'రన్నింగ్ కామెంటరీలకు చెక్ పెట్టాలి' | BJP MP demands ban on running commentaries by judges during hearings | Sakshi
Sakshi News home page

'రన్నింగ్ కామెంటరీలకు చెక్ పెట్టాలి'

Published Mon, Apr 25 2016 7:23 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

'రన్నింగ్ కామెంటరీలకు చెక్ పెట్టాలి' - Sakshi

'రన్నింగ్ కామెంటరీలకు చెక్ పెట్టాలి'

న్యాయమూర్తులు రన్నింగ్ కామెంటరీలు చేయకుండా నిషేధం విధించాలని బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: న్యాయమూర్తులు రన్నింగ్ కామెంటరీలు చేయకుండా నిషేధం విధించాలని బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ డిమాండ్ చేశారు. లోక్ సభలో సోమవారం జీరో అవర్ లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. విచారణ సమయాల్లో జడ్జిలు రన్నింగ్ కామెంటరీలు చేయకుండా చూడాలని అన్నారు. విధాన నిర్ణేతలను పశ్నించే అధికారం కోర్టులకు లేదని, చట్టాలు చేయడం పార్లమెంట్ విధి అని చెప్పారు.

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తప్పుబడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనీ డిమాండ్ చేశారు. 'పార్లమెంట్, స్పీకర్ తో పాటు రాష్ట్రపతిపై కూడా జడ్జిలు కామెంట్లు చేస్తుండడం మనం చూస్తున్నాం. ఇకపై అలా జరగడానికి వీల్లేదు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. వారు సంయమనం పాటించాలి' అని మేఘవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement