నో కాంప్రమైజ్‌ | Sakshyam Movie Satellite Rights Sold | Sakshi
Sakshi News home page

నో కాంప్రమైజ్‌

Mar 1 2018 11:35 PM | Updated on Aug 22 2019 9:35 AM

Sakshyam Movie Satellite Rights Sold  - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాక్ష్యం’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు.   ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను ఓ ప్రముఖ టీవీ చానల్‌ సొంతం చేసుకుంది. తెలుగు హక్కులను 5.5 కోట్లకు, హిందీ హక్కులను 8 కోట్లకు దక్కించుకుందని చిత్రబృందం తెలిపింది.

ఈ చిత్రాన్ని మే 11న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ‘‘మా చిత్రానికి మార్కెట్‌లో మంచి క్రేజ్‌ క్రియేట్‌ అయ్యింది.  ఓ యువ హీరో చిత్రానికి ఈ స్థాయిలో శాటిలైట్‌ బిజినెస్‌ జరడగం ఇదే మొదటిసారి. నిర్మాణ విలువలపరంగా నో కాంప్రమైజ్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఆఖరి షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్‌ చేశాం. ‘సాక్ష్యం’ హిట్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement