అలానే ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులని కూడా పరిశీలించి దర్యాప్తు చేశారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పనిచేస్తోంది' అని నవదీప్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సీరియల్ బ్యాచ్ని వాయించేసిన నాగార్జున.. తప్పుల్ని గుర్తుచేస్తూ!) -
డ్రగ్స్ కేసులో నవదీప్కు బిగ్ షాక్!
మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నవదీప్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. (ఇది చదవండి: విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!) పిటిషన్పై హై కోర్టులో విచారణ సినీ నటుడు నవదీప్ పిటిషన్పై హై కోర్టు లో విచారణ జరిగింది. అయితే నవదీప్పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హై కోర్టుకు పోలీసులు వివరించారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరఫున అడ్వకేట్ సిద్దార్థ్ వాదించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని నవదీప్ అడ్వకేట్ సిద్దార్థ్ హైకోర్టుకు వివరించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో నవదీప్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. (ఇది చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!) ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో 41 ఏ కింద నవదీప్కు నోటీస్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులిచ్చి విచారణ జరపాలని ఆదేశిస్తూ నవదీప్ పిటిషన్ కొట్టివేసింది. -
నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు
-
డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. నవదీప్ ఇంటికి నార్కోటిక్ పోలీసులు!
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్చంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అసలేం జరిగిందంటే... మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్లాట్లో గత నెల 31న జరిగిన డ్రగ్ పార్టీ తీగ లాగిన టీఎస్ నాబ్ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్చంద్ విచారణలోనే నటుడు నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్చంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు. చివరిసారిగా గత శనివారం వీరిద్దరు వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్ నాబ్ అధికారులు నవదీప్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. నవదీప్ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు డ్రగ్స్ కేసులో నవదీప్ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధి డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో నటుడు నవదీప్ పేరు
హైదరాబాద్: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో సినీనటుడు నవదీప్ కూడా నిందితుడని, అతడు పరారీలో ఉన్నాడని నగర కొత్వాల్, తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) డైరెక్టర్ సీవీ ఆనంద్ గురువారం సాయంత్రం ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది సమయానికే తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నవదీప్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. డ్రగ్స్ కేసులో ఉన్న నవదీప్ తాను కాదని, తన ఇంట్లోనే అందుబాటులో ఉన్నానని అందులో ప్రకటించాడు. ఆపై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన శుక్రవారం తన న్యాయవాది ద్వారా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. రామ్చంద్ వాంగ్మూలంతో వెలుగులోకి.. మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్లాట్లో గత నెల 31న జరిగిన డ్రగ్ పార్టీ తీగ లాగిన టీఎస్ నాబ్ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్చంద్ విచారణలోనే నటుడు నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్చంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు. ఆఖరుసారిగా గత శనివారం ఇరువురం వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్ నాబ్ అధికారులు నవదీప్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. మరికొందరితో కలిసి ఎస్కేప్... హైదరాబాద్ సీపీ చెప్తున్న నవదీప్ను తాను కాదంటూ ట్వీట్ చేసిన నవదీప్ ఆపై కొన్ని మీడియా చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇవి ముగిసిన తర్వాత మరికొందరితో కలిసి కారులో బయటకు వెళ్లిపోయాడు. ఈ హడావుడి చూసిన టీఎస్ నాబ్ అధికారులు నవదీప్కు నోటీసులు జారీ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అతడు అందుబాటులో లేకపోవడంతో మరికొన్ని ప్రాంతాల్లోనూ గాలించారు. అర్ధరాత్రి వరకు పోలీసులతో టచ్లో ఉన్న నవదీప్ అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా అంటూ మఽభ్యపెట్టాడు. ఆపై పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం తన న్యాయవాది ద్వారా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్ నాబ్ సైతం కౌంటర్ దాఖలు చేసింది. గతంలోనూ గలాభాలు.. . నవదీప్ వార్తల్లోకి ఎక్కడం ఇది తొలిసారేమీ కాదు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడపడంతో పాటు పోలీసుల విధులను అడ్డుకోవడానికి ప్రయత్నించి 2010లో అరెస్టయ్యాడు. అదే ఏడాది అక్టోబర్లో నాగార్జునసాగర్లో బోటుతో వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకుని హడావుడి చేశాడు. 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరయ్యాడు. నవదీప్ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు డ్రగ్స్ కేసులో నవదీప్ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధి డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.సురేందర్ వాదనలు చేపట్టారు. పిటిషనర్ తరఫున వెంకట సిద్ధార్థ వాదనలు వినిపించారు. ‘ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుగా నవదీప్ను కావాలని ఇరికించారని, ఆయనకు ఇతర నిందితులెవరితోనూ ప్రమేయం, అనుబంధం లేదని.. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలి’ అని వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మంగళవారం వరకు నవదీప్ను అరెస్టు చేయవద్దని ఆదేశించారు. -
అందాలు చదివే కళ్లకైనా...
నవదీప్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంఖురి గిద్వానీ, మిర్చి హేమంత్ నటించారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మాత. గోవింద్ వసంత సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అందాలు చదివే కళ్లౖకైనా.. కందాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండెకైనా..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను అనిల్ కష్ణన్ పాడారు. ‘‘లవ్ మౌళి’ షూటింగ్ మొత్తం మేఘాలయలోని చిరపుంజీలో చిత్రీకరించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
టాలీవుడ్ తెరపై మరో డ్రగ్ మరక
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లోని విఠల్నగర్లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్ ఫ్లాట్లో చిక్కిన వారిలో ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డి ఉండగా... గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఐసీసీసీలో టీఎస్–నాబ్ ఎస్పీ (వెస్ట్) డి.సునీతా రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నాప్చాట్లో గాడ్ హెడ్స్ పేరుతో... నెల్లూరుకు చెందిన బి.బాలాజీ గతంలో ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశాడు. కంటికి తీవ్రమైన గాయం కావడంతో మెడికల్లీ అన్ఫిట్ అయ్యాడు. దీంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచుగా హైదరాబాద్కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా ఇతడికి హైదరాబాద్తో పా టు బెంగళూరు డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు ఏర్ప డ్డాయి. దీంతో హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫామ్హౌస్లు, గెస్ట్ హౌస్ల్లో రేవ్ పార్టీలు ఏర్పాటు నిర్వహించేవాడు. స్నాప్చాట్లో గాడ్ హెడ్స్ పేరుతో ఐడీ క్రియేట్ చేసి దీని ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ యాప్లో మెసేజ్ చదవగానే డిస్అప్పియర్ అయ్యే ఆప్షన్ ఉండటంతోపాటు కస్టమర్లకు ప్రత్యేక కోడ్లు ఇవ్వడం ద్వారా దందా సాగించాడు. గత నెల 31న ఇతడితోపాటు రమణారెడ్డి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పని చేస్తున్న డి.మురళిని అరెస్టు చేశారు. వీరిని విచారించడంతో ఈ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. నైజీరియన్ల ద్వారా రామ్ కిషోర్కు... బాలాజీ ముగ్గురు నైజీరియన్లతోపాటు నగరానికి చెందిన రామ్ కిషోర్ వైకుంఠం (పరారీలో ఉన్నాడు) నుంచి డ్రగ్స్ ఖరీదు చేసేవాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమోబీ చికోడి మొనగాలు, ఇక్బావే మైకేల్, థామస్ అనఘకాలు నుంచి బాలాజీకి కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ అందుతున్నాయి. డ్రగ్ పార్టీల నిర్వహణకు బాలాజీకి రమణా రెడ్డి ఫైనాన్స్ చేస్తుండేవాడు.ఇతడికి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఖాతా ఉంది. ఇందులో ప్రస్తుతం రూ.5.5 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు రమణారెడ్డి, బాలాజీలకు ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. వీటిని స్వాధీనం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన 18 మంది కస్టమర్లలో సినీ రంగానికి చెందిన వారితోపాటు పబ్లు, స్నూకర్ పార్లర్ల నిర్వా హకులు ఉన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్లో టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో నిర్వహించే అర్జున్, గుంటూరులో స్నూకర్ పార్లర్ నిర్వహించే పీఎస్ కృష్ణ ప్రణీత్ కీలకం. వీరు తమ సంస్థల్లోనే రహస్య గదులు ఏర్పాటుచేసి డ్రగ్స్ వినియోగానికి సహకరిస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లు ఆఫ్ చేసుకున్న నవ్దీప్, రవి బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారూ ఉన్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. హీరో నవదీప్, షాడో, రైడ్ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్రావ్ కుమారుడు సురేశ్ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్లతోపాటు కలహర్రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు బెంగళూరులో జరిగిన డ్రగ్ పార్టీకి హాజరయ్యారనే విషయం 2021లో వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించింది. ఈ పార్టీ నిర్వాహడుకు కలహర్రెడ్డే కావడం గమనార్హం. మరోపక్క ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేసిన 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు ఉంది. నిందితుల కోసం ఏసీపీ కె.నర్సింగ్రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్, కానిస్టేబుల్ సత్యనారాయణ తదితరుల బృందం గాలించింది. అమోబీ చికోడి, ఇక్బావే మైకేల్, థామస్తోపాటు సురేశ్ రావ్, కొల్లి రామ్చంద్, కూరపాటి సందీప్, అనుగు సుశాంత్ రెడ్డి, కృష్ణ ప్రణీత్లను పట్టుకుంది. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. నవదీప్, రవి ఉప్పలపాటి సహా మిగిలిన నిందితులు తమ ఫోన్లు ఆఫ్ చేసుకుని, కుటుంబంతో సహా పరారయ్యారు. -
ఎక్కడికి పారిపోలేదు.. సిటీలోనే ఉన్నా: నవదీప్
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్కు చెందిన హీరో నవదీప్తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్వెల్లడించాడు. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పాడు. దీనిపై హీరో నవదీప్ కూడా స్పందించాడు. అసలు ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదన్నాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్లోనే ఉన్నానన్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బీజీగా ఉన్నాయనని ఓ మీడియా ప్రతినిధికి ఆయన చెప్పారు. అలాగే ట్విటర్(ఎక్స్) ద్వారా కూడా ఆయన ఈ కేసుపై స్పందించాడు. అది నేను కాదు జెంటిల్మెన్, నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అని ట్వీట్ చేశాడు. నవదీప్ స్నేహితుడు అరెస్ట్ అయితే ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచందర్ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారమే నవదీప్ను డ్రగ్స్ కన్స్యూమర్ గా తేల్చారు. ఈ విషయాన్ని సీసీ ఆనంద్ మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో నవదీప్ పేరు మారుమోగింది.అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. That's not me gentlemen I'm right here .. pls clarify thanks — Navdeep (@pnavdeep26) September 14, 2023 -
మాదాపూర్ డ్రగ్స్ కేసు: పరారీలో హీరో నవదీప్.. అరెస్ట్ కోసం గాలింపులు!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి . ఈ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నవారిలో హీరో నవదీప్ కూడా ఉన్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు పేర్కొన్నాడు. (చదవండి: అలాంటి సీన్లు ఉన్నాయ్.. బేబీ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ సీరియస్) నవదీప్ స్నేహితుడు రాంచందర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు తేల్చి చెప్పారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ అభియోగాలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. నేను ఎక్కడికి పారిపోలేదు: నవదీప్ మాదాపూర్ డ్రగ్స్ కేసుపై నవదీప్ స్పందించాడు. అసలు ఆ కేసుతో తనకు సంబంధమే లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. సీపీ ఆనంద్ చెప్పినట్లుగా తాను పరారీలో లేనన్నాడు. హైదరాబాద్లోనే ఉన్నానని, పారిపోవాల్సిన అవసరం లేదన్నాడు. లవ్ మౌళి అనే తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బిజీగా ఉన్నానని ఆయన చెప్పారు. That's not me gentlemen I'm right here .. pls clarify thanks — Navdeep (@pnavdeep26) September 14, 2023 -
'సగిలేటి కథ' ట్రైలర్.. అలాంటి కాన్సెప్ట్తో
హీరో నవదీప్ సమర్పణలో రవితేజ మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. ఆయనే ఎడిటింగ్, సినిమాటోగ్రాఫర్ కూడా. ఈ మూవీని అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సమర్పకుడు హీరో నవదీప్ సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సోహెల్, ప్రొడ్యూజర్ జి.సుమంత్ నాయుడు విచ్చేశారు. డ్యాషింగ్ డైరెక్టర్ 'రామ్ గోపాల్ వర్మ' ఈ చిత్ర బృందానికి వీడియో క్లిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. కోడి అహంకారంతో కూడిన ఫన్నీ స్కిట్తో ఈవెంట్ ప్రారంభమైంది. రుచికరమైన చికెన్ తినడానికి తహతహలాడే ఒక పాత్ర దురాశ చుట్టూ తిరిగే కథ. మూవీ ఇంతకంటే రంజిపజేసే విధంగా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పాటు సెప్టెంబర్లో మూవీ థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. (ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?) -
కాలు విరగ్గొట్టుకున్న నవదీప్.. ఆ నటి మాత్రం!
టాలీవుడ్ ప్రముఖ నటుడు నవదీప్ కాలు విరిగింది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. నటి తేజస్విని ఓ వీడియో షేర్ చేయడంతో ఈ విషయం బయటపడింది. అయితే నవదీప్ కి గాయమైందని ఆమె బాధపడటం సంగతి అటుంచితే.. అతడిని తెగ ఏడిపించింది. ఈ వీడియోలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. దీంతో అసలు ఏం జరిగిందా అని అందరూ అనుకుంటున్నారు. 'జై' సినిమాతో హీరోగా పరిచయమైన నవదీప్.. ఆ తర్వాత లీడ్ రోల్ లో పలు సినిమాలు చేశాడు గానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆర్య 2, బాద్ షా తదితర చిత్రాల్లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రల్లో కనిపించాడు. కొన్నాళ్ల ముందు పలు షోల్లో జడ్జిగా, పార్టిసిపెంట్ గానూ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు) ఏమైందో ఏమో గానీ ఈ మధ్య నవదీప్ కాలికి గాయమైంది. దీంతో అతడిని పరామర్శించడానికి వచ్చిన నటి తేజస్విని.. ఆటపట్టిస్తూ ఓ రీల్ చేసింది. దాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన పలువురు నటీనటులు.. నవదీప్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఫన్నీగా ఉందని నవ్వుకుంటున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'ఐస్ క్రీమ్' సినిమాలో నవదీప్-తేజస్విని తొలిసారి కలిసి నటించారు. ఆ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన వీళ్లిద్దరూ.. సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటారు. గతంలో ఓసారి తేజు కాలికి గాయమైనప్పుడు నవదీప్ ఇలానే ఆటపట్టించాడు. ఇప్పుడు దానికే తేజూ రివేంజ్ తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. నవదీప్ రీసెంట్గా 'న్యూసెన్స్' సిరీస్ లో, తేజస్విని 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ లో నటించారు. View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) -
న్యూసెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎలా ఉందంటే?
వెబ్ సిరీస్: న్యూసెన్స్ నటీనటులు: నవదీప్, బిందుమాధవి, మహిమా శ్రీనివాస్, నంద గోపాల్, చరణ్ కురుగొండ, జ్ఞానేశ్వర్ దర్శకుడు: శ్రీ ప్రవీణ్ కుమార్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంగీతం: సురేశ్ బొబ్బిలి ఓటీటీ ప్లాట్ఫామ్: ఆహా రిలీజ్ డేట్: మే 12, 2023 మీడియా.. మూడు అక్షరాల పదం. బలవంతుడికి, బలహీనుడికి కావాల్సిన ఆయుధం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి. పక్కన ఉన్న స్నేహితుడిని నమ్మకపోయినా సరే పొద్దున్నే పేపర్లో వచ్చే వార్తను మాత్రం నమ్ముతారు. అంతటి పవర్ పెన్నుకు ఉంది. ఆ కలం కల్పితాలను సృష్టిస్తే, నిజాన్ని కప్పేసి అబద్ధాన్ని ప్రచారం చేస్తే, పైసా ఉన్నోడికి లొంగిపోయి తప్పులను కప్పిపుచ్చేస్తే.. మీరే దిక్కంటూ మీడియానే నమ్ముకున్న అనామకులను సైతం నయవంచన చేస్తే.. నిజం చాటున నిలబడాల్సిన వాళ్లు ఎందుకలా తయారయ్యారు? వంటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించిన సిరీస్ న్యూసెన్స్. కథ: ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి ప్రెస్క్లబ్ చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడ ఏది రాస్తే అదే నిజం అని జనాలు గుడ్డిగా నమ్ముతుంటారు. సమస్య ఎక్కడుంటే అక్కడ పోలీసుల కన్నా ముందే వాలిపోతారు పాత్రికేయులు. నిజానిజాలు తెలిసినా బలం, బలగం, డబ్బు ఉన్నవాళ్లకు అమ్ముడుపోయి అబద్ధాన్నే ప్రచారం చేస్తారు. వీళ్లకు కావాల్సిందల్లా సాయంత్రానికి పైసల కవర్ వచ్చిందా? లేదా! ఇదే వీళ్లు నేర్చుకున్న, అలవాటు పడిన జర్నలిజం. ఈ ప్రెస్క్లబ్లో శివ(నవదీప్) ఓ న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా పని చేస్తుంటాడు. అక్కడే లోకల్ న్యూస్ ఛానల్లో నీల (బిందు మాధవి) న్యూస్ రీడర్గా పని చేస్తుంది. వీరిద్దరి మధ్య చిన్న లవ్ ట్రాక్ ఉంటుంది. ఇకపోతే పోలీసులకు, ప్రభుత్వాధికారులకు చెప్పినా పట్టించుకోని సమస్యను పాత్రికేయులకు చెప్తే న్యాయం దొరుకుతుందని భావిస్తూ ప్రెస్క్లబ్ మెట్లెక్కుతారు అమాయక జనాలు. కానీ వారికి అండగా ఉండాల్సింది పోయి బాధలు పెడుతున్న రాబంధులకే సలాం కొడతారు. న్యాయం దొరక్క అమాయకులు ప్రాణాలు పోతున్నా వారి మనసు కరగకపోవడం గమనార్హం. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య జర్నలిస్టులు నలిగిపోయే తీరు, ఎవరికి వత్తాసు పలకాలో తెలియని డైలమా, ఇద్దరి దగ్గరా డబ్బులు తీసుకుని సమన్యాయం చేసే నక్క తెలివితేటలు.. ఇలా చాలానే ఉన్నాయి. మధ్యలో హీరో.. పవర్ ఉన్నోడిని ఎదిరించలేక, అరిగోసలు పడ్తున్న అమాయకులకు అండగా ఉండలేక నలిగిపోతుంటాడు. చివర్లో వచ్చిన కొత్త పోలీసాఫీసర్ రాజకీయ నాయకులకు, ప్రెస్ వాళ్లకు చుక్కలు చూపిస్తాడు. మరి ప్రజల సమస్యలకు చెక్ పడిందా? పోలీసాఫీసర్కు, శివకు మధ్య వైరం ఏంటి? రిపోర్టర్స్ను రాజకీయ నాయకులు ఎలా వాడుకున్నారు? వంటి విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే! విశ్లేషణ మీడియాపై సినిమాలు రావడం చాలా అరుదు. డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ పాయింట్ను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. అయినప్పటికీ కథను తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. న్యూసెన్స్లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలు చొప్పించి సాగదీసినట్లుగా అనిపిస్తుంది. రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మంచి చేయలేని నిస్సహాయుడిగా హీరోను చూపించారు. దీనివల్ల నిరంతరం అతడు సంఘర్షణకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. లోపల మంచితనం ఉన్నా దానికి ముసుగు వేస్తూ బతకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. చివర్లో అయినా హీరో మారి అన్యాయాన్ని ఎదిరిస్తాడనుకుంటే నిరాశే ఎదురవుతుంది. బహుశా రెండో సీజన్లో అతడి మార్పును చూపిస్తారేమో! మధ్యలో మదర్ సెంటిమెంట్ను కూడా వాడారు. ఈ సీన్ మాత్రం హైలైట్ ఓ పేద రైతు కష్టపడి సాగు చేస్తున్న భూమిని ఓ రాజకీయ నాయకుడి మనుషులు కబ్జా చేస్తారు. ఎక్కడా న్యాయం దొరక్క జరల్నిస్టుల దగ్గరకు వస్తారు. వాళ్లు అతడికి సాయం చేస్తామని మాయమాటలు చెప్పి రైతును అడ్డుపెట్టుకుని వారి సొంత పనులు చేసుకుంటారు. నిజం తెలిసిన రైతు చివరకు తెగించి తనే భూమిని కాపాడుకోవాలని పొలానికి వెళ్తాడు. అక్కడున్న రౌడీలు అతడిని అదే భూమిలో చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు రాయిస్తారు. ఈ సీన్ వల్ల జర్నలిస్టులు ఇంత రాక్షసంగా ఉంటారా అనిపిస్తుంది. మరో సంఘటనలో ఓ మహిళ భర్తను పొలిటీషియనే హత్య చేయిస్తాడు. కానీ ఆమె అక్రమ సంబంధం వల్లే అతడు చనిపోయాడంటూ వార్త రాస్తారు. ఈ సీన్లో పాత్రికేయులు మరీ ఇంత నీచానికి దిగజారతారా? అనిపించక మానదు. న్యూస్ రాస్తే రూ.200, రాయకుంటే రెండు వేలు అన్న డైలాగ్ నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. బలవంతుడికి చేతులెక్కి మొక్కాలే కానీ రాళ్లు విసరకూడదు అన్న మాట నాయకులకు వ్యతిరేకంగా ఏమీ చేయలేమన్న చేతకానితనాన్ని చూపిస్తుంది. న్యూస్ రాసేవాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది అన్న డైలాగ్ ముమ్మాటికీ నిజం. సిరీస్ అంతా ఓకే కానీ క్లైమాక్స్ మాత్రం అస్సలు రుచించదు. రెండో సీజన్ ఉంటుందని హైప్ క్రియేట్ చేయాలనుకున్నారు. అక్కడిదాకా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ ఓ అర్థంపర్థం లేకుండా గాలికొదిలేనిట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ను సగంలోనే వదిలేసినట్లుగా ఉంటుంది. ఎలా నటించారంటే? నవదీప్ ఆకలి మీదున్న సింహంలా కనిపించాడు. చిత్తూరు యాసలో డైలాగ్స్ అదరగొట్టేశాడు. నిజానికి, అబద్ధానికి మధ్య నలిగిపోయే సన్నివేశాల్లో బాగా నటించాడు. బిందుమాధవి హీరో ప్రేయసి పాత్రగా అందంతో ఆకట్టుకుంది. అయితే ఈ సిరీస్లో నటనపరంగా తనకు పెద్దగా స్కోప్ లభించలేదు. తిక్కలోడిగా కనిపించే పోలీసాఫీసర్ ఎడ్విన్ పాత్రలో నందగోపాల్ నటనకు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఆయన క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాకే సిరీస్కు ఓ ఎనర్జీ వచ్చింది. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. సురేశ్ బెబ్బులి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. అనంతనాగ్ కావూరి, ప్రసన్న, వేదరామన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్గా నిలిచింది. సింగిల్ లైన్లో చెప్పాలంటే.. న్యూసెన్స్ను న్యూస్గా రాస్తారు, కానీ ఇక్కడ న్యూసే న్యూసెన్స్ అయింది! -
ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్? నవదీప్కు చిక్కు ప్రశ్న.. రియాక్షన్ ఇదే!
డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన జై సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు నవదీప్. ఆ వెంటనే గౌతమ్ ఎస్ఎస్సీ, చందమామ నిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు హీరోగానే కాకుండా సెకండ్ లీడ్గా, నెగెటివ్ క్యారెక్టర్ ఉన్న పాత్రలు సైతం పోషిస్తూ వచ్చాడు. ప్రస్తుతం అతడు న్యూసెన్స్ వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ మే 12 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ క్రమంలో శనివారం జరిగిన న్యూసెన్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నవదీప్కు కొన్ని చిక్కుప్రశ్నలు ఎదురయ్యాయి. మీ వల్ల ఓ హీరోయిన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని గతంలో వార్తలు వచ్చాయి? దీనికి మీ సమాధానం ఏంటి? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి హీరో నవదీప్ స్పందిస్తూ.. '2005లో ఓ హీరోయిన్ నా వల్ల ఆత్మహత్య చేసుకుందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. అది పూర్తిగా అబద్ధం. అలాగే నేను గే అని జరిగిన ప్రచారం కూడా అబద్ధమే! ఇకపోతే నా ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిగిందన్న ప్రచారంలోనూ ఎటువంటి వాస్తవం లేదు. అందుకు మా అమ్మ సాక్ష్యం. ఎందుకంటే ఆ సమయంలో నేను అమ్మతో కలిసి ఫామ్ హౌస్లో డిన్నర్ చేశాను. ఈ ఫేక్ న్యూస్ల వల్ల మా ఇంట్లో కూడా నన్ను అనుమానించే పరిస్థితి వచ్చింది. అమ్మతో ఉన్నప్పుడే అలా ఏదో జరిగిపోయిందంటూ వార్త రాశారు. అదంతా అబద్ధమని ఇంట్లో వాళ్లకు తెలుసు కాబట్టి అప్పటి నుంచి నాపై మా ఇంట్లో నమ్మకం పెరిగింది' అని చెప్పుకొచ్చాడు నవదీప్. చదవండి: త్రిష మాజీ ప్రియుడిని ప్రేమించా: బిందుమాధవి -
మామూలోడు కాదురా బాబు..సీరియస్ గానే కామెడీ చేసేశాడు
-
అల్లు అర్జున్ తో సినిమా ఎప్పుడంటే..!
-
న్యూసెన్స్ ట్రైలర్ వచ్చేసింది, అప్పటినుంచే స్ట్రీమింగ్!
‘నటీనటులుగా ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉండేలా చూసుకోవడమే కాదు, అందరిలో ఓ పాజిటివ్ దృక్పథాన్ని కల్పించే కంటెంట్ క్రియేట్ చేయడం మా బాధ్యత' అంటోంది బిగ్బాస్ బ్యూటీ బిందుమాధవి. కచ్చితంగా అలాంటి ప్రభావాన్ని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ధీమాగా చెప్తోంది. నేటి మీడియా రంగం సమాజంపై చూపుతున్న ప్రభావంపై ఆందోళన చెందేవారందరూ తప్పనిసరిగా ఈ సిరీస్ చూడాల్సిందే అంటోంది. నవదీప్, బిందుమాధవి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ ‘‘ఇప్పటి సమాజంలో మీడియాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి దానిపై ఓ ప్రత్యేక దృక్పథాన్ని ఏర్పరిచేలా రూపొందిన న్యూసెన్స్లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రారంభం నుంచి చివరి వరకు ఆడియెన్స్ను ఈ సిరీస్ కట్టిపడేస్తుంది' అన్నాడు. దర్శకుడు శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ.. 'మన సమాజం ఎలా ఉంది? దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాలను తెలియజేయడం క్రియేటర్గా నా బాధ్యత. న్యూస్ స్ట్రింగర్స్ ప్రపంచంలోకి వెళ్లి లోతుగా అధ్యయనం చేసేలా ఉండేదే ఈ న్యూసెన్స్ సిరీస్. ఉన్నది ఉన్నట్లుగా, నిజాయితీతో ఓ రంగానికి సంబంధించిన విషయాలను చూపించేలా రూపొందిన ఈ సిరీస్ ఆడియన్స్కు నచ్చుతుందని భావిస్తున్నాం' అన్నారు. కాగాఈ సిరీస్ టీజర్ విడుదలైనప్పుడు డబ్బుకి మీడియా దాసోహమా? అనే లైన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిజంగానే డబ్బుకు మీడియా దాసోహమైందా? బానిసగా మారిందా? అనే ప్రశ్న మన మదిలో వస్తుంది. మీడియాలో ప్రసారమవుతున్న వార్తల ప్రామాణికతకు సంబంధించిన ప్రశ్న మనసులో రావడమే కాకుండా సమాజంపై మీడియా ప్రభావం గురించి ఆందోళన చెందుతున్న వారిపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి! -
యాంకర్ గా నవదీప్ కొత్త అవతారం. రివర్స్ లో ఆదుకున్న జగపతిబాబు, గోపీచంద్
-
ఆహాలో సరికొత్త 'న్యూసెన్స్'.. టీజర్ చూశారా?
నవదీప్, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'న్యూసెన్స్'. ఈ వెబ్ సిరీస్కు ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో రానా చేతులమీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే పాలిటిక్స్, మీడియాను ఉద్దేశించి తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ఎవడు మాట విన్నా, వినకపోయినా న్యూస్ రాసేవాడి చేతిలోనే ఉంటుంది చరిత్ర' అన్న నవదీప్ డైలాగ్ ఆసక్తి పెంచుతోంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించనున్నారు మేకర్స్. 'పాలిటిక్స్ ను ఆడించే పాళి.. మదనపల్లి రాజకీయాల్లో, కథాకళి.. పవర్పెన్ పాలిటిక్స్!' అనే క్యాప్షన్ ఈ సిరీస్పై మరింత ఆసక్తి పెంచుతోంది. పాలిటిక్స్ ను ఆడించే పాళి..🖋 మదనపల్లి రాజకీయాల్లో, కథాకళి..! Power'Pen' Politics... #NewsenseOnAHA Coming Soon@pnavdeep26 @thebindumadhavi @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @SasikiranNaray1 @sureshbobbili9 @sriprawin @APEnt_Hyd pic.twitter.com/zmWnkwo1Pk — ahavideoin (@ahavideoIN) March 21, 2023 -
నవదీప్ ఎంగేజ్మెంట్? ఆ ఫోటో అర్థమదేనా?
వాలంటైన్స్ డే.. అదృష్టం బాగుంటే వన్ సైడ్ లవ్ కాస్తా టూ సైడ్ లవ్గా మారుతుంది. లేదంటే నో అన్న సమాధానంతో ఆ ప్రేమకు ఆదిలోనే ముగింపు కార్డు పడుతుంది. ఇక అప్పటిదాకా సీక్రెట్గా లవ్ చేసుకున్నవాళ్లు అఫీషియల్గా కూడా వారి ప్రేమను బయటపెడుతుంటారు. గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండనే ఉంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే నిన్నటి వాలంటైన్స్డే రోజు హీరో నవదీప్ ఓ పోస్ట్ పెట్టాడు. ఓ అమ్మాయి చేతుల నిండా మెహందీ, ఎడమ చేతికి మెరిసిపోతున్న ఉంగరం, మరో చేతితో ముఖాన్ని దాచుకున్నట్లుగా ఉంటున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఈ వాలంటైన్స్ డే చాలా స్పెషల్ అని రాసుకొస్తూనే ఖుషీ అహుజా అన్న అకౌంట్ను జత చేశాడు. ఇంకేముంది.. ఆ అమ్మాయెవరో ఆరా తీద్దామని నెటిజన్లు ప్రయత్నించే క్రమంలో నవదీప్ ప్రాంక్ చేశాడని తెలుసుకున్నారు. ఆ అకౌంట్ ఓపెన్ చేయగా.. చూసింది చాలు కూర్చో అన్నట్లుగా ఓ డైలాగ్ కనబడింది. దీంతో హర్టైన ఫ్యాన్స్ గుడ్న్యూస్ చెప్తావనుకుంటే ఇలా బకరా చేశావేంటన్నా అని కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ అభిమాని నవదీప్ అన్న మోసం చేశాడని వీడియో చేయగా దాన్ని ఇన్స్టా స్టోరీలో తిరిగి షేర్ చేశాడు హీరో. చదవండి: భర్త నుంచి విడిపోయిన దివ్యవాణి? నటి ఏమందంటే? -
హీరో నవదీప్కి అల్లు అర్జున్ సర్ప్రైజింగ్ గిఫ్ట్
జై సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యాడు హీరో నవదీప్. ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సీ, చందమామ, మరియు ఆర్య 2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య సినిమాల్లో అంతగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటున్నాడు. తాజాగా ఓ పాన్ ఇండియా స్టార్ తనకు పంపిన సర్ప్రైజింగ్ గిఫ్ట్ను ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. సప్రేమకు హద్దులు లేకుండే అకేషన్ ఏమీ లేకున్నా ఇలా గిఫ్ట్స్ వస్తుంటాయి. థ్యాంక్స్ బావ. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్తో ఎయిర్పొడ్స్ వాడతాస అంటూ నవదీప్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఇంతకీ ఈ గిఫ్ట్ ఇచ్చింది మరెవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్య 2 చేసినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మొదలైన ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా సెర్బియాలో బన్నీ 40వ బర్త్డే సెలబ్రేషన్స్లోనూ నవదీప్ పాల్గొన్న సంగతి తెలిసిందే. -
‘గెడ్డం తెల్లబడుతోంది.. పెళ్లి చేస్కో’.. నెటిజన్కి నవదీప్ స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లలో నవదీప్ ఒకరు. ఒకప్పుడు వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్గా పేరొందిన నవదీప్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా అలరిస్తున్నాడు. ఆ మధ్యలో ‘అల వైకుంఠపురములో ’చిత్రంలో బన్నీ ఫ్రెండ్గా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘మోసగాళ్లు’చిత్రంలోనూ హీరో విష్ణు స్నేహితుడిగా కనిపించారు. ప్రస్తుతం సన్నీ లియోని ప్రధాన పాత్రలో నటిస్తున్న వీరమాదేవి చిత్రంలోనూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల వయసు వచ్చినా.. పెళ్లికి మాత్రం ఇంకా టైమ్ ఉంటుంది అంటున్నాడు నవదీప్. అయితే నెటిజన్స్ మాత్రం ‘ఇంకెప్పుడు పెళ్లి బాబు..’అంటూ ప్రతిసారి కామెంట్ చేస్తుంటారు. వాటికి చాలా ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంటాడు నవదీప్. తాజాగా ‘గడ్డం నెరిసిపోతుంది.. ఇప్పటికైనా పెళ్లి చేసుకో’ అని సలహా ఇచ్చి ఓ నెటిజన్కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. 'అన్నా గెడ్డం తెల్లబడుతోంది పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గెడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలి. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా’అని నవదీప్ కౌంటర్ ఇచ్చాడు. Oddhu ra sodhara :) pic.twitter.com/IYKSAGFDVE — Navdeep (@pnavdeep26) January 23, 2022 -
ముగిసిన నవదీప్ విచారణ: కీలకంగా మారిన ‘పబ్’
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం 9 గంటలపాటు విచారణ చేసింది. నవదీప్తోపాటు ఎఫ్ లాంజ్ పబ్బు జనరల్ మేనేజర్ను కూడా విచారించారు. ఎఫ్ లాంజ్ పబ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2015,17 మధ్య కాలంలో పెద్దఎత్తున ఎఫ్ లాంజ్ పబ్లో పార్టీలు, ఆ పార్టీలకు పలువురు నటీనటులు హాజరయ్యారని గుర్తించారు. పార్టీలకు ముందు తర్వాత పెద్ద ఎత్తున క్లబ్ ఖాతాలోకి భారీగా నిధులు వచ్చాయని సమాచారం. కొంతమంది నటీనటులు పెద్ద ఎత్తున క్లబ్బు మేనేజర్కి డబ్బులు బదిలీ చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. చదవండి: లవ్ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్బుక్ మనీ ల్యాండరింగ్ నిబంధనల ఉల్లంఘనపై ఈడీ ప్రశ్నించింది. ఎఫ్ క్లబ్ వేదిక ద్వారా జరిగిన డ్రగ్స్ ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగారు. ఎఫ్ క్లబ్కు వ్యాపారానికి సంబంధించిన వివరాలు సేకరించారని సమాచారం. కెల్విన్, జిషాన్లు కలిసి పార్టీలకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని నడిపినట్టుగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఎఫ్ లాంజ్ పబ్ కీలకంగా మారింది. ఆ పబ్ లావాదేవీలు కూడా పరిశీలించారు. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, కెల్విన్, జిషాన్ ఖాతాలకు భారీగా ఎఫ్ లాంజ్ పబ్ నుంచి నిధులు బదలాయింపు జరిగాయని విచారణలో గుర్తించినట్లు సమాచారం. కెల్విన్, జీషాన్ల ఖాతాల నుంచి విదేశీలకు నగదు బదిలీ అయిట్టు గుర్తించారని తెలుస్తోంది. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్కాకి -
నవదీప్పై ఈడీ ప్రశ్నల వర్షం
-
Tollywood Drugs Case: రేపు ఈడీ ముందుకు నవదీప్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రశ్నించనున్నారు. ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్కు సైతం ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. తొలుత ఈ కేసు అంతా డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్ చుట్టూ తిరిగినా, విచారణ క్రమంలో ఎఫ్-క్లబ్లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. దీంతో సోమవారం నాటి విచారణకు హీరో నవదీప్, ఎఫ్-క్లబ్ మేనేజర్ హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈడీ అధికారులు పలువురి సెలబ్రిటీల నుండి వారివారి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించగా.. ఈ కేసులో అప్రూవల్ గా మారిన కెల్విన్, అతడి స్నేహితుడు, ఈవెంట్ మేనేజర్ జీషాన్అలీల బ్యాంక్ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బుల మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీశారు.ఇక సోమవారం నాటి విచారణలో కెల్విన్ తో జరిపి డ్రగ్స్ లావాదేవీల పై ఆరా తీయనున్నారు. నవదీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ చెప్పే అంశాల ఆధారంగా ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయో లేదో చూడాలి. -
‘మోసగాళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్ : మోసగాళ్లు జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : మంచు విష్ణు, కాజల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు నిర్మాణ సంస్థ : ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కథ, నిర్మాత : మంచు విష్ణు దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్ సంగీతం : సామ్ సి.ఎస్ సినిమాటోగ్రఫీ : షెల్డన్ చావ్ ఎడిటర్ : గౌతమ్ రాజు విడుదల తేది : మార్చి 19, 2021 స్టార్ హీరో మోహన్ బాబు కుమారుడిగా పరిచయమై మంచు విష్ణు గత కొన్నేళ్లుగా కెరీర్లో సరైన హిట్ పడక సతమతమవుతున్నాడు. ఇటీవల ఆయన హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.దీంతో సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్న విష్ణు.. ఓ భారీ స్కామ్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'మోసగాళ్లు' అనే పాన్ఇండియా సినిమాతో బరిలోకి దిగాడు. రూ.50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా రచయితగా కూడా మంచు విష్ణు పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందన వచ్చింది.దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘మోసగాళ్లు’పై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మోసగాళ్లు’అందుకున్నారా? ఈ సినిమా మంచు విష్ణుని హిట్ ట్రాక్ ఎక్కించిందా? ఈ ‘మోసగాళ్ల’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథ అను(కాజల్), అర్జున్(మంచు విష్ణు) కవల అక్కా తముళ్లు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరుగుతారు. తండ్రి (తనికెళ్ల భరణి) నిజాయతీ వల్లే తాము పేదలుగా మిగిలిపోయామని ఫీలవుతుంటారు. ఉన్నవాడిని మోసం చేసి రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే విజయ్ (నవదీప్)తో కలిసి ఒక ఫేక్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి మోసాలు చేద్దామని ప్లాన్ వేస్తారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ పేరుతో అమెరికన్లకు ఫోన్ చేసి పన్ను బకాయిలు చెల్లించాలని బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించడం మొదలుపెడతారు. అలా దాదాపు రూ.2,600 కోట్లు కొట్టేస్తారు. భారీ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఫెడరల్ ట్రేడ్ కమిషన్, భారత ప్రభుత్వం విచారణ కోసం ఎసీపీ కుమార్ (సునీల్ శెట్టి) నియమిస్తుంది. ఈ మోసగాళ్లును పట్టుకోవడానికి ఏసీపీ కుమార్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆయన నుంచి తప్పించుకోవడానికి అను, అర్జున్ ఎలాంటి ఎత్తులు వేశారు. చివరకు ఈ మోసగాళ్లు ఎలా చిక్కారు? అనేదే మిగతా కథ. నటీనటులు అర్జున్ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయాడు. తెరపై ఇంతవరకూ చూడని విష్ణుని ఈ సినిమాలో చూడొచ్చు. కన్నింగ్ ఫెలోగా, సీరియస్ లుక్లో విష్ణు కనిపిస్తాడు. అను పాత్రలో కాజల్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఎసీపీ కుమార్ భాటియాగా సునీశ్ శెట్టి నటన బాగుంది. తన అనుభవాన్ని తెరపై చూడొచ్చు. నవీన్ చంద్రా, నవదీప్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశ్లేషణ ‘అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ‘మోసగాళ్ళు’ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీ సహాయంతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు అనేదే ‘మోసగాళ్లు’ సినిమా కథ. అయితే ఇలాంటి కథను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై ఎలా థ్రిల్లింగ్ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. సినిమా ఆరంభంలో అను, అర్జున్లనేపథ్యాన్ని క్లుప్తంగా చూపించేసి, ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జెఫ్రీ గీ చిన్. తర్వాత అర్జున్ ఓ కాల్ సెంటర్లో పనిచేయడం.. దాని ద్వారా అక్రమంగా అమెరికన్ల డేటాను సేకరించి అమ్మడం.. ఈ క్రమంలో విజయ్ కలిసి ఓ భారీ స్కాంకి స్కెచ్ వేయడం.. ఇలా కథని చకచకగా నడిపించి బోర్ కొట్టకుండా నడిపించేశాడు. అయితే అను ఎంట్రీ తర్వాత కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా, సాదాసీదాగా అనిపిస్తాయి. అలాగే నవీన్ చంద్ర, సునీల్ శెట్టి మధ్య వచ్చే కొన్ని సీన్లు స్పీడ్గా సాగుతున్న కథకు బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తాయి. మరోవైపు ఈ మోసగాళ్లను పట్టుకునేందుకు ఎసీపీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్గానే ఉంటాయి. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. క్లైమాక్స్లో సునీల్ శెట్టి, మంచు విష్ణులకి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగుంటుంది.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్. ఈ సినిమాకు ప్రధాన బలం సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రొటీన్ కథలకు బిన్నంగా ఉన్న ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాస్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
నవదీప్ దరిద్రమైన అలవాట్లు అవే: విష్ణు
మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ విష్ణుకి అక్కగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విష్ణు.. నవదీప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవదీప్ని పొగుడుతూనే.. అతని చెడు అలవాట్లు ఏంటో బయటపెట్టేశాడు. నా దృష్టిలో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ నవదీప్. అతని టాలెంట్కి తగ్గ గుర్తింపు రాలేదు. అతని కెపబిలిటీకి ఇప్పుడున్న గుర్తింపు నథింగ్. అతను ఇప్పుడు నా సినిమాలో చేశాడని నా మందు ఉన్నాడని పొగడటం కాదు.. దానివల్ల తొక్క ఏం రాదు. ఐదుసార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఎత్తడు. అలాంటి దరద్రమైన అలవాట్లు ఉన్నాయి అతనికి. కానీ.. అతని దగ్గర టాలెంట్ చాలా ఉంది.. ఎఫర్ట్ పెట్టి చేస్తాడు. నేను ఒక సెక్షన్ అయినతరువాత బ్రదర్ దీన్ని మనం తెలుగులో ఎలా చేద్దాం.. అని డిస్కష్ చేశా. ముఖ్యంగా నవదీప్కి ఓన్లీ యాక్టింగ్ అనే కాదు.. రైటింగ్ మీద ఫుల్ గ్రిప్ ఉంది. ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఈ సినిమాలో నవదీప్ చాలా స్టైలిష్గా చేశాడు.. అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఛాలెంజింగ్గా అనిపించింది’ అంటూ నవదీప్ని పొగుడుతూనే, అతని చెడు అలవాట్లను బయటపెట్టేశాడు. అయితే దీనిపై నవదీప్ సెటైరికల్గా స్పందించాడు.. ‘నాకు ఉన్న దరిద్రమైన అలవాట్లలో విష్ణు ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాడు. అలాంటివి చాలా ఉన్నాయి’అని నవదీప్ చెప్పడంతో యాంకర్తో పాటు విష్ణు, నవీన్ చంద్ర ఘోల్లున్న నవ్వారు. చదవండి: ఇదే తొలిసారి.. ‘చందమామ’తో నాగ్ రొమాన్స్! జాతిరత్నాలు’ డైరెక్టర్తో వైష్ణవ్ తేజ్ సినిమా -
కొందరు దర్శకులు నన్ను మోసం చేశారు
‘‘మోసగాళ్ళు’ సినిమా కోసం నా వద్ద ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టాను. సినిమా బాగా రావడంతో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకుల రిజల్ట్ కోసం చూస్తున్నాం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. హైదరాబాద్లో ‘మోసగాళ్ళు’ చిత్రం 10 నిమిషాల ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేశాం. ఇంగ్లీష్ మినహా ఐదు భాషల్లో ఒకేరోజు నా సినిమా విడుదలవుతుండటం ఇదే మొదటిసారి. దీంతో చాలా ఎగై్జటింగ్గా ఉంది. ఈ సినిమాలో సునీల్ శెట్టి మినహా అందరూ మోసగాళ్లే. నిజ జీవితంలో కొందరు దర్శకులు నన్ను మోసం చేశారు’’ అన్నారు. కార్యక్రమంలో నవదీప్ పాల్గొన్నారు. ఉక్కు పోరాటం న్యాయమైనదే: మంచు విష్ణు వైజాగ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైనదే. ‘వైజాగ్ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ అని 1962లో ఎన్నో ఆందోళనలు చేసి సాధించుకున్న పరిశ్రమ అది అని నాన్నగారు (మోహన్బాబు) కూడా చెప్పారు. నరేంద్ర మోదీగారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు నేను పెద్ద అభిమానిని. కానీ ఇప్పుడు కాదు. కేంద్రం నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. ఉక్కు ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం అంటూ మంత్రి కేటీఆర్ చెప్పడం సంతోషం. చదవండి: (స్నేహం.. యాక్షన్.. థ్రిల్) -
నచ్చినవే చేయాలనుకుంటున్నాను
‘‘ఇన్ని రోజులూ నాకు వచ్చిన రోల్స్ చేయాలా? లేక నచ్చినవి చేయాలా? అనే కన్ ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు నచ్చినవే చేయాలని డిసైడ్ అయ్యాను’’ అన్నారు నవదీప్. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్శెట్టి ప్రధాన పాత్రధారులుగా జెఫ్రీ చిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోసగాళ్ళు’. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన నవదీప్ చెప్పిన విశేషాలు. ► ఓ మోస్తరుగా చదువు వచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి కాల్ సెంటర్ ఆధారంగా అమెరికాలో 150 మిలియన్ డాలర్ల స్కామ్ను ఎలా చేశారు? అనే అంశంతో ‘మోసగాళ్ళు’ సినిమా ఉంటుంది. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ చిన్ తో సినిమా చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. మంచు విష్ణు సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఆసక్తి అనిపించింది. టెక్నాలజీలోని లోటుపాట్లను వాడుకుని స్కామ్ చేయడమనే అంశం ఆడియన్స్ను థ్రిల్ చేస్తుంది. ► ఈ సినిమాలో నాది వైట్ కాలర్ క్రిమినల్ జాబ్. మహిళలను తక్కువగా అంచనా వేసే పాత్ర. కథ ప్రకారం మంచు విష్ణు, కాజల్ నన్ను మోసం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సునీల్ శెట్టిగారు తప్ప మేమందరం మోసగాళ్ళమే. ► నా స్నేహితుడు పవన్ తో కలిసి ఆరంభించిన ‘సీ స్పేస్’లో దాదాపు 40 మంది రైటర్స్ ఉన్నారు. ఓ పేపర్ కటింగ్ తీసుకువచ్చి మా ‘సీ స్పేస్’లో ఇచ్చి సినిమాకు కథ కావాలంటే చేసిన ఇస్తాం. వెబ్ సిరీస్గా డెవలప్ చేయమన్నా చేస్తాం. ఓ ఫ్యాంటసీ లవ్స్టోరీలో హీరోగా నటించబోతున్నాను. -
మూడుసార్లు బెయిలు నిరాకరణ.. ఎవరీ నవ్దీప్ కౌర్!
‘‘భయపడొద్దు తల్లీ. ఓటమిని అంగీకరించొద్దు. చివరివరకు మనం పోరాడాలి. లేకుంటే వీళ్లు మనల్ని బతకనివ్వరు.’’ – నవ్దీప్ కౌర్ తల్లి. ‘‘కొన్నిసార్లు పోరాటమే మార్గం అవుతుంది. ఆ మార్గంలోనే మా అక్క నడుస్తోంది’’ – నవ్దీప్ కౌర్ చెల్లెలు రాజ్వీర్ కౌర్. ‘‘అతివాద మూకలు మన ఫొటోను మంటల్లో తగలబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ఇండియాలో ఉంటే ఏం జరుగుతుందో ఊహించండి’’. – నవ్దీప్ కౌర్ను విడుదల చేయాలని కోరుతూ ప్లకార్డ్ను ప్రదర్శిస్తున్న ఒక యువతి ఫొటోను, ఉద్యమకారుల పోస్టర్లు తగలబెడుతున్న వారి ఫొటోనూ జత చేస్తూ కమలా హ్యారీస్ చెల్లెలి కూతురు మీనా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు. పంజాబ్ యువతి. వయసు 23. ప్రస్తుతం ఆమె పంజాబ్లోని కర్నాల్ జైల్లో ఉన్నారు. ఇరవై మూడేళ్ల ఈ దళిత యువతికి మొదట ఆమె తల్లి, చెల్లి మాత్రమే మద్దతుగా ఉన్నారు. ఈ నెల 6న మీనా షేర్ చేసిన పోస్టుతో యావద్దేశమే కాదు, అమెరికాలోనూ నవ్దీప్ను వెంటనే విడుదల చేయాలని అక్కడి ఎన్నారైలు డిమాండ్ చేస్తున్నారు! జనవరి 12న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నేటికి 28 రోజులు. మూడుసార్లు కోర్టు ఆమెకు బెయిలు నిరాకరించింది! ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేయడం, ఆ ప్రాంతంలోనే తను పని చేస్తున్న ఫ్యాక్టరీలో కొందరిని అకారణంగా తొలగించడాన్ని ప్రశ్నించడం ఆమె చేసిన నేరాలు! వ్యక్తిగా ఆమె నిరసన తెలియజేసినంత కాలం మౌనంగా ఉండి, అవకాశం కోసం చూస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం.. ఆమె ‘మజ్దూర్ అధికారం సంఘటన్’ (మాస్)లో సభ్యురాలిగా చేరి ఒక్క నినాదం ఇవ్వగానే అరెస్ట్ చేయించి, జైల్లో పెట్టించింది. ఫ్యాక్టరీలో మహిళా కార్మికులపై జరుగుతున్న అఘాయిత్యాలను ‘మాస్’ అండతోనే బయటపెట్టగలిగారు నవ్దీప్ కౌర్. పర్యవసానమే.. జైలు నుంచి ఆమె బయటికి వచ్చే ద్వారాలు మూసుకుని పోవడం. నవ్దీప్ కౌర్కు మద్దతుగా కమలా హ్యారిస్ చెల్లెలి కూతురు మీనా పెట్టిన ట్వీట్. ‘‘జైల్లో మా అక్కను చిత్రహింసలు పెడుతున్నారు. ఆమె కాళ్ల మధ్య నుంచి రక్తం స్రవించడాన్ని తాము చూసినట్లు సహ ఖైదీలు మా అమ్మకు సమాచారం పంపారు. అమ్మ బాధపడింది. కానీ భయపడలేదు. ‘పోరాడకపోతే మన బతుకులు ఎప్పటికీ ఇంతే’ అని వర్తమానం పంపింది. మా అక్కడ ధైర్యవంతురాలు. కడవరకు పోరాడుతూనే ఉంటుంది’’ అని రాజ వీర్ కౌర్ తనని కలిసిన మీడియా ప్రతినిధి ఆస్తా సవ్యసాచితో అన్నారు. రాజ్వీర్ ఢిల్లీ యూనివర్సిటీలోనే చదువుతోంది. అక్కను బయటికి తెప్పించేందుకు ఆమే స్వయంగా ఎప్పటికప్పుడు లాయర్తో మాట్లాడుతోంది. వారి కుటుంబంలో రాజ్వీర్ ఒక్కరే ఇంత చదువు వరకు వచ్చింది. అక్క నవ్దీప్, తమ్ముడూ స్కూల్లో ఉండగానే చదువు మానేశారు. లాక్డౌన్ సమయంలో చేసిన పీకల్లోతు అప్పుల నుంచి తల్లిదండ్రులను గట్టెక్కించడానికి పంజాబ్ నుంచి ఢిల్లీ వచ్చి ఫ్యాక్టరీలో పనికి చేరారు. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మీదే ఆమెను, ‘మాస్’ అధ్యక్షుడు శివకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవ్దీప్ కౌర్ పంజాబ్లోని దళిత సామాజిక వర్గమైన ‘మఝబీ సిక్కు’ల అమ్మాయి. నాలుగు నెలల క్రితమే ఆమె పని కోసం ఢిల్లీలో ఆ ఫ్యాక్టరీలో చేరారు. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా ఉద్యమిస్తున్న రైతులతో గొంతు కలిపారు. ఇవన్నీ కూడా ఆమెను అక్రమంగా జైల్లో వేయించడానికి తోడ్పడ్డాయి. జైల్లో పెట్టిన రెండో రోజే.. జనవరి 14 నాటికి.. నడవలేని స్థితికి చేరుకున్నారు నవ్దీప్. వైద్య పరీక్షల్లో ఆమె రక్తస్రావానికి లైంగిక అకృత్యాలే కారణం అని నిర్థారణ అయినట్లు బయటికి పొక్కింది. మగ పోలీసులు ఆమెను జననావయంపై లాఠీతో కొట్టిన గుర్తులు బయటపడ్డాయి. జైల్లో నుంచి ఆమె ప్రాణాలతో బయటపడతారా అన్నదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. చదవండి: కష్టాలను ఎత్తి కుదేయండి తల్లిదండ్రులున్నా అనాథగా పెరిగా -
డ్రగ్స్ కేసు: నాకేం బాధ లేదు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం బాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయగా.. ఆమె 25 మంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించారు. రియా ఇచ్చిన సమాచారం మేరకు వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు ఎన్సీబీ సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తుండటంతో టాలీవుడ్లో మరోసారి అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ "రకుల్ - మంచు -రానా - నవదీప్. ఇది మళ్లీ టాలీవుడ్కు యూటర్న్ తీసుకుంది. అన్నా మనకీ బాధలు తప్పేలా లేవు" అంటూ వెటకారంగా నవ్వుతున్న ఎమోజీలతో నటుడు నవదీప్కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన నవదీప్.. "నాకేం బాధ లేదు బద్రర్.. నువ్వు కూడా ఏ బాధా పడకు. పద, పనికొచ్చే పనులు చేసుకుందాం" అని నోరు మూయించాడు. (చదవండి: వికారాబాద్ అడవుల్లో రకుల్..) కాగా 2017లో హైదరాబాద్లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమను అతలాకుతలం చేసింది. అప్పట్లో ఈ కేసు విచారణ కోసం ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీ, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, తరుణ్, నవదీప్ సహా పలువురిని విచారించారు. ఆ తర్వాత వీరికి డోప్ టెస్ట్ కోసం శాంపిల్స్ కూడా సేకరించారు. (చదవండి: డ్రగ్స్ కేసులో రకుల్, సారా పేర్లు?) -
జూన్లో మోసగాళ్ళు
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా హాలీవుడ్–ఇండియన్ సినిమా ‘మోసగాళ్ళు’. హాలీవుడ్కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ ప్రకటించడంతో చిత్రంలో కీలకమైన ఐటీ ఆఫీస్ సన్నివేశాల చిత్రీకరణ నిలిచిపోయింది. కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను జూన్ 5న, ఇంగ్లిష్ వెర్షన్ ను జూలైలో విడుదల చేయనున్నట్లు విష్ణు తెలిపారు. ‘‘ఇటీవల విడుదల చేసిన ‘మోసగాళ్ళు’ ఫస్ట్లుక్ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ పోస్టర్లలో అర్జున్ గా విష్ణు, అను పాత్రలో కాజల్ అగర్వాల్, ఏసీపీ కుమార్గా సునీల్ శెట్టి కనిపించారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో నవదీప్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. -
‘సి- స్పేస్’ ప్రారంభించిన అల్లు అర్జున్
-
‘నెక్ట్స్ ఏంటి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
‘నెక్ట్స్ ఏంటి’ ట్రైలర్ లాంచ్
-
ఫిట్నెస్ పరీక్షలో షమీ ఫెయిల్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వివాదాలతో సతమతమవుతోన్న భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ యో యో ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యాడు. ఫలితంగా అఫ్గానిస్తాన్తో ఈనెల 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టులో పాల్గొనే భారత జట్టు నుంచి అతడిని తప్పించారు. షమీ స్థానంలో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ నవ్దీప్ సైనిని తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. 25 ఏళ్ల సైని ఇప్పటివరకు 31 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 96 వికెట్లు తీశాడు. ‘బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో షమీ నెగ్గలేకపోయాడు. దాంతో అతని స్థానంలో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నవ్దీప్ సైనిని ఎంపిక చేసింది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. షమీతోపాటు భారత ‘ఎ’ జట్టు సభ్యుడు సంజూ శామ్సన్ కూడా యో యో ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యాడని అతని స్థానంలో భారత అండర్–19 మాజీ కెప్టెన్ ఇషాన్ కిషన్ను ఎంపిక చేశామని తెలిపింది. -
వెబ్ సీరీస్ లో మరో యంగ్ హీరో
ప్రస్తుతం టీవీ, సినీ రంగాలతో పాటు డిజిటిల్ మీడియా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగా సీరియల్స్, సినిమాలతో పాటు వెబ్ సీరీస్ ల నిర్మాణం కూడా ఊపందుకుంది. డిజిటల్ మీడియం ద్వారా భారీ పబ్లిసిటీ, రెవెన్యూ వస్తుండటంతో సినీ నటులు కూడా వీటి మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే సుమంత్ అశ్విన్, వరుణ్ సందేశ్ లతో పాటు స్టార్ హీరో రానా కూడా వెబ్ సీరీస్ లలో నటిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరో నవదీప్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. హీరోగా ఎంట్రీ , తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఆకట్టుకుంటున్నాడు. గతంలో ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నవదీప్, ఇటీవల బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇప్పుడు భారతదేశం బయట ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు వెబ్ సీరీస్ లలో నటించనున్నట్టుగా తెలిపారు నవదీప్. మన ముగ్గురి లవ్ స్టోరి పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సీరీస్ లో తేజస్వీ కీలక పాత్రలో నటించనుంది. వైజయంతి మూవీస్ కు చెందిన వెబ్ డివిజన్ ఎర్లీ మాన్సూన్ టేల్స్ ఈ వెబ్ సీరీస్ ను నిర్మిస్తోంది. నందినీ రెడ్డి పర్యవేక్షణలో శశాంక్ ఏలేటీ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. -
బిగ్ బాస్: అదే నాకు శాపంలా మారింది!
తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో 'బిగ్బాస్'. యాభైకి పైగా ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న ఈ షో విజయవంతంగా ముందుకు సాగుతోంది. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్లో షో కంటెస్టెంట్లలో ఒకరైన నటుడు నవదీప్ కాస్త నిరాశ చెందినట్లు కనిపించారు. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తనకు శాపంగా మారిందంటూ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో భాగంగా నవదీప్ ఈ విధంగా స్పందించారు. టాస్క్లో భాగంగా కెప్టెన్ శివబాలాజీని మినహాయించగా.. అర్చన, దీక్షా పంత్, హరితేజ, ప్రిన్స్, ఆదర్శ్, నవదీప్ లు చర్చించుకని.. ఓ నిర్ణయానికి రావాలి. ఆపై రియాల్టీ షోలో బలమైన కంటెస్టెంట్లు 1వ స్థానం, ఆ తర్వాత స్ట్రాంగ్గా ఉన్నవాళ్లు 2వ స్థానం అలా అందరూ నిల్చోవాలి. ప్రిన్స్, నవదీప్లు ఫస్ట్ ప్లేస్కి మేము అర్హులమని వాదనలు వినిపించగా.. చివరికి మెజార్టీతో ప్రిన్స్ 1వ స్థానంలో నిల్చుంటారు. ఆ తర్వాత వరుసగా హరితేజ, నవదీప్, అర్చన, ఆదర్శ్, దీక్ష స్థానాలు డిసైడ్ అవుతాయి. కేవలం తాను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడం తనకు శాపంగా మారిందని, కొన్ని సందర్బాల్లో ఇదే అంశం తనకు మైనస్ అవుతుందున్నారు నవదీప్. అందరిలా తొలిరోజు నుంచి షోలో ఉంటే తనకూ మరింతగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండేదంటారు. -
బిగ్బాస్ షోలో నవదీప్
హైదరాబాద్: ‘బిగ్బాస్’ రియాలిటీ షో బుల్లితెరపై సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. టీఆర్పీల్లో సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది. తారక్ వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్న ఈషోకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. షోలో కంటెస్టంట్లలో వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతూ షోని రక్తికట్టిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టంట్ల సంఖ్య తగ్గేకొద్ది వైల్డ్కార్డు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. గతంలో జ్యోతి, మధు ప్రియ ఎలిమినేట్ అవగానే గోపాల గోపాల సినిమా ఫేం దీక్షా పంత్ బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టింది. గతవారం కూడా సమీర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే షోలోకి కొత్తగా ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారని ప్రేక్షకులు అనుకున్నారు. దీనిపై పలు రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అనుకున్నట్లుగానే మరొక హీరో ఎంట్రీ ఇవ్వనున్నారు. దృవ ఫేం నవదీప్ షోలో అడుగు పెట్టనున్నాడు. షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నటుడు నవదీప్ కనిపించనున్నాడని తాజా సమాచారం. డ్రగ్స్ కేసులో ముమైత్ఖాన్తోపాటు నవదీప్ కూడా విచారణకు హాజరైన విషయం విదితమే. -
రానాకి యాక్టింగ్ వస్తుందా.. రాదా?అనే భయం ఉండేది .
– నిర్మాత డి. సురేశ్బాబు ‘‘మా వాడు(రానా) హీరో అయ్యాక తనతో నేను తీస్తున్న తొలి చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. మామూలుగా కథలంటే నాకు చాలా భయం. కథ సెలక్ట్ చేయడం కష్టం. నా కొడుకు సినిమాకి కథ అంటే ఇంకా కష్టం’’ అని నిర్మాత డి.సురేశ్బాబు అన్నారు. రానా, కాజల్, కేథరిన్, నవదీప్ ముఖ్య పాత్రల్లో తేజ దర్శకత్వంలో డి.రామానాయుడు సమర్పణలో సురేశ్బాబు, ఎం.వి. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో రానా చేసిన జోగేంద్ర పాత్ర పేరుతో ‘జోగేంద్ర యువగర్జన’ అనే కార్యక్రమం నిర్వహించారు. సురేశ్బాబు మాట్లాడుతూ– ‘‘తేజ చెప్పిన కథ బాగుందనిపించి వినమని రానాకు చెప్పా. రానాకూ నచ్చింది. నేను తండ్రిని కాబట్టి.. వీడికి యాక్టింగ్ వస్తుందా? రాదా? అనే భయం ఉండేది. తొలి షెడ్యూల్ ఫస్ట్ కాపీ చూసిన కిరణ్రెడ్డి ‘అదిరిపోయింది సార్’ అనడంతో ధైర ్యం వచ్చింది’’ అన్నారు. రానా మాట్లాడుతూ– ‘‘వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేనెప్పుడూ దేవుడిగా చూసే వ్యక్తి ఎన్టీఆర్గారు. ఈ చిత్రంలోని నా పాత్రలో (జోగేంద్ర) ఎన్టీఆర్గారి, ఎం.జీ.ఆర్.గారి ఫిలాసఫీ ఉంటాయి. అందుకే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశా. ఈ చిత్రం మా తాత (రామానాయుడు) చూడలేకపోయారనే లోటు ఉంది. ఈ రోజు ఇక్కడ నిలుచున్నానంటే ఆయనవల్లే. ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేదనే బాధ కూడా ఉంది. మా నాన్న చాలా మంచి నిర్మాత. తేజగారి వద్ద చాలా చాలా నేర్చుకున్నా. మంచి సినిమాలు చేద్దామనే నటుణ్ణి అయ్యా. వెంకటేశ్గారి ఫ్యాన్స్ అండగా ఉన్నారనే ధైర్యంతో ముందుకెళుతున్నా. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇతర భాషల సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమా అయినా చేస్తా’’ అన్నారు. ‘‘కథ రాయగానే రానాకి కరెక్ట్గా సరిపోతుందనుకున్నా. కథ వినగానే రానా, కాజల్ ఓకే అన్నారు’’ అని తేజ చెప్పారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి, మాటల రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, లక్ష్మీ భూపాల్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు. -
నటుడు నవదీప్ ట్విట్టర్ విసుర్లు
-
నటుడు నవదీప్ విసుర్లు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనను సిట్ అధికారులు విచారించిన విధానంపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని నటుడు నవదీప్ తప్పుబట్టారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు అమాయకులన్న భ్రమలో మీడియా ఉందని వ్యాఖ్యానించారు. తాము రాసిన కథనాలను ప్రజలు నమ్ముతారన్న విశ్వాసంతో ఉన్నట్టు కనబడుతోందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై కనీసం గౌరవం లేనట్టుగా మీడియా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. దర్యాప్తు కొనసాగుతుండగా ఊహాగానాలు, తమకు అందిన సమాచారం అంటూ ఇష్టానుసారం రాయడం సమంజసం కాదని నవదీప్ ట్వీట్ చేశారు. కాగా, డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన సోమవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో నిన్న ఉదయం 10.30 నుంచి రాత్రి 9.50 వరకు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. రక్త నమూనాలు ఇవ్వడానికి నవదీప్ నిరాకరించారు. మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ ధర్మారావు అలియాస్ చిన్నాను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు విచారణ కొనసాగినట్టు ప్రతికా ప్రకటనలో సిట్ తెలిపింది. సౌరభ్ బానోతు, ఆకుల రితికేశ్, అంకిత్ అగర్వాల్ అనే వ్యక్తులను కూడా ప్రశ్నించినట్టు సిట్ వెల్లడించింది. హీరోయిన్ చార్మి కౌర్ బుధవారం ఉదయం 10.30 గంటలకు హాజరవుతారని పేర్కొంది. Its astonishing that certain mediums of news are assuming general public to be so ignorant and believe their amusing stories and (1/3) — Navdeep (@pnavdeep26) 25 July 2017 twisted facts! It seems like they have no respect for our government instutuions and on-going investigations which are being done in (2/3) — Navdeep (@pnavdeep26) 25 July 2017 a very precise manner! #oohagaanalu#anisamacharam — Navdeep (@pnavdeep26) 25 July 2017 -
డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: నటుడు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నోటీసులు వచ్చిన మాట నిజమే. పోలీసుల విచారణలో నేను పూర్తిగా సహకరిస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. కానీ అకారణంగా ఊహాగానాలు వ్యాప్తిచేయడం బాధాకరం. కెల్విన్తో సంబంధాలు అంటున్నారు కానీ, ఆ కెల్విన్ ఎవరో నాకు నిజంగానే తెలియదు. మొత్తం సెలబ్రిటీలే చేశారంటూ ప్రచారం చేయడం వల్ల మాకు చాలా డామేజ్ జరుగుతుందని' నవదీప్ అన్నారు. చిన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పటికే నా జీవితం సాఫ్ట్ టార్గెట్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి విషయాల్లో తప్పులు చేసి సరిదిద్దుకున్నాను. కానీ డ్రగ్స్ లాంటి పెద్ద కేసుల్లో ఇప్పటివరకు నాపై కనీసం ఆరోపణలు కూడా రాలేదన్న విషయం అందరికీ తెలుసన్నారు. జనరల్ కౌన్సెలింగ్ కోసం నోటీసులు అందజేశారు. ఇటీవల ఓ రాంగ్ ఈవెంట్ మేనేజ్మెంట్తో కలిసి పని చేయడం వల్లే మమ్మల్ని పిలిచి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. ఆ మేనేజ్మెంట్ వారి వద్ద నా ఫోన్ నెంబర్ ఉండటంతో కేసు గురించి ప్రశ్నించేందుకు పిలిచారు. విచారణకు సహకరించి పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఇంటికి వస్తానన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఈ విషయంపై ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని, అకారణంగా ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దని నటుడు నవదీప్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని సినీ ప్రముఖులకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. -
లండన్ నుంచి బాధగా...
సినిమా కంప్లీట్ అయిన తర్వాత యాక్టర్స్ చివరి రోజున ఎమోషన్ అవ్వడం సహజమే. నెలల తరబడి కలిసి పని చేస్తారు కాబట్టి, ‘టాటా’ చెప్పేటప్పుడు అలా అయిపోతుంటారు. తమన్నా కూడా ఇలా ఎమోషన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు జస్ట్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినందుకే ఫీలవుతున్నారామె. అంతగా చిత్రబృందంతో కలిసిపోయినట్లున్నారు. కునాల్ కోహ్లీ డైరెక్షన్లో సందీప్ కిషన్, తమన్నా జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ను మే 28న లండన్లో స్టార్ట్ చేశారు. ఇందులో నవదీప్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ‘‘లండన్లో సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. యూనిట్ మెంబర్స్ను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. వీళ్లందరితో ఈ సినిమా షూటింగ్ చాలా జాయ్ఫుల్గా, సూపర్గా జరిగింది’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తమన్నా. -
పాపా... ఏ క్లాస్ చదువుతున్నావ్?
రియల్ లైఫ్లో స్టూడెంట్ లైఫ్ను సరిగా ఎంజాయ్ చేయలేదని తమన్నా పలు సందర్భాల్లో చెప్పారు. 15 ఏళ్ల వయసులో హీరోయిన్గా పరిచయం కావడంతో ఆమె కాలేజీకి వెళ్లిందే లేదు. అప్పుడు మిస్ అయిన స్టూడెంట్ లైఫ్ను ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సందీప్ కిషన్, తమన్నా జంటగా హిందీ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ సిన్మా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా స్కూల్ గాళ్గా నటిస్తున్నారు. ఆమె ఏ క్లాస్ చదువుతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్! దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరితో కలసి నటుడు–నిర్మాత సచిన్ జోషి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ లండన్లో జరుగుతోంది. ఇందులో హీరో నవదీప్ కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం. లండన్లోని ఈ సినిమా షూటింగ్ స్పాట్లో ఆయన ఎక్కువ కనిపిస్తున్నారని చూసినోళ్లు చెబుతున్నారు. -
ఖైదీ కోసం రానా, నవదీప్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఖైదీ నంబర్ 150. చిరు 150వ సినిమా కూడా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సింగిల్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ అంచనాలను మరింతగా పెంచేస్థాయిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తోంది మెగా టీం. విజయవాడ వేదికగా జరగనున్న ఈ ఈవెంట్కు యువ నటులు రానా, నవదీప్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారట. ఇప్పటికే పలు సినీ వేడుకలకు యాంకరింగ్ చేసిన నవదీప్, తన సినిమాల ఆడియో వేడుకల్లో యాంకరింగ్ చేసే రానా.. ఇద్దరు కలిసి మెగాస్టార్ రీ ఎంట్రీకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ వేడుకలో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, లైవ్ పర్ఫామెన్స్ మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. -
రఫ్ఫాడిస్తాం!
ఈ స్టిల్ చూస్తుంటే.. ‘లుక్ చూడు ఎంత రఫ్గా ఉందో... ఐపీయస్గా రఫ్ఫాడిస్తా’ అని రామ్చరణ్ చెప్తున్నట్టుంది కదూ! చరణ్ వెనుక నవదీప్ కూడా రెడీ. ట్రైనీ ఐపీఎస్గా రామ్చరణ్ ఎంత రఫ్ఫాడించారో చూడాలంటే కొత్త సినిమా విడుదలయ్యే వరకూ ఎదురు చూడాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ధ్రువ’. ఇందులో ప్రతినాయకుడిగా ‘రోజా’ ఫేమ్ అరవింద్ స్వామి నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. చరణ్, నవదీప్, ఇతర తారాగణం పాల్గొనగా టాకీ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. గత నెలలో చరణ్, రకుల్ప్రీత్ సింగ్లపై కాశ్మీర్లో పాటలను చిత్రీకరించారు. తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్’కి తెలుగు రీమేక్ ఇది. -
బుల్లితెరపై నవదీప్
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జై సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయిన యంగ్ హీరో నవదీప్. లుక్ విషయంలో, నటన విషయంలో ఎలాంటి రిమార్క్స్ లేకపోయినా స్టార్ ఇమేజ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. అయితే హీరో పాత్రే చేయాలంటూ పట్టు పట్టకపోవటంతో నవదీప్ కెరీర్ బిజీగానే సాగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో నెగెటివ్ రోల్స్కు నవదీప్ బెస్ట్ చాయిస్లా కనిపిస్తున్నాడు. అంతేకాదు పలు కార్యక్రమాలకు హోస్ట్గా కూడా తన సత్తా చూపిస్తున్నాడు నవదీప్. ఇటీవల జరిగిన ఐఐఎఫ్ఎ అవార్డ్ ఫంక్షన్తో పాటు, బ్రహ్మోత్సవం ఆడియో వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తాజాగా మరో కొత్త కార్యక్రమంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఓ ప్రముఖ చానల్లో నిర్వహిస్తున్న రియాల్టీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూతురు స్వప్నదత్ నిర్మాతగా వైజయంతీ టెలిఫిలింస్ నిర్మిస్తున్న ఈ కార్యక్రమంలో 15 మంది టాలీవుడ్ ముద్దుగుమ్మలు సాహసాలు చేయనున్నారు. వారిని సమన్వయపరిచే బాధ్యతను నవదీప్ తీసుకున్నాడు. దీంతోపాటు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు నవదీప్. -
అదృశ్యమైన చిన్నారి కథ సుఖాంతం..
విశాఖపట్నం: విశాఖలో అదృశ్యమైన 11 నెలల చిన్నారి నవదీప్ కథ సుఖాంతమైంది. శనివారం అర్థరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని వారి ఇంటి సమీపంలో వదిలివెళ్లారు. చిన్నారిని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో నవదీప్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా గాలిస్తున్న పోలీసులు చిన్నారి దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
విశాఖలో చిన్నారి కిడ్నాప్ కలకలం
విశాఖపట్నం: విశాఖలో మరో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని స్టేట్బ్యాంక్ అపార్ట్మెంట్లో గురువారం మధ్యాహ్నం 11 నెలల చిన్నారి నవదీప్ అదృశ్యమైయ్యాడు. అపార్టమెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్న బొంగ పైడిరాజు మనుమడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. గత రెండు రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. పరామర్శించేందుకు వచ్చిన వారిని నవదీప్ తల్లి ఆరా తీయడం చుట్టుపక్కలవారిని కంటతడిపెట్టిస్తోంది. మరోవైపు మూడవపట్టణ పోలీసులు అనుమానాస్పద ప్రాంతాలలో విస్తృతంగా గాలిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ యోగానంద్ సైతం చిన్నారి కిడ్నాప్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎనిమిది బృందాలతో ప్రత్యేక గాలింపు నగరం, నగర శివారు ప్రాంతాలలో నవదీప్ ఆచూకీ కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వలస వచ్చిన కుటుంబాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ అపార్ట్మెంట్ వద్ద గురువారం ఉదయం పూసలమ్మే ఒక మహిళ అనుమానాస్పదంగా తిరిగినట్లు నవదీప్ అమ్మమ్మ పైడమ్మ చెబుతోంది. ఆ పూసలమ్మే మహిళే నవదీప్ను కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
కథలన్నీ మనువాదానికి చెందినవే..
ఎల్జీబీటీ హక్కుల నేత నవదీప్ హైదరాబాద్: ప్రస్తుతం ప్రచురితమయ్యే కథలన్నీ మనువాదానికి చెందినవే ఉన్నాయని ఎల్జీబీటీ(లెస్బియన్ గే బెసైక్సువల్ ట్రాన్స్జెండర్) రైట్స్ యాక్టివిస్ట్ నవదీప్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్గార్డెన్స్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కథా ఉత్సవం-2015 జరిగింది. ఈ సందర్భంగా 2014లో వెలువడిన ఉత్తమ కథల సంకలనం ‘‘ప్రాతినిధ్య-2014’’ను నవదీప్ ఆవిష్కరించారు. నేటి సమాజంలో స్వలింగ సంపర్కులను అంటరానివాళ్లుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కులను సినిమా, మీడియా వాళ్లు అణచివేత ధోరణితోనే చూస్తున్నారని, ఇది పోవాలంటే విస్తృతమైన చర్చ జరగాలన్నారు. ముఖ్యఅతిథి ప్రముఖకవి సతీష్ చందర్ మాట్లాడుతూ సామాజిక స్పృహతో కూడిన రచనలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఎక్స్లెన్సీ అవార్డు ఫర్ లిటరరీ క్రిటిసిజం సాహితీవేత్త సి.విజయభారతికి, సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఎక్సెలెన్సీ అవార్డ్ ఫర్ స్టోరీ రైటింగ్ను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత మునిపల్లె రాజుకు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సీఐడీ ఐజీపీ పి.వి.సునీల్ కుమార్, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మి నారాయణ, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు పాల్గొన్నారు. -
మరింత పేరు తెచ్చుకుంటా..!
‘‘ఇప్పటి వరకూ నా స్థాయిలో నేను రాణిస్తున్నాననే అనుకుంటున్నా. అయితే ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం దక్కలేదనే వెలితి మాత్రం ఉంది. నా దగ్గరకు వచ్చినవాటిల్లో ఉత్తమమైనవే ఎంచుకుంటున్నా. భవిష్యత్తులో మరింత పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అని నవదీప్ చెప్పారు. ఆయన హీరోగా కార్తీక్వర్మ దర్శకత్వంలో రాజేశ్వర్మ నిర్మించిన ‘భమ్ బోలేనాథ్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ -‘‘భమ్ బోలేనాథ్’లో మూడు కథలుంటాయి. ఒకదానికొకటి సంబంధం లేనట్టు సాగినా ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాయి. ఆఖరుకు ఏం జరిగిందనేది ఆసక్తికరం. క్లైమాక్స్లో డ్రగ్స్కు సంబంధించిన ఆంశాన్ని హాస్యభరితంగా నడిపించాం. తెలుగు సినిమాకు ఇది కొత్త తరహా క్లైమాక్స్ అవుతుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్ మీదే ఉందనీ, పెళ్లి గురించి ఇంకా ఆలోచించడం లేదనీ నవదీప్ పేర్కొన్నారు. తెలుగులో మూడు సినిమాలతో పాటు తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
డిఫరెంట్ స్క్రీన్ప్లేతో...
‘‘వైవిధ్యమైన కథతో, విభిన్నమైన స్క్రీన్ప్లేతో ఈ చిత్రాన్ని తీశాం. ఆ మధ్య మా ‘కార్తికేయ’ లానే కచ్చితంగా ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత శిరువూరి రాజేష్ అన్నారు. కార్తీక్ వర్మ దర్శకత్వంలో నవదీప్, నవీన్చంద్ర, పూజ హీరో హీరోయిన్లుగా వస్తున్న ‘భమ్ భోలేనాథ్ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ, ‘‘చాలా విభిన్నమైన కథాంశంతో సినిమా తీశాం’’ అని చెప్పారు. ప్రచారచిత్రాలకు మంచి స్పందన వచ్చిందని హీరో నవదీప్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సమర్పణ: రఘు పెన్మెత్స, శ్రీకాంత్ దంతులూరి. -
మరింత కొత్తగా...
కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఏ విధంగా అయితే మా ‘కార్తీకేయ’ చిత్రాన్ని ఆదరించారో అలాగే మా తదుపరి చిత్రం ‘భం భోలేనాథ్’కు విజయం చేకూరుస్తారని నిర్మాత శిరువూరి రాజేష్ ధీమా వ్యక్తం చేశారు.నవదీప్, నవీన్చంద్ర, ప్రదీప్ హీరోలుగా నటిస్తుండగా, ప్రాచీ, పూజా వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తికేయవర్మ దర్శకత్వం వహించారు.ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ,ఈ నెల 23 న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. -
విభిన్న కథనంతో...
నవదీప్, నవీన్చంద్ర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. కార్తీక్వర్మ దండు దర్శకుడు. శిరువూరి రాజేశ్వర్మ నిర్మాత. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ్ ఆడియో సీడీని ఆవిష్కరించగా, ప్రచార చిత్రాలను నిఖిల్, సందీప్కిషన్, ప్రిన్స్, చందు మొండేటి, సుధీరవర్మ కలిసి విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన నాని, వరుణ్సందేశ్, శశాంక్, కమల్ కామరాజ్, కిరణ్, మధుశాలిని, పూజా జవేరి, ప్రాచీ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కథపై నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు కృతజ్ఞతలని దర్శకుడు అన్నారు. టికెట్కి పూర్తి న్యాయం చేసే సినిమా ఇదని నిర్మాత చెప్పారు. విభిన్నమైన కథనంతో కార్తీక్వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారని నవీన్చంద్ర అన్నారు. సంగీతానికి ఆస్కారమున్న సినిమా ఇదని సంగీత దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మట్లాడారు. -
మూడు జంటల కథ
క్రైమ్, కామెడీ నేపథ్యంలో నవదీప్, నవీన్చంద్ర, పూజ, ప్రాచీ, శ్రేయ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. శ్రీకాంత్ దంతులూరి సమర్పణలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకుడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను నవదీప్, నవీన్చంద్ర హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘విభిన్నమైన స్క్రీన్ప్లే, ఆసక్తికరమైన క్లయిమాక్స్తో సాగే చిత్రం ఇది’’ అని ఈ సందర్భంగా నవదీప్ అన్నారు. ఎంతో ఇష్టంగా చేసిన చిత్రమిదని నవీన్చంద్ర చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మూడు జంటల మధ్య సాగే కథ ఇది. క్రైమ్, కామెడీ ప్రధానాంశాలు. ఈ నెల 28న పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్, థ్రిల్లర్స్కు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సినిమా కొత్తగా ఉంటుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే.. మరిన్ని కొత్త చిత్రాలు వస్తాయి’’ అన్నారు. -
భమ్ బోలేనాథ్ మూవీ స్టిల్స్