కోలివుడ్‌ కాలింగ్‌ | Rajasekhar doing Tamil film after 32 years | Sakshi
Sakshi News home page

కోలివుడ్‌ కాలింగ్‌

May 25 2017 11:56 PM | Updated on Sep 5 2017 11:59 AM

కోలివుడ్‌ కాలింగ్‌

కోలివుడ్‌ కాలింగ్‌

యాంగ్రీ మేన్‌ రాజశేఖర్‌ దాదాపు 32 ఏళ్ల తర్వాత ఓ తమిళ చిత్రంలో నటించనున్నారు.

యాంగ్రీ మేన్‌ రాజశేఖర్‌ దాదాపు 32 ఏళ్ల తర్వాత ఓ తమిళ చిత్రంలో నటించనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. కెరీర్‌ ప్రారంభంలో 1984లో ‘పుదుమై  పెన్‌’, 1985లో ‘పుదియ తీర్పు’ వంటి తమిళ చిత్రాల్లో నటించారాయన. ఆ తర్వాత తెలుగు చిత్రాలకే పరిమితమయ్యారు.

ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పిఎస్‌వి గరుడ వేగ 125.18’ చిత్రంలో తనకు అచ్చొచ్చిన పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు రాజశేఖర్‌. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి కాక ముందే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తమిళ చిత్రంలో నటించడానికి ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. వెంకట్‌ ప్రభు ఇప్పటికే రాజశేఖర్‌కు కథ వినిపించగా, ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని భోగట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement