అమానుషం : క్యాన్సర్‌ పేషంట్‌ను చితకబాదిన సిబ్బంది | In UP Cancer Patient Beaten By Staff For Using Staff Toilet | Sakshi
Sakshi News home page

ముగ్గుర్ని సస్పెండ్‌ చేసిన అధికారులు

Feb 22 2019 12:39 PM | Updated on Feb 22 2019 12:45 PM

In UP Cancer Patient Beaten By Staff For Using Staff Toilet - Sakshi

లక్నో : అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల పట్ల సానుభూతి చూపాల్సింది పోయి వారిని చితక్కొట్టారు ఆస్పత్రి సిబ్బంది. స్టాఫ్‌ టాయిలెట్స్‌ వాడినందుకు గాను క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళను దారుణంగా అవమానించడమే కాక ఆమె కుమారుడి మీద కూడా దాచి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో జరిగిందీ దారుణం. స్టాఫ్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందన్న కారణంతో ఓ క్యాన్సర్ పేషెంట్‌ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడమే కాక ఆమె కొడుకుపై కూడా దాడికి పాల్పడ్డారు సదరు ఆస్పత్రి సిబ్బంది.

గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ దాడి ఘటనపై ఔట్ పేషెంట్ ఇన్‌చార్జి ప్రొ.మనీష్ బాజ్‌పాయి సీరియస్ అయ్యారు. యువకుడిపై దాడి చేసిన ముగ్గురు సిబ్బందిని గుర్తించి.. వారిని విధుల నుంచి తొలగించారు. ఇక మీదట ఇలాంటి గొడవలు జరగకుండా చూస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement