![నాగ్ సరసన - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81461529971_625x300.jpg.webp?itok=LlAZ70n5)
నాగ్ సరసన
ధూపాటి హరిబాబు మనసు దోచుకున్న సీతగా ‘కంచె’లో ప్రేక్షకులను అలరించారు కథానాయిక ప్రగ్యా జైశ్వాల్. తాజాగా ఈ బ్యూటీని మరో బంపర్ ఆఫర్ వరించిందని సమాచారం. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిరిడి సాయి’ వంటి భక్తి రస ప్రధానమైన చిత్రాలను తెరకెక్కించిన కె. రాఘవేంద్రరావు మరోసారి అదే తరహాలో వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో టైటిల్ రోల్ను నాగార్జున చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా ఎంపికయ్యారట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ను జూన్లో ప్రారంభించనున్నారట.