saakshyam
-
బెల్లంకొండ సినిమాలో మెహ్రీన్
ఇటీవల సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తన ఐదో పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నాడు ఈ దర్శకుడు. కాజల్ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ పాత్రలో మెహ్రీన్ నటిస్తున్నారు. ఈ రోజు నుంచి మెహ్రీన్కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ ప్రారంభమైంది. వంశధార క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. -
నల్గొండలో ‘సాక్ష్యం’ టీం
-
బెల్లంకొండ కెరీర్ బెస్ట్ ‘సాక్ష్యం’
యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సాక్ష్యం. జూలై 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్లోనే 40 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన శ్రీనివాస్ కెరీర్లోనే బిగెస్ట్ ఓపెనర్గా నిలిచింది. పుల్ రన్లో ‘సాక్ష్యం’ బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రాల రికార్డ్లను తిరగరాస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యంగ్ హీరో తొలి చిత్రం అల్లుడు శీను పుల్రన్లో 70 కోట్ల గ్రాస్ వసూళు చేయగా జయ జానకి నాయక దాదాపు 80 కోట్ల గ్రాస్ సాదించింది. ఇప్పుడు సాక్ష్యం ఆ రెండు చిత్రాల కలెక్షన్లు దాటేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. పంచ భూతల నేపథ్యంలో యాక్షన్ డ్రామగా తెరకెక్కిన సాక్ష్యం సినిమా బీసీ సెంటర్లలో మంచి వసూళ్లు సాదిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సాయి శ్రీనివాస్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతమందించాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా లో జగపతి బాబు, మీనా, శరత్ కుమార్, జయప్రకాష్, అశుతోష్ రానా, రవికిషన్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
అందుకు విజయమే సాక్ష్యం
‘‘కొత్త కాన్సెప్ట్ని ఆడియన్స్ ఎలా రీసివ్ చేసుకుంటారు? అనే ప్రశ్నకి కొత్త సక్సెస్తో సమాధానం చెబుతున్నారు. ఇంత పెద్ద కథను చెప్పడానికి మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. థియేటర్ నుంచి ఆడియన్స్ ఎలా బయటకు రావాలని కోరుకున్నామో అదే ఫీలింగ్తో వస్తున్నారు’’ అని శ్రీవాస్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ నామా నిర్మించారు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో శ్రీవాస్ మాట్లాడుతూ – ‘‘అభిషేక్గారు కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. శ్రీనివాస్ ప్రాణం పెట్టి పని చేశాడు. అందరం కూడా కసిగా పని చేశాం. ట్రెండ్ని, ట్రెడీషన్ని కలిపి తీసిన చిత్రం ‘సాక్ష్యం’’ అన్నారు. ‘‘టీమ్ అందరి సపోర్ట్కి థ్యాంక్స్. చాలా కష్టపడి పని చేశాం. ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందనడానికి సక్సెసే ‘సాక్ష్యం’. శ్రీవాస్గారు బాగా తెరకెక్కించారు. అభిషేక్గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది’’ అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ‘‘కొత్త కాన్సెప్ట్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్లో రిచ్నెస్ కనిపిస్తోంది. సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను మంచి యాక్షన్ హీరో అవుతాడు’’ అన్నారు పూజా హెగ్డే. ‘‘సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. అందరం సినిమాను ప్రేమించి పని చేశాం. థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘ఈ విజయంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా చూస్తే తప్పు చేయడానికి భయపడతారు అనే భావన కలుగుతుంది’’ అన్నారు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా. -
‘సాక్ష్యం’ మూవీ రివ్యూ
టైటిల్ : సాక్ష్యం జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే, జగపతి బాబు, వెన్నెల కిశోర్, అశుతోష్ రానా సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్ దర్శకత్వం : శ్రీవాస్ నిర్మాత : అభిషేక్ నామా అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయ జానకీ నాయక సినిమాతో సూపర్ హిట్ సాధించి మంచి ఫాంలో ఉన్నాడు. అదే జోరులో శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాక్ష్యం సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి బెల్లంకొండకు సక్సెస్ అందించిందా..? ఇప్పటి వరకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాతో భారీ యాక్షన్ చిత్రాలను కూడా డీల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడా..? కథ ; రాజు గారు (శరత్కుమార్) స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మక ప్రాంతంలో ఉండే పెద్ద మనిషి. అదే ప్రాంతంలో ఉండే మును స్వామి (జగపతి బాబు) అతని తమ్ముళ్లు చేసే అన్యాయాలను ఎదిరిస్తుంటారు. ఇది సహించలేని మునుస్వామి మొత్తం రాజుగారి కుటుంబాన్ని చంపేస్తాడు. రాజుగారి భార్య తన కొడుకును ఓ లేగ దూడకు కట్టి తప్పిస్తుంది. అలా చావు నుంచి తప్పించుకున్న పిల్లాడిని ఓ వ్యక్తి తీసుకెళ్లి కాశీలో వదిలేస్తాడు. (సాక్షి రివ్యూస్) పిల్లలు లేని శివ ప్రకాష్ (జయ ప్రకాష్) దంపతులు ఆ పిల్లాడికి విశ్వాజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్) అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు. శివ ప్రకాష్కు విదేశాల్లో వ్యాపారాలు ఉండటంతో విశ్వా కూడా అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు. అడ్వంచరస్ లైఫ్ను ఇష్టపడే విశ్వా రియాలిటీ వీడియో గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అక్కకు తోడుగా ఉండేందుకు అమెరికా వచ్చిన సౌందర్య లహరి(పూజ హెగ్డే) ప్రవచనాలు చెపుతుండగా చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇండియన్ ట్రెడిషన్ పై తాను చేసే ఓ వీడియో గేమ్ కు సాయం చేయమని సౌందర్యను అడుగుతాడు. సౌందర్య.. వాల్మీకి (అనంత శ్రీరామ్) అనే వ్యక్తిని విశ్వకు పరిచయం చేస్తుంది. వాల్మీకి పంచభూతాల నేపథ్యంలో ఓ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్ చెప్తాడు. అదే సమయంలో విశ్వ, సౌందర్యలు చిన్న అపార్థం కారణంగా విడిపోతారు. సౌందర్య ప్రేమకోసం ఇండియా వచ్చిన విశ్వను పంచభూతాలు ఎలా నడిపించాయి..? తనకు తెలియకుండా తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని విశ్వ ఎలా అంతమొందించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకు మంచి పరిణితి చూపిస్తున్న ఈ యంగ్ హీరో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాక్ష్యంలో మరింతగా మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్, డ్యాన్స్ లు ఇరగదీశాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాకు తనవంతుగా పూర్తి న్యాయం చేశాడు. సౌందర్య లహరి పాత్రలో పూజా హెగ్డే ఒదిగిపోయింది. నటనపరంగా ఓకే అనిపించినా గ్లామర్, లుక్స్తో సూపర్బ్ అనిపించింది.(సాక్షి రివ్యూస్) విలన్ గా జగపతి బాబు మరోసారి తన మార్క్ చూపించారు. వేమన పద్యాలు చెపుతూ సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మంచి విలనిజం పండించారు. జగపతి బాబు తమ్ముళ్లుగా నటించిన అశుతోష్ రానా, రవికిషన్లు కూడా తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో జయ ప్రకాష్, పవిత్రా లోకేష్, రావూ రమేష్, వెన్నెల కిశోర్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; పంచభూతాలే ప్రతీకారం తీర్చుకుంటాయన్న డిఫరెంట్ (ఫాంటసీ) కాన్సెప్ట్ తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు శ్రీవాస్ పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సినిమాను తెరకెక్కించాడు. బెల్లంకొండ శ్రీనివాస్కు గత చిత్రం జయ జానకీ నాయకతో వచ్చిన మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్తో కథ నడిపించాడు. ఫస్ట్ హాఫ్లో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని బ్యాలెన్స్ చేసిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో నడిపించాడు. (సాక్షి రివ్యూస్)హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నా కథనం మధ్యలో స్పీడు బ్రేకర్లలా మారి ఇబ్బంది పెడతాయి. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అభిషేక్ నామా ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రిచ్గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ సినిమాటోగ్రఫి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; కథనం మధ్యలో ఇబ్బంది పెట్టే పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. మరిన్ని రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సాక్ష్యం షోలు రద్దు!
సాక్షి, హైదరాబాద్: భారీ బడ్జెట్తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు(జూలై 27)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఎర్లి మార్నింగ్ షోతోపాటు మార్నింగ్ షోలు కూడా దాదాపు రద్దయ్యాయి. ఇందుకు టెక్నికల్ ఇష్య్సూ కారణమని చెబుతున్నప్పటికీ.. మరోవైపు న్యాయపరమైన సమస్యలనే టాక్ వినిపిస్తోంది. నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే షోలు ఆగినట్లు సమాచారం. చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉదయం షోలు రద్దయ్యాయంట. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పటి వరకు ఈ చిత్రం షోలు పడలేదు. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో పడాల్సిన 8.45 గంటల షో కూడా రద్దయింది. ఏపీ, తెలంగాణల్లో మార్నింగ్ షోలు కూడా ఉండవని పలువురు సినీ జర్నలిస్టులు ట్వీట్లు చేశారు. మధ్యాహ్నానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించకుని మ్యాట్నీ షో నుంచి చిత్ర ప్రదర్శనను ప్రారంభించాలని నిర్మాత యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్కు డిజిటల్ ప్రింట్ అందలేదు. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల సమయంలో చిక్కులు ఎదుర్కొవటం గమనార్హం. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు విలన్. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్గా సాక్ష్యం తెరకెక్కింది. -
విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి
‘‘అల్లుడుశీను’ సినిమా విడుదలై అప్పుడే నాలుగేళ్లయిందంటే నమ్మలేకపోతున్నా. నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సినిమా సినిమాకి సాయి చాలా మెచ్యూర్డ్గా ఎదుగుతున్నాడు. ‘సాక్ష్యం’ ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. అభిషేక్ నామా ‘సాక్ష్యం’ని అంత గ్రాండ్గా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హేగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ‘సాక్ష్యం’ రేపు విడుదలవుతోంది. ‘సాక్ష్యం’ చిత్రంలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘డెస్టినీ’ని వినాయక్ రిలీజ్ చేశారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా టీమ్ అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. అభిషేక్గారు ఈ చిత్రాన్ని లావిష్గా నిర్మించారు. శ్రీవాస్గారి విజన్కి ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం అందించాలి’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ‘సాక్ష్యం’ ఉంటుంది. ఇందులో ఇప్పటివరకూ చేయని కొత్త పాత్ర చేశాను. విజువల్స్ చాలా బాగుంటాయి’’ అని పూజాహెగ్డే అన్నారు. -
కన్ఫామ్ చేసిన ‘సాక్ష్యం’ టీం
సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. గతం కొద్ది రోజులుగా సాక్ష్యం సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో జంతువులు, పక్షులను వినియోగించినందున సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ సాక్ష్యం టీం సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది. -
మినీ బాహుబలి చేశాం
‘‘జయ జానకి నాయక’ సినిమాకి ముందే శ్రీవాస్గారు ‘సాక్ష్యం’ కథ చెప్పారు. పంచభూతాల నేపథ్యంలో అద్భుతమైన కథ రెడీ చేశారాయన. ఇప్పటివరకూ చూడని సరికొత్త కథ.. చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకు బాగా నచ్చింది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు... ► పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఇలాంటి కథతో సినిమా రాలేదు. బహుశా.. మా సినిమా విడుదల తర్వాత ఈ జానర్లో మరిన్ని సినిమాలు వస్తాయనుకుంటున్నా. ఈ సినిమా కోసం 150 రోజులు పనిచేశాం. ► పాటలు, ఫైట్లు చక్కగా కుదిరాయి. యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. నా బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు పీటర్ హెయిన్స్గారు యాక్షన్స్ డిజైన్ చేశారు. ఈ చిత్రంలో డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేశా. ఎంత కష్టపడితే అంత మంచి భవిష్యత్ ఉంటుందని నా నమ్మకం. అందుకే జెన్యూన్గా కష్టపడ్డా. వెరీ హ్యాపీ. యాక్షన్ సీక్వెన్స్ చాలా సహజంగా ఉంటాయి. ► ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇందులో నేను వీడియోగేమ్ డిజైనర్గా చేశా. ‘సాక్ష్యం’ కథ వినగానే హిట్ అని తెలుసు. సూపర్ హిట్ చేయాలని యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఓ రకంగా మినీ ‘బాహుబలి’ చేశాం. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చూడదగ్గ చిత్రమిది. ► ఏ సినిమాకైనా నా వైపు నుంచి బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తా. మినిమం గ్యారంటీ సినిమాలు ఇస్తాడనే పేరు చాలు. నా మార్కెట్ పరిధికి మించి ఎవరూ ఖర్చు పెట్టరు. వసూళ్లు ఒక్కటే కాదు.. శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపితే నా సినిమాలకు నష్టం రాదు. బడ్జెట్ విషయంలో ఎవర్నీ ఒత్తిడి చేయను. నేనెప్పుడూ నిర్మాతల హీరోనే. ► ‘సాక్ష్యం’ వర్క్ని ప్రతిరోజూ ఎంజాయ్ చేస్తున్నా అని శ్రీవాస్గారు అన్నారు. మంచి విజన్తో ఈ కథ రెడీ చేశారు. రెండు పార్ట్లుగా తీయాల్సిన సినిమా ఇది. నా లైఫ్లో ‘సాక్ష్యం’ చిత్రాన్ని గర్వంగా ఫీలవుతా అని అభిషేక్ నామాగారు అన్నారు. ► కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నా. ఇందులో కాజల్ హీరోయిన్. 70శాతం షూటింగ్ పూర్తయింది. నవంబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తేజగారి డైరెక్షన్లో చేస్తున్న సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఇది చాలా కొత్త కథ. ఫస్టాఫ్లో ఫైట్స్ ఉండవు. ఏడేళ్ల కిందటే ఆయన ఈ కథ తయారు చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా కాజలే హీరోయిన్. యాక్చువల్లీ ఈ సినిమాకు నాకన్నా ముందే కాజల్ని ఫైనలైజ్ చేశారు. తర్వాత నేను వచ్చా. మా కాంబినేషన్ రెండోసారి అనుకోకుండా కుదిరింది. -
హీరో, హీరోయిన్లు కాదు.. కథే రాజు
‘‘ఇండియన్ ఫిలిం హిస్టరీలో మొదటిసారి పంచ భూతాల మీద వస్తున్న సినిమా ‘సాక్ష్యం’. తప్పు చేసినప్పుడు ఎవరూ చూడకుండా చేసాం, తప్పించుకున్నాం అనుకుంటారు. కానీ, కర్మ సాక్షి అనేది ఒకటి ఉంటుందనీ, దాని నుంచి తప్పించుకోవడం కుదరదనేది మా సినిమా మెయిన్ కాన్సెప్ట్’’ అని నిర్మాత అభిషేక్ నామా అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా పంచుకున్న విశేషాలు... ► ‘సాక్ష్యం’ కథని శ్రీవాస్గారు మొదట బెల్లంకొండ శ్రీనివాస్గారికి చెప్పారు. నిర్మాతగా నేను అయితే బాగుంటుందని వాళ్లు అనుకుని నన్ను కలిశారు. శ్రీవాస్ గత సినిమా ‘డిక్టేటర్’ ఎందుకో ఆ సమయంలో వర్కవుట్ కాలేదు. కానీ, ‘సాక్ష్యం’ కథ మీద నమ్మకంతోనే ఆయనతో ఈ సినిమా చేశా. ► ప్రజెంట్ జనరేషన్ మూవీస్లో హీరో, హీరోయిన్ల కంటే కథే మెయిన్ కింగ్. సినిమాలో కాశీలో కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటిని హైదరాబాద్లో తీయలేం కదా?. కష్టమైనా కాశీలోనే తీయాలి. అందుకే ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం పెరిగింది. ► ‘సాక్ష్యం’ లో శ్రీనివాస్ వీడియో గేమ్ డిజైనర్గా నటిస్తున్నారు. హీరో మార్కెట్ పక్కన పెడితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ఈ మాత్రం ఖర్చు కరెక్టే అనిపించింది. పెద్ద హీరోలని పెట్టి సినిమా తీసినా, సరైన కథ లేకపోతే ప్రేక్షకులు చూడరు కదా? ► తన సినిమాల్లో శ్రీవాస్ తొలిసారి హీరోని చాలా డిఫరెంట్గా చూపించారు. సాయి శ్రీనివాస్గారు కూడా లవ్ సీన్స్లో చాలా స్టైలిష్గా, ఫైట్ సీన్స్ అప్పుడు బాడీని బాగా బిల్డ్ అప్ చేసి నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కని సంగీతం అందించారు. కథకు తగ్గట్టు, సందర్భానుసారంగా పాటలు వస్తాయి. పాటలు చిత్రీకరించిన లొకేషన్లు అందర్నీ ఆకట్టుకుంటాయి. ► మొత్తం 48మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. వారందరూ స్క్రీన్పై గ్రాండ్గా కనిపిస్తారు. మా బ్యానర్కి ‘సాక్ష్యం’ చాలా ప్లస్ అవుతుంది. కొత్త కాన్సెప్ట్ కావడంతో తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. -
‘సాక్ష్యం’ మూవీ స్టిల్స్
-
సృష్టే సాక్ష్యంగా...
ఈ భూమ్మీద జరిగే ప్రతిదానికి సాక్ష్యం ఈ దృష్టే కాదు. ఆ సృష్టి కూడా. ఇలా సృష్టే సాక్ష్యంగా నిలిచిన ఓ సంఘటన కోసం ఓ కుర్రాడు పోరాడుతున్నాడు. అతని పోరాటానికి పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) ఎలా సాయం చేసాయన్నది థియేటర్లో చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటున్నారు ‘సాక్ష్యం’ టీమ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సాక్ష్యం’. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ‘‘ఇటీవల విడుదలైన ట్రైలర్, ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఎలా సాక్ష్యంగా నిలిచింది అన్న అంశం సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్. అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. సినిమాను ఈ నెల 27న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణా, జయప్రకాశ్, ‘వెన్నల’ కిశోర్ నటించిన ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా. -
పంచభూతాలే ఈ సినిమా చేయించాయి
‘‘నేను మాట్లాడాల్సిందంతా నా థియేట్రికల్ ట్రైలర్, పంచభూతాల సాంగ్ మాట్లాడేశాయి. కొత్త కథలను ఆడియన్స్ ఆదరిస్తున్నారని ఈ స్క్రిప్ట్ని ఎంచుకున్నాను. పంచభూతాల సపోర్ట్తోనే ఈ సినిమా జరిగిందనుకుంటాను. పంచభూతాలే నాతో ఈ సినిమా చేయించాయి అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీవాస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్లో జరిగింది. ట్రైలర్ను, ఆడియో సీడీలను పార్లమెంట్ సభ్యులు, టీ న్యూస్ ఎండీ సంతోశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ –‘‘నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ మేకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. బడ్జెట్ ఎక్కువైనా సరే నిర్మాత అభిషేక్ కథను నమ్మి కాంప్రమైజ్ అవ్వలేదు. హర్షవర్ధన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్థర్ విల్సన్ కెమెరా, చంటిగారి ఎడిటింగ్, అనంత శ్రీరామ్ లిరిక్స్ హైలైట్స్గా నిలుస్తాయి. విలన్స్ చాలా పవర్ఫుల్గా ఉండాలని జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణాని సెలెక్ట్ చేసుకున్నాం. ఒక దర్శకుడికి శ్రీనివాస్లాంటి హీరో దొరికితే హ్యాపీగా ఉంటుంది. ఏం చెప్పినా చేసేవాడు. ఫ్యూచర్లో పెద్ద స్థాయికి వెళ్తాడు. పూజా హెగ్డే సౌందర్యలహరి క్యారెక్టర్కి మౌల్డ్ అయిపోయింది’’ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘ఇంత మంచి సినిమాను నాకిచ్చినందుకు శ్రీవాస్ గారికి థ్యాంక్స్. కెరీర్ స్టార్టింగ్లోనే ఇలాంటి సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి కథను నమ్మి నిర్మించినందుకు నిర్మాత అభిషేక్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శ్రీవాస్గారు ఇందులో డిఫరెంట్ రోల్ ఇచ్చారు. సాయి చాలా హార్డ్వర్కింగ్ పర్సన్. అభిషేక్ గారికి చాలా డబ్బులు రావాలి’’ అన్నారు పూజా హెగ్డే. ‘‘ఇలాంటి ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అనంత శ్రీరామ్గారి సపోర్ట్ లేకపోతే పంచభూతాల సాంగ్ ఇలా వచ్చేది కాదు’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘సాంగ్ చూడగానే ‘లెజెండ్’ సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా కూడా ఆ రేంజ్ బ్లాక్బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘శ్రీనివాస్తో ఓ సినిమా తీశాను. చాలా ఎనర్జిటిక్. కోపరేటివ్. ఈ సినిమా విజువల్ ఫీస్ట్లా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘సినిమాను ఇష్టపడే వ్యక్తి శ్రీవాస్. బ్లాక్బస్టర్ కొట్టి టాప్ రేంజ్కి వెళ్లాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు దశరథ్. -
'సాక్ష్యం' చిత్రం ఆడియో
-
‘సాక్ష్యం’ ఆడియో వేడుక
‘జయ జానకి నాయక’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు బెల్లకొండ శ్రీనివాస్. తన తదుపరి చిత్రంగా ఓ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. స్టార్ ప్రొడ్యుసర్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా ఆడియో వేడుకను జూలై 7న హైదరాబాద్లోని శిల్పాకళావేదికలో నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. పంచభూతాలే సాక్ష్యం అంటూ ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ప్రకృతే సాక్ష్యం
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించారు. జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్ కీలక పాత్రలు చేశారు. హర్షవర్ధన్ రామేశ్వరన్ స్వర పరచిన ఈ సినిమా ఆడియోను జూలై 7న విడుదల చేయనున్నారు. ‘‘ప్రకృతే సాక్ష్యంగా ఈ సినిమాను రూపొందించాం. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్, రెండు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆర్తు ఏ.విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలం. ‘బాహుబలి’ చిత్రానికి సీజీ వర్క్ చేసిన టీమ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. టైమ్ మ్యూజిక్ సౌత్ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. జూలై 20న ‘సాక్ష్యం’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆ యువ హీరో సినిమాకు భారీ ఆఫర్!
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు భారీ ఆఫర్ వచ్చింది. సినిమా షూటింగ్ ఇప్పుడే మొదలుపెట్టారు... అప్పుడే ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులకు భారీ ఆఫర్ వచ్చింది. జయ జానకి నాయకా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యువహీరో ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సాక్ష్యం సినిమా తరువాత మొదలుపెట్టే ఈ సినిమాకు హిందీ శాటిలైట్ హక్కులను రూ. 9.5కోట్లకు అమ్మినట్లు చిత్రనిర్మాతలు ప్రకటించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత తెలిపాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. వంశధార క్రియేషన్స్పై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ను ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. Actress @MsKajalAggarwal joins the sets of #BSS5. Starring @BSaiSreenivas and production by #VamsadharaCreations. A film by #Sreenivas. Hindi satellite rights of the film sold for a whopping ₹9.50 crore. pic.twitter.com/8P9sQCeoOF — BARaju (@baraju_SuperHit) June 1, 2018 -
ఒక్క పాటకు ఐదుగురు దిగ్గజాలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పంచభూతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాటను ఐదుగురు గాయకులు కలిసి ఆలపిస్తున్నారు. పంచభూతల నేపథ్యంలో వచ్చే ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, ఏసుదాసు, హరిహరన్, కైలాష్ఖేర్, బాంబే జయశ్రీ లు పాడటం విశేషం. హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూలై 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా జూన్ 14నే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించినా.. గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమవుతుండటంతో విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు. శరత్కుమార్, మీనా, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో విజయాన్ని నమోదు చేయటం ఖాయం అని భావిస్తున్నారు. -
ఆలస్యంగా ‘సాక్ష్యం’
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా ‘సాక్ష్యం’ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయాలనుకున్నారు. సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డేట్ను జూలై 20కు పోస్ట్ పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ –‘‘బాహుబలి’ సినిమాకు వర్క్ చేసిన సీజీ టీమ్ ‘మకుట’ మా సినిమాకు వర్క్ చేస్తోంది. సినిమా పంచభూతల చుట్టూ తిరుగుతుంది. దర్శకుడు ఒక సరికొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో కొంచెం డిలే అయింది. ప్రపంచవ్యాప్తంగా మా సినిమాను జూలై 20న రిలీజ్ చేస్తున్నాం. టీజర్, ట్రైలర్స్కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్. -
ఒక సినిమా.. ఐదు క్లైమాక్స్లు
జయ జానకి నాయక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ఐదు క్లైమాక్స్లను ప్లాన్ చేశారట. పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ ఫైట్లు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ప్రతీ ఫైట్ క్లైమాక్స్ అనిపించేంత భారీగా తెరకెక్కించారు. యాక్షన్ కొరియెగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఒక్క ఫైట్ను ఒక్కో థీమ్తో డిఫరెంట్గా రూపొందించారట. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా శరత్ కుమార్, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సాక్ష్యం’ విడుదల వాయిదా!
‘జయ జానకి నాయకా’ సినిమాతో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మంచి జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ యువహీరో తన తదుపరి చిత్రం సాక్ష్యం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్, లుక్స్, సాంగ్స్కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది. జూన్ 14న సాక్ష్యంను విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రం జూలైలో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. -
అమెరికా టు రాయలసీమ
అవును.. అమెరికా నుంచి స్ట్రయిట్గా రాయలసీమలో అడుగుపెట్టారు పూజా హెగ్డే. అమెరికాలో ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి, డైరెక్ట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్–ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారీ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో సాగే యాక్షన్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేకంగా రూపొందించిన ‘రాయలసీమ సెట్’లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అంటే.. పూజా హెగ్డే రాయలసీమలోకి ఎంటరైనట్లే కదా. 45 రోజులు పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందట. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్లో రిలీజ్ కానుంది. -
‘సాక్ష్యం’ నుంచి సౌందర్య లహరి సాంగ్
బడా నిర్మాత బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ హీరోకు ఇప్పటి వరకు తగిన గుర్తింపు రాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ యువ హీరో మొదట్నుంచీ స్టార్ హీరోయిన్లతోనే జతకడుతున్నారు. గతేడాది జయ జానకి నాయకా అంటూ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్తో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈరోజు (మే 4) సినిమాలోని మొదటి సాంగ్ను రిలీజ్ చేశారు. లహరి ..లహరి..అంటూ సాగే ఈ మెలొడిసాంగ్ను అందమైన లొకేషన్లో తెరకెక్కించినట్లు లిరికల్ వీడియో సాంగ్ చూస్తే తెలుస్తోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత సారథ్యంలో... జితిన్, ఆర్తిలు ఆలపించారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. -
‘సాక్ష్యం’ మొదటి సాంగ్ విడుదల
-
‘సాక్ష్యం’ నుంచి రేపు ఫస్ట్ సింగిల్
గతేడాది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ‘జయ జానకి నాయకా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ సినిమా విజయవంతమైంది. ఈయన కెరీర్లో పెద్దగా విజయాలు లేకపోయినా... హై బడ్జెట్, కాస్టింగ్తో సినిమాలు రిచ్గా ఉంటాయి. ప్రస్తుతం ‘సాక్ష్యం’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ (సౌందర్య లహరి...)ను రేపు (మే 4) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించగా...శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పంచభూతాలే సాక్ష్యంగా..!
నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశాలను పంచభూతాలు అంటారు. ఓ సంఘటనకు ఈ పంచభూతాలు ఎలా సాక్ష్యంగా నిలిచాయి అనే అంశాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సాక్ష్యం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్కు ప్రకృతినే కేంద్రబిందువుగా చేసుకుని సరికొత్త యాంగిల్లో శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ మేకోవర్, టెక్నికల్ అంశాలు, గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్. దుబాయ్, వారణాసి, అమెరికాలోని లొకేషన్స్లో చిత్రీకరణ జరిపాం. శుక్రవారం రాజమండ్రిలో మొదలైన కొత్త షెడ్యూల్తో షూటింగ్ను కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు. జగపతిబాబు, శరత్కుమార్, మీనా, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: హర్షవర్ధన్. -
పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం
‘కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నెక్ట్స్ ఏం జరుగుతుంది?’ అనే అంశాల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘సాక్ష్యం’. బెల్లకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం... కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అన్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. అభిషేక్ నామా మాట్లాడుతూ–‘‘ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్గా ఉన్నాయి. స్క్రీన్ప్లే ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్. ప్రస్తుతం న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూ జెర్సీలోని అద్భుతమైన లొకేషన్స్లో షూటింగ్ జరుగుతోంది. హర్షవర్ధన్ మంచి సంగీతం అందిస్తున్నారు. మేలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. జగపతిబాబు, శరత్కుమార్, మీనా, ‘వెన్నెల’ కిషోర్, జయప్రకాశ్, రవికిషన్ నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ఆర్దర్ ఎ.విల్సన్. ∙బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే -
‘సాక్ష్యం’ టీజర్ విడుదల
-
‘సాక్ష్యం’ టీజర్ వచ్చేసింది..!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ను ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. భారీ బడ్జెట్ తో అదే స్థాయి తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాకుండానే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అయిదున్నర కోట్లకు అమ్ముడయ్యి రికార్డ్ సృష్టించింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కనువిందు చేయనున్నాయి. సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సాక్ష్యం టీజర్ ఎప్పుడంటే..!
జయ జానకి నాయక సినిమా తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ను ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాకుండానే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అయిదున్నర కోట్లకు అమ్ముడయ్యి రికార్డ్ సృష్టించింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కనువిందు చేయనున్నాయి. సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అమెరికాలో సాక్ష్యం
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాక్ష్యం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. 15రోజుల షెడ్యూల్లో ఓ సాంగ్ను, కొన్ని సీన్స్ అమెరికాలోని న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూ జెర్సీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. మే 11న సినిమా విడుదల చేయనున్నారు. జగపతిబాబు, మీనా, శరత్ కుమార్, ‘వెన్నెల’ కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: హర్షవర్ధన్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్. -
మరో స్టార్ హీరోయిన్తో బెల్లంకొండ
వరుసగా స్టార్ హీరోయిన్లతో జతకడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నెక్ట్స్ సినిమాలో సీనియర్ తో ఆడిపాడనున్నాడు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శ్రీనివాస్ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సాక్ష్యం తరువాత చేయబోయే రెండు సినిమాలను ఇప్పటికే ఫైనల్ చేశాడు శ్రీనివాస్. కొత్త దర్శకుడు శ్రీనివాస్ను పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ స్టార్ కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్లతో నటించిన సాయి శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో పూజా హెగ్డేతో జోడి కట్టాడు. -
బెల్లంకొండ సినిమాలో బాలీవుడ్ విలన్
జయ జానకి నాయక సినిమాతో కమర్షియల్ హిట్ సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత సాయి శ్రీనివాస్ మరో భారీ బడ్జెట్లో చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్ బ్యానర్పై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాలో విలన్గా నటిస్తున్న నీల్ నితిన్ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అలరించనున్నారు. -
నో కాంప్రమైజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాక్ష్యం’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ చానల్ సొంతం చేసుకుంది. తెలుగు హక్కులను 5.5 కోట్లకు, హిందీ హక్కులను 8 కోట్లకు దక్కించుకుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని మే 11న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘మా చిత్రానికి మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఓ యువ హీరో చిత్రానికి ఈ స్థాయిలో శాటిలైట్ బిజినెస్ జరడగం ఇదే మొదటిసారి. నిర్మాణ విలువలపరంగా నో కాంప్రమైజ్. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. ఆఖరి షెడ్యూల్ను అమెరికాలో ప్లాన్ చేశాం. ‘సాక్ష్యం’ హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘సాక్ష్యం’ శాటిలైట్ రైట్స్కు రికార్డ్ ప్రైజ్
జయ జానకి నాయక సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు బిజినెస్ పరంగానూ సాక్ష్యం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న సాక్ష్యం సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అయిదున్నర కోట్లకు అమ్ముడయ్యి రికార్డ్ సృష్టించింది. దీంతో థియేటర్ హక్కలు కాకుండానే 13కోట్లకు పైగా బిజినెస్ సాధించింది సాక్ష్యం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కనువిందు చేయనున్నాయి. ఈ సీన్స్కు సంబంధించిన ఫుటేజ్ చూసిన జీ న్యూస్ సంస్థ ఇంత భారీ మొత్తం వెచ్చించినట్టుగా తెలుస్తోంది. సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా డీటెయిల్స్
ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో హీరోగా నటిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్ బ్యానర్లో తొలి ప్రయత్నంగా నవీన్ సొంటినేని (నాని) ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నవీన్ సొంటినేని మాట్లాడుతూ.. ‘ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో మా బ్యానర్ ను ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ‘దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ఛోటా కె.నాయుడు గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను, ఆర్ట్ డైరెక్టర్ గా చిన్నాగారిని ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే మిగతా నటీనటుల మరియు సాంకేతిక నిపుణులను ప్రకటిస్తాం. ఫిబ్రవరి 22న హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో మా ప్రొడక్షన్ నెం.1 ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం’ అన్నారు. -
సమ్మర్లో సాక్ష్యం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’ – నేచర్ ఈజ్ ది విట్నెస్ అనేది ట్యాగ్లైన్. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రపంచవ్యాప్తంగా మే 11న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఆ తర్వాత ఓ కీలక షెడ్యూల్ను అమెరికాలో చిత్రీకరించనున్నారట. ఆ షెడ్యూల్తో సినిమా కంప్లీట్ అవ్వనుంది. ఈ సినిమాకు శ్రీవాస్ స్క్రిప్ట్, సాయి శ్రీనివాస్ చేసిన యాక్షన్ సీన్స్, పూజా గ్లామర్ హైలెట్స్గా నిలుస్తాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ. విల్సన్, మాటలు: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: హర్షవర్ధన్.8 -
మే 11న ‘సాక్ష్యం’
‘జయ జానకి నాయక’ సినిమాతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 11 రిలీజ్ కానున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘ప్రేమికుల రోజు సందర్భరంగా రిలీజ్ చేసిన పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయటం మరింత ఆనందంగా ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన భారీ సెట్లో క్లైమాక్స్కు సంబంధించిన భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. శ్రీవాస్ అందించిన కథా కథనాలపై మాకు చాలా నమ్మకముంది. హీరో శ్రీనివాస్ కూడా సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. పూజాతో చేసిన రొమాంటిక్ సీన్స్ తో పాటు అడ్వంచరస్ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్గా నిలుస్తాయి. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో భారీ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ అమెరికా వెళ్లనుంద’ని తెలిపారు. -
ప్రేమికుల దినోత్సవం సాక్ష్యంగా...
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హీరో హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘సాక్ష్యం’లో హీరో, హీరోయిన్ పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. శ్రీవాస్ వారి పాత్రలు రాసిన విధానం బాగుంది. ఆయన దర్శకత్వ శైలి పూర్తిగా మారిపోయింది. సినిమాలో కీలకమైన ఫైట్ సీక్వెన్స్ని పీటర్ హెయిన్ మాస్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెరకెక్కిస్తున్నారు.ఆర్ఎఫ్సీలో జరుగుతున్న క్లైమాక్స్ షూటింగ్లో శ్రీనివాస్, పూజ పాల్గొనగా కాంబినేషన్ సీన్స్ తీస్తున్నాం. కీలక పాత్రధారులైన జయప్రకాశ్, పవిత్ర లోకేష్, ‘వెన్నెల’ కిషోర్ల కాంబినేషన్లో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అన్నారు. జగపతిబాబు, శరత్కుమార్, మీనా, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్. -
‘ఒకే ప్రేమ ఒకే హృదయం ఒకే విధి’
జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల లుక్ను ప్రేమికుల రోజు సందర్భంగా రివీల్ చేశారు చిత్రయూనిట్. దాదాపుగాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 26నే రిలీజ్ చేయాలని భావించినా వాయిదా పడింది. తాజాగా హీరోహీరోయిన్ల లుక్ను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రేమికుల రోజే కరెక్ట్ అని భావించిన చిత్రయూనిట్ ఈ రోజు (ఫిబ్రవరి 14) ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఒకే ప్రేమ ఒకే హృదయం ఒకే విధి అనే కాన్పెప్ట్ తో రూపొందించిన ఈ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మరో స్టార్ హీరోయిన్తో..!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో సాయి శ్రీనివాస్. తొలి సినిమా అల్లుడు శీనుతోనే వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్, సమంత లాంటి టాప్ హీరోయిన్తో కలిసి పని చేశాడు శ్రీనివాస్. అంతేకాదు ఈ సినిమాలో తమన్నాతో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడాడు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్తో జోడి కట్టి తొలి కమర్షియల్ సక్సెస్ను అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శ్రీనివాస్ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సాక్ష్యం తరువాత చేయబోయే రెండు సినిమాలను ఇప్పటికే ఫైనల్ చేశాడు శ్రీనివాస్. ఓంకార్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు కొత్త దర్శకుడు నానిని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ హీరోయిన్గా నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
బెల్లంకొండతో సుకుమారి
వరుసగా భారీ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నెక్ట్స్ సినిమాలో ఓ క్రేజీ హీరోయిన్ తో జతకట్టనున్నాడు. శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జయ జానకీ నాయక లాంటి మంచి హిట్ తరువాత చేస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సాక్ష్యం సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెడుతున్నాడు ఈ యంగ్ హీరో. దర్శకుడిగా మారిన యాంకర్.. ఓంకార్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నాడు. ఇటీవల రాజుగారి గది 2 సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఓంకార్, నెక్ట్స్ సినిమాను డిఫరెంట్ జానర్ లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ని హీరోయిన్గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అజ్ఞాతవాసి సినిమాలో సుకుమారిగా ఆకట్టుకున్న కీర్తి సురేష్.. కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. -
రిపబ్లిక్ డేకి ‘సాక్ష్యం’ ఫస్ట్ లుక్
జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ చిత్రయూనిట్ ఫస్ట్లుక్ ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
డబుల్ ధమాకా
బడిలో గుడిలో.. మడిలో నీ తలపే శశివదన.. అంటూ ‘డీజే’ సినిమాలో అగ్రహారం కుర్రాడు అల్లు అర్జున్నే కాకుండా తెలుగు రాష్ట్రాల అబ్బాయిలందరితో తన నామ జపం చేయించారు పూజా హెగ్డే. ఆ మాటకొస్తే ‘ముకుందా’లో ‘గోపికమ్మా.. చాలునులేమ్మా..’ అంటూ కుర్రకారు గుండెలకు గేలం వేశారు. ప్రతి సినిమాకీ అభినయంతో పాటు గ్లామర్తో మంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు వరుసగా ఆఫర్లూ కొట్టేస్తున్నారు ఈ భామ. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ‘సాక్ష్యం’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా రూపొందనున్న సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరునే ఖరారు చేసిందట చిత్రబృందం. ఇది మహేశ్ కెరీర్లో 25వ చిత్రం. ఈ సినిమాను అశ్వినీ దత్, ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. మరో సినిమాకి కూడా పూజ పేరు పరిశీలనలో ఉంది. ‘శతమానం భవతి’ సినిమాతో దర్శకుడిగా మారిన సతీష్ వేగేశ్న తదుపరి సినిమా ‘శ్రీనివాస కల్యాణం’లో హీరోయిన్గా చాలా పేర్లు పరిశీలించినప్పటికి ‘దిల్’ రాజు టీమ్ పూజా హెగ్డే పేరునే ఫైనల్ చేసినట్టు సమాచారం. పైన చెప్పిన రెండు సినిమాల్లో పూజా నటిస్తే.. ‘దిల్’ రాజు సారథ్యంలో ఆమె త్రీ మూవీస్ చేసినట్లవుతుంది. ఒకేసారి రెండు సినిమాలకు ఓ హీరోయిన్ పేరుని పరిశీలిస్తున్నారంటే.. కచ్చితంగా అది ఆమెకు డబుల్ ధమాకానే. -
సంక్రాంతికి ‘సాక్ష్యం’ ఫస్ట్ లుక్
జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్షం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
దుబాయ్ లో ‘సాక్ష్యం’ షూటింగ్
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్, యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘సాక్ష్యం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ రామోజీ ఫీలిం సిటీలో, పొల్లాచిలో, వారణాసి, హోస్ పేటలో కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్ సీక్వెన్స్ ను పీటర్ హెయిన్స్ నేతృత్వంలో తెరకెక్కించిన చిత్ర బృందం తాజా షెడ్యూల్ దుబాయ్ లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘హైద్రాబాద్, పొల్లాచి, వారణాసి, హోస్ పేట వంటి ప్రాంతాల్లో భారీ క్యాస్టింగ్ తో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరిపాం. సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లు చాలా కీలకం అందుకే పీటర్ హెయిన్స్ మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు ఓ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నాం. అలాగే.. పూజా హెగ్డే, జయప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నాం. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. వేసవి కానుకగా ‘సాక్ష్యం’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం’ అన్నారు. -
సమాజసేవకి సీటీమార్!
సీటీమార్... సీటీమార్... సీటీమార్... ‘డీజే–దువ్వాడ జగన్నాథమ్’లోని ఈ పాట చూశారా? అందులోనూ, ఆ సినిమాలోనూ పూజా హెగ్డేను చూశారా? ఎంత అందంగా ఉంటుందో కదూ! ఈ మంగుళూరు బ్యూటీ అందానికి కుర్రకారు ‘సీటీమార్... సీటీమార్...’ అంటున్నారు. చూపులను మాత్రమే కాదు... మనసునూ కదిలించే అందం పూజాది! అందమైన ముఖం, శరీరాకృతి మాత్రమే కాదు... తనకు అందమైన మనసూ ఉందని నిరూపించుకుంటున్నారీ సుందరి. మొన్నే అక్టోబరులో క్యాన్సర్ను జయించే చిన్నారుల మధ్య తన పుట్టినరోజును జరుపుకున్నారు పూజా హెగ్డే. వాళ్లతో కొంతసేపు గడిపి ధైర్యం నింపారు. అంతే కాదు... వీలు చిక్కినప్పుడల్లా సమాజ సేవ చేస్తున్నారు. ఇటీవల బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సాక్ష్యం’ చిత్రీకరణ కోసం హోస్పేట్ వెళ్లారు పూజ. అక్కడ షెడ్యూల్ పూర్తయిన తర్వాత వందమంది చిన్నారులకు పుస్తకాలు, ఫుడ్ ఐటమ్స్ పంచిపెట్టారు. పూజ అందంతో పాటు ఆమె చేస్తున్న సమాజసేవకీ సీటీమార్ అనాలనిపిస్తోంది కదూ!! -
హోస్పేట్లో డిష్యుం డిష్యుం
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి కీలక షెడ్యూల్ బళ్లారి జిల్లా హోస్పేట్లో జరిగింది. అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘కర్ణాటకలోని హోస్పేట్లో మైన్స్ బ్యాక్డ్రాప్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ తీశాం. 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో 15 రోజులు ఏకధాటిగా చిత్రీకరించిన ఈ షెడ్యూల్లో శ్రీనివాస్తోపాటు పూజా హెగ్డే, కీలకపాత్రధారులు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్తో 70 శాతం షూటింగ్ పూర్తయింది. ‘సాక్ష్యం’ లోని యాక్షన్ ఎపిసోడ్స్ తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తాయనే నమ్మకం ఉంది. శ్రీనివాస్ డూప్ లేకుండా చాలా కష్టపడి చేశాడు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ. విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: దేవిశ్రీప్రసాద్. -
‘సాక్ష్యం’ మోషన్ పోస్టర్ లాంచ్