పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌! | okkadu migiladu movie shooting Completed | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌!

Apr 30 2017 12:08 AM | Updated on Sep 5 2017 9:59 AM

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌!

పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌!

ఎల్‌టీటీఈ మిలిటెంట్‌ చీఫ్‌ ప్రభాకరన్‌ పాత్రలో మంచు మనోజ్‌ నటిస్తున్న సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకుడు.

ఎల్‌టీటీఈ మిలిటెంట్‌ చీఫ్‌ ప్రభాకరన్‌ పాత్రలో మంచు మనోజ్‌ నటిస్తున్న సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకుడు. పద్మజ ఫిలిమ్స్‌–న్యూ ఎంపైర్‌ సెల్యులాయిడ్స్‌ సంస్థలపై ఎస్‌.ఎన్‌. రెడ్డి, లక్ష్మీకాంత్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నేటితో పూర్తవుతుంది.

ఈ సందర్భంగా ఇందులో పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌గా కీలక పాత్ర చేస్తున్న ‘అలియాస్‌ జానకి’ ఫేమ్‌ అనీషా ఆంబ్రోస్‌ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నిర్మాతలు ఎస్‌.ఎన్‌. రెడ్డి, లక్ష్మీకాంత్‌ మాట్లాడుతూ – ‘‘ఇందులో మంచు మనోజ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మనోజ్‌ ప్రభాకరన్‌ ఫస్ట్‌ లుక్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. త్వరలో మనోజ్‌ మరో పాత్రకు సంబంధించిన లుక్‌ విడుదల చేయాలనుకుంటున్నాం.

 1990ల నాటి శ్రీలంక యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం’’ అన్నారు. మిలింద్‌ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: పీఎస్‌ వర్మ, కెమేరా: వి. కోదండ రామరాజు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కథనం: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement