జమ్ముకశ్మీర్లో వరదలు: ఇద్దరి మృతి | 2 children killed, 9 injured in flash floods after cloudburst in Jammu and Kashmir's Baltal on Friday evening | Sakshi

జమ్ముకశ్మీర్లో వరదలు: ఇద్దరి మృతి

Published Sat, Jul 25 2015 7:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

జమ్మూ కశ్మీర్ బల్తార్లో భారీ వర్షాలు, వరదలకు ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో 9 మందికి గాయాలయ్యాయి.

బల్తార్: జమ్మూ కశ్మీర్ బల్తార్లో భారీ వర్షాలు, వరదలకు ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో 9 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 13 ఏళ్ల బాలిక, 12 ఏళ్ల బాలుడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో 11 మంది అచూకీ లభించాల్సి ఉందని చెప్పారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు శ్రీనగర్-లడక్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. అమర్నాథ్ యాత్రికులు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే అమర్నాథ్కు వెళ్తున్న 780 మంది యాత్రకులని ఆర్మీక్యాంపుకు తరలించామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement