ఎన్జీటీలో రాష్ట్ర ప్రభుత్వ వాదన
సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన 120 ఏళ్ల చరిత్రలో అమరావతి ప్రాంతం కృష్ణా జలాలతో ముంపునకు గురైన దాఖలా లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరద ముప్పు ఉందని దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ సోమవారం చేపట్టింది.
ప్రతివాది అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ తన వాదనలు వినిపిస్తూ... .కృష్ణా నదీ జలాలతో అమరావతికి వరద ముప్పు ఉండదని పేర్కొన్నారు. తదుపరి వాదనలను మంగళవారం వింటామని చెబుతూ ధర్మాసనం విచారణను వాయిదావేసింది.
120 ఏళ్లలో అమరావతికి వరద ముప్పు లేదు
Published Tue, Apr 18 2017 1:35 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement
Advertisement