Toilet
-
లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే(Indian Railways)లో విధులు నిర్వహిస్తున్న లోకో పైలట్లు తమకు డ్యూటీ సమయంలో భోజనం చేయడానికి, టాయిలెట్కు విరామ సమయం కావాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా లోకో పైలట్ల వినతిని రైల్వేశాఖ తిరస్కరించింది. దీంతో లోకో పైలట్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని బహుళ-విభాగాల కమిటీ సిఫార్సుల ఆధారంగా తీసుకుంది.రైల్వే బోర్డుకు చెందిన ఐదుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) సభ్యుల కమిటీ లోకో పైలట్లకు విరామం ఇవ్వాలనే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కమిటీ 2024, జూలైలో ఏర్పాటయ్యింది. లోకో పైలట్లు, గార్డుల ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలించింది. కాగా ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్(All India Loco Running Staff Association) (ఏఐఎల్ఆర్ఎస్ఏ) సెక్రటరీ-జనరల్ కేసీ జేమ్స్, రైల్వే బోర్డు ఛైర్మన్/సీఈఓకు రాసిన ఒక లేఖలో ఈ కమిటీ రైలు వేగాన్ని 110 కిమీ/గం నుండి 130 కిమీ/గం వరకు పెంచిందని, ఫలితంగా లోకో పైలట్లపై పెరిగే ఒత్తిడి స్థాయిని అంచనా వేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. లోకోమోటివ్లలో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం లోకో పైలట్లకు ఇబ్బందికరంగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం లోకో పైలట్ల ఆరోగ్యం, రైళ్ల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.కాగా రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ రైళ్ల షెడ్యూల్ను నిర్వహించడం, ఆలస్యాలను నివారించడం కోసం ఈ చర్యలు తప్పనిసరి అని పేర్కొంది. లోకోమోటివ్లలో టాయిలెట్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం లేదా డ్యూటీ సమయంలో విరామాలను అనుమతించడం వల్ల రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతుందని బోర్డు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఏఐఎల్ఆర్ఎస్ఏ తీవ్రంగా ఖండించింది. లోకో పైలట్ల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రైల్వేలో 41,000 మందికి పైగా లోకో పైలట్లు ఉన్నారు. వీరిలో 1,828 మంది మహిళా లోకో పైలట్లు.ఇది కూడా చదవండి: Delhi: సీఎంకు ‘శీష్ మహల్’ అడ్డంకి.. దక్కని అధికార నివాసం -
ఢిల్లీలోని మురికివాడల కంటే.. శీష్ మహల్లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువ: అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు. మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను పట్టించుకోకుండా, ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ ‘ఆపద’ప్రభుత్వం అడ్డంకిగా మారిందన్నారు. గత పదేళ్లుగా ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని చెప్పారు. కనీసం తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ వసతులు కూడా లేని మురికివాడలు చెత్తకుప్పల్లా మారాయని చెప్పారు. సుమారు 5.25 లక్షల మంది ఢిల్లీ విద్యార్థులకు పాఠశాల విద్య అందడం లేదంటూ కేజ్రీవాల్ను నిలదీశారు. -
వసతులు కను‘మరుగు’
రామారెడ్డి: హైస్కూల్లో 105 మంది, ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులు, అదే పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రంలో 20 మంది చిన్నారులు ఉన్నారు. ఈ మూడు పాఠశాలల ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది మొత్తం 20 మంది వరకు ఉంటారు. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి.. ఇక ఇంతమందికి ఎంత ఇబ్బందో అర్థం చేసుకోవలసిందే. విద్యార్థినులు ఒక సమయంలో, విద్యార్థులు మరో సమయంలో మరుగు దొడ్డికి వరుస కట్టి వెళ్తున్నారు. జిల్లాలో హై స్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఒకే చోట ఉన్న ఏకైక గిరిజన పాఠశాల కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తండాలో ఉంది. ఈ గిరిజన పాఠశాలలో మరుగుదొడ్డి సమస్యతో పాటు తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. తాత్కాలికంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులోనే బోధన సాగుతోంది. కొన్ని తరగతులు చెట్టు కిందే నడుస్తున్నాయి. -
ప్రభుత్వ ఆస్పత్రి టాయిలెట్లో పెన్ కెమెరా
అన్నానగర్: కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని మహిళా మరుగుదొడ్డిలో కెమెరా పెట్టిన వైద్యుడిని సస్పెండ్ చేస్తూ ఆస్పత్రి డీన్ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీపంలోని పనమరతుపట్టికి చెందిన వెంకటేషన్(33) కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ కోసం వెంకటేషన్ గత నెల 16న పొల్లాచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ మహిళల వాష్ రూమ్ల పెన్ కెమెరా ను అమర్చాడు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన నర్సింగ్ విద్యార్థిని పబ్లిక్ టాయిలెట్ వద్దకు వెళ్లింది. అక్కడ దాచిన పెన్ను కెమెరాకు రబ్బరు బ్యాండ్ చుట్టిన టాయిలెట్ బ్రష్ కనిపించింది. దిగ్భ్రాంతితో పెన్ను కెమెరాతో బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో నిలబడిన వెంకటేషన్ వివరణ కోరింది. ఆపై ఆ పెన్ను కెమెరాను తీసుకుని విచారిస్తానని చెప్పి ఆమెని పంపించి వేశాడు. వెంకటేషన్ మరుసటి రోజు పనికి వెళ్లలేదు. దీంతో విద్యార్థిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజా వద్ద సమాచారం అందించింది. వెంటనే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కెమెరా రికార్డులను పరిశీలించినప్పుడు వెంకటేషన్ ఆ మరుగుదొడ్డికి వెళ్లడం రికార్డు అయ్యింది.ఆ తర్వాత అతడిని పిలిపించి విచారించగా సీక్రెట్ కెమెరా పెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీంతో సూపరింటెండెంట్ రాజా పొల్లాచ్చి ఈస్ట్ పోలీస్ స్టేష¯న్లో ఫిర్యాదు చేశారు. స్పెషల్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేసి వెంకటేశన్ను అరెస్టు చేశారు. అతని గదిలోని సెల్ఫోన్ మెమొరీ కార్డును స్వా«దీనం చేసుకున్నారు. ఈ పరిస్థితిలో కోయంబత్తూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్ నిర్మలా బుధవారం విధుల నుంచి వెంకటేశన్ను సస్పెండ్ చేశారు. -
ఈ బాధలు ఎప్పటికీ తీరేను.. పాలకులు పట్టించుకోరా?
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ జరుపుకుంటున్నా నేటికీ ప్రపంచంలో 350 కోట్ల ప్రజలకు టాయిలెట్ (మరుగుదొడ్డి) సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. టాయిలెట్ సౌకర్యలేమి కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, బాలికలు... తీవ్రమైన మానసిక, ఆరోగ్య, సామాజిక సమస్యలకు గురవుతున్నారు. అనేక పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర పని ప్రదేశాల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు, మంచినీటి సౌకర్యం వంటివి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 41.9 కోట్లమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారనీ, సుమారు 220 కోట్లమంది ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదనీ, 11.5 కోట్లమంది కుంటలూ, చెరువులు, బావులు వంటి వాటిలోని సురక్షితం కాని నీరు తాగుతున్నారనీ గణాంకాలు చెబుతున్నాయి. సరైన మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో ప్రతిరోజూ వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక మన భారతదేశంలో 2019–21లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం 69.3 శాతం మంది మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేటికీ 19.4 శాతం మంది మనదేశంలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. 2014 అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్‘ ప్రారంభించినా నేటికీ అందరికీ టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు.చదవండి: మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!మనదేశం త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఆవిర్భవించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. కనీసం ప్రజలందరికీ టాయిలెట్ సౌకర్యం కల్పించకుండా ఇది సాధ్యంకాదు. అందుకే ప్రభుత్వాలు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.– ఐ. ప్రసాదరావు; ఉపాధ్యాయుడు, కాకినాడ (నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం) -
139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల
జగిత్యాల రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 77 మంది విద్యార్థులున్నారు. వీరిలో 37 మంది బాలికలు, 40 మంది బాలురు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థుల్లో 36 మంది బాలికలు, 26 మంది బాలురు ఉన్నారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. వాటి స్థానంలో ఉపాధి హామీ కింద పాఠశాలకు ఒకటి చొప్పున రెండు మూత్రశాలల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతుండగానే జిల్లా అధికారులు నిధులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి రెండు పాఠశాలల్లో ఉన్న మొత్తం 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల గతి అయ్యింది. బహిర్భూమికి విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలకు టీసీలు ఇస్తే పాఠశాల ఎలా నడిపేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
స్కూళ్ల మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయాల్సిందే
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, వార్డు ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ప్రతి వారం వారి పరిధిలోని స్కూళ్లలో మరుగుదొడ్లను పరిశీలించి, ఆ ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ప్రతి సోమవారం, గురువారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను సందర్శించి అక్కడి మరుగుదొడ్లు, యూరినల్స్ గదుల్లో శుభ్రతకు సంబంధించిన ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతను సచివాలయాల ఉద్యోగులకు అప్పగిస్తూ ప్రభుత్వం గత 16న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధులకు చాలాచోట్ల ఆ ఉద్యోగులు హాజరు కావడం లేదన్న సమాచారంతో గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం కూడా ఈ మేరకు అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లోని సెక్రటరీలకు వ్యక్తిగతంగా మెసేజ్ రూపంలో ఈ సమాచారం మరోసారి పంపారు. -
129 మందికి ఒకటే మరుగుదొడ్డి
రాయికల్(జగిత్యాల): ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 129 మంది విద్యార్థులు.. కానీ ఇంతమందికి ఒక్కటే మరుగుదొడ్డి.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్లోని గడికోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 129 మంది చదువుకుంటున్నారు. వీరిలో బాలికలు 65 మంది, బాలురు 64 మంది ఉన్నారు.అందరికీ కలిపి ఒకే మరుగుదొడ్డి ఉండటంతో.. దానిని 65 మంది బాలికలు రోజూ క్యూలో నిలబడి వినియోగించుకోవలసి వస్తోంది. బాలురు ఆరుబయటే మూత్రవిసర్జన చేస్తున్నారు. పాఠశాలలో బెంచీలు లేకపోవడంతో నేలపైనే కూర్చుంటున్నారు. తరగతి గదులు కూడా సరిపడా లేవు. ఎమ్మెల్యే సంజయ్కుమా ర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించి యుద్ధప్రతిపాదికన మరుగుదొడ్లు, బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీని వాస్ మాట్లాడుతూ.. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, సమస్య ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని స్పష్టం చేశారు. -
మూత్రం నుంచి విద్యుత్
పాలక్కడ్: కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై ప్రపంచం దృష్టిపెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటీ పాలక్కడ్ పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ ‘సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్(ఈఆర్ఆర్ఆర్)ను తయారుచేశారు. ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రోరసాయనిక చర్యల ద్వారా విద్యుత్ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు. ఈ విద్యుత్తో స్మార్ట్ఫోన్లును చార్జ్చేయొచ్చు. విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్ స్కాలర్ వి.సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పీఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోషీల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈఆర్ఆర్ఆర్ ద్వారా నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే సహజ ఎరువునూ పొందొచ్చని ఐఐటీ పాలక్కడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమ్మోనియా సంగ్రహణి, క్లోరినేషన్ గది, ఎలక్ట్రికల్ గొట్టాల సమన్వయంతో ఈ రియాక్టర్ పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియంను ఆనోడ్గా, గాలి కార్భన్ను కాథోడ్గా వాడతారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లో మూత్ర విసర్జన ఎక్కువ. ఇలాంటి చోట్ల ఈ రియాక్టర్ల ద్వారా ఎక్కువ స్థాయిలో విద్యుత్ను ఉత్పత్తిచేసి అక్కడి విద్యుత్దీపాలను వెలిగించవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉందని ఐఐటీ పాలక్కడ్ స్పష్టంచేసింది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం బృందం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రమే నిధులిచ్చింది. -
స్పైస్జెట్ విమానం టాయిలెట్లో చిక్కుకున్న ప్రయాణికుడు
ముంబయి: స్పైస్జెట్ విమానం టాయిలెట్స్లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు నరకయాతన అనుభవించాడు. ముంబయి నుంచి బెంగళూరు వరకు వెళ్లే స్పైస్జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన దగ్గర నుంచి బెంగళూరులో ల్యాండ్ అయ్యేవరకు గంటకుపైగా టాయిలెట్లోనే ఉండిపోయాడు. విమానం ముంబయిలో టేకాఫ్ అయ్యాక ఓ వ్యక్తి టాయిలెట్స్కి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో టాయిలెట్స్ డోర్ లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. క్రూ సిబ్బంది అతనికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. తీరా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక.. ఇంజినీర్ వచ్చి డోర్ ఓపెన్ చేసేవరకు బాధిత వ్యక్తి టాయిలెట్స్లోనే ఉండిపోయాడు. The note from the crew to the passenger locked on #Spicejet flight. #Avgeek #Aviation pic.twitter.com/pPrvXq8mJm — Aman Gulati 🇮🇳 (@iam_amangulati) January 17, 2024 "జనవరి 16న ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో దురదృష్టవశాత్తూ ఒక ప్రయాణికుడు సుమారు గంటసేపు టాయిలెట్స్లో చిక్కుకుపోయాడు. డోర్ లాక్ లోపం కారణంగా విమానం గాలిలో ప్రయాణించింది. ప్రయాణమంతా మా సిబ్బంది ఆ ప్రయాణికునికి మార్గనిర్దేశం చేశారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం." అని స్పైస్జెట్ తెలిపింది. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
Video: పాఠశాల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం.. నెలలో మూడో ఘటన
బెంగళూరు: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు వారితో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిందిపోయి పని పిల్లలుగా మార్చుతున్నారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులు.. విద్యార్థులతో టాయిలెట్స్ కడిగించారు.కర్ణాటకలోని శివమొగ్గలో విద్యార్ధులతోటి బలవంతంగా టాయిలెట్లను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన విద్యార్ధులు బ్రష్లు చేతబట్టి బాత్రూమ్లు శుభ్రం చేయడం కనిపిస్తుంది. కాగా శివమొగ్గ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప సొంత జిల్లా. మంత్రి బుధశారం రాత్రి చిన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలవ్వలేదు. ఇప్పటి వరకు ఆయన జిల్లాలో జరిగిన ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి నివేదిక అందించారు. ఈ షాకింగ్ ఘటన గత వారం జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ వివరణ ఇస్తూ.. విద్యార్థులను కేవలం టాయిలెట్లో నీళ్లు సరిగా పోయమని మాత్రమే చెప్పానని, క్లీన్ చేయమని ఆదేశించలేదని చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో విద్యార్ధులు బాత్రూమ్లు కడగడం వంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇది మూడోసారి. గత వారం రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా టాయిలెట్లను శుభ్రం చేస్తూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కార్యకర్తలు నగరంలోని ఆండ్రహళ్లి ప్రాంతంలోని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతం విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి విద్యార్థులు టాయిలెట్లు క్లీన్ చేయడంపై సీరియస్ అయ్యారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. చదవండి: ‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్ Shocker from Karnataka | Students found cleaning toilet in a school in Shivamogga pic.twitter.com/iZhe66gNRC — NDTV (@ndtv) December 28, 2023 -
బీజేపీ వీడియోతో డీఎంకే ఎదురుదాడి
చెన్నై: హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారంటూ మార్చి నెలలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యల వీడియోపై బీజేపీ దుమ్మెతిపోస్తుండటంతో డీఎంకే ఘాటుగా స్పందించింది. దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యల వీడియోను తెరమీదకు తెచి్చంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ‘నల్లని మనుషులు’ అంటూ బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యల పాత వీడియోను డీఎంకే తాజాగా షేర్ చేసి దీనిపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించింది. 2017 సంవత్సరంలో అల్ జజీరా టీవీ చానల్లో చర్చా కార్యక్రమంలో తరుణ్ చేసిన వ్యాఖ్యలు ఆనాడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ‘‘ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు నిజంగానే జాతి వివక్ష చూపే అవలక్షణమే ఉంటే మాకు మొత్తం దక్షిణాదితో అవసరమేముంది?. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. ఇలా ఈ రాష్ట్రాల ప్రజలతో ఎందుకు కలిసి మెలిసి ఉంటాం?. మా చుట్టూ మొత్తం నలుపు మనుషులే ఉన్నారు’’ అని తరుణ్ విజయ్ మాట్లాడిన వీడియోను డీఎంకే ఐటీ విభాగం షేర్ చేసింది. ‘‘యూపీ, బిహార్ ప్రజలు ఇంగ్లి‹Ùను గాలికొదిలి హిందీని పట్టుకుని వేలాడి తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు’’ అని డీఎంకే నేత దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా దేశవ్యాప్తంగా వివాదం రేపడం తెలిసిందే. -
హిందీ మాట్లాడేవాళ్లు... టాయిలెట్లు కడుగుతున్నారు
చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. -
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్కీ బాత్లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్మిల్లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?
దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఐదు నెలల బాలుని విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన ఒక ముస్లిం కుటుంబానికి రైలులోని టాయిలెట్లో ఒక పసిబాలుడు కనిపించాడు. వారు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు ఆ చిన్నారి సంబంధీకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. డెహ్రాడూన్లోని జీఎంఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఫర్నిచర్ వ్యాపారి ఫయాజ్ అహ్మద్ కుటుంబం ఆదివారం జ్వాలాపూర్ నుంచి డెహ్రాడూన్కు రైలులో తిరిగి వస్తోంది. ఈ నేపధ్యంలో ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళకు టాయిలెట్లో ఐదు నెలల బాలుడు కనిపించాడు. దీంతో ఆ మహిళ కోచ్లోని వారందరికీ ఈ విషయాన్ని తెలిపింది. వారెవరూ ఆ బాలుడు తమకు చెందినవాడు కాదని స్పష్టం చేశారు. ఇంతలో డెహ్రాడూన్ స్టేషన్ వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడిని తమ ఇంటికి తీసుకువచ్చారు. ముందుగా ఆ బాలునికి వైద్య చికిత్స అందించారు. తరువాత ఇందిరానగర్ పోలీస్ పోస్ట్లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారి సంబంధీకుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చిన్నారిని పెంచే బాధ్యతను అధికారులు తమకు అప్పగిస్తే అందుకు తాను సిద్ధమేనని ఫయాజ్ తెలిపారు. కాగా ఆ చిన్నారికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది కూడా చదవండి: ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం! -
ఫ్లోర్లు ఊడ్చా..టాయ్లెట్లు క్లీన్ చేశా...కానీ: హీరోయిన్
జీవితంలో అనుకున్నది సాధించాలంటే..అనేక కష్టనష్టాల్ని భరించాలి. ఆటుపోట్లను తట్టుకుని రాటు దేలాలి. అపుడు మాత్రమే అందరికంటే మిన్నగా, ఉన్నతంగా నిలుస్తాం. అందులోనూ సినీ పరిశ్రమలో మహిళలు రాణించాలంటే మరింత కష్టపడాలి. దేశం ఏదేనా.. ప్రాంతం ఏదైనా సినీ హీరోయిన్లకు ఇదే పరిస్థితి...! మహీరా ఖాన్ పాకిస్తాన్లో పాపులర్ హీరోయిన్, అత్యధిక పారితోషికం తీసుకునే నటి.'ఖిరాద్'టీవీ సీరియల్తో పాటు, ఫవాద్ ఖాన్తో నటించిన హమ్ సఫర్తో మరింత పాపులరయ్యారు. 2017లో మహిరా షారుఖ్ ఖాన్ సరసన నటించిన రయీస్ అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇటీవలే వ్యాపారవేత్త సలీం కరీమ్తో రెండో వాహం చేసుకుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతోపాటు మహిరా ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, పైకి ఎదగడానికి పడిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్లో ఒకానొక సమయంలో ఫ్లోర్లు ఊడ్చి, టాయిలెట్లను శుభ్రం చేశానని గతంలో ఒక మ్యాగజైన్ ఇచ్చిన గుర్తు చేసుకున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, జీవనం సాగించానని చెప్పుకొచ్చారు. లాస్ ఏంజిల్స్లో ఉంటున్నప్పుడు టాయిలెట్లను శుభ్రం చేయడం, ఫ్లోర్లను శుభ్రం చేయడం లాంటివి చేశానన్నారు. నిజానికి చేతిలో ఒక్క డాలర్ కూడా లేని టైంలో ఉన్న కొద్ది పాటి భోజనాన్ని సోదరుడితో కలిసి సర్దుకున్న వైనాన్ని వివరించారు. బైపోలార్ డిజార్డర్తో బాధపడ్డా సెలబ్రిటీ జీవితంలో కఠినమైన విమర్శలు ఎంత అనివార్యమైన భాగమని పేర్కొన్నారు. తాను కూడా బైపోలార్ డిజార్డర్ అనే 'మానిక్ డిప్రెషన్'తో పోరాడినట్లు వెల్లడించారు. ముఖ్యంగా "రయీస్" చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ఇటీవల వెల్లడించారు. దాదాపు ఆరేడు సంవత్సారలు యాంటి డిప్రెసెంట్స్తో మేనేజ్చేసినట్టు తెలిపారు. .తన ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి రావడం తనకు చాలా గొప్ప విషయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. జీవితంలో చాలాసార్లు ఓడిపోతాం.. కానీ ఆశాభావంతో ముందుకు సాగాలి. తన జీవితంలో కూడా చాలా కష్టమైన పీరియడ్ ఒకటుందని అందరికీ తెలియాలనే తానే విషయాలన్నీ షేర్ చేస్తున్నాన్నారు సలీం కరీమ్తో మహిరా ఖాన్ రెండో వివాహం ఈ ఏడాదిల అక్టోబర్ 2 మహీరా ఖాన్ , తన చిరకాల మిత్రుడు సలీం కరీంని రెండో వివాహం చేసుకుంది. అయితే అంతకు ముందు 17 ఏళ్ల వయసులో అలీ అక్సారిని పెళ్లాడింది. అజ్లాన్ అనే కుమారుడున్నాడు. అయితే 2015లో కొన్ని అనివార్య కారణాలతో ఈ జంట విడిపోయింది. అటు అలీ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. -
కోట్ల ఆస్తులు.. టాయిలెట్స్ శుభ్రం చేసిన షారుక్ హీరోయిన్!
బాలీవుడ్లో చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తారలు ఉన్నారు. వారిలో చాలామంది స్టార్ హీరోయిన్స్గా ఎదిగారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణించింది. అయితే అలాగే పాకిస్థాన్కు చెందిన ప్రముఖ నటి సైతం షారుక్ సరసన ఎంట్రీ ఇచ్చింది. 2017లో వచ్చిన రయీస్ చిత్రంలో బాద్షాతో కలిసి రొమాన్స్ చేసింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న భామకు ఓ పాప కూడా ఉంది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె పరిస్థితి ఏంటి? బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? అనే పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఇంతకీ ఆమెవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. పాకిస్థానీ ప్రముఖ నటి మహిరా ఖాన్ బీ టౌన్లో పరిచయం అవసరం లేని పేరు. ఆమెకు పాకిస్థాన్లోనే కాకుండా భారత్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహిరా ఖాన్ 2006లో వీజేగా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తరువాత ప్రముఖ పాకిస్థానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ దర్శకత్వం వహించిన బోల్ చిత్రంలో నటించింది. టీవీ షో హమ్సఫర్లో ఆమె పాత్రకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత 2017లో నటి రయీస్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. రాహుల్ ధోలాకియా తెరకెక్కించిన ఈ చిత్ ద్వారా అరంగేట్రం చేసింది. ఈ మూవీలో షారుక్, మహిరా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పాత్రకు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ కమర్షియల్గా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.281.45 కోట్లు వసూలు చేసింది. అయితే మహీరా ఖాన్ తన చదువుల కోసం 17 సంవత్సరాల వయస్సులో యూఎస్లోని కాలిఫోర్నియాకు వెళ్లింది. అక్కడ తన వ్యక్తిగత ఖర్చుల కోసం మహిరా ఖాన్ టాయిలెట్లను శుభ్రం చేయడం, ఇళ్లు తుడవడం లాంటి పనులు చేసింది. ఆ తర్వాత నటి లాస్ ఏంజిల్స్లోని ఓ దుకాణంలో క్యాషియర్గా ఉద్యోగంలో చేరింది. ఈ విషయాన్ని 2021లో ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచెప్పింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. మహిరా ఖాన్ మాట్లాడుతూ..'నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు కూడా చూశా. ప్రజల కోసం నా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నా. నేను లాస్ఎంజిల్స్లో ఉన్న సమయంలో ఫ్లోర్లు, టాయిలెట్లను కూడా శుభ్రం చేశా. ఇప్పుడు మీరు నన్ను చాలా గౌరవిస్తారు. ఒక సమయంలో రెస్టారెంట్కు వెళ్లి నేను, నా సోదరుడు కలిసి ఒక భోజనాన్ని ఇద్దరం తినేవాళ్లం. నా జీవితంలో ఇలాంటి అనుభవాలను బయటికి చెప్పకుండా ఉండలేను." అని అన్నారు. కాగా.. ప్రస్తుతం మహీరా ఖాన్ పాకిస్తాన్లో అత్యంత ధనిక నటిగా నిలిచింది. పాకిస్తాన్లో కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 3 నుండి 5 లక్షల భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 58 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. జో బచాయ్ హైన్ సాంగ్ సమైత్ లో పేరుతో రాబోయే పాకిస్తాన్ మొదటి ఒరిజినల్ నెట్ఫ్లిక్స్ సిరీస్ కోసం మహిరా ఖాన్ ఫవాద్ ఖాన్తో జతకట్టనుంది. -
టాయిలెట్కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య!
రోడ్ ట్రిప్లంటే చాలామంది అమితమైన ఇష్టాన్ని చూపిస్తుంటారు. కుటుంబ సమేతంగా కారులో కూర్చుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడమంటే చాలామందికి ఇష్టం. ఓ భార్యాభర్తల జంట ఇలానే రోడ్ ట్రిప్కు బయలుదేరింది. కానీ భర్త చేసిన పొరపాటు కారణంగా భార్య నానా అవస్థలు పడింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు ప్రయాణంలో భర్త టాయిలెట్ కోసం కారు దిగాడు. పావుగంట తరువాత తిరిగి కారును స్టార్ట్ చేశాడు. అయితే ఆ సమయంలో కారులో తన భార్య లేదన్న విషయాన్ని అతను గమనించలేదు. ఆమె కారులో నిద్రపోతున్నదని అనుకున్నాడు. అయితే కొద్దిసేపటి తరువాత కారు వెనుక సీటులోకి చూశాడు. అక్కడ భార్య లేదు. అతను తన పొరపాటు తెలుసుకునే సరికే 160 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. భర్త పేరు బ్రూనో టామ్చామ్ (55), భార్య పేరు అమ్నుయ్ టామ్చామ్ (49). ఇద్దరూ థాయిలాండ్కు చెందినవారు. ఇద్దరూ తెల్లవారుజామున మూడు గంటలకు మహాసర్ఖా ప్రావిన్స్కు బయలుదేరారు. దారిలో బ్రూనో ఒక టాయిలెట్ కోసం దిగవలసి వచ్చింది. ఒక అడవికి సమీపంలో రోడ్డు పక్కగా కారును ఆపాడు. టాయిలెట్ ముగించి, తిరిగి కారులోకి వచ్చి కూర్చున్నాడు. అయితే బ్రూనో కారు దిగాక అతని భార్య కూడా కారు దిగి టాయిలెట్కు వెళ్లింది. అయితే అమ్నుయ్ తిరిగి వచ్చేసరికి, రోడ్డుపై కారు కనిపించలేదు. అమె దగ్గర డబ్బు, ఫోన్ కూడా లేవు. అవన్నీ కారులోనే ఉన్నాయి. దీంతో ఆమె ఎవరినైనా సాయం అడిగేందుకు ముందుకు నడక ప్రారంభించింది. దాదాపు 20 కిలోమీటర్ల దూరం నడిచాక తెల్లవారుజామున 5 గంటలకు అమ్నుయ్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. జరిగిన సంఘటనను పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు బ్రూనోకు పలుమార్లు కాల్ చేశారు. అతను కాల్ ఎత్తలేదు. ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. తరువాత పోలీసు స్టేషన్కు వెళ్లి, తన భార్యను కలుసుకున్నాడు. ఇది కూడా చదవండి: కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు -
మూత్రంతో తయారు చేసిన బీరు..ఎగబడుతున్న జనాలు!
బీరు అంటే మందుబాబులకు ఎంత ఇష్టం చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిదని చాలామంది దీన్నే ప్రిఫర్ చేస్తారు. అలాంటి బీరుని మూత్రంతోనా..ఛీ యాక్ అంటారేమో! అక్కడ సింగపూర్ జనాలు మాత్రం ఈ బీర్ చాలా రుచిగా ఉందని ఎగబడుతున్నారట. ఇలాంటి బీరు కావాలని అంటున్నారట. వాళ్లకి ఈ బీరు ఎలా తయారవ్వుతుందో తెలయదనుకోకండి. ఆ బీరుని ఉత్పత్తి చేసిన కంపెనీలు ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయట. పైగా పర్యావరణ హితం కోసంమే ఇదంతా చేస్తున్నారట సింగపూర్ అధికారులు! సింగపూర్ జాతీయ నీటి ఏజెన్సీ సహకారంతో న్యూబ్రూ అనే కంపెనీ మూత్రంతో బీరుని తయారు చేస్తుంది. అంతేగాదు సూపర్ మార్కెట్లో బ్రూవర్క్ట్జ్ అనే బ్రాండ్తో ఈ బీరుని విక్రయాలు జరుపుతుంది. జనాలు కూడా ఎగబడి కొంటున్నారట. పైగా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారట కూడా. అయినా కూడా జనాలు కొనడం విశేషం. మొదట్లో వాట్? అని ఆశ్చర్యపోయి.. చిరాకు పడ్డా ఆ తర్వాత ఈ బీరే చాలా టేస్టీగా ఉందని కొట్టుండడం విచిత్రం. ఎందుకిలా అంటే.. నీటి భ్రదతను మెరుగుపరిచేందుకు శుద్ది చేసే కర్మాగారాల సాయంతో ప్రవహించే మరుగునీటిని రీసైకిల్ చేసి తాగే 'నీవాటర్గా' మారుస్తారు. ఈ శుద్ది చేసిన మరుగునీటి వినియోగం, ప్రాముఖ్యతపై సింగపూర్వాసులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ సరికొత్త బీరును తయారుచేస్తున్నారట. తొలుత మరుగు నీటిని ప్రాసెస్ చేయాలనే ఆలోచన చాలామంది తిరస్కరించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మంచి నీటి వనరులు దారుణంగా క్షీణిస్తున్నాయని సర్వేలు తెలిపాయి. అలాగే ప్రపంచ వన్యప్రాణి నిధి అంచనా ప్రకారం 2.7 బిలియన్ల మంది ప్రజలు ఏడాదిలో ఒక నెలపాటు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈనేపథ్యంలోనే సింగపూర్ అధికారులు ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికారు. ఇప్పటికే సింగపూర్, ఇజ్రాయల్ వంటి దేశాలు మరుగునీటిని మంచి నీటిగా మార్చి వినియోగించే విధానాన్ని అమలు చేస్తున్నాయట. త్వరలో ఈ దేశాల సరసన యూఎస్ కూడా చేరనుందట. (చదవండి: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..) -
స్కూలు టాయిలెట్లో శిశు జననం.. మాయమైన తల్లి
రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలోగల కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజానికి తలవంపులు తెచ్చే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ రాత్రి వేళ ఒక పాఠశాల టాయిలెట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చి, అక్కడి నుంచి పరారయ్యింది. ఆ నవజాత శిశువు రాత్రంతా టాయిలెట్లో రోదిస్తూనే ఉంది. ఉదయం పాఠశాల తెరిచినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టాయిలెట్లోని నవజాత శిశువును చూసిన పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆ శిశువును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శిశువును ఉదయ్పూర్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ శిశువు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెత్కియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఓ గుర్తుతెలియని మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ మహిళ నవజాత శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఆ శిశువు రాత్రంతా టాయిలెట్లో ఏడుస్తూనే ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో చుట్టుపక్కల వారికి వెంటనే ఈ విషయం తెలియలేదు. మర్నాటి ఉదయం పాఠశాల తెరిచినప్పుడు టాయిలెట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో కొందరు విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అక్కడ రక్తంతో తడిసిన శిశువు ఏడుస్తుండటాన్ని వారు గమనించారు. వారు వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఈ విషయం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నవజాత శిశువును స్థానిక రిషభదేవ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం శిశువును ఉదయ్పూర్కు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఉదయ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపధ్యంలో గుర్తు తెలియని మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది? -
టాయిలెట్స్ శుభ్రం చేసేవాడిని.. సల్మాన్ కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్-2 ఓటీటీ సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా సాగిన రియాలిటీ షో సోమవారం ముగిసింది. ఈ సీజన్లో ఎల్విశ్ యాదవ్ విన్నర్గా నిలిచాడు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వచ్చిన ఎల్విశ్ యాదవ్ విన్నర్గా నిలవడం విశేషం. అయితే బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 గ్రాండ్ ఫినాలే సందర్భంగా సల్మాన్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మనం చేసే ఏ పని అయినా సరే అవమానంగా, చిన్నదిగా భావించకూడదని అన్నారు. (ఇది చదవండి: నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా) 'బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2'లో కంటెస్టెంట్స్లో ఒకరైన పూజా భట్ గ్రాండ్ ఫినాలే సమయంలో ఎలిమినేట్ అయిన మొదటి వ్యక్తి. ఈ సందర్భంగా సల్మాన్ ఆమెను ప్రశంసించారు. హౌస్లో ఆమె ఉన్నప్పుడు టాయిలెట్లు, వాష్రూమ్లను శుభ్రంగా ఉంచడం పట్ల పూజాను కొనియాడారు. ప్రపంచంలోని ఏ పనిని చిన్నదిగా భావించకూడదని హౌస్మేట్స్తో పాటు ప్రేక్షకులకు సలహా ఇచ్చారు. అంతేకాకుండా తాను జైలు, పాఠశాలలో టాయిలెట్స్ శుభ్రం చేశానని గుర్తు చేసుకున్నారు. 'బిగ్ బాస్' గత సీజన్లలోని కంటెస్టెంట్లకు గుణపాఠం చెప్పేందుకు తానే స్వయంగా హోస్లోకి ప్రవేశించి టాయిలెట్లను శుభ్రం చేయాల్సి వచ్చిందని సల్మాన్ గుర్తు చేసుకున్నాడు. 'బిగ్ బాస్' హౌస్లోని వాష్రూమ్స్ సీజన్లో పూజ శుభ్రం చేసినట్లు తానెప్పుడూ చూడలేదన్నారు. కాగా.. కృష్ణజింకలను వేటాడిన కేసుతో పాటు హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా బయటపడే వరకు సల్మాన్ చాలా రోజులు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: కుల విభేదాలకు కారణం రాజకీయ నాయకులే : నటుడు శరత్ కుమార్) బిగ్ బాస్ OTT 2 గ్రాండ్ ఫినాలే 'బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2' గ్రాండ్ ఫినాలే ట్రోఫీ కోసం అభిషేక్ మల్హాన్, ఎల్విష్ యాదవ్ పోటీలో నిలవగా చివరికి ఎల్విష్ యాదవ్ను విన్నర్గా ప్రకటించారు. ఈ రియాలిటీ షో చరిత్రలో ట్రోఫీని గెలుచుకున్న మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అతను నిలిచాడు. -
వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్
ఒకప్పుడు హీరోగా, విలన్గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ 2015 తర్వాత, అతను అకస్మాత్తుగా నటనకు స్వస్తి చెప్పి, తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్కు వెళ్లాడు. ఆయన రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ఇండియాలోనే ఉండనున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్ చేసుకున్నాడు ఎంతో మంది అవమానించారు 'నేను టాయిలెట్ క్లీనర్ను తాగమని ఆడగలేదు. బాత్రూంలో వాడండి అని చెప్పాను. టాయిలెట్ క్లీనర్ యాడ్లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్ చేశారు. నన్ను వెక్కిరిస్తూ చాలామంది కొన్ని వీడియోలు క్రియేట్ చేశారు. వాటి వల్ల నేను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అలాగని వాళ్లు చేస్తున్న విమర్శలకు బాధపడలేదు. పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించడం కోసమే నేను ఆ ప్రకటనలో నటించా. మీ ఇంటిని క్లీన్గా ఉంచడం, ఉంచకపోవడం మీ ఇష్టం. (ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్) ఆ యాడ్ చేస్తున్న సమయంలో నాకు అంత బిజీ పనులు ఏమీ లేవు. అందులో పనిచేసినందుకు వాళ్లు నాకు మంచి పారితోషికం ఇచ్చారు కూడా. మా మధ్య దాదాపు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్ కుదిరింది. అలా, వచ్చిన డబ్బుతో ఆ సమయంలో కుటుంబాన్ని పోషించా. కాబట్టి అందులో తప్పేముంది. నేను వృత్తులన్నింటినీ ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమే కష్టపడుతుంటారు' అని ఆయన తెలిపారు. రీ ఎంట్రీ ప్లాన్ న్యూజిలాండ్లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. ఇప్పుడు, నటన నుంచి తొమ్మిదేళ్ల విరామం తర్వాత, మళ్లీ నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో, అతను చివరిగా రామానుజన్ బయోపిక్లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. ఆయన ఇండియాలోనే స్థిరపడేందుకు ప్లాన్ చేసుకుంటన్నారని సమాచారం -
టాయిలెట్ కోసం వందే భారత్ రైలెక్కి.. ఇరుక్కుపోయిన వ్యక్తి..
ప్రస్తుతం దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ల కాలం నడుస్తోంది. వేగంగా ప్రయాణించగలిగే ప్రత్యేకత కలిగిన ఈ సెమీ హైస్పీడ్ రైలుకీ రోజురోజుకీ వీటికి ప్రజాదరణ పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. .అయితే రాళ్లు రువ్వడం, ఆవు, గేదేలు గుద్దుకొని రైలు దెబ్బతినడం వంటి విషయాలతో తరుచూ వందే భారత్ రైలు వివాదాల్లో నిలుస్తుంది. తాజాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది.. ఒక వ్యక్తి మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కినందుకు ఏకంగా రూ. 6 వేల మూల్యం చెల్లించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి హైదరాబాద్లో నివాసముంటూ డ్రైఫ్రూట్ బిజినెస్ చేస్తూంటాడు. ఇతనికి హైదరాబాద్తో పాటు సొంత ఊరైన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో షాపులున్నాయి. ఈ క్రమంలో జూలై 15న తన భార్య 8 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్ నుంచి భోపాల్కు వెళ్లాడు. అక్కడి నుంచి సొంతూరు సింగరౌలీకి రాత్రి 8.20కు రైలు ఎక్కాల్సి ఉంది. దీంతో స్టేషన్లోని ఫ్లాట్ఫాంపై వేచి ఉన్నారు.అయితే ఆ సమయంలో అబ్దుల్కు అర్జెంట్గా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఫ్లాట్ఫామ్పై ఉన్న ఇండోర్ వెళ్లే వందే భారత్ రైలులోని టాయిలెట్లోకి వెళ్లాడు. మూత్ర విసర్జన అనంతరం బయటకు రావడంతో.. అప్పటికే రైలు డోర్లు మూసుకుపోయి భోపాల్ స్టేషన్ నుంచి కదిలింది. చదవండి: ఎంత విషాదం.. జిమ్లో వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిన యువకుడు దీంతో ఆందోళన చెందిన అబ్దుల్, టీసీలు, కోచ్ల్లోని పోలీస్ సిబ్బందిని సంప్రదించి సాయం కోరాడు. అయితే ట్రైన్ డ్రైవర్ మాత్రమే డోర్స్ తెరిచేందుకు వీలు ఉంటుందని చెప్పడంతో అతడు డ్రైవర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. చివరకు టికెట్ లేకుండా రైలు ఎక్కినందుకు అబ్దుల్ రూ.1020 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తర్వాత స్టేషన్ ఉజ్జయినిలో రైలు ఆగిన తర్వాత దిగి.. భోపాల్కు రూ. 750 చెల్లించి బస్సులో వెళ్లాడు. మరోవైపు భోపాల్ రైల్వే స్టేషన్లో వేచి ఉన్న అబ్దుల్ భార్య, కుమారుడు సైతం ఈ విషయం తెలుసుకుని ఆందోళన చెంది సొంతూరు సింగ్రౌలీ వెళ్లే రైలు ఎక్కకుండా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో వారు బుక్ చేసిన రూ.4,000 విలువైన రిజర్వేషన్ టిక్కెట్లు వినియోగించకపోవడంతో వృథా అయ్యాయి. మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కిన అబ్దుల్ ఖాదిర్ ఈ విధంగా సుమారు రూ.6,000 మూల్యం చెల్లించుకున్నాడు. -
టాయిలెట్ల వెనక చాలా కథ ఉంది.. ఈ వింతలు, విశేషాలు తెలుసా? (ఫోటోలు)
-
శరీరంపై 800 టాటూలు.. అక్కడే చిక్కొచ్చి పడింది..!
టాటూ.. శరీరాన్ని మరింత అందంగా ఫ్యాషన్గా కనిపించేలా చేస్తుంది. అందరి కళ్లూ మనమీదే ఉండేలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ బ్రిటన్కు చెందిన ఓ మహిళకు మాత్రం టాటూలే తన పాలిట శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. దిక్కరింపులే ఎదురవుతున్నాయట. జీవనోపాధి కూడా లభించట్లేదట. ఎందుకంటే..? ఆమె పేరు మెలిస్సా స్లోన్(46) యూకేకు చెందిన మహిళ. ఇంతకు ముందు తనకు కనీసం టాయిలెట్ క్లీనింగ్ ఉద్యోగమైనా లభించేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఆమె తన శరీరంపై ఏకంగా 800 టాటూలను వేయించుకుంది. శరీరమంతా టాటూలతో నిండిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం ఇవ్వకుండా యజమానులు తిరస్కరిస్తున్నారట. మెలిస్సాకు తన 20వ ఏట నుంచి టాటూలను శరీరంపై వేయించుకునే అలవాటు ఉండేది. మొదట్లో ప్రతి వారం రెండు నుంచి మూడు టూటూలు వేయించుకుంటే.. ఇక రాను రాను పరిస్థితి మారిపోయింది. వాటికి అలవాటు పడి శరీరమంతా పచ్చబొట్లను పొడిపించుకుంది. దీంతో చూడటానికి ఇబ్బందికరంగా మారిపోయింది. మెలిస్సాకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. టూటూల కారణంగా శరీరం నీలం రంగులో మారిపోయిందని ఆమె చెబుతున్నారు. కానీ అవంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది. బహుశా ప్రపంచంలో తన కంటే ఎక్కువ టాటూలు ఎవరి శరీరంపై ఉండబోవని ఆమె అన్నారు. ఇదీ చదవండి: గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి.. -
ఇవేం టాయిలెట్లు... మీ ఇళ్లలో ఇలాగే ఉంటాయా
హుస్నాబాద్: టాయిలెట్లు కంపుకొడుతున్నాయి.. మీ ఇళ్లలో ఇలాగే ఉంటాయా అని కళాశాల అధ్యాపకులపై హుస్నాబాద్ సివిల్ కోర్టు జూనియర్ జడ్జి శివరంజని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, బాలుర జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లోని టాయిలెట్ల నిర్వహణపై శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని కళాశాలల్లో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నింటికి తాళాలు వేసి ఉండటం చూసి విస్మయం వ్యక్తం చేశారు. అధ్యాపకుల టాయిలెట్లు శుభ్రంగా ఉండి, విద్యార్థులవి అధ్వానంగా ఉండటంపై మండిపడ్డారు. కళాశాలకు ఇంకా విద్యార్థులు రావడం లేదని, అందుకే టాయిలెట్లు శుభ్రం చేయలేదని అధ్యాపకులు తెలిపారు. పిల్లలు వస్తేనే టాయిలెట్లు శుభ్రం చేస్తారా అని జడ్జి మందలించారు. కళాశాలలకు విద్యార్థులు వస్తేనే మీకు ఉద్యోగాలు ఉంటాయన్న విషమయం గుర్తుంచుకోవాలన్నారు. వారం రోజుల్లో మళ్లీ వస్తా, పరిస్థితి ఇలాగే ఉంటే హైకోర్టుకు రిపోర్టును పంపుతానని హెచ్చరించారు. ఎన్సాన్పల్లి రెసిడెన్షియల్ కళాశాలలో.. సిద్దిపేటఅర్బన్: మండలంలోని ఎన్సాన్పల్లి రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను సిద్దిపేట కోర్టు సీనియర్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్లను ఆమె పరిశీలించారు. వీటి పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు. -
స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు..! వయసేమో 11.. షాకైన టీచర్లు
సాధారణంగా మాటలు రాని చిన్నపిల్లలకు డైపర్లు వేస్తుంటారు. వారు టాయిలెట్ వచ్చేటప్పుడు చెప్పలేరనే భావనతో డైపర్లు వాడుతుంటారు. అయితే వారు పెరిగేకొద్దీ డైపర్ల వినియోగాన్ని మానేస్తారు. సాధారణంగా పిల్లలకు 3 లేదా 4 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడతారు. అలాగే ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా డైపర్లు వాడతారు. అయితే 11 ఏళ్ల పిల్లలు కూడా డైపర్లు వాడటాన్ని ఎక్కడైనా చూశారా? పిల్లలకు 2 లేదా మూడేళ్లు వచ్చేసరికి వారి తల్లిదండ్రులు వారికి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తుంటారు. అప్పటి నుంచి వారే స్వయంగా టాయిలెట్కు వెళుతుంటారు. అయితే దీనికి భిన్నంగా ఆ దేశంలోని పిల్లలు 11 లేదా 12 ఏళ్లు వచ్చినా ఇంకా డైపర్లు వాడుతూనే ఉన్నారు. డైపర్లు పెట్టుకునే స్కూలుకు వెళుతుంటారు. పెద్దపిల్లలు కూడా డైపర్లు పెట్టుకుని స్కూలుకు వెళ్లే దేశం స్విట్జర్లాండ్. ఈ దేశం ఎంతో అందమైనదిగా పేరుగాంచింది. అభివృద్ధి పరంగానూ వేగంగా ముందుకు సాగుతోంది. అయితే అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను డైపర్ల పెట్టి స్కూలుకు పంపుతుంటారు. ఇన్సైడర్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద వయసుకలిగి, అన్నిరకాలుగా ఆరోగ్యవంతుతైన పిల్లలు కూడా డైపర్లు ధరించి స్కూలుకు రావడాన్ని స్విట్జర్లాండ్ టీచర్లు గమనించారు. నాలుగేళ్లు దాటి, మాటలు వచ్చిన పిల్లలకు కూడా డైపర్లు పెట్టి, వారి తల్లిదండ్రులు స్కూలుకు పంపిస్తున్నారు. 11 ఏళ్ల పిల్లలు కూడా.. స్విట్జర్లాండ్కు చెందిన పిల్లల మానసిక వైద్య నిపుణులు రీటా మెస్మర్ మాట్లాడుతూ ఒక 11 ఏళ్ల బాలిక తన దగ్గరకు వచ్చిందని, తాను డైపర్ పెట్టుకుని స్కూలుకు వెళతానని తెలిపిందన్నారు. ఆ చిన్నారికి తల్లిదండ్రులు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వకపోవడంతోనే ఇలా జరుగుతున్నదన్నారు. స్విట్జర్లాండ్లోని చాలామంది పిల్లలకు టాయిలెట్ ఎలా వినియోగించాలో తెలియదన్నారు. పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా వారి తల్లిదండ్రులకు టైమ్ ఉండటం లేదన్నారు. టీచర్లు ఏమంటున్నారంటే.. స్విట్జర్లాండ్కు చెందిన ఒక ఎడ్యుకేషనల్ సైంటిస్ట్ మాట్లాడుతూ డైపర్లు మార్చడం అనేది టీచర్ల పని కాదన్నారు. టాయిలెట్ ట్రైనింగ్ అనేది తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతీతల్లిదండ్రులూ పిల్లలకు సరైన సమయంలో టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. పెద్ద పిల్లలు డైపర్లు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. -
Hyderabad: మెట్రో ప్రయాణికులకు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు మరో షాక్ ఇచ్చారు. మెట్రో స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లలో ఉపయోగించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ చార్జీలను నేటి నుంచే(జూన్2) వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. స్టేషన్లో టాయిలెట్ వాడకానికి 5 రూపాయలు, యూరినల్ వాడకానికి రూ.2 వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని ఉపయోగించినందుకు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయడం లేదు. కానీ ఇకపై వాటికి డబ్బులు వసూలు చేయనున్నారు. దీంతో ఇప్పటికే మెట్రో చార్జీల రాయితీల్లో కోతతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులకు తాజా నిర్ణయం మరింత భారం కానుంది. ఇక ఇటీవలె మెట్రో చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. కాంటాక్ట్లెస్ స్మార్ట్కార్డులు, క్యూఆర్కోడ్పైన ప్రయాణం చేస్తున్న వారికి ఇప్పటి వరకు చార్జీల్లో 10 శాతం రాయితీ ఉండగా.. ఈ రాయితీపైన కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేశారు. అదే విధంగా గుర్తించిన సెలవు రోజుల్లో కేవలం రూ.59కే అపరిమితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన సూపర్ సేవర్ ఆఫర్ ధరలను సైతం రూ.100కు పెంచింది. చదవండి: తెలుగులోనే పూర్తి ప్రసంగం.. కళాకారులతో గవర్నర్ తమిళిసై డ్యాన్స్ -
అర్జంట్గా పోయాలి.. కానీ తాళం తీయట్లేదు.? ఇవ్వేం పబ్లిక్ టాయిలెట్లురా బాబోయ్
లగ్జరీ వాష్రూంల పేరిట కార్పొరేట్ స్థాయిలో నగరంలో నిర్మించిన లూకేఫ్ టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా లక్ష్యం నెరవేరకపోవడంతో టాయిలెట్లకు వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి. – వరంగల్ అర్బన్ లూకేఫ్ టాయిలెట్లు.. కార్పొరేట్ తరహాలో నిర్మించారు. గ్రేటర్ వరంగల్ నగరంలో రెండున్నర ఏళ్ల కిందట అవసరం పేరిట ఒకటి, రెండు కాదు.. 5 చోట్ల నిర్మించారు. దేశ వ్యాప్తంగా పేరు మోసిన బడా కాంట్రాక్టు సంస్థ రూ.కోటి వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టింది. సగానికి పైగా బిల్లులు కూడా కట్టబెట్టారు. మిగతా సొమ్ము కోసం సదరు సంస్థ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తుండటంతో ఓ ప్రజారోగ్య విభాగం అధికారి, మరో ఇంజనీర్ కలిసి ఆ బిల్లు కూడా ఇప్పించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. మరి ఇవి ఉపయోగంలో ఉన్నాయా అని బల్దియా అధికారులను అడిగితే ‘మాకేం తెలుసు’అన్న సమాధానం వస్తోంది. ఉత్సవ విగ్రహాలేనా..? నగరంలో ప్రజా మురుగుదొడ్ల నిర్వహణ నిధుల మేతగా మారింది. జీడబ్ల్యూఎంసీ ద్వారా నిర్మితమై న ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మరుగున పడ్డాయి. లూకేఫ్ సంస్థ కంటైనర్ తరహాలో రూ.కోటితో కాజీపేట నిట్, కలెక్టరేట్, సర్క్యూట్ గెస్ట్హౌస్, వరంగల్ పోచమ్మమైదాన్, ఖిలా వరంగ ల్ ఖుష్మహల్ వద్ద టాయిలెట్లను నిర్మించింది. ఒక్కో ప్రాంతంలో ఆరు సీట్లతో ఏర్పాటు చేశారు. వీటిని వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ బల్దియాపై ఎలాంటి భారం లేకుండా పలు సంస్థలకు, నిరుద్యోగులకు అప్పగించారు. లూకేఫ్ టాయిలెట్లను నిర్వహిస్తూ, ప్రజలు ఉచితంగా మరుగుదొడ్లు ఉపయోగించుకునేలా నిర్ణయించారు. వీటి పక్కన జిరాక్స్, టీ, పాన్షాపు తదితర చిన్న తరహా షాపులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనువైన స్థలాల్లో నిర్మించకపోవడం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చిరు వ్యాపారాలు నడవకపోవడంతో చేతులెత్తేశారు. దీంతో లూకేఫ్ టాయిలెట్లు అలంకా ర ప్రాయంగా మారాయి. హనుమకొండ కలెక్టరేట్ కొత్తగా నిర్మాణం కావడం వల్ల లూకేఫ్ టాయిలెట్ ను కూల్చివేయడం పూర్తయింది. సమన్వయ లోపం.. నిధులు నిరుపయోగం బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజనీర్ల మధ్య సమన్వ య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జనరద్దీ కలిగిన ప్రాంతాల్లో కాకుండా ఇష్టమొచ్చిన, ప్రభుత్వ స్థలా లు ఉన్న చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, అవగా హనా రాహిత్యం తదితర కారణాల వల్ల లూకేఫ్లు మూలకు చేరాయి. బల్దియా పట్టణ ప్రగతి నిధులు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఇవేకాకుండా నగరంలో నాలుగు చోట్ల నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ల పరిస్థితీ దయనీయంగా మారింది. -
‘పుతిన్కు అదే గతి.. టాయిలెట్ కోసం బకెట్ పట్టుకుని నిలబడి..’
రష్యన్ దళాల నుంచి విముక్తి పొంది ఏడాదైన సందర్భంగా కైవ్కు తూర్పున యాగిద్నే ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ హాజరయ్యారు. ఆయనతో పాటు జర్మన్ వైస్ ఛాన్సలర్ రాబర్ట్ హెబెక్ కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ తన జీవితాంతం చీకటి నేలమాళిగలో బకెట్తో గడపాలని తాను ఆశిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్కు అదే గతి యుధ్దం జరుగుతున్న సమయంలో రష్యా దళాలు 367 మంది ప్రజలను యాగిద్నేలోని 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాఠశాల బంకర్లోకి బలవంతంగా తరలించారు. 8 నెలల పాపతో సహా గ్రామస్తులను దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉంచగా, వారిలో 11 మంది చనిపోయారు. తాజాగా ఈ ప్రాంతంలో పర్యటించిన అధ్యక్షుడు జెలెన్స్కీ.. అక్కడి పరిసరాలు, గ్రామ ప్రజలు పడిన నరకయాతన తెలుసుకొని చూసి చలించిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత, ఆయన దీనిపై స్పందిస్తూ.. ‘ తన మిగిలిన రోజులను టాయిలెట్ కోసం బకెట్తో ఇదే విధంగా బంకర్లో గడుపుతారని తాను ఆశిస్తున్నానని’ ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు. ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని మరచిపోకుండా ఉండేందుకు గ్రామస్థులు వారి పేర్లు నమోదు చేయడం, పిల్లలు జాతీయగీతాన్ని రాసిన తీరును జెలెన్స్కీ ప్రశంసించారు. ఉక్రెయిన్లో రష్యా బలగాలు అనేక నేరాలకు పాల్పడుతున్నాయని కైవ్ అధికారులు, పాశ్చాత్య ప్రభుత్వాలు ఆరోపించాయి. అయితే మాస్కో మాత్రం ఈ వాదనలను ఖండించింది. -
120 మందికి.. ఒకే టాయిలెట్
నిర్మల్: లోకేశ్వరం గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు కనీస వసతులు కరువయ్యాయి. స్థలం సరిపోక కొందరు వెనుదిరుగుతుంటే ఇక్కడ ఉండి చదువుకునే వారికి మూత్రశాలలు, మరుగుదొడ్డి లేక నరకం చూస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన నుంచి ఇక్కడికి వచ్చే వారిసంఖ్య పెరిగింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు గ్రంథాలయం తెరిచే ఉంటోంది. రోజు 120 మందికి పైగా వస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలు వస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇంత మందికి కేవలం ఒకే మరుగుదొడ్డి ఉంది. సరిపోని గదులు వరుస నోటిఫికేషన్లతో వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. హాలు, చిన్న గదులు ఉన్నాయి. గ్రంథాలయ ఇరుకు గదులోనూ అభ్యర్థులు చదువుకుంటున్నారు. కొద్దిగా ఆలస్యమైన కుర్చీ దొరకని పరిస్థితి. వేసవి ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న కూలర్లు ఏర్పాటు చేసేందుకు స్థలం లేదు. 2004లో రూ.3 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. వర్షం కురిస్తే గ్రంథాలయ భవనం ఊరుస్తోంది. ఇంత మందికి ఒకే మరుగుదొడ్డి ఉండడంతో ఆరుబయటకు వెళ్లి మూత్రవిసర్జన చేయాల్సి వస్తోంది. గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుందని, అధికారులు స్పందించి కొత్తది ఏర్పాటు చేయాలని పాఠకులు కోరుతున్నారు. సౌకర్యాలు కల్పించాలి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇక్కడకు వస్తున్నాం. మూ త్రశాలలు, మరుగుదొ డ్డి లేక ఇబ్బంది పడుతున్నాం. గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఒకే చోటకు వెళ్లడం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి కొత్త గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరుతున్నాం. – రాజశేఖర్, లోకేశ్వరం పాఠకుడు నివేదించాం లోకేశ్వరం గ్రంథాలయం శిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. కొత్త గ్రంథాలయ భవన నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే భవనం పనులు ప్రారంభించి పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – పృథ్వీరాజ్, గ్రంథాలయాధికారి, లోకేశ్వరం -
టాయిలెట్లో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు
సాక్షి, ఢిల్లీ: టాయిలెట్లో రెండు కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఇందీరాగాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐ) విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. దేశీయ పర్యటనలు పూర్తి చేసుకున్న అంతర్జాతీయ విమానg ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 2వద్ద ఆగినప్పుడూ ఈ ఘటన వెలుగు చూసిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారుల ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్న విమానాన్ని తనిఖీ చేస్తుండగా.. వాషరూమ్లో సింక్కు దిగువున టేప్తో అతికించిన బూడిదరంగు పర్సును కనుగొన్నారు. దీంతో వెంటనే అధికారులు ఆ పర్సును స్వాధీనం చేసుకుని చూడగా..మొత్తం మూడు వేల గ్రాములకు బరువున్న నాలుగు దీర్ఘచతురస్రాకరా బంగారు కడ్డీలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీర్ఘచతురస్రాకారంలో ఉండే బంగారు కడ్డీల ధర సుమారు 2 కోట్లు రూపాయాలపైనే ఉంటుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: 'మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి) -
700 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్
-
అయ్యో! ఎంత కష్టం, ఆఫీసుకు టాయిలెట్ పేపర్లు తెస్తున్న ట్విటర్ ఉద్యోగులు
ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈవోగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అందులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సంస్థ నష్టాలను తగ్గించే క్రమంలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. వీటితో పాటు మస్క్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను చూసి కొందరు నిపుణుల సైతం షాక్కి గురవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా టెస్లా అధినేత "క్రేజీ కాస్ట్ కటింగ్" చర్యలను చేపట్టారు. న్యూయార్క్ టైమ్స్ తెలిపిన నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కోలోనిని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు తమ సొంత టాయిలెట్ పేపర్ను ఆఫీసుకు తీసుకురావడం ప్రారంభించారట. కారణం ఏంటంటే.. ట్విటర్ నిర్వహణ ఖర్చులు తగ్గించే పనిలో ఉన్న మస్క్ భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ సంస్థలోని క్లీనింగ్ స్టాఫ్ను కూడా తొలగించారట. దీంతో బాత్రూంలో నిర్వహణ లేక ఉద్యోగులే వారి ఇటి నుంచి టాయిలెట్ పేపర్లు తీసుకువెళ్లాల్సి వస్తోందట. అధిక వేతనాల కోసం క్లీనింగ్ సిబ్బంది సమ్మె చేయడంతో లేఆఫ్ల ప్రక్రియ అందులోనూ జరిగాయి. చదవండి: ఐఫోన్ లవర్స్కు శుభవార్త ..‘ఫోల్డ్’పై యాపిల్ కన్ను, శాంసంగ్కు ధీటుగా -
ఎన్ఈపీలో శుభ్రతను చేరుస్తాం
ఉస్మానియా యూనివర్సిటీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ–2020)లో శుభ్రత, మౌలిక వసతుల కల్పన అంశాలను కూడా చేరుస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రపరిచే యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ఈపీ కోసం కోట్లాది రూపాయాలను వెచ్చిస్తున్నామని ఇందులో మరుగుదొడ్ల పరిశుభ్రతకు నిధుల కేటాయింపుపై శ్రద్ధచూపుతామని తెలిపారు. తగిన యంత్రాంగం లేక దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిని శుభ్రపర్చడం సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలో మరుగుదొడ్ల శుభ్రత, మంచినీరు, కరెంట్ బిల్లుల చెల్లింపు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిందన్నారు. పాఠశాలల్లో టీచర్ల నియామకంతో పాటు మరుగుదొడ్లను శుభ్రపరిచే (శానిటేషన్) సిబ్బందిని కూడా నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ముందుకు రావాలన్నారు. అనంతరం ఎన్టీపీసీ అందచేసిన 94 యంత్రాలను వివిధ పాఠశాలల ప్రధాన అధ్యాపకులకు అందచేశారు. త్వరలో మరో 150 యంత్రాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మరుగుదొడ్డిని కిషన్రెడ్డి మిషన్తో శుభ్రపరిచారు. -
బాత్రూమ్లో ఫోన్ వాడుతున్నారా.. ఈ సమస్యలు తప్పవా?
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన జీవితంలో అంతర్భాగమై పోయింది. గత దశాబ్దంన్నర కాలం నుంచి వ్యక్తులతో కమ్యూనికేట్ అవ్వడం దగ్గర నుంచి , కాలు కదపకుండా హోటల్ నుంచి ఫుడ్ ఇంటికి తెప్పించుకోవడం, ఆన్లైన్ షాపింగ్ వరకూ ఇలా అన్నింట్లో సహాయ పడుతుంది. అయితే దాని వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉందని సైంటిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అరిజోనా యూనివర్సిటీ సైంటిస్టులు జరిపిన ఓ అధ్యయనంలో మనం వినియోగించే స్మార్ట్ ఫోన్లలో 17 వేల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా వినియోగించే టాయిలెట్ సీటు మీద ఉండే బ్యాక్టీరియా కంటే స్మార్ట్ ఫోన్ల మీద 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ► టీనేజర్లు వినియోగించే ఫోన్లమీద బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు అరిజోనా సైంటిస్ట్లు చెబుతున్నారు. ఎందుకంటే వారిలో ఎక్కువ మందికి బాత్రూంకు మొబైల్ తీసుకొని వెళ్లే అలవాటు ఉందని , ఎక్కువ సమయం బాత్రూంలో మొబైల్ వినియోగించడం వల్ల ఫోన్పై బ్యాక్టీరియా ఏర్పుడుతుందని హెచ్చరిస్తున్నారు. ► 2016లో సోనీ సంస్థ జరిపిన సర్వేలో 41 శాతం మంది ఆస్ట్రేలియన్లు టాయిలెట్లో ఫోన్ వినియోగిస్తుండగా.. 75శాతం మంది అమెరికన్లు వాడుతున్నారు. అయితే అలా ఫోన్ వినియోగిస్తున్న వారు టైం వేస్ట్ చేయకుండా మల్టీ టాస్కింగ్ చేస్తున్నామని అనుకుంటున్నట్లు తేలింది. కానీ టాయిలెట్లో మొబైల్ వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామనే విషయాన్ని మరిచిపోతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ► డాక్టర్ కర్మాకర్ సలహా మేరకు.. ఫోన్ను బాత్రూంలోకి లేదంటే పబ్లిక్ ఏరియాల్లో వినియోగించకపోవడం ఉత్తమం. ఆహారం తీసుకునేటప్పుడు కూడా చాలా మంది తమ ఫోన్ని ఉపయోగిస్తుంటారు. నోటి ద్వారా ఇన్ఫెక్షన్లు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్లోని బ్యాక్టీరియా వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాల్ని పెంచుతుంది. చదవండి👉 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం ఫోన్ను బాత్రూంలో వినియోగిస్తే వాటిల్లే ప్రమాదాలు ►►ఫోన్ వినియోగిస్తూ బాత్రూంలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది.తద్వారా రెక్టల్ (మల ద్వార) సమస్యలు ఎక్కవుగా ఉత్పన్నమవుతాయి. ►► పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగితే జీర్ణాశయాంతర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించాలి ►► బాత్రూంలో ఫోన్ వినియోగిండం వల్ల టైం దుర్వినియోగం అవుతుంది. చేయాల్సిన వర్క్ ఆగిపోతుంది. మనకు తెలియకుండా మన లోపలి శరీరం ఒత్తిడికి గురవుతుంది. ►► మీరు ఉదయం పూట నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూం వెళ్లే సమయంలో ఫోన్ను వెంట తీసుకొని వెళుతున్నారా? అయితే మీరు ఉదయం పూట బాత్రూంలో ఫోన్ వినియోగించే సమయం కంటే.. ఫోన్ లేనప్పుడు బాత్రూంలో గడిపే సమయం ఎక్కువగా ఉంటుందని సైంటిస్ట్లు చెబుతున్నారు. అందుకే ఉదయం టాయిలెట్లోకి ఫోన్ తీసుకొని వెళ్లకపోవడమే ఉత్తమం. ►► వెడ్ఎమ్డి హెల్త్ జర్నల్ ప్రకారం..ఈ బాక్టీరియాలో సాల్మొనెల్లా, ఇ.కోలి, షిగెల్లా, క్యాంపిలో బాక్టర్ అనే బ్యాక్టీరియాలు మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యానికి గురి చేస్తాయి. ►► ఒకరి నుంచి మరొకరికి వైరస్ను వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే ఈ ఫోన్ను టాయిలెట్లో వినియోగిస్తే గ్యాస్ట్రో, స్టాఫ్ వంటి వైరస్ల ఇతరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. చదవండి👉 యాపిల్ లోగోను టచ్ చేసి చూడండి.. అదిరిపోద్దంతే..! ఫోన్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ►► నిపుణుల అభిప్రాయం ప్రకారం 60% నీరు, 40% శానిటైజర్లతో ఫోన్ను శుభ్రం చేసుకోవాలి. మీ ఫోన్ను నేరుగా లిక్విడ్తో శుభ్రం చేయడం వల్ల డిస్ప్లే చెడిపోతుందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. ►► ఫోన్ నుంచి సురక్షితంగా ఉండాలంటే బాత్రూమ్లోకి తీసుకొని వెళ్లిపోకూడదు. తినేటప్పుడు ఫోన్ను వినియోగించపోవడం ఉత్తమం ►► టచ్స్క్రీన్లను శుభ్రం చేయడానికి నిర్దిష్ట స్ప్రేలను కొనుగోలు చేయవచ్చు. స్క్రీన్ ప్రొటెక్ట్ చేసేందుకు సహాయ పడతాయి. ►► బాత్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు లేదా ఇతరుల స్మార్ట్ఫోన్ను తాకినప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. చదవండి👉 ‘ఆఫీస్కు రండి.. లేదంటే గెట్ ఔట్’! -
బస్స్టేషన్లలోని మరుగుదొడ్లలో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్: సజ్జనార్
ఖైరతాబాద్: గౌలిగూడ మహాత్మాగాంధీ, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ల లో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు శానిటరీ ప్యాడ్ బాక్స్లు కూడా ఏర్పా టు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో నవంబర్లోగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. బాలికా విద్య, మహిళలు రుతు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ (ప్యూర్) స్వచ్ఛంద సంస్థ ‘ప్యూరథాన్’ నిర్వహించింది. నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా ఆదివారం ఉదయం జరిగిన 2కె, 5కె రన్, వాక్ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళల్లో శానిటరీ ప్యాడ్స్ గురించి మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఆర్టీసీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కొందరు రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడతారని, ఇది ప్రకృతి సహజమైనదని అన్నారు. ప్యాడ్స్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థినులు పాఠశాలల నుంచి డ్రాపవుట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుక్రమంపై ముఖ్యంగా మగవారిలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, సినీ నటుడు సత్యదేవ్ అన్నారు. జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్కు వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో అలాగే ప్యాడ్లను కొనుగోలు చేసేలా మహిళలు, యువతులు, బాలికల్లో ధైర్యం పెంచేందుకు ఈ పరుగును నిర్వహించినట్లు ప్యూర్ సంస్థ ఎండీ శైలా తాళ్లూరి తెలిపారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రమేష్, సినీనటి దివి, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, గాయని గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. -
Viral Video: ఖాళీ చేతులతో స్కూల్ టాయిలెట్లు శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ..
భోపాల్: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ కనిపించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది జరిగి 24 గంటలు గడవకముందే రాష్ట్రంలో ఇలాంటి కోవకే చెందిన మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఈసారి పిల్లలు కాకుండా బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా బాలికల పాఠశాలలో టాయ్లెట్లు శుభ్రం చేస్తూ కనిపించారు. అయితే ఆయన ఎలాంటి బ్రష్ సాయం లేకుండా తన చేతులతో క్లీన్ చేయడం గమనార్హం. ఈ వీడియోను బీజేపీ ఎంపీ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బీజేపీ యువ మోర్చా యూత్ వింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘సేవా పఖ్వాడా) కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న మొదలైన ఈ కార్యక్రమం అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రోజున ముగించనున్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్లోని రేవా నియోజకవర్గంలోని ఖట్కారి బాలికల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి స్థానిక నియోజకవర్గ ఎంపీ జనార్ధన్ మిశ్రా ముఖ్య అతిథిగా వచ్చారు. తన సందర్శనలో పాఠశాల మరుగుదొడ్లు(టాయిలెట్స్) పరిశుభ్రంగా లేకపోవడాన్ని ఎంపీ గమనించారు. దీంతో ఆయనే స్వయంగా తన చేతులతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మహాత్మాగాంధీ, మోదీ ఇచ్చిన నినాదాన్ని గుర్తు చేశారు. ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఇదేం మొదటిసారి కాదని అన్నారు. पार्टी द्वारा चलाये जा रहे सेवा पखवाड़ा के तहत युवा मोर्चा के द्वारा बालिका विद्यालय खटखरी में वृक्षारोपण कार्यक्रम के उपरांत विद्यालय के शौचालय की सफाई की।@narendramodi @JPNadda @blsanthosh @ChouhanShivraj @vdsharmabjp @HitanandSharma pic.twitter.com/138VDOT0n0 — Janardan Mishra (@Janardan_BJP) September 22, 2022 -
టాయిలెట్లో భోజనాలు
సహరన్పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో వినడానికే రోత పుట్టించే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారిణులకు ఇంకెక్కడా చోటు లేనట్టు టాయిలెట్లో భోజనాలు వడ్డించారు! సహరన్పూర్లోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ స్టేడియంలో సెపె్టంబర్ 16 నుంచి 18 దాకా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 డివిజన్ల నుంచి 300 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. వారికి టాయిలెట్లో భోజనాలు వడ్డించడం తీవ్ర దుమారం రేపింది. అన్నం, కూరలతో పాటు పూరీలను టాయిలెట్లోనే నేలపై పేపర్లు పరిచి ఉంచారు. గత్యంతరం లేక బాలికలు అక్కడే వడ్డించుకొని తింటున్న వీడియో వైరల్గా మారింది. దాంతో యూపీ ప్రభుత్వం తీరును నెటిజన్లు అసహ్యించుకున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సహరన్పూర్ జిల్లా క్రీడల అధికారి అనిమేశ్ సక్సేనాను సస్పెండ్ చేసింది. భోజనాలు తయారు చేసిన కేటరర్ను బ్లాక్ లిస్ట్లో ఉంచింది. మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించింది. ‘‘వీడియోలో కనిపిస్తున్న ఆహారం సెపె్టంబర్ 15న వండినది. పాడైపోయిన ఆహారం కావడంతో భారీ వర్షాల వల్ల స్టేడియంలో ఎక్కడా చోటు లేక ఛేంజింగ్ రూమ్లో ఉంచాం. అంతే తప్ప బాలికలకు పెట్టడానికి కాదు’’ అంటూ సక్సేనా సమరి్థంచుకున్నారు. భోజనాలపై కోచ్లు, క్రీడాకారిణులు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకొచ్చారు. 300 మందికి భోజనాన్ని ఇద్దరే చేశారని, అన్నం కూడా ఉడకలేదని సమాచారముందని కలెక్టర్ చెప్పారు. దీనిపై బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ మండిపడ్డారు. క్రీడాకారిణుల్ని ఈ స్థాయిలో అగౌరవపరచడం జాతికే అవమానమంటూ ట్వీట్ చేశారు. ఇంత దారుణంగా చూస్తారా అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా దీనిపై మండిపడింది. -
ఘోరం: మరుగుదొడ్డిలో ఆటగాళ్లకు భోజనం
లక్నో: కబడ్డీ ఆటగాళ్ల కోసం మరుగుదొడ్డిలో ఆహారాన్ని భద్రపర్చడం, గత్యంతరం లేని స్థితిలో అక్కడే వాళ్లు వడ్డించుకోవడం లాంటి ఘోర పరిస్థితులతో ఉన్న వీడియో వైరల్ కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అధికారులు సైతం స్పందించారు. ఉత్తర ప్రదేశ్ షాహారన్పూర్లో ఈమధ్య అండర్-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. అయితే.. టాయిలెట్ గదుల్లో భద్రపర్చిన ఆహారాన్ని విద్యార్థులు వడ్డించుకున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ 16వ తేదీన కొందరు అమ్మాయిలే ఈ వీడియోను రిలీజ్ చేసి విడుదల చేసినట్లు తెలుస్తోంది. టాయ్లెట్లో ఓ పక్కన ఉన్న పాత్రల నుంచి అన్నం, కూరలతో పాటు అక్కడి నేలపై ఓ పేపర్ ముక్కపై నుంచి పూరీలను అమ్మాయిలు వడ్డించుకుంటున్నారు. ఆ భోజనాన్ని తీసుకుని బయట ఆహారం వండిన స్విమ్మింగ్పూల్ వద్దకు వెళ్లి వాళ్లు తింటున్నారు. నిమిషం నిడివి ఉన్న వీడియోలో అక్కడి పరిస్థితులు ఘోరంగా కనిపించాయి. In UP's Saharanpur, video of players attending the state level girl's U-16 Kabaddi tournament being served food kept on the floor of toilet at the sports stadium has surfaced. Video by @sachingupta787 pic.twitter.com/12dYRlMofH — Piyush Rai (@Benarasiyaa) September 20, 2022 ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో షాహారన్పూర్ క్రీడాఅధికారి అనిమేష్ సక్సేనా స్పందించారు. స్టేడియం వద్ద నిర్మాణ పనులు సాగుతున్నాయి. పైగా ఆ సమయంలో వర్షం పడింది. అందుకే స్విమ్మింగ్ పూల్ వద్ద వంటలు చేయించాం. అయితే ఆహారాన్ని భద్రపరిచింది బట్టలు మార్చుకునే రూంలో అని ఆయన వెల్లడించారు. పాయిఖానాలో ఆహారాన్ని ఉంచిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే.. వీడియో ఆధారంగా ఏర్పాట్లపై మండిపడుతున్నారు చాలామంది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. అధికారులపై వేటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కానిస్టేబుల్ సుధా హత్యకేసులో కీలక మలుపు -
Video Viral: స్కూల్ విద్యార్థులతో టాయిలెట్ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్
లక్నో: ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో ప్రిన్సిపల్ టాయిలెట్లు శుభ్రం చేయిస్తున వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. బలియా జిల్లా పిప్రా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ స్కూల్లోని విద్యార్థులను ప్రిన్సిపల్ వాష్రూమ్లు శుభ్రం చేయాలని ఆదేశించాడు. ప్రిన్సిపల్ పక్కన నిలబడి పిల్లలచేత టాయిలెట్లు కడిగించాడు. అంతేగాక విద్యార్థులకు మరుగుదొడ్డి సరిగ్గా శుభ్రం చేయాలని ఆదేశాలు ఇస్తున్నాడు. సరిగా క్లీన్ చేయకుంటే తాళం వేస్తానని, అప్పుడు అందరూ మల విసర్జన కోసం ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని బెదిరించాడు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. Primary School Students Made To Clean Toilet by Principle in Ballia, Uttar Pradesh. The incident was reported from Pipra Kala Primary School of Sohav Block in Ballia. pic.twitter.com/oYaqqBhFJA — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) September 8, 2022 ఇందులో కొందరు విద్యార్థులు టాయిలెట్ను శుభ్రం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్గా మారింది. అదికాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు విధ్యాశాఖ అధికారి అఖిలేష్ కుమార్ ఝా తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: పగ తీర్చుకున్నాడు.. కాటేసిన పామును కసితీరా కొరికి -
ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్లెట్ చార్జీ రూ.112
ఆగ్రా: రైల్వేస్టేషన్లో టాయ్లెట్ వాడుకుంటే ఎంత చెల్లిస్తాం? ఉచితం కాకుంటే గనక ఏ ఐదు రూపాయలో, 10 రూపాయలో. కానీ ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులు మాత్రం ఏకంగా రూ.112 చొప్పున చెల్లించుకోవాల్సి వచ్చింది! వారిద్దరూ ఢిల్లీలోని బ్రిటిష్ ఎంబసీ నుంచి ఆగ్రా వెళ్లారు. రైల్వేస్టేషన్లో శ్రీవాత్సవ అనే గైడ్ వారిని రిసీవ్ చేసుకున్నాడు. టాయ్లెట్కు వెళ్లాలని చెప్పడంతో ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటివ్ లాంజ్కు తీసుకెళ్లాడు. బయటికి రాగానే 12 శాతం జీఎస్టీతో కలిపి చెరో రూ.112 రూపాయలు చెల్లించాలని వారిని సిబ్బంది డిమాండ్ చేశారట. ఇదేమిటని ప్రశ్నించినా లాభం లేకపోయిందని, దాంతో ఆ మొత్తాన్ని తానే చెల్లించానని గైడ్ చెప్పుకొచ్చాడు. దీనిపై ఆయన ఐఆర్సీటీసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది లాంజ్ సేవల చార్జే తప్ప టాయ్లెట్కు వెళ్లినందుకు వసూలు చేసింది కాదని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ‘‘లాంజ్ సేవలు వాడుకుంటే కనీస చార్జీ రూ.200. రెండు గంటల పాటు ఏసీ లాంజ్ రూము, కాంప్లిమెంటరీ కాఫీ, ఉచిత వైఫై వంటి సదుపాయాలకు కలిపి ఈ చార్జీ. 50 శాతం డిస్కౌంట్ పోను 12 శాతం జీఎస్టీతో కలిపి రూ.112 చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది. -
టాయిలెట్ బిల్లుకు జీఎస్టీ ఘటన!! ఐఆర్సీటీసీ వివరణ
ఢిల్లీ: జీఎస్టీ.. దేశంలో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. నిత్యావసరాల మొదలు.. చాలావాటిపై కేంద్రం జీఎస్టీ వడ్డన చేయడంతో.. సోషల్మీడియాలోనూ విపరీతమైన విమర్శలు వినిపించాయి. తాజాగా టాయిలెట్కు వెళ్లినా ఫారినర్లకు భారీ బిల్లుతో పాటు అందులో జీఎస్టీ సైతం పడడంతో కంగుతిన్నారు. దేశ రాజధానిలోనే ఈ ఘటన జరిగింది. ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో వాష్ రూమ్ని వాడుకున్నందుకు ఇద్దరు విదేశీ పర్యాటకులు భారీ బిల్లు ఫ్లస్ జీఎస్టీ చెల్లించాల్సి వచ్చింది. అయితే వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన గైడ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్రిటిష్ ఎంబసీ నుంచి విదేశీయులిద్దరూ గతిమాన్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో దిగారు. వాళ్లను శ్రీవాస్తవ అనే గైడ్ రీసివ్ చేసుకున్నాడు. అయితే.. స్టేషన్లో దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వాలనుకున్నారు. దీంతో స్టేషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి తీసుకెళ్లారు శ్రీవాస్తవ. కేవలం ఐదు నిమిషాల్లో వాళ్లు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చారు. సాధారణంగా ఐదు, పది రూపాయలు.. మహా అయితే రూ. 20 ఇవ్వాల్సి వస్తుందని శ్రీవాస్తవ భావించారు. కానీ, అక్కడి రిసెప్షనిస్ట్.. రూ. 224 బిల్లు చేతిలో పెట్టడంతో.. ఆయన షాక్ అయ్యారు. ఐదు నిమిషాల పాటు వాష్ రూం వాడుకున్నందుకు ఒక్కొక్కరి బిల్లు రూ. 100లు వేశారు. పైగా దానిపై జీఎస్టీ రూ. 12 జత చేశారు. అలా వారిద్దరికీ కలిపి రూ. 224 బిల్లు అయింది. అంత చెల్లించేందుకు మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ, సిబ్బంది ఒత్తిడితో చివరికి చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఐఆర్సీటీసీ ప్రతినిధి బ్రజేష్ కుమార్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి ప్రవేశానికి ప్రత్యేక చార్జ్ ఉందని, దానిపై జీఎస్టీ పడుతుందని చెప్పారు. అంతేకాదు లాంజ్లో ఉన్నంతసేపు టూరిస్టులు, ఫారినర్లు ఫ్రీగా వైఫై వాడుకోవచ్చని, కాంప్లిమెంటరీగా కాఫీ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై గైడ్ శ్రీవాస్తవ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ కోచ్లో ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తే టికెట్ రూ. 90 రూపాయలు మాత్రమేనని, కానీ స్టేషన్లో వాష్రూం వినియోగించుకున్నందుకు రూ. 112 చార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథి దేవో భవ పిలుపును ఐఆర్సీటీసీ అవమానిస్తోందని, ఇలా చేయడం వల్ల విదేశీయులు ఇక్కడి వ్యవస్థలపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యవహారంపై టూరిజం శాఖలో ఫిర్యాదు చేస్తానన్నారు. ఇదీ చదవండి: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం -
ఆ దేశాలకు వెళ్లినపుడు కారు, బైక్ హార్న్ కొట్టారంటే..
ప్రపంచంలోని చాలా దేశాల్లో రోడ్ల మీద అదే పనిగా హార్న్ కొట్టడం సభ్యత కాదు. ఇతరులను డిస్టర్బ్ చేయడం కింద లెక్క. ఇంకా చెప్పాలంటే సౌండ్ పొల్యూషన్గా కూడా పరిగణిస్తారు. కానీ కరీబియన్ కంట్రీస్లో మాత్రం కాదు. అక్కడ కారు, బైక్ హార్న్ కొట్టడమంటే ‘హాయ్.. హలో..’ అంటూ పలకరించడంలాంటిది. ‘థాంక్యూ’కి మారుగా కూడా హార్న్ కొట్టొచ్చు అక్కడ. రోడ్ల మీద స్నేహితులు, బంధువులు ఎవరు కలిసినా.. ఇలా హార్న్ కొట్టి పలకరించుకుంటారట అక్కడ. స్మార్ట్ టాయ్లెట్స్ .. అంటే అంటూ ఐబ్రోస్ ముడేయకండి. ఇవి జపాన్లో ఉన్నాయి. ఆ టాయ్లెట్స్లోకి వెళితే మీ నాడి చూసి మీ ఆరోగ్య రహస్యం చెప్పేస్తాయవి. చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలనూ సూచిస్తాయి. మీరు ఆరోగ్యవంతులని తేలితే.. గ్రీట్ చేసి పంపిస్తాయి. ఇంతకీ ఇవి ఏ ఆసుపత్రిలోనో.. పాథలాజికల్ ల్యాబ్లోనో ఉన్న టాయ్లెట్స్ కావు. పబ్లిక్ టాయ్లెట్స్. అర్జెంట్ అని పబ్లిక్ టాయ్లెట్స్లోకి వెళితే.. స్మార్ట్గా ఈ హెల్త్చెకప్ చేస్తుందట. వాటే టెక్నాలజీ కదా! చదవండి: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే.. -
మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. ఉండడానికి చోటు లేక బిక్కుబిక్కుమంటూ..
మాచారెడ్డి(కామారెడ్డి జిల్లా): ఊహ తెలియని వయసులో ఆమె తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి కన్న తల్లే అన్నీ తానై పోషిస్తున్న సమయంలో మూడేళ్ల కిందట అనారోగ్యానికి గురై కన్నుమూసింది. మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన కర్రోళ్ల ఎల్లయ్య, ఎల్లవ్వల ఏకైక కుమార్తె సోనికి కష్టాలు చుట్టుముట్టాయి. తల్లి మృతి చెందిన కొన్ని రోజులకే వారు నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోయింది. చదవండి: వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ ఉండడానికి చోటు లేక ప్రభుత్వ సహాయంతో నిర్మించుకున్న మరుగుదొడ్డిలోనే సోని ప్రస్తుతం నివసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరుగుగా ఉన్న ఆ చిన్న మరుగుదొడద్డిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తోంది. గ్రామస్థుల సహకారంతో సోనికి వాడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించినా కొద్ది రోజులకే వివిధ కారణాల వల్ల ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆమె ఉంటున్న మరుగుదొడ్డి చుట్టూ పాములు, తేళ్లు తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ విషపురుగు కాటేస్తుందోనని ఆమె ఆందోళన చెందుతోంది. స్వచ్చంద సంస్థలు, మానవతావాదులు ముందుకొచ్చి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది. -
మరుగుదొడ్డే ఆమెకు ఆవాసం ..‘ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి’
సాక్షి, మెదక్: అందరూ ఉన్న అనాథ. కుమారులు పట్టించుకోకపోవడంతో ఆసరా కరువై వృద్ధురాలు భిక్షాటనచేస్తోంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా చిన్న కుమారుడితో కలిసి రోడ్డు భవనాలశాఖకు చెందిన గెస్ట్హౌస్ మరుగుదొడ్డిలో తలదాచుకుంటోంది. తల్లీకుమారుల దయనీయస్థితిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట పట్టణానికి చెందిన జెట్టి రామలక్ష్మి భర్త భాస్కర్ గతంలోనే మృతిచెందాడు. దీంతో ఆమె కష్టపడి కూలీపనులు చేసి ముగ్గురు కొడుకులను పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది. పెద్ద కుమారుడు తన భార్యాపిల్లలతో పక్క గ్రామంలోని అత్తగారింటిలో స్థిరపడ్డాడు. బీసీ కాలనీలో ఉంటున్న రెండో కొడుకు కూలీపనులు చేసుకుంటూ తన బార్యా పిల్లను పోషించుకుంటున్నాడు. మూర్చవ్యాధితో తరచూ అనారోగ్యానికి గురవుతున్న మూడో కుమారుడు శ్రీనివాస్తో కలిసి తల్లి రామలక్ష్మి బీసీ కాలనీలోని అద్దె ఇంటిలో నివాసం ఉండేది. అనారోగ్యంతో శ్రీనివాస్ సరిగా పనులు చేసుకోకపోవడంతో అతడి భార్య ఇద్దరు కూతుర్లను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో అద్దె ఇల్లు యజమాని ఇల్లు ఖాళీ చేయించడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో రామలక్ష్మి తన కుమారుడితో పట్టణంలోని మెదక్ రోడ్డులో శిథిలమైన రోడ్డు భవనాల శాఖకు చెందినన గెస్ట్హౌస్ మరుగుదొడ్డిలో తలదాచుకుంటుంది. కూలీ పనులు చేయాలన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో తల్లీకొడుకులు కొన్నాళ్లూ అర్థాకలితో గడిపారు. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో రామలక్ష్మి భిక్షటన చేపట్టింది. తనకు వస్తున్న పించన్ డబ్బుతోపాటు భిక్షాటన ద్వారా వచ్చింది తింటూ తల్లీకొడుకులు కాలం గడపుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు మందులకోసం ప్రతినెలా రూ.1500 ఖర్చవుతోందని వృద్ధురాలు వాపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గత నెలనుంచి మందులు కూడా వేసుకోవడంలేదని కంటతడి పెట్టింది. రెండు పడకల ఇళ్లు మంజూరు చేయాలి దయనీయ పరిస్థితిలో అర్థాకలితో అలమటిస్తున్న తల్లీకొడుకులు మూడు నెలలుగా మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ప్రతిరోజూ పట్టణంలో భిక్షాటన చేస్తున్న రామలక్ష్మిని చూస్తున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఎవరూ ఆసరా ఇవ్వకపోడంతో భిక్షాటన ఎంచుకుంది. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరుచేయాల్సిన అవసరం ఉంది. ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి కొంతకాలంగా నేను, చిన్నకుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. అద్దె ఇంటిలో ఉండేవాళ్లం. ఇంటి యజమాని ఖాళీ చేయించడంతో విధిలేక మరుగుదొడ్డిలో ఉంటున్నాం. పూటగడిచే మార్గంలేక సిగ్గువిడిచి భిక్షాటన చేస్తున్నా. పించన్ డబ్బులు, భిక్షాటన ద్వారా వస్తున్న డబ్బులు మందులకు కూడా సరిపోవడంలేదు. ప్రభుత్వపరంగా ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలి. – జెట్టి రామలక్ష్మి, వృద్ధురాలు -
మరుగు దొడ్డి విషయంలో మనస్తాపం.. ఉరితాడుకు రమ్య!
చదువుకున్న ఆ అమ్మాయి.. ప్రాణంగా ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ, అతని ఇంట పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మచ్చా(బావా) అని ప్రేమగా పిల్చుకునే భర్త దగ్గర బాధను వెల్లగక్కుకుంది. అది అతను అర్థం చేసుకోలేకపోయేసరికి.. పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త మనసు మారిందేమో అని మళ్లీ ప్రయత్నిస్తే.. అతను అదే సమాధానం ఇవ్వడంతో పెళ్లై నెల కూడా గడవక ముందే ఆ కొత్త పెళ్లికూతురు ఏకంగా ప్రాణమే తీసుకుంది. చెన్నై: తమిళనాడులో ఈ ఘటన జరిగింది. 27 ఏళ్ల రమ్య భర్త తన ఇంట మరుగుదొడ్డి కట్టించడం లేదన్న ఆవేదనతో ప్రాణం తీసుకుంది. కడలూరు అరిసిపెరియాన్కుప్పంకు చెందిన రమ్య.. ఎమ్మెస్సీ చదివింది. ఒక ప్రైవేట్ మెడికల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. రెండేళ్లుగా కార్తికేయన్ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉంది. పెద్దలను ఒప్పించి కిందటి నెల(ఏప్రిల్ 6న) వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే కాపురానికి వెళ్లిన ఆమెకు అక్కడ మరుగు దొడ్డి లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది. కడలూరులోనే మరో ఇంటికి మారుదామని అతన్ని కోరింది. కానీ, ఆ కోరిక వివాదానికి దారి తీసింది. అందరిలాగా బహిర్భూమికి వెళ్లమంటూ సలహా ఇచ్చాడు ఆ భర్త. ఈ పరిణామంతో కలత చెందిన రమ్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కొన్నిరోజులకు భర్త మనసు మారిందేమో అనే ఉద్దేశంతో.. ఆమె సోమవారం మళ్లీ అతనికి ఫోన్ చేసి మాట్లాడింది. మరుగుదొడ్డి ఉన్న ఇంటికి మారుదామని మరోమారు బతిమాలింది. కానీ, అతను మాత్రం కరగలేదు. ససేమిరా కుదరదని చెప్పేశాడు. దీంతో ఆవేదన చెందిన రమ్య.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి కొయ్యకు వేలాడుతున్న రమ్యను.. గుర్తించిన ఆమె తల్లి ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. టాయిలెట్ లేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కష్టాలు ఎదురైనా.. మనోధైర్యంతో ముందుకు సాగే స్ఫూర్తిదాయకమైన కథలు ఎన్నో. అవి చూసి కూడా జీవితం విలువ గుర్తించరు కొందరు. పైగా చిన్నచిన్న కారణాలకే ప్రాణం తీసుకుంటారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసా, వాష్రూమ్లో భోజనాల తయారీ
సమోసా.. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్. ఆలు సమోసా, ఆనియన్ సమోసా, కార్న్ సమోసా ఇలా ఎన్నో రకాలున్నా.. ఆవురావురంటూ తినాల్సిందే. మరీ ముఖ్యంగా సాయంత్రం వేళల్లో స్నాక్ ఐటమ్గా సమోసాను తెగ లాగించేస్తుంటారు. అయితే ఆహార ప్రియులకు ఎంతో ప్రియమైన సమోసాకు సంబంధించిన ఓ చేదు వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సౌదీ అరేబియాలో ఓ రెస్టారెంట్లో ఒకటి కాదు రెండు కాదు గత 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసాలు, ఇతర స్నాక్స్ తయారు చేస్తోస్తోంది. అంతేకాదు రెస్టారెంట్లో కుళ్లిపోయిన మాంసాన్ని, ఇతర ఆహార పదార్థాలను కూడా వినియోగిస్తున్నారు. జెబ్బా నగరంలోని రెసిడెన్షియల్ భవనంలోని రెస్టారెంట్లో ఆహార భద్రత నియమాలు, పరిశుభ్రత పాటించం లేదని స్థానికుల అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే సదరు రెస్టారెంట్పై దాడి చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.. గత 30 ఏళ్లుగా టాయిలెట్లో స్నాక్స్ తయారుచేస్తున్నారని అధికారులు గుర్తించారు. అదే విధంగా, వాష్ రూమ్ లో భోజనాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్నాక్స్లో కాలపరిమితి ముగిసిన మాంసం, చీజ్ వంటి ఆహార పదార్ధాలను వాడుతున్నట్లు తెలిసింది. వీటిలో కొన్ని రెండు సంవత్సరాల కిందటివి కూడా ఉన్నాయి. రెస్టారెంట్లో పురుగులు, ఎలుకలు, బొద్దింకలు తిరగడం అధికారులకు కనిపించింది. దీంతో అధికారులు షాక్కు గురయ్యారు. చదవండి👉 నీ ఇల్లు బంగారం గానూ.. ఇంటి గోడలో రూ.10 కోట్లు, 19 కేజీల వెండి ఇటుకలు 30 ఏళ్ల నుంచి హోటల్ లో పనిచేసే వారికి కనీస నివాస సదుపాయాలు, కార్మికులకు హెల్త్ కార్డులు లేవని అధికారులు తెలిపారు. కాగా సౌదీ అరేబియాలో యితే సౌదీ అరేబియాలో అపరిశుభ్రత కారణంగా రెస్టారెంట్ను మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. జనవరిలో షావర్మా స్కేవర్పై ఎలుక మాంసం తింటూ కనిపించడంతో జెడ్డాలోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ కూడా మూతబడింది. కాగా సౌదీ వ్యాప్తంగా 2,833 రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జెడ్డా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43 చోట్ల ఉల్లంఘనలు గుర్తించామని, ఇందులో 26 మూసివేసినట్లు పేర్కొన్నారు. చదవండి👉 కారు నడిపిన ఎనిమిదేళ్ల బాలుడు.. రోడ్డుపై రయ్యిమంటూ -
టాయిలెట్లో చిక్కుకుపోయిన మహిళా క్రికెటర్.. మ్యాచ్ కోసం
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ నొకోలా కేరికి వింత అనుభవం ఎదురైంది. ఆమె దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్లో చిక్కుకుపోయారు. మ్యాచ్ మొదలయ్యే సమయానికి కేరీ అందుబాటులోకి రాకపోవడంతో జట్టును ఆందోళన కలిగించింది. ఆ తర్వాత జట్టుతో చేరిన కేరీ అసలు విషయం చెప్పడంతో నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియా మహిళల జట్టు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టింది. సోమవారం వెస్టిండీస్తో వార్మప్ మ్యాచ్కు సిద్ధమైంది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి కేరీ అందుబాటులోకి రాలేదు. ఏమైందా అని జట్టు కాస్త కంగారు పడింది. అరగంట తర్వాత కేరీ మైదానంలో దర్శనం ఇచ్చింది. విషయమేంటని కేరీని ఆరా తీయగా.. ''టాయిలెట్కు వెళ్లాను. పని పూర్తి చేసుకొని బయటకు వద్దామంటే డోర్ లాక్ అవ్వడంతో బయటికి రాలేకపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్లోనే ఉండిపోయాడు. ఆ తర్వాత సమాచారం అందుకున్న మా మేనేజర్ మాస్టర్ కీ సాయంతో డోర్ లాక్ తీశాడు. ఒకవేళ అది లేకుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో. మ్యాచ్ ఆడేందుకు డోర్ను బద్దలు కొట్టైనా బయటకు వచ్చేసేదాన్ని'' అంటూ పేర్కొంది. ఇక రికార్డు స్థాయిలో ఏడో ప్రపంచకప్ టైటిల్పై కన్నేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు వార్మప్ మ్యాచ్లో జోరు కనబరిచింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఏంచుకోగా.. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 259 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి 90 పరుగులుతో ఓటమి పాలైంది. చదవండి: Kohli-BCCI: 'కోహ్లిపై కోపం తగ్గలేదా'.. బీసీసీఐని ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్ Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడికి వరుస షాక్లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు Russia-Ukraine Crisis: దేశం కోసం కీలక మ్యాచ్ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్ Nic Carey got stuck (literally) in a less than ideal spot during yesterday’s warm-up! Ash Gardner has the details from Christchurch 🥶🤣 pic.twitter.com/wi7XhdnHZu — Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) February 28, 2022 -
గ్రామాల్లో టాయిలెట్ వేస్ట్ శుద్ధి కేంద్రాలు
సాక్షి, అమరావతి: సెప్టిక్ ట్యాంకులు నిండి ఇబ్బందిపడుతున్న గ్రామాల్లో.. టాయిలెట్ వేస్ట్ శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో డివిజన్కు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. సెప్టిక్ ట్యాంకుల నుంచి శుద్ధి కేంద్రాలకు టాయిలెట్ వేస్ట్ను తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది. సబ్సిడీ కమ్ లోన్ విధానంలో నిరుద్యోగ యువతకు ఈ వాహనాలను అందజేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అధికారుల అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనే రోజూ 5,940 కిలోలీటర్ల టాయిలెట్ వేస్ట్.. సెప్టిక్ ట్యాంకులకు చేరుతుంది. కానీ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో కేవలం రోజుకు 1,145 కిలోలీటర్ల టాయిలెట్ వేస్ట్ను శుద్ధి చేసే కేంద్రాలు మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో టాయిలెట్ వేస్ట్ను శుద్ధి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్కి ఒకటి చొప్పున గ్రామాల్లో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుద్ధి చేసిన టాయిలెట్ వేస్ట్ను.. సేంద్రియ ఎరువుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. తొలిదశలో 23 గ్రామాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 46 గ్రామాల్లో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 23 గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కొక్క చోట కనీసం అర ఎకరా స్థలంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క శుద్ధి కేంద్రం నిర్మాణం కోసం గరిష్టంగా రూ.1.80 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మిగిలిన గ్రామాల్లో రెండో దశలో చేపడతారు. -
ట్రంప్కి ఆఫీస్ పేపర్లను చింపి వైట్హౌస్ టాయిలెట్లో వేయడం హాబీ!
Documents ripped up, stuffed down the toilet: అమెరికా అధ్యక్షుల రికార్డులను భద్రపరిచే నేషనల్ ఆర్కైవ్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యహహార శైలిపై విచారణ చేయాలని న్యాయశాఖను అభ్యర్థించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష్య డాక్యుమెంట్లను చింపేసి టాయిలెట్లో పడేయడం లేదా ఫ్లోరిడాకు తరలించడం వంటివి చేశారని ఆరోపించింది. అంతేకాదు ట్రంప్ అధ్యక్ష పత్రాలను భద్రపరచడంలో చట్టాలను ఉల్లంఘించారని ఆర్కైవ్స్ పేర్కొంది. రిపబ్లికన్ మద్దతుదారులను ఆకర్షించే నిమిత్తం ట్రంప్ గతంలో ప్రెసిడెన్షియల్ డెకోరమ్ ఆమోదించిన అనేక నిబంధనన పత్రాలను పాడు చేసినట్లు వెల్లడించింది. అంతేకాదు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడూ వైట్హౌస్ పేపర్లను చించిపడేసే ట్రంప్ అలవాటు పై దర్యాప్తు చేయాలని ఆర్కైవ్స్ కోరింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ రికార్డుల కార్యాలయం ట్రంప్ ఫ్టోరిడా ఎస్టేట్ నుండి 15 బాక్సుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించింది. పైగా వాటిని ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన సమయంలో తనతోపాటు తీసువెళ్లారని పేర్కొంది. అంతేకాదు ఆ పత్రాలలో చాలామటుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి సంబంధించిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల తోపాటు అప్పటి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్ కోసం ఓవల్ ఆపీస్ని విడిచి వెళ్తున్నప్పుడు రాసిన లేఖ కూడా ఉందని వెల్లడించింది . అయితే ట్రంప్ మాత్రం అవన్ని ప్రేమ లేఖలని చెప్పడం గమనార్హం. ఈ మేరకు వాటర్గేట్ కుంభకోణం నేపథ్యంలో ఆమోదించిన 1978 ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ (పీఆర్ఏ) ప్రకారం యూఎస్ అధ్యక్షులు అన్ని ఈమెయిల్లు, ఉత్తరాలు, ఇతర పని పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్కు బదిలీ చేయాలి. అయితే ట్రంప్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ ఈ ఆరోపణలన్నింటిని ఖండించారు. అంతేగాదు ఆర్కైవ్స్తో తన వ్యవహారాలను ఎలాంటి వివాదం లేకుండా స్నేహపూరిత వాతావరణంలోనే కొనసాగించినట్లు పేర్కొన్నాడు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ మ్యాగీ హేబెర్మాన్ రాసిన "కాన్ఫిడెన్స్ మ్యాన్" పుస్తకం ప్రకారం వైట్ హౌస్ నివాసంలోని సిబ్బంది క్రమానుగతంగా మూసుకుపోతున్న టాయిలెట్లో ప్రింటెడ్ పేపర్ను కనుగొన్నారు అని రాయడం కొసమెరుపు. హేబెర్మాన్ ట్రంప్తో తీసుకున్న ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశాడు. జనవరి 6, 2020న అమెరికా క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కమిటీ కూడా ట్రంప్ అధికారిక పత్రాల కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కమిటీ అధ్యక్షురాలు కరోలిన్ మలోనీ మాట్లాడుతూ..ట్రంప్ పదేపదే అధ్యక్ష రికార్డులను నాశనం చేయడానికి ప్రయత్నించారని, తాము ఆ రికార్డుల గురించి ఆందోళన చెందుతున్నాం. ఇది తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుంది. అని వ్యాఖ్యానించారు. -
ఆఫీస్ టాయ్లెట్స్కు సున్నం వేయకున్నా జైలే..
న్యూఢిల్లీ: దేశ ద్రోహం కింద పరిగణించే నేరాలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. అయితే, వ్యాపార సంస్థలు మరుగుదొడ్లకు (లెట్రిన్లు, యూరినల్స్) నాలుగు నెలలకోసారి సున్నాలు వేయకపోయినా కూడా అదే స్థాయిలో ఏడాది నుంచి మూడేళ్ల వరకూ శిక్షలు వేయొచ్చని చట్టాలు చెబుతున్నాయి. ఇలా జైలు శిక్షకు ఆస్కారం ఉన్న అనేకానేక నిబంధనలను తూచా తప్పకుండా పాటించలేక దేశీయంగా వ్యాపారాలు నానా తంటాలు పడుతున్నాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) ఒక అధ్యయనంలో వెల్లడించింది. ’వ్యాపారం చేస్తే జైలుశిక్ష: భారత వ్యాపార చట్టాల్లో 26,134 జైలు శిక్ష క్లాజులు’ పేరిట టీమ్లీజ్ సంస్థతో కలిసి ఓఆర్ఎఫ్ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం భారత్లో వ్యాపార సంస్థల నియంత్రణకు నిర్దేశించిన నిబంధనలు 69,233 పైచిలుకు ఉన్నాయి. వీటిని పాటించకపోతే జరిమానాగా జైలు శిక్ష విధించేలా 26,134 క్లాజులు ఉన్నాయి. ‘ప్రతి అయిదు నిబంధనలకు కనీసం రెండు క్లాజులు .. వ్యాపారవేత్తలను జైలుకు పంపే విధంగా (నిబంధనలను పాటించనందుకుగాను) ఉంటున్నాయి‘ అని ఓఆర్ఎఫ్ పేర్కొంది. పారిశ్రామిక రంగంలో ముందున్న అయిదు రాష్ట్రాల (గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు) వ్యాపార చట్టాల్లో కనీసం 1,000కి పైగా జైలు శిక్ష క్లాజులు ఉన్నాయని వివరించింది. ఏటా రూ. 18 లక్షల భారం.. అధ్యయనం ప్రకారం.. 150 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్న సగటు చిన్న తరహా తయారీ సంస్థ (ఎంఎస్ఎంఈ) ఏటా 500–900 పైచిలుకు నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఈ భారం ఏటా రూ. 12–18 లక్షల స్థాయిలో ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ చేసిన అనేకానేక వ్యాపార చట్టాల్లో జైలు శిక్ష నిబంధనల వల్ల భారత్లో వ్యాపారాలు చేయడం సవాళ్లతో కూడుకున్నదిగా మారిందని ఓఆర్ఎఫ్ తెలిపింది. అతి నియంత్రణ వల్ల లాభాల కోసం పని చేసే సంస్థలతో పాటు లాభాపేక్ష లేని సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. టాయ్లెట్లను శుభ్రం చేయకపోవడాన్ని కూడా దేశద్రోహ నేరానికి సమానంగా పరిగణించి శిక్ష వేసేలా నిబంధనలు ఉండటం ఇందుకు ఉదాహరణగా ఓఆర్ఎఫ్ వివరించింది. అసంఖ్యాక నిబంధనలను పాటించేలా వ్యాపారవేత్తలను క్రిమినల్ శిక్షలతో అతిగా భయపెట్టడం వల్ల అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అనవసర నిబంధనలను తొలగించే విషయంలో ప్రభుత్వం శుభారంభం చేసిందని.. దాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో 26,134 జైలు క్లాజులకు కూడా విస్తరించాలని టీమ్లీజ్ వైస్ చైర్మన్ మనీష్ సబర్వాల్ తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించి గత ఏడేళ్లుగా సేకరించిన వివరాల ఆధారంగా డేటాను లేబర్, ఫైనాన్స్, ఆరోగ్యం తదితర ఏడు విభాగాల కింద ఓఆర్ఎఫ్ వర్గీకరించింది. దీని ప్రకారం అయిదు రాష్ట్రాల వ్యాపార చట్టాల్లో 1,000కి పైగా జైలు శిక్ష క్లాజులు ఉన్నాయి. గుజరాత్ (1,469), పంజాబ్ (1,273), మహారాష్ట్ర (1,210), కర్ణాటక (1,175), తమిళనాడు (1,043) ఈ జాబితాలో ఉన్నాయి. క్రమబద్ధీకరించేందుకు పది సూత్రాలు.. మితిమీరిన నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా వ్యాపార చట్టాలు, నియంత్రణలను క్రమబద్ధీకరించేందుకు నివేదికలో పది సూత్రాలను ప్రతిపాదించారు. క్రిమినల్ పెనాల్టీలను విధించడంలో సంయమనం పాటించడం, నియంత్రణల ప్రభావాలను మదింపు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం, జైలు శిక్ష విధించే క్లాజులను క్రమబద్ధీకరించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఉద్దేశ్యపూర్వకమైన ఉల్లంఘనలకు (పన్నుల ఎగవేత, పర్యావరణ విధ్వంసం మొదలైనవి) జైలు శిక్ష నిబంధనను కొనసాగిస్తూనే.. ప్రక్రియపరమైన లోపాలు, ఉద్దేశ్యపూర్వకం కాని తప్పిదాలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించవచ్చని నివేదిక సూచించింది. పౌరులు, రాజకీయవేత్తలు, అధికారులు కూడా ఈ సంస్కరణల విషయంలో తగు చొరవ చూపాలని పేర్కొంది. -
బాత్రూమ్లో ప్రత్యక్షమయిన నాగుపాము.. పరుగో పరుగు
కర్ణాటక: ఓ ఇంట్లోని మరుగుదొడ్లో నాగుపాము ప్రత్యక్షమయింది. ఈ ఘటన శివమొగ్గ నగరానికి సమీపంలో ఉన్న శివప్పనాయక లే ఔట్లో చోటుచేసుకుంది. ఇంట్లోని వ్యక్తి బాత్రూంలోకి వెళ్లగా.. అక్కడ పాము కనిపించడంతో బయటకు పరుగులు పెట్టాడు. అయితే బయట నుంచి మరుగుదొడ్లోకి వచ్చిన నాగుపాముకు అక్కడ నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాలేదు. దాంతో అందులోనే ఉండిపోయింది. అనంతరం ఇంటి సభ్యులు వెంటనే స్నేక్ కిరణ్కు సమాచారం ఇచ్చారు. దీంతో అతను వెంటనే అక్కడకు చేరుకుని నాగుపామును బంధించి సురక్షితంగా అడవిలో వదిలాడు. చదవండి: (MK Stalin: కరోనా ఉగ్రరూపం.. సీఎం స్టాలిన్ నడిరోడ్డుపై కారు ఆపి..) -
సూర్యాపేట: 216 మంది బాలికలకు రెండే.. ఇదీ వరస
సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్ఎస్లో 216 మంది బాలికలు, 302 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. బాలికలకు 2 మరుగుదొడ్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికు ల్లేక శుభ్రం చేయక జామ్ అయిపోయాయి. తప్పని పరిస్థితిలో బాలికలు వాటినే ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ఈ మరుగుదొడ్ల వద్దకు వెళ్లడానికి దారి సరిగా లేదు. ఆవరణలో మొలిచిన గడ్డిలో నీళ్లు చేరి మరుగుదొడ్లకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. బాలురకు మరుగుదొడ్లు అసలే లేవు. వీరు నిత్యం విరామ సమయంలో పాఠశాల ఆవరణలోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. చదవండి: Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63 -
టాయిలెట్ క్లీన్ చేసే రోబో.. ధర 40 వేల రూపాయలు!
Cleaning Robot: క్లీనింగ్లో అంట్లు తోమడం, గదులు తుడవటం ఓ ఎత్తు.. టాయిలెట్ క్లీన్ చెయ్యడం మరో ఎత్తు. ఆ సమస్యకు చెక్ పెట్టేస్తుంది ఈ గిడెల్ టాయిలెట్ క్లీనింగ్ రోబో. యాంటీమైక్రోబియల్ ప్లాస్టిక్ బాడీ కలిగిన ఈ డివైజ్.. మురికితో, గారతో డర్టీగా మారిన టాయిలెట్ని సైతం.. శుభ్రంగా, కొత్తదానిలా మార్చేస్తుంది. మెమరీ–టచ్ టెక్నాలజీ ఉన్న ఈ రోబోను చిన్న టాయిలెట్కి సైతం సులభంగా అటాచ్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి దీని బ్రషింగ్ పరిధి పెరుగుతుంది. మొత్తానికీ గుండ్రగా, పొడవుగా లేదా కోలగా ఉన్న టాయిలెట్ సీట్కి, మూతకి మధ్యలో కనెక్షన్ జాక్ బిగించి.. ఈ రోబోని మధ్యలో వదిలేసి స్విచ్ ఆన్ చేస్తే.. చుట్టూ తిరుగుతూ, శుభ్రంగా క్లీన్ చేస్తుంది. చిత్రంలోని బ్రష్ అన్ని మూలల్లోకి వెళ్లి మురికిని వదిలిస్తుంది. ల్యాబ్లో పలు పరీక్షలను ఎదుర్కొన్న ఈ రోబో.. టాయిలెట్ అడుగులో, నీళ్లు నిలబడే భాగాన్ని క్లీన్ చెయ్యడానికి తన బ్రష్ని అటోమెటిక్గా అదే పెంచుకుంటుంది. క్లీన్ చేశాక దానికదే తగ్గుతుంది. అవసరాన్ని బట్టి దీనికి చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ధర 530 డాలర్లు (రూ.40,019). చదవండి: ముక్కలుగా.. ఆ తర్వాత పేస్ట్లా మార్చే మాన్యువల్ చాపర్ -
128 మంది బాలురు.. బిగపట్టుకుని.. ఒకరి తరువాత ఒకరు
సాక్షి, వేములవాడ(కరీంనగర్): విద్య, వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ దిశగా పనులు కనబడడం లేదు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో మాత్రం ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కాక విద్యార్థులు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ఉదాహరణే వేములవాడ రూరల్ మండలంలోని 17 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు. ఇందులో ప్రధానంగా ఫాజుల్నగర్ మండల పరిషత్ పాఠశాలలో అసౌకర్యాల మధ్య పిల్లలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. 1వ తరగతి నుంచి ఐదోతరగతి వరకు 128 మంది పిల్లలు ఉన్నారు. వీరికి మూడు గదులు మాత్రమే ఉన్నాయి. రెండు గదులు చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో వాటిని వినియోగించడం లేదు. ఇక బాత్రూంల పరిస్థితి చెప్పనక్కర్లేదు. 128 మందికి ఒకే బాత్రూం ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టాల్సిందే. ఒకరు వెళ్లారంటే మిగితా వారు బిగపట్టుకుని వచ్చేవారి కోసం ఎదురుచూడాల్సిందే. ఇలా మండంలోని నమిలిగుండుపల్లి తదితర గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని చిన్నారుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ చైర్మన్లు కోరుతున్నారు. చదవండి: నాలుగు రోజుల్లో పెళ్లి.. యువకుడి అదృశ్యం -
‘174 మంది బాలికలకు ఒకటే’.. సాక్షి కథనానికి విశేష స్పందన
పెద్దవూర/ఆదిలాబాద్ టౌన్: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూత్రశాలల కొరతతో బాలికలు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ మెయిన్లో గురువారం ‘174 మంది బాలికలకు ఒకటే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు పాఠశాలలో మూత్రశాలలతో పాటు మౌలిక వసతులు కల్పించడానికి ముందుకు వచ్చారు. (174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం) హైదరాబాద్ మాదా పూర్కు చెందిన ఎన్సీసీ లిమిటెడ్ యాజమాన్యం విద్యార్థులకు కావాల్సిన మూత్రశాలలు నిర్మించటానికి ముందుకు వచ్చింది. తమ ప్రతినిధులను పాఠశాలకు పంపి.. ఎన్ని మూత్రశాలలు అవసరమవుతాయో ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో నిర్మించి ఇస్తామని తెలియజేసింది. ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిం చి దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థలు ముందు కు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ♦ కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ పాఠశాలలో రెడీమేడ్ మూత్రశాలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. ♦ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ రామారావు తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా పాఠశాలకు పది మరుగుదొడ్లు నిర్మించి ఇస్తామని, తమ ప్రతినిధులు పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు కల్పిస్తామని హామీనిచ్చారు. ♦‘సాక్షి’లో వచ్చిన విద్యార్థినుల ఇబ్బందుల వార్త తనను కదిలించిందని ఆదిలాబాద్లోని రిమ్స్ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కళ్లెం వెంకట్రెడ్డి తెలిపారు. రెండో మూత్రశాల మరమ్మతులకు తనవంతుగా రూ.10 వేల ఆర్థిక సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ♦ ఇంకా, సికింద్రాబాద్కు చెందిన రోటరీ క్లబ్ సైతం పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపింది. పోలీస్ శాఖలో సీఐగా పనిచేస్తున్న నులక వేణుగోపాల్రెడ్డి సైతం పాఠశాలలో అవసరమైన మూత్రశాలలు నిర్మించటానికి ముందుకు వచ్చారు. హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ గండికోట శ్రీనివాస్ తమవంతు సహాయం చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ సేవా సమితి సభ్యులు కూడా ఆర్థిక సహాయం అందించటానికి ముందుకు వచ్చారు. -
174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం
పెద్దవూర: బాలికలు బారులు తీరి కనిపిస్తున్న ఈ ఫొటో మూత్రశాల వద్దది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల పరిస్థితి ఇది. ఈ పాఠశాలలో మొత్తం 398 మంది విద్యార్థులున్నారు. బాలికల సంఖ్య 174 కాగా, మరో ఆరుగురు బోధన సిబ్బంది ఉన్నారు. ఇంతమందికి పాఠశాలలో ఉన్న మూత్రశాలలు మాత్రం రెండే. అందులో ఒకటి మరమ్మతులకు గురికాగా, వినియోగంలో ఉన్నది ఒకటి మాత్రమే. దీంతో విరామ సమయంలో ఇలా బారులు తీరాల్సి వస్తోంది. అరగంట ముందు నుంచే బాలికలను తరగతుల వారీగా విరామానికి పంపిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చదవండి: టాయిలెట్స్ ఎవరు కడగాలి? -
కిక్కు కోసం.. బాస్కు రిజైన్ లెటర్ దేని మీద రాసిచ్చాడంటే !
సాధారణంగా ఉద్యోగులు తాము పని చేస్తున్న కంపెనీ నచ్చకపోతే రాజీనామా చేయడం సహజం. అందుకు వారు ఏ వైట్ పేపర్పైనో, లేదా మెసేజ్, ఈ మెయిల్ ద్వారా పంపడం సహజమే. ఎవరు రాజీనామా చేయాలన్నా ఇదే ఫాలో అవుతారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందని భావించాడో, లేదా బాస్పై కోపమో గానీ తన రాజీనామాను విచిత్రంగా రాశాడు. అంతేనా.. అతను ఏ పేపర్ మీద రాశాడో తెలిస్తే షాక్తో పాటు యాక్ కూడా అంటారు మరీ. అసలు ఆ ఉద్యోగి చేసిన నిర్వాకం ఏంటంటే.. ఓ ఉద్యోగి తన కంపెనీకి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరూ ఇచ్చినట్లు తన రాజీనామాను ఇస్తే కిక్కు లేదనుకున్నాడు. అందుకే.. ఏకంగా టాయిలెట్ పేపర్ మీద తన రాజీనామా లేఖను రాశాడు. ఈ నెల 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని రాసి.. తన బ్యాక్ చూపిస్తున్నట్టుగా డ్రాయింగ్ కూడా వేశాడు. దాన్ని రెడిట్లో పోస్ట్ చేసి.. మా బాస్కు ఇదే రాజీనామా పత్రాన్ని ఇవాళ ఇవ్వబోతున్నా అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారి హల్ చల్ చేస్తోంది. టిష్యూ పేపర్పై రాసిన లెటర్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాప్రే.. ఇలాంటి రిజైన్ లెటర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఇంటర్వ్యూలో అన్నీ కరెక్ట్గా చెప్పినా.. ఆ సిల్లి కారణంతో రిజెక్ట్ చేశారు -
మన టాయిలెట్స్లాగే బడిలోనివీ శుభ్రంగా ఉండాలి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన టాయిలెట్స్ కల్పించాలన్న ప్రభుత్వ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న అధికారులను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు. విద్యార్థులతో కలిసి అధికారులు భోజనం చేస్తున్న, అధికారులే స్వయంగా మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న ఫొటోలను ఈ ట్వీట్కు సీఎం జతచేశారు. ‘ఇటీవల విద్యాశాఖ సమీక్షలో నేను ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలల్లో నాణ్యమైన వసతుల కల్పనకు అధికారులు తీసుకుంటున్న చొరవ అభినందనీయం. ఇంట్లో మనం తినే భోజనం ఎంత నాణ్యంగా ఉండాలనుకుంటామో అంతే నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు అధికారులు సైతం అంతే తపనపడుతున్నారు. మనం ఉండే ఇంటి పరిసరాలు, టాయిలెట్ పరిశుభ్రంగా ఉండాలని మనం ఆశించినట్లుగానే బడిలో టాయిలెట్స్ కూడా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఈ సంకల్పాన్ని అధికారులు ముందుకు తీసుకెళ్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది’ అంటూ సీఎం తన ట్వీట్లో పేర్కొన్నారు. -
టాయిలెట్స్ ఎవరు కడగాలి?
World Toilet Day 2021: ఇది భలే సహజ విషయం. స్త్రీలకు సహజంగా కేటాయించబడిన విషయం. పిల్లలు పుడితే వారి టాయిలెట్ను శుభ్రం చేయడం స్త్రీల పని. ఇంట్లో బాత్రూమ్లను క్లీన్ చేయడం స్త్రీల పని. వయసు మీరిన వారు లావెటరీ వరకు వెళ్లలేకపోతే కూతురు, కోడలు లేదా పనిమనిషి మొత్తానికి స్త్రీలే వాటిని ఎత్తి పోసే పని. టాయిలెట్స్ కట్టే వరకు స్త్రీలు ఒక అవస్థ పడ్డారు. కట్టాక చీపుళ్లు పట్టుకు నిలబడుతున్నారు. పురుషులకు రెండు చేతులు ఉన్నాయి. వారు ఎందుకు ఈ పని షేర్ చేసుకోరు? ఈ పని స్త్రీలు మాత్రమే ఎందుకు చేయాలి? ఎంతకాలం చేయాలి? మొత్తం మీద పని మనుషులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకుంటున్నారు. ఇంటి పని ఒప్పుకునే ముందు ‘టాయిలెట్లు తప్ప’ అని చెబుతున్నారు. ఒకప్పుడు ఇంటి పనిలో టాయిలెట్లు శుభ్రం చేయడం కూడా ఉండేది. కాని ఇప్పుడు పని మనుషులు ఒప్పుకోవడం లేదు. అంట్లు, బట్టలు, ఇల్లు ఓకే. టాయిలెట్లు? ఎవరికి వారు శుభ్రం చేసుకోవడం కదా సంస్కారం. అయితే అది దాదాపు అన్ని ఇళ్లల్లో స్త్రీ సంస్కారం మాత్రమే. పురుషుడిది కాదు. గాంధీజీ ఏ విషయానికైనా గొప్పవారే. ఆయన తానే ఒక పార పట్టుకుని బహిర్భూమికి వెళ్లేవారు. వచ్చే ముందు పారతో మట్టిపోసి వచ్చేవారు. విసర్జనం ఒక నిత్యకృత్యం. శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు అందుకై వాడే స్థలం కూడా ఎవరికి వారు శుభ్రం చేయాలి. కాని పురుషుడై ఉంటే అందునా భర్త అయితే ఈ చోటు శుభ్రం చేసే పని భార్యదిగా ఉంటుంది. భార్యది మాత్రమే ఎందుకు? తరతరాల ఇబ్బంది భారతదేశంలో రోజు వారీ తప్పని ఈ అవసరానికి స్త్రీలను తరాలుగా ఇబ్బంది పెట్టారు. టాయిలెట్లు కట్టక, స్తోమత ఉన్నా మూఢత్వం కొద్దీ కట్టక, వారి మర్యాదను పట్టించుకోక ఇబ్బంది పెట్టారు. స్త్రీలు బహిర్భూమికి సిగ్గుతో చితుకుతూ ఊరికి దూరంగా వెళ్లాల్సి రావడం ఒక అంశమైతే రాత్రి పొద్దుపోయాక లేదా తెల్లవారుజామున తుప్పల్లోకో పొదల్లోకో వెళ్లి ప్రమాదాల్లో పడ్డారు. దాడులకు గురయ్యారు. తొంగి చూసే ఆకతాయిల వల్ల అవమానాలు పడ్డారు. ‘స్వచ్ఛభారత్’ వల్ల గాని, దానికి ముందు ప్రభుత్వాలు చేసే ప్రచారం వల్లగాని ఈ సమస్య ఒక కొలిక్కి వస్తున్నా ఇంకా టాయిలెట్లు లేని ఇళ్లు, టాయిలెట్లకు నోచుకోని పేదజనం ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ టాయిలెట్ డే’ నిర్వహించేది ప్రతి మనిషి శుభ్రత కలిగిన, మరుగు కలిగిన ప్రదేశంలో గౌరవం చెడకుండా కాలకృత్యాలు తీర్చుకునే హక్కు కలిగి ఉన్నాడని చెప్పేందుకే. సరే... టాయిలెట్లు వచ్చాయి. వాటిని కడగడం ఎవరి వంతు? నీటి సమస్య... శుభ్రత సమస్య టాయిలెట్లు కడగడం అంటే ఆ కొద్దిపాటి స్థలం కడగడం మాత్రమే కాదు. అందుకు నీళ్లు కావాలి. ఈ దేశంలో 90 శాతం ఇళ్లలో నీళ్లు పట్టాల్సిన, మోయాల్సిన, పొదుపు చేయాల్సిన బాధ్యత స్త్రీలది. నలుగురు కుటుంబ సభ్యులు కాలకృత్యాల కోసం రోజులో ఐదారుసార్లు టాయిలెట్లను వాడితే ప్రతిసారీ నీరు ఖర్చవుతుంది. ఆ నీరు మోసే పని భారం స్త్రీ మీద పడుతుంది. తమ టాయిలెట్ అవసరాలకు నీరు మోసుకోవాలని పిల్లలకు నేర్పాల్సి ఉంటుంది. భర్త తానే పట్టి తెచ్చి ఉదాహరణగా నిలవాల్సి ఉంటుంది. ఈ రెండూ జరగడం మృగ్యం. ఇంకా సమస్య ఏమిటంటే ‘టాయిలెట్ ఎటికెట్’ను పాటించకపోవడం. టాయిలెట్ వాడి చేతులూపుకుంటూ వచ్చేస్తే ‘నీళ్లు కొట్టండ్రా’ అని స్త్రీలు వారి వెనుక వెళ్లి ప్రతిసారీ నీళ్లు కొట్టాలి. నీళ్లు మోయాలి.. నీళ్లు కొట్టాలి... అన్నిసార్లు టాయిలెట్ను చూడాల్సి రావడం ఎవరికైనా వికారంగానే ఉంటుంది. స్త్రీలకు ఆ వికారం ఎందుకు? ఈ శ్రమ ఎవరిది? ఇంట్లో వయసు మీరిన వారుంటే వారు జబ్బున పడితే స్త్రీల పైప్రాణాలు పైనే పోతాయి. దానికి కారణం వారి టాయిలెట్ అవసరాలు చూడాల్సి రావడమే. ఈ సమస్యను పురుషులు సరిగా అడ్రస్ చేయకపోవడం వల్ల కుటుంబ నిర్మాణంలో అనేక అంతరాలు, అవాంతరాలు వస్తున్నాయి. వయసు మీరిన అత్తగారిని, మావగారిని ఇంట్లో ఉంచుకోవడానికి ‘కొందరు కోడళ్లు’ సుముఖంగా లేరు అని అనడం వింటూ ఉంటే ‘ఆ పెద్దల సేవను ఎవరు చేయాలి?’ అనే ప్రశ్నకు సమాధానం పురుషుడు చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక కారణాల రీత్యా ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టే వీలు లేదు. ఈ సేవకు పురుషుడు సిద్ధ పడడు. మరి స్త్రీనేగా చేయాలి. చేయడానికి ఆమె నిరాకరించదు, పురుషుడు కనుక ఆ పనిలో భాగం పంచుకుంటే. ఈ పనిని, సేవను గొప్పగా చేసిన పురుషులు ఉన్నారు. కాని వారి శాతం స్వల్పం. ఒకరిపై ఆధారపడేలా టాయిలెట్ అవసరాలు తీర్చుకునే పెద్దవారు ఉంటే పురుషుడు అప్రమత్తం కావాలి. స్త్రీతో చర్చించాలి. ఆ శ్రమను సరిగా విభజన చేయాలి. సెంటిమెంట్లు, బాధ్యతలు ఏ పనిలో అయినా సరే కాని ఈ పనిలో కాదు. ఫినాయిల్, బ్రష్ పట్టండి ఇల్లు శుభ్రంగా ఉండటం ఎంత ముఖ్యమో టాయిలెట్ శుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. సబ్బు వాసనలు వచ్చే టాయిలెట్లో వెళ్లడానికి ఇష్టపడతారు ఎవరైనా చెడు వాసనలు వచ్చే టాయిలెట్ కంటే. కనుక పురుషులు తమకు సమయం చిక్కినప్పుడు నెలకు ఇన్నిసార్లు అని టాయిలెట్ను తప్పక శుభ్రం చేయాలి. ఇంట్లో ఉన్న మగపిల్లల చేత చేయించాలి. ఫినాయిల్ వాడటం, బ్రష్ పట్టుకుని కమోడ్లను తోమడం కూడా నేర్చుకోవాలి. నీటి సమస్య ఉన్న ప్రాంతాలైతే మరింత బాధ్యతగా వ్యవహరించాలి. టాయిలెట్లు కూడా క్లీన్ చేయలేవా అని గీరగా భార్య వైపు చూసే భర్తలు ఒకసారి బాత్రూమ్లో చీపురు, నీళ్లు పట్టుకుని అడుగుపెట్టండి. ప్లీజ్. ఈ పనిని, సేవను గొప్పగా చేసిన పురుషులు ఉన్నారు. కాని వారి శాతం స్వల్పం. ఒకరిపై ఆధారపడేలా టాయిలెట్ అవసరాలు తీర్చుకునే పెద్దవారు ఉంటే పురుషుడు అప్రమత్తం కావాలి. స్త్రీతో చర్చించాలి. ఆ శ్రమను సరిగా విభజన చేయాలి. సెంటిమెంట్లు, బాధ్యతలు ఏ పనిలో అయినా సరే కాని ఈ పనిలో కాదు. -
టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!!
This is Why You Should Not Spend More Than 10 Minutes on the Toilet: చాలా మందికి టాయిలెట్లో ఎక్కువ సమయం గడపటం అలవాటు. టాయిలెట్లో తీరిగ్గా కూర్చుని ఫోన్ చూస్తూ గంటల కొద్ది సమయం ఈజీగా గడిపేస్తారు. ఐతే ఆ పొజిషన్లో ఎక్కువ సమయం కూర్చోవరటం ఎంత ప్రమాదమో తెలిస్తే 10 నిముషాలకంటే ఎక్కువ సమయం టాయిలెట్లో ఎప్పటికీ గడపరు. అవునండీ.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ సుందర్ల్యాండ్కి చెందిన క్లినికల్ లెక్చరర్ ఎన్హెచ్ఎన్ సర్జన్ డా. కరన్ రాజన్ మాటల్లో.. ‘టాయిలెట్లో 10 నిముషాల కంటే ఎక్కువ సమయం కూర్చుంటే మల మార్గంలో ఉండే రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువయ్యి, రక్తనాళాలు ఉబ్బి ఫైల్స్ ఏర్పడతాయి. ఈ వ్యాధిని హెమోరాయిడ్ అని అంటారు. వీటిని తొలగించాలంటే శస్త్ర చికిత్స ఒక్కటే మార్గం. జీర్ణ ప్రక్రియ సజావుగా జరగడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ప్రతి రోజూ తీసుకుంటే మల విసర్జన సక్రమంగా ఉంటుంది' అని వివరించారు. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. మీ జీవితంలో ఫైల్స్ సమస్య ఎప్పటికీ తలెత్తకుండా ఉండాలంటే ఈ సూచనలు ఖచ్చితంగా పాటించడం ఒక్కటే మార్గం. కాబట్టి టాయిలెట్లో సిట్టింగ్ పొజిషన్లో 10 నిముషాల కంటే ఎక్కువ సమయం గడపకండే!! జాగ్రత్త మరి..! చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!! -
30 ఏళ్లుగా టాయిలెట్ నీటినే తాగారా!
టోక్యో: జపాన్లోని ఒక ఆసుపత్రి సిబ్బంది, రోగులు సుమారు 30 ఏళ్లుగా టాయిలెట్ నీటినే తాగు నీరుగా ఉపయోగించారట. అబ్బా ఏంటి ఇది ? అది కూడా జపాన్లోనా అని ఆశ్యర్యపోకండి. అసలేం జరిగిందంటే జపాన్లోని ఒసాకా విశ్వవిద్యాలయ ఆసుపత్రి పరిసరాల్లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో తవ్వుతుండగా కొన్ని పంపు నీటి పైపులు తప్పుగా ఏర్పాటు చేయబడినట్లు గుర్తించింది. (చదవండి: వర్క్ ఫ్రం హోం: ఎక్స్ ట్రా వర్క్కి చెక్ పెట్టేలా కొత్త చట్టం) పైగా ఆ తాగునీటి పైపులు మరుగుదొడ్డికి అనుసంధానం చేసి ఉంది. ఈ ఆసుపత్రి 1993లో ప్రారంభమైనప్పుడు 120 పైపులు నుంచి నాసిరకం నీరు వస్తున్నట్లు అప్పట్లో ఫిర్యాదుల కూడా వచ్చాయి. కానీ ఇప్పుడ విచారిస్తే ఆ టాయిలెట్ వాటర్ని రోగులు, సిబ్బంది 30 ఏళ్లుగా వినియోగించినట్టు తేలింది. దురదృష్టమేమిటంటే ఆసుపత్రికి సంబంధించిన భవనాలు నిర్మిచాలనుకునే వరకు ఎవ్వరు వీటిని గుర్తించలేకపోయారు. అయితే ఆ నీటిని తాగినందు వల్ల ఎవ్వరు అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి రికార్డుల్లో నమోదు కాలేదు. అధునాతన వైద్య సంరక్షణను అందించే విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో ఇలా జరగడం తమను ఆందోళనకు గురిచేసిందని తనని క్షమించండి అంటూ ఆ ఆసుపత్రి డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ కజుహికో నకటానీ సిబ్బందిని, రోగులను వేడుకున్నారు. (చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!) -
2700 నాటి పురాతన టాయిలెట్.. ఎలా ఉందంటే?
జెరూసలేం: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాగా ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో బెరూసలేం ఒకటన్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేయడంతో పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం కూడా ప్రైవేటు బాత్రూమ్లు ఉండేవని తేలింది. ఆ టాయిలెట్ కింద లోతైన సెప్టెక్ ట్యాంక్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారి తెలిపారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి మరుగుదొడ్లను కొనుగోలు చేసేవారని చెప్పారు. టాయిలెట్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులోని జంతువుల ఎముకలతో పటు లభించిన పలు వస్తువల ఆధారంగా ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలితో పాటు అప్పటి వ్యాధులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ విహార ప్రదేశంలో పెద్ద ఎస్టేట్ ఉన్న ప్రదేశంలో ఈ టాయిలెట్ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్ను అధికారులు పురావస్తు సదస్సులో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు, అయితే అది వీక్షించడానికి మాత్రమే. చదవండి: Taliban: సోమనాథ్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశాం -
మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు
బాలానగర్: మరుగుదొడ్డిలో నివసిస్తున్న ఆ కుటుంబ కష్టాలను సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. సాక్షి కథనానికి స్పందించిన మానవతామూర్తులు ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరికి చెందిన సుజాతకు పక్కా ఇల్లు కట్టించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన సుజాత భర్త ఆరేళ్ల కిందట మృతి చెందాడు. అయితే వారి ఇల్లు మూడేళ్ల కిందట కూలిపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో ఇల్లు నిర్మించుకోవడం కష్టమవడంతో ఇంటి ముందు ఉన్న మరుగుదొడ్డిలోనే నివసిస్తున్నారు. చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్గా కార్పొరేటర్ భర్త కేసు సుజాతతోపాటు తన ఇద్దరు పిల్లలు, అత్తతో కలిసి మరుగుదొడ్డిలో ఉంటున్నారు. వీరి కష్టాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఆదిబట్లకు చెందిన ప్రభాకర్రెడ్డి, ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన బంధువు రాఘవరెడ్డి, రత్నాకర్రెడ్డి ముందుకు వచ్చారు. తమ స్నేహితుల సహకారంతో సుజాతకు ఇల్లు కట్టించేందుకు ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చురుకుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి గ్రామానికి చెందిన మోహన్నాయక్కు రూ.1.60 లక్షలు అందజేసి ఇంటి నిర్మాణం పూర్తి బాధ్యతను అప్పగించారు. రెండు నెలల్లోగా ఇంటి నిర్మాణం పూర్తిచేయాలని వారు కోరారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ -
వన్డ్రైవ్ ఇన్ ఫుడ్కోర్టు బాత్రూంలో స్పై క్యామ్
-
వన్డ్రైవ్ ఇన్ ఫుడ్కోర్టు బాత్రూంలో స్పై క్యామ్: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్కోర్టులోని మహిళల టాయిలెట్లో తన సెల్ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న హౌస్ కీపింగ్ బాయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు హౌజ్ కీపర్ బెనర్జీనే స్పై క్యామ్ పెట్టినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్పై క్యామ్లో ఐదు గంటల డేటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. (చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్) ఇక ఈ వ్యవహారంలో వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వన్ డ్రైవ్ ఇన్లో సీసీ కెమెరా బ్యాక్ అప్ లేకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు హౌస్ కీపర్ బెనర్జీ ఇంటితో పాటు ఓనర్ చైతన్య నివాసంలో తనిఖీలు చేశారు. సీక్రెట్ కెమెరాల్లో 20 మంది అమ్మాయిల నగ్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెనర్జీ పై నిర్భయ కేసు నమోదు చేశారు. చదవండి: అమెజాన్లో కత్తి కొని ప్రియురాలి ఇంటికి.. చివరికి ఏమైందంటే -
జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్కోర్టులోని మహిళల టాయిలెట్లో తన సెల్ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న హౌస్ కీపింగ్ బాయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా బట్టి గూడెం గ్రామానికి చెందిన బొంగరాల బెనర్జీ (18) ఓ హోటల్లో ఆరు నెలల నుంచి పనిచేస్తున్నాడు. (చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు, ఇంకా పెళ్లి కాలేదని..హోటల్కు తీసుకెళ్లి) మూడురోజుల క్రితం తన సెల్ఫోన్ వీడియో కెమెరా ఆన్ చేసి హోటల్లో మహిళలు ఉపయోగించే టాయిలెట్లో పైన పెట్టాడు. దానిలో రికార్డైన వీడియోలు ప్రతిరోజూ చూస్తుండేవాడు. మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతోంది. అయితే బుధవారం ఓ యువతి ఆ సెల్ఫోన్ను గమనించి యజమానికి ఫిర్యాదు చేసింది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఆ బలం ఆర్చనకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో) సెల్ఫోన్ను సీజ్ చేశారు. సుమారు 20 మంది మహిళల వీడియోలు ఫోన్లో చిత్రీకరించినట్లుగా గుర్తించారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడురోజుల నుంచే ఈ తతంగం నడుస్తోందా? ఇంతకు ముందు కూడా ఏమైనా వీడియోలు తీశాడా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అతడి భార్య, ఆమె భర్త మిస్సింగ్.. పోలీసులే అవాక్కయ్యారు!) -
ఆఫీస్ కోసం టాయిలెట్ అద్దెకు ఇవ్వబడును.. వారానికి అద్దె..
గ్లాస్గో : ఖాళీగా పడుందని అనుకున్నాడో ఏమో తెలీదు కానీ! ఏకంగా టాయిలెట్నే అద్దెకు ఇవ్వడానికి చూశాడో వ్యక్తి. అది కూడా ఆఫీసు కోసం. వివరాలు.. స్కాట్లాండ్, గ్లాస్గోలోని పాట్రిక్కు చెందిన ఓ వ్యక్తి గమ్ట్రీ అనే ప్రాపర్టీ సైట్లో కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన ఇచ్చాడు. తన అపార్ట్మెంట్ బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టాయిలెట్ను అద్దెకు ఇస్తున్నానని.. వైఫై, రిఫ్రిజిరేటర్, టీ కెటిల్, బల్ల, కుర్చీ ఇలా కొన్ని రకాల వసతులు అందులో ఉన్నట్లు ప్రకటనలో వెల్లడించాడు. ఓ వ్యక్తి ఆఫీసు నిర్వహించుకోవటానికి బాగుంటుందని పేర్కొన్నాడు. ఆ టాయిలెట్ వాడుకోవటానికి వారానికి 50 స్టెర్లింగ్ పౌండ్లు(5,070 రూపాయలు) చెల్లించాలని తెలిపాడు. తాను సోమవారం-శుక్రవారం.. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటానని, ఎక్కువ కాలానికి అద్దెకు తీసుకునే వాళ్లకు తాళం చెవులు కూడా ఇస్తానన్నాడు. ఈ ప్రకటనను చదివిన నెటిజన్లు సదరు వ్యక్తిపై సీరియస్ అయ్యారు. టాయిలెట్ను అద్దెకివ్వటమేంటి.. దానికి 50 స్టెర్లింగ్ పౌండ్ల అద్దేంటని మండిపడ్డారు. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి తన పోస్ట్ను డిలేట్ చేసేశాడు. చదవండి : ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో.. ఛీ అది కలిపావేంట్రా -
హైదరాబాద్లో ఇదేం విచిత్రం.. షీ టాయిలెట్లలో షాపులా?
సాక్షి, రామంతాపూర్: వివిధ పనుల నిమిత్తం ఇళ్లనుంచి బయటకు వచ్చే నగర మహిళలు అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళల ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ షీ టాయిలెట్ల ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణ అగమ్యగోచరంగా తయారవడం మహిళల పాలిట శాపంలా తయారవుతోంది. వివరాలివీ... రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఐడీఏ ఉప్పల్ సమీపంలో మోడ్రన్ బేకరీ ఎదురుగా ఉన్న బస్టాండ్ ఆనుకొని షీ టాయిలెట్ను ఏర్పాటు చేశారు. ఈ షీ టాయిలెట్లను బస్సుల కోసం ఎదురు చూసే మహిళలతో పాటు స్థానికంగా ఉన్న ఐడీఏ ఉప్పల్లో పలు ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులు వినియోగిస్తుంటారు. అయితే షీ టాయిలెట్ అని చూడకుంగా వీటిని ఆనుకొని షాపులు ఏర్పాటు చేశారు. ఈ షాపులను పురుషులే నిర్వహిస్తున్నందున చాలామంది మహిళలు షీ టాయిలెట్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యాలకు గురవుతున్నారు. ఈ టాయిలెట్లను ఆనుకొని ఉన్న షాపులను దూరంగా తరలించాలని లేదా ఈ షీ టాయిలెట్ను మహిళలే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. -
సఫాయి కర్మచారీ.. వి ఆర్ 'వెరీ సారీ'
వారు మోరీలలోకి దిగుతారు.. మురికి నీటిలో మునుగుతూ.. మురికి కంపుని పీల్చుతూ.. ప్రాణాలను ఫణంగా పెట్టి మానవ వ్యర్థాలను ఎత్తిపోస్తారు. సంఘంలో వారు వివక్షను ఎదుర్కొంటారు.. అయినా డీలా పడకుండా మరుగుదొడ్లలోని మలమూత్రాలను ఎత్తిపోస్తూ ప్రజలు పలు రోగాల బారిన పడకుండా తమవంతు కృషి చేస్తుంటారు. వారే శ్రమ ప్రేమికులు..రోగాలను తరిమేసే సిపాయిలు.. సఫాయి కర్మచారీలు! సాక్షి, అమరావతి: మరుగుదొడ్లలోని మలమూత్రాలను మనుషులే ఎత్తిపోసే పద్ధతి దేశంలో ఇంకా ఉందా? వందల ఏళ్ల నాటి అత్యంత హీనమైన ఈ పద్ధతిని రద్దు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చినా ఈ వ్యవస్థ ఇంకా పోలేదా? అంటే కేంద్ర ప్రభుత్వం అవుననే జవాబు చెబుతోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభకు చెప్పిన దాని ప్రకారం దేశంలో 58,098 మంది సఫాయి కార్మికులు ఉన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తూ 2013లో మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధిత చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ తర్వాత 2019లో జరిపిన సర్వే ప్రకారం దేశంలో 58,098 మంది సఫాయి కార్మికులు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వీరు ఉన్నట్లు సర్వే తెలిపింది. వీరి పునరావాసానికి కేంద్రం కట్టుబడి ఉందని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటిస్తూనే ఏమేమి చర్యలు చేపట్టిందో వివరించింది. ఆ వృత్తిలో ఉన్న వారిని విముక్తి చేసేందుకు సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడున్న సఫాయి కర్మచారీలలో అర్హులైన వారికి నగదు సాయం చేసి విముక్తం చేసింది. మరో 16,057 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తోంది. 1,387 మందికి స్వయం ఉపాధి పథకాలకు మూలధన పెట్టుబడిలో సబ్సిడీ ఇచ్చింది. అయినా ఇంకొంతమంది ఆ వృత్తిలోనే ఉన్నట్లు గుర్తించి వారిని విముక్తం చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. వారి వివరాలను ‘స్వచ్ఛ అభియాన్’లో అప్లోడ్ చేయండి దేశంలో మాన్యువల్ స్కావెంజర్లతో శుభ్రం చేయించే మరుగుదొడ్లే లేకుండా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రకటించింది. ప్రతి ఇంటికీ మరుగు దొడ్డి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇప్పటికే 10.71 కోట్ల పరిశుభ్రమైన లెట్రిన్లను, పట్టణ ప్రాంతాల్లో 62.57 లక్షల లెట్రిన్లను నిర్మించింది. దీంతో సఫాయికర్మచారీల అవసరం తొలగిపోయినా ఇంకా అక్కడక్కడ మిగిలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. సఫాయికర్మచారీలు ఎక్కడైనా చేతికి బకెట్ తగిలించుకుని, చీపురు కట్ట, ఇనుప రేకు పట్టుకుని కనిపించినా, ఎక్కడైనా లెట్రిన్లను శుభ్రం చేస్తున్నా, మనుషులు శుభ్రం చేసే లెట్రిన్లు కనిపించినా ఫోటోలు తీసి ‘స్వచ్ఛ అభియాన్’ మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలని కేంద్రం సూచించింది. ఇలా చేయడం వల్ల వారి వివరాలు కనుక్కోవడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించవచ్చని, సఫాయి కర్మచారీల వ్యవస్థను రూపుమాపవచ్చని పౌర సమాజానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. -
బాత్రూంలో కొండ చిలువ.. కాటు వేయగానే షాక్లోకి..
కాన్బెర్రా: సాధారణంగా మనలో చాలా మంది పాములంటే తెగ భయపడిపోతుంటారు. ఒకవేళ పొరపాటున కంటపడితే వెంటనే అక్కడి నుంచి మాయమైపోతారు. ఆ తర్వాత అక్కడి, దరిదాపుల్లోకి వెళ్లటానికి సాహసం చేయరన్న విషయం తెలిసిందే. అయితే, ఒక్కొసారి పాములు, కొండ చిలువలు ఆహరం కోసం లేదా ఆవాసం కోసం మనిషి ఇళ్లలోనికి ప్రవేశిస్తున్న సంఘటనలను మనం తరచుగా చూస్తునే ఉంటాం. అయితే, తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో జరిగింది. వివరాలు.. కాన్బెర్రాలోని గ్రాజ్లో 65 ఏళ్ల ఒక వ్యక్తి ఉదయం 5 గంటలకు నిద్రలేచాడు. ప్రతిరోజు మాదిరిగా తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంకు వెళ్లాడు. ఈ క్రమంలో గత సోమవారం అతడు ఒక షాకింగ్ సంఘటన ఎదుర్కొన్నాడు. బాత్రూంలో కూర్చున్నప్పుడు ఒక కొండ చిలువ మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో కాటు వేసింది. దీంతో షాక్ కు గురైన ఆవ్యక్తి తేరుకుని వెంటనే బేసిన్ కింద చూశాడు. అక్కడ 5 అడుగుల కొండ చిలువను చూసి భయంతో వణికిపోయాడు. వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తన ఇంటిపక్కన ఉండే 24 ఏళ్ల యువకుడు కొండ చిలువల్ని, పాములను పెంచుతున్నాడని గుర్తించారు. అతని అపార్ట్ మెంట్లో దాదాపు 11 రకాల విషపూరిత పాములు ఉన్నాయని పోలీసులు కనుగొన్నారు. అయితే, ఈ కొండ చిలువ కాటుతో ప్రాణానికి పెద్దగా ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. ఆ వృద్ధుడిని, కాటు వేసిన కొండ చిలువ కొన్ని రోజుల ముందు తప్పిపోయిందని ఆ యువకుడు విచారణలో తెలిపాడు. కొండ చిలువ బాత్రూంలో కాటువేసిన తర్వాత అది కాలువ లోనికి వెళ్లి తప్పించుకుంది.ఆ యువకుడు నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వెంటనే పాములను పట్టేవారికి సమాచారం అందించారు. కాగా, ఆగ్నేయాసియాలో ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువలు ఉంటాయి. ఇవి మానవులకు పెద్దగా హని కల్గించవు. -
కరోనా పేషెంట్ల మరుగుదొడ్లు కడిగిన చిన్నారి.. వీడియో వైరల్
ముంబై(బుల్దానా): కరోనా పేషంట్లకు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను 8 ఏళ్ల చిన్నారితో కడిగించిన అవమానీయ ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్పూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరోడ్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషద్ పాఠశాలను కొద్ది రోజల క్రితం కోవిడ్ ఐసోలేషన్ సెంటర్గా మార్చారు. ప్రస్తుతం ఈ ఐసోలేషన్ సెంటర్లో 15 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. కాగా మే 29న ఐసోలేషన్ సెంటర్ నిర్వహణ ఎలా ఉందో చూడడానికి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వస్తున్నట్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సంగ్రామ్పూర్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఇన్స్పెక్షన్ నేపథ్యంలో పాఠశాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అక్కడి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అయితే పనిచేయడానికి పారిశుధ్య కార్మికులు రాకపోవడంతో సెంటర్ నిర్వాహకుడు.. ఊరిలో బంధువులను చూడడానికి వచ్చిన 8 ఏళ్ల చిన్నారిని బలవంతంగా పాఠశాలకు తీసుకెళ్లాడు. కరోనా పేషంట్ల మరుగుదొడ్లను శుభ్రం చేయాలని.. లేకపోతే కట్టెతో కొడతానని బెదిరించాడు.దీంతో భయపడిన ఆ చిన్నారి మరుగుదొడ్లను ఏడుస్తూనే శుభ్రం చేశాడు. పని పూర్తయ్యాకా 50 రూపాయలు ఆ పిల్లాడి చేతిలో పెట్టి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడినుంచి పంపిచేశాడు. కాగా దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో పిల్లాడు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంటే నిర్వాహకుడు అతనికి మరాఠిలో సూచనలు ఇవ్వడం కనిపించింది. విషయం తెలుసుకున్న అధికారులు సదరు వ్యక్తిని విధుల నుంచి తొలగించి పోలీసులకు అప్పజెప్పారు. కాగా పోలీసులు ఆ వ్యక్తిపై బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: కరోనా సెకండ్ వేవ్: 624 మంది డాక్టర్లు మృతి 8 yr old school kid was forced to clean toilet of quarantine centre with 15 covid +ve patients in it; in buldhana, maharashtra. This is world's best CM @OfficeofUT 's maharashtra model. pic.twitter.com/sJXCt5aNAP — आलू बोंडा (@ek_aalu_bonda) June 1, 2021 -
టాయిలెట్ ద్వారా కరోనా వ్యాపిస్తుందా?
కరోనా బాధితుల్లో ప్రస్తుతం నీళ్ల విరేచనాలు సర్వ సాధారణంగా కనిపిస్తున్న లక్షణం. బాధితుల విసర్జితాల్లో వైరస్ ఆర్ఎన్ఏ లేదా జెనెటిక్ కోడ్ను ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. మరి ఈ నేపథ్యంలో కరోనా సోకిన వ్యక్తి టాయిలెట్ ఫ్లష్ను వాడితే పొరుగింటి దాకా ఈ వైరస్ వ్యాపిస్తుందా..? అదే టాయిలెట్ను వాడటం లేదా అదే ఇంట్లో ఉండటం వల్ల వేరే వారికి కరోనా వైరస్ సోకుతుందా..? ఇటీవల సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. ఇంతకూ ఇందులో నిజమెంత.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్స్ విషయంలో ఏం జరిగింది.. 2003లో సార్స్ వైరస్ సంక్షోభ సమయంలో హాంకాంగ్లోని ఓ 50 అంతస్తుల భవనంలో 342 మందికి వైరస్ సోకగా, వారిలో 42 మంది చనిపోయారు. టాయిలెట్ ద్వారా వ్యాప్తి చెందడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మార్చి 14, 19న సార్స్ సోకిన వ్యక్తి ఆ భవనంలోని మధ్య అంతస్తులోకి వచ్చాడని, అతడు విరేచనాలతో బాధపడుతూ తరచుగా టాయిలెట్స్ ఉపయోగించాడని, ఆ తర్వాతే ఆ భవనంలో అనేక మంది సార్స్ బారినపడ్డారని వెల్లడైంది. విచిత్రమేంటంటే.. సదరు రోగి వచ్చిన అంతస్తు పైన ఉన్న అంతస్తుల్లోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. కింది అంతస్తులో ఉన్న వారిలో చాలా తక్కువ మందికి సోకిందట. టాయిలెట్ వాడకమే సార్స్ సోకడానికి ప్రధాన కారణం కాకపోయినా.. టాయిలెట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి అంశాన్ని పూర్తిగా కొట్టిపారేసే విషయం కాదని చెబుతున్నారు. సోషల్ మీడియాలో తెగ హల్చల్.. టాయిలెట్స్ ద్వారా కరోనా వైరస్ సులువుగా వ్యాప్తి చెందుతుందని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు తెగ హల్చల్ చేశాయి. తాజాగా ‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్’అనే జర్నల్లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. టాయిలెట్ ఫ్లష్ చేయడం వల్ల అందులోని విసర్జితాలు నీటి తుంపరల రూపంలో బయటకు వచ్చి, ఆ గదిలో వ్యాపిస్తాయి. ఒకవేళ విసర్జితాల్లో వైరస్ లోడ్ ఉంటే టాయిలెట్ సీటుపై దాదాపు 40 నుంచి 60 శాతం వైరస్ అవశేషాలు పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటేనే.. ‘టాయిలెట్ బౌల్ లోపల పెద్ద సంఖ్యలో వైరస్లు తిష్టవేసి ఉండే అవకాశం ఉంది. వైరస్ సోకిన వ్యక్తులు వాటిని ఉపయోగిస్తే.. వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. హోం ఐసోలేషన్లో ఉండే వ్యక్తి వాడిన టాయిలెట్ వేరే వారు వాడకుండా ఉంటే మంచిది. అయితే పబ్లిక్ టాయిలెట్స్ విషయంలో ఇది సాధ్యపడదు. చాలా మంది అదే టాయిలెట్ను వాడటం ద్వారా వైరస్ వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదం ఉంది. అయితే బాత్రూం పైపుల ద్వారా భారీగా కరోనా వైరస్ సోకుతుందనడం సరికాదు. ఒకవేళ వైరస్ లోడ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటే మాత్రమే సోకే అవకాశం ఉంది. అంతేకాదు టాయిలెట్ బేసిన్ నిర్మాణం కూడా ప్రభావం చూపుతుంది. టాయిలెట్ వాడిన తర్వాత ఫ్లష్ చేసేటప్పుడు దాని మూత వేసి ఫ్లష్ చేస్తే బాత్రూం గోడలు, గదిలో తుంపరలు పడకుండా అడ్డుకోవచ్చు. దీనిద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు.’ – డి.మనోజ్ కుమార్, జనరల్ మెడిసిన్ -
ప్రకృతి పిలిచినా.. రైలు ఆగలేదు!
వెబ్డెస్క్: జపాన్లో బుల్లెట్ రైలు నడిపే ఓ డ్రైవర్ నిర్లక్ష్యం అందరినీ కాసేపు టెన్షన్ పెట్టింది. ప్రకృతి పిలుపుతో డ్రైవర్ బాత్రూంకి వెళ్లగా, డ్రైవర్ లేకుండానే బులెట్ రైలు కొన్ని నిమిషాలు పరుగులు పెట్టింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ కావడంతో డ్రైవర్, కండక్టర్లపై చర్యలకు సిద్ధమయ్యారు. అసలేం జరిగిందంటే.. హికరీ 633 సూపర్ ఫాస్ట్ బుల్లెట్ రైలు శుక్రవారం ఉదయం టొకైడో-షిన్కన్సేన్ రైల్వే లైన్ల మధ్య నడుస్తోంది. ఆ టైంలో హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో డ్రైవర్ బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో కండక్టర్ని తన సీట్లో ఉంచి వెళ్లాలి. కానీ, ఆ కండక్టర్కి లైసెన్స్ లేదు. దీంతో కాక్పిట్ను ఖాళీగానే వదిలి బాత్రూంకి వెళ్లాడు. కనీసం రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు ట్రైన్ గంటకు150 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. రైళ్లో 160 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ మానిటరింగ్ చేస్తున్న అధికారులు.. డ్రైవర్ ఇంజిన్ కాక్పిట్లో లేకపోవడంతో కంగారుపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ప్రమాదేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చర్యలు తప్పవు సెంట్రల జపాన్ రైల్వే జపాన్ రూల్స్ ప్రకారం.. బుల్లెట్ ట్రైన్ నడిపే డ్రైవర్తో పాటు కండక్టర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ డ్రైవర్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు, అత్యవసర సమయాల్లోనూ ఆ కండక్టర్ ట్రైన్ను నడపొచ్చు. అలాకాని పక్షంలో డ్రైవర్ ఎంత ఎమర్జెన్సీ అయిన కాక్పిట్ను వదిలేసి వెళ్లకూడదు. -
ఈ వీడియో చూశాక.. బయట తినాలంటేనే భయమేస్తుంది..
-
మహిళ పాడు పని.. యాక్ థూ అంటున్న జనాలు
పార్టీలు అనగానే చాలు ఎగేసుకుని వెళ్లే జనాలు సమాజంలో కోకొల్లలు. ఫ్రీగా వస్తుందంటే.. ఫినాయిల్ కూడా వదలరనే సామెత వీరిని చూశాకే వచ్చి ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఫ్రీ పార్టీలకు ఆశపడితే.. ఒక్కోసారి ఎలాంటి దరిద్రమైన అనుభవాలు చవి చూడాల్సి వస్తుందో ఇది చదివితే తెలుస్తుంది. అన్నా షో అనే ఫేస్బుక్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు వీడియోలోని మహిళని ఛీ నువ్వసలు మనిషివేనా.. అంటూ తిట్టని తిట్లు తిడుతున్నారు. ఇంతకు సదరు మహిళ చేసిన ఘనకార్యం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. ఈ వీడియోలో ఓ మహిళ పార్టీ ఇస్తానంటూ స్నేహితులను ఇంటికి ఆహ్వానించింది. పార్టీకి వచ్చిన అతిథుల కోసం ఓ డ్రింక్ తయారు చేసింది. అయితే ఇందుకోసం సదరు మహిళ టాయిలెట్ బౌల్ని వినియోగించింది. తొలుత మహిళ టాయిలెట్ బౌల్లో ఓ వస్త్రం పెట్టి దాన్ని కవర్ చేస్తుంది. ఆ తర్వాత దాని మీదుగా ఐస్ క్యూబ్స్, క్యాండీస్, ఐస్క్రీమ్ వేస్తుంది. ఆ తర్వాత ఫ్లష్ ట్యాంక్ ఒపెన్ చేసి దానిలో సోడా డ్రింక్, స్ప్రైట్, ఫాంటా, మిరిండా, ఇతర స్వీట్నర్స్ వేస్తుంది. ఆ తర్వాత ఫ్లష్ బటన్ ప్రెస్ చేస్తుంది. దాంతో ట్యాంక్లో కలిపిన డ్రింక్ ఇక్కడకు వస్తుంది. ఆ తర్వతా సదరు మహిళ గరిటెతో ఆ డ్రింక్ను తీసి.. గ్లాస్ల్లో పోసి పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్కి సర్వ్ చేస్తుంది. మహిళ ఈ డ్రింక్ తయారు చేసే బాత్రూమ్ పక్కనే పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే వీరిలో ఒకరు సదరు మహిళ డ్రింక్ని టాయిలెట్ బౌల్లో తయారు చేసిందని గుర్తించి.. ఆ విషయాన్ని మిగతా వారికి చెప్తాడు. అప్పుడు చూడాలి వారి రియాక్షన్.. కక్కలేక.. మింగలేక నానా అవస్థలు పడ్డారు. వెంటనే యాక్ అంటూ ఆ డ్రింక్ని తీసుకెళ్లి టాయిలెట్లో పోశారు. ఇక వీడియో చూసిన జనాలు.. ‘‘ఛీ ఇలాంటి చండాలమైన ఐడియాలు ఎలా వస్తాయి’’.. ‘‘ఈ వీడియో చూశాక.. బయట తినాలంటేనే భయమేస్తుంది.. జీవితం మీద విరక్తి తెప్పించావ్’’.. ‘‘అందుకే నేను వేరే వాళ్లింటికి వెళ్లినప్పుడు ఏం తినను.. తాగను’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: కొంపముంచిన ఫేస్బుక్ యాడ్ -
నిద్రపోతున్న ప్రియుడిపై ప్రియురాలి దారుణం
తైపీ: తనతో సహజీవనం చేస్తున్న ప్రియుడు వేరే మహిళతో సంబంధంపెట్టుకోవడాన్ని ఆ మహిళ భరించలేకపోయింది. ప్రియుడికి ఎలాగైన బుద్ధి చెప్పాలనుకుంది. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడి అంగాన్ని కోసేసి తన కోపాన్ని తీర్చుకొంది. ఈ ఘటన తైవాన్లోని చాంఘువా కౌంటీలోని జిహుటౌన్షిప్లో చోటుచేసుకుంది. 52 ఏళ్ల హువాంగ్ తన ప్రియురాలు పూంగ్తో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు. అయితే పుంగ్కు తన ప్రియుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో అతను రోజులాగే తాగి నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే పుంగ్ వంట గదిలోకి వెళ్లి ఒక పదునైన కత్తి తీసుకొని వచ్చి ప్రియుడి అంగాన్ని కొసేసింది. మత్తులో ఉన్న అతనికి నొప్పి తెలియలేదు. ఆ తర్వాత ఆమె దాన్ని బాత్రూంలో పడేసి ఫ్లష్ చేసింది. ఉదయాన్నే నిద్రనుంచి లేచిన హువాంగ్ అంగం వద్ద నొప్పిగా ఉండటంతో చూశాడు. ఆ తర్వాత బెడ్షిట్ అంతా రక్తపు మరకలే ఉన్నాయి. వెంటనే భయపడిపోయాడు. తన ప్రియురాలు కోసం అరిచాడు. ఆమె కనిపించలేదు. కాసేపు చుట్టుపక్కల తెగిపడిన అంగం కోసం వేతికాడు.. దొరకలేదు. వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడికి డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. మూత్రం మార్గంలో ప్రత్యేకంగా సర్జరీ చేశారు. ఆ వ్యక్తికి మొదట ఈ పని ఎవరు చేశారో తెలియలేదు. అయితే, కొన్ని రోజులకు ఈ పనిచేసింది తన ప్రియురాలే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ‘తాను మద్యం మత్తులో ఉన్నప్పుడు తనపై అనుమానంతోనే ప్రియురాలు ఈ పని చేసిందని తెలుసుకొని షాక్కు గురయ్యాడు. ఆ ఘటన తర్వాత పుంగ్నేరుగా పోలీసులు దగ్గరికి వెళ్లి లొంగిపొయింది. తను తన ప్రియుడిపై అనుమానంతోనే ఈ పనిచేసినట్లు ఒప్పుకొంది. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ బలం ఆర్చనకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో
ఒక కాగితం దాని మీద ఒక సంతకం తాలూకు బలం ఆర్చనకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో. బెంగళూరుకు చెందిన ఈ సోషల్ యాక్టివిస్టు ‘మంత్రిగారూ... ఈ స్కూళ్ల టాయ్లెట్లు ఎప్పుడు బాగుపడతాయి’ అని ఒక కాగితం మీద రాసి ట్విట్టర్లో సంతకాలు ఆహ్వానిస్తే 8 వేల మంది చకచకా సంతకాలు చేశారు. పాఠశాల విద్యామంత్రి ఉలిక్కి పడ్డారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశంలో 100 కోట్లు స్కూళ్ల టాయ్లెట్లకు కేటాయించారు. అర్చనను అందరూ ‘నింజా’ అని పిలుస్తారు ముద్దుగా. ఫైట్ చేయడం తెలిసిన వారిని నింజా అనడమే కరెక్ట్ కదా. మార్చి 28న హోలీ పండగ. కాని అర్చన నాలుగైదు రోజుల నుంచే తన ట్విటర్ ఖాతా ద్వారా నీళ్ల పొదుపు గురించి బెంగళూరు వాసులకు సూచనలు చేయడం మొదలుపెట్టేసింది. ‘రంగులు చల్లుకున్న తర్వాత మీ స్నానాన్ని 8 నిమిషాల్లో పూర్తి చేయండి. ఒక్క బకెట్టు నీళ్లలో శుభ్రపడటానికి ప్రయత్నించండి. మీరు కొంటున్న నీళ్లు వాస్తవానికి వాటి రేటు కంటే ఖరీదైనవి’ అని ప్రచారం చేస్తోంది. 28 ఏళ్ల అర్చన కె.ఆర్ బెంగళూరు వాసులకు సోషల్ యాక్టివిస్ట్గా సుపరిచితురాలు. తనని తాను ‘శానిటేషన్, మెన్స్ట్రునల్ హైజీన్ యాక్టివిస్ట్’ గా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమెకు ‘రీప్బెనిఫిట్’ సంస్థ తరఫున పని చేస్తుంది. ఆ సంస్థకు ‘సాల్వ్ నింజా’ అనే యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా బెంగళూరులో నగర సమస్యలు, నగరంతో ముడిపడిన పౌర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం, పౌరులే పరిష్కరించుకునేలా చేయడం గురించి అర్చన పని చేస్తుంది. ‘సాల్వ్ స్మాల్ డెంట్ బిగ్’ అనేది వీరి నినాదం. ‘నగరంలో నివసించడానికి అందరూ ఇష్టపడతారు. కాని నగర సమస్యలను పరిష్కరించడంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే శ్రద్ధ వహిస్తారు. మన నగరాన్ని బెటర్గా చేసుకోవడం మనందరి బాధ్యత’ అంటుంది అర్చన. యువతీ యువకులను ఈ బాధ్యతలోకి మళ్లించడానికి కూడా అర్చన పని చేస్తుంది. ‘యువతే భవిష్యత్తులో మంచి లీడర్లు కావాలి. అందుకని వారికి ప్రజాస్వామ్యంలో అధికార స్థానాల్లో ఉండటం ఎంత అవసరమో కూడా నేను తెలియచేస్తుంటాను. అందుకోసమే ‘డెమొక్రసీ ఎక్స్ప్రెస్’ వంటి శిక్షణా తరగతులు కూడా ఇస్తాను’ అని అర్చన అంటుంది. తన సమస్య నుంచి అందరి సమస్య చూసి అర్చనది కర్ణాటకలోని హస్సన్ ప్రాంతం. ‘నేను కూడా అందరిలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాను. కాని ఆ పాఠశాలల్లో టాయ్లెట్లు సరిగ్గా ఉండేవి కావు. అందుకని నేను స్కూల్ తరచూ ఎగ్గొట్టేదాన్ని. పెద్దయ్యాక సామాజిక రంగంలో పని చేయడం మొదలెట్టాక ఆ పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకుందామనుకున్నాను. కర్ణాటకలో దాదాపు 300 ప్రభుత్వ స్కూళ్లు చూశాను. కాని 70 శాతం స్కూళ్ల టాయ్లెట్లు పనికి రాకుండా ఉన్నాయి. అబ్బాయిలు ఎక్కడో ఒక చోట పని కానిస్తారు. కాని అమ్మాయిలకు వేరే మార్గం లేదు. వారు బడి మానేయాల్సిందే. ఒకమ్మాౖయెతే స్కూలుకు వచ్చి స్కూలు నుంచి వెళ్లేదాకా నీళ్లే తాగను అని చెప్పింది టాయ్లెట్కు వెళ్లాల్సి వస్తుందని. అందుకే దీనిమీద ఎంత దూరమైనా వెళ్లి పోరాడాలనుకున్నాను’ అంది అర్చన. సంతకాల ఉద్యమం కర్ణాటకలో ప్రభుత్వ బడుల్లో టాయ్లెట్ల మెరుగుకు అర్చన ‘ఛేంజ్డాట్ఆర్గ్’ ఫౌండేషన్ సాయంతో సంతకాల ఉద్యమం మొదలెట్టింది. ‘ప్రభుత్వ బడులలో టాయ్లెట్ల మెరుగుకు ఉద్యమం’ పేరుతో తొలి సంతకం తాను చేసి ఆన్లైన్ పిటిషన్ మీద సంతకాలు ఆహ్వానించింది. ఆమె గ్రౌండ్ వర్క్, ఆమె పెట్టిన దారుణమైన టాయ్లెట్ల ఫొటోలు చూసి పౌరులు స్పందించారు. 7000 మంది సంతకాలు చేశారు. ఈ సంతకాల ఉద్యమం దావానలంలా వ్యాపిస్తూ ఉండటంతో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖా మంత్రి ఎస్.సురేశ్ కుమార్ స్పందించారు. ‘నేను ఈ పరిస్థితిని చక్కదిద్దుతాను’ అని ట్విటర్లోనే అర్చనకు సమాధానం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రికి ఏమి చెప్పుకున్నారో ఏమో మార్చి మొదటివారంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప 100 కోట్ల రూపాయల నిధులు స్కూళ్ల టాయ్లెట్ల మరమ్మతులకు మంజూరు చేశారు. ‘ఇది మనందరి విజయం. మన పోరాటం గెలిచింది’ అని అర్చన వ్యాఖ్యానించింది. కేవలం అర్చన సంకల్పం, పోరాటం వల్ల ఈ మంచి పని సాధ్యమైందని చెప్పవచ్చు. హైవేల పై మరుగుదొడ్ల కోసం... అర్చన స్కూళ్ల గురించే కాదు హైవేల పై శుభ్రమైన మరుగుదొడ్లు ముఖ్యంగా స్త్రీలకు అవసరం అని మరో ఉద్యమం మొదలు పెట్టింది. ఎన్హచ్ 75 మీద తిరుగుతూ ఈ దారిలో మరుగుదొడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో వీడియో రికార్డులు చేసింది. స్త్రీలు ప్రయాణిస్తూ మరుగుదొడ్లు లేకపోవడం వల్ల పడే ఇబ్బందులు తెలియ చేయడం వల్ల హైవేల మీద కొత్త మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘షీ డిమాండ్ ఛేంజ్’ అని ఈ ఉద్యమానికి అర్చన పేరు పెట్టింది. నిజమే. మనం మన హక్కులను డిమాండ్ చేయడం మర్చిపోయాం. డిమాండ్ చేస్తే పనులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా కోల్పోయాం. కాని అర్చనకు హక్కులను పోరాడి సాధించుకోవడం మీద నమ్మకం ఉంది. సంతకానికి ఉన్న శక్తి గురించి కూడా అవగాహన ఉంది. ఆ అవగాహనను అందరూ అందుకోవాల్సి ఉంది. ఈసురోమని బతకడం అలవాటు చేసుకున్నవారికి ఒక దిక్సూచి అర్చన. -
'నన్ను వెళ్లనివ్వకపోతే ప్యాంటులోనే పోసేస్తా'
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ప్రపంచ 12వ ర్యాంకర్ డెనీస్ షాపోలపోవ్, జన్నిక్ సిన్నర్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్ మధ్యలో డెనీస్ టాయిలెట్కు వెళ్లాలని చైర్ అంపైర్ను అడగ్గా.. అతను అనుమతి ఇవ్వలేదు. దీంతో డెనీస్కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'నన్ను టాయిలెట్కు వెళ్లనివ్వకపోతే ప్యాంటులోనే పోసేలా ఉన్నా..లేదంటే ఆ బాటిల్లో పోస్తా. మీరు ఆటగాళ్లను టాయిలెట్కు కూడా వెళ్లనివ్వరా? ఇదెక్కడి రూల్? నాకర్థం కావడం లేదు అంటూ విరుచుకుపడ్డాడు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐదో సెట్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా వీరిద్దరి మధ్య మ్యాచ్ ఫస్ట్ సెట్ నుంచే 3-6, 6-3,6-2,4-6,6-4తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో డెనీస్ విజయం సాధించాడు. -
వేలంలో బాత్రూమ్ సీటు: ఎవరిదంటే..
అసలు నియంత అనే పేరుకు బ్రాండ్అంబాసిడర్.. రెండో ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధాన కారకుడిగా పేర్కొనే అడాల్ఫ్ హిట్లర్కు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్గా మారింది. ఆయన బాత్రూమ్ సీటు వేలం వేయనున్నారు. దీనికి ప్రారంభ ధరగా 5 వేల డాలర్లు నిర్ణయించారు. దీనికి సంబంధించిన వేలం ఈనెల 8వ తేదీన అమెరికాలోని మేరీల్యాండ్లో జరగనుంది. ఈ విషయాన్ని వేలం నిర్వహించే సంస్థ ‘అలెగ్జాండర్ ఆక్షన్స్’ ప్రకటించింది. జర్మన్ అధ్యక్షుడిగా ఉన్న అడాల్ఫ్ హిట్లర్ బేవరియన్ ఆల్ప్స్లో ఉన్న తన ప్రైవేట్ బాత్రూమ్ ఉపయోగించేవాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలోని బెర్చ్టేస్ గాడెన్లో ఉన్న హిట్లర్ ప్రైవేట్ బాత్రూమ్లో ఆ టాయ్లెట్ సీటును అమెరికాకు చెందిన సైనికుడు రాంగ్వాల్డ్ సి బోర్చ్ దొంగతనం చేశాడు. బొవారియన్ రిట్రీస్ సమయంలో హిట్లర్ ఇంటిని సాయుధ దళాలు చుట్టుముట్టగా ఆ సమయంలో అదే అదునుగా అతడు టాయ్లెట్ సీట్ను ఎత్తుకెళ్లి న్యూజెర్సీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఏళ్లుగా అది అతడి ఇంటి పునాదిలోనే ఉంది. ఇప్పుడు ఆ సీటును ఆ సైనికుడి కుటుంబసభ్యులే వేలానికి పెట్టారు. ఆ సీటును వేలం పెట్టి సొమ్ము చేసుకుందామని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ టాయ్లెట్ సీట్ చెక్కతో తయారుచేసి ఉంది. రెండు ముక్కలుగా ఉంది. 19 ఇంచుల పొడవు, 15 ఇంచుల వెడల్పు ఉంది. దీనికి స్టీల్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఇది దాదాపు 15,000 డాలర్లు పలుకుతుందని ఆ సంస్థతో పాటు సైనికుడి కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేరిల్యాండ్లోని చెసాపీకే సిటీలో ఈనెల 8వ తేదీన ఈ వేలం జరగనుందని ‘అలెగ్జాండర్ ఆక్షన్స్’ సంస్థ తెలిపింది. గతంలో హిట్లర్ వాడిన ఫోన్ను వేలంలో ఉంచగా భారీ ధర పలకడంతో ఈ మేరకు ఆ సైనికుడి కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. -
అమ్మమ్మ లాంటి ప్రభుత్వం ఉండాలి
ఒడిశా: తండ్రి చనిపోతాడు. తల్లి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. వాళ్లు ఐ.ఏ.ఎస్.లు, ఐ.పి.ఎస్.లు అవుతారు. (లేదా) తల్లి చనిపోతుంది. తండ్రి పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడు. వాళ్లను అమ్మమ్మ చేరదీస్తుంది. చాలావరకు ఇలాగే జరుగుతుంది. తండ్రికి పిల్లలెందుకు పట్టరో తల్లిని తీసుకెళ్లిన ఆ దేవుడికే తెలియాలి. మూడేళ్ల క్రితం తల్లి చనిపోయి, తండ్రి వదిలేసి పోతే విమలమ్మే ఇద్దరు మనవరాళ్లను (8 ఏళ్లు, 4 ఏళ్లు) మనవడిని (6 ఏళ్లు) సాకుతోంది. ఏ ప్రభుత్వ రికార్డులలో లేని ఈ కుటుంబం ఒడిశాలోని అంగుల్ జిల్లా, కిషోర్ నగర్ తాలూకా, బైసాన గ్రామంలో ఉంది. మొన్నటి వరకు మట్టి గుడిసెలో ఉండేవారు. వర్షాలకు అది మెత్తబడి, కూలిపోవడంతో గ్రామ శివారులో కొత్తగా కట్టిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డిలో తల దాచుకుంటున్నారు. తలే దాచుకుంటున్నారు. చదవండి: (ఈ చిన్నారులకు దిక్కెవరూ...! ) వంట, స్నానాలు ఆరు బయట. ఆ నలుగురే ఒకరికొకరు నా అన్న వాళ్లు. పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఏ రోజుకారోజు పని వెతుక్కోడానికి వెళ్లొస్తుంటుంది విమలమ్మ. వయసు మీద పడి ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతోంది. ఆ కష్టాలను ఊహించుకోవలసిందే. పై నుంచి తల్లి తన తల్లిని, బిడ్డల్ని చూసిందో ఏమో, ఆమే పంపినట్లుగా ఒక సామాజిక కార్యకర్త వాళ్లను చూశాడు. పంచాయితీ ఆఫీసులో తాత్కాలికంగా గూడు ఏర్పాటు చేయించాడు. ఆ నలుగురు పొట్టల్ని నింపడానికి ప్రభుత్వం దగ్గర బియ్యం, పప్పులు ఉప్పులు ఉన్నాయి. ఆమెకు పింఛను ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. పిల్లల్ని చేర్చడానికి బడులు ఉన్నాయి. నివాసం ఉంచేందుకు షెల్టర్లు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఇన్ని ఉన్నా, తీసుకోడానికి వీళ్ల దగ్గర పౌరులుగా ఏ గుర్తింపూ లేదు. కనీసం ఆధార్ కార్డు లేదు. అవన్నీ వచ్చేవరకు పంచాయితీ కార్యాలయం లో ఉండేందుకైతే అనుమతి వచ్చింది. అక్కడికే సంతోషంగా ఉంది విమలమ్మ. విమలా ప్రధాన్ పూర్తి పేరు. పిల్లలకు ఇవేమీ తెలియదు. తల్లి లేకపోవడం పేదరికం. అమ్మమ్మ దగ్గర ఉండటం రాజరికం. పేదలందరికీ అమ్మమ్మ లాంటి ప్రభుత్వం ఉండాలి. వారిని ప్రభుత్వం దగ్గరకు చేర్చేందుకు అమ్మ లాంటి యాక్టివిస్ట్ లు ఉండాలి. -
షాకింగ్.. టాయిలెట్ వాటర్తో పానీపూరి
ముంబై: ‘పానీ పూరి’ దేశవ్యాప్తంగా అందరికి ఇష్టమైన చిరుతిండి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ స్నాక్ ఐటం ప్రస్తుతం గ్రామాల్లో కూడా లభిస్తుంది. కరోనాతో ప్రస్తుతం చాలా మంది జనాలు బయటి ఆహారం తీసుకోవాలంటనే ఒణుకుతున్నారు. దాంతో ఇప్పుడు పానీపూరికి గిరాకి బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు రోడ్డుకు ఇరువైపులా పానీపూరి బళ్లు.. దాని చుట్టూ జనాలు కిక్కిరిసి ఉండేవారు. మధ్యాహ్నం మొదలయ్యే ఈ వ్యాపారం రాత్రి పది వరకు కూడా నడిచేది. ఇక చిన్న పిల్లలు మొదలు.. ముసలి వారు వరకు ఇష్టంగా తినేవారు. మరో విశేషం ఏంటంటే పానీపూరి వ్యాపారంలో కల్తీకి సంబంధించి ఎన్ని వార్తలు వచ్చిన గిరాకీ మాత్రం తగ్గేది కాదు. మరి ఇప్పుడు ఈ వార్త చదివిన తర్వత అయినా జనాల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. తాజాగా ఓ పానీ పూరీ బండి వ్యక్తి టాయిలెట్ వినియోగం కోసం ఉంచిన నీటిని తెచ్చి.. పానీపూరికి వాడే రసంలో కలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జనాలు అతడిని చితకబాదారు. (చదవండి: ప్రాణం తీసిన గప్చుప్) ఈ ఘటన కొల్హాపూర్లో చోటు చేసుకుంది. పట్టణంలోని రంకాల లేక్ సమీపంలో ‘ముంబై కా స్పెషల్ పానీ పూరి వాలా’ పేరుతో నడిచే ఈ పానీ పూరి బండి ఆ ప్రాంతంలో తెగ ఫెమస్. సాయంత్రం అయ్యిందంటే చాలు.. పానీ పూరి కోసం జనాలు బండి దగ్గర క్యూ కడతారు. ఈ క్రమంలో ఓ రోజు సదరు పానీ పూరి బండి వ్యక్తి రోడ్డు పక్కన టాయిలెట్ బయట ఉన్న నీటిని తెచ్చి పానీపూరి రసంలో మిక్స్ చేశాడు. అయితే అతడి నిర్వకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన జనాలు ఆగ్రహంతో అతడి బండిని కిందపడేసి.. వస్తువులను నాశనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇంట్లో ఎంతో శుభ్రంగా, రుచిగా చేసిపెట్టినప్పటికి కొందరికి మాత్రం బయటి తిండే రుచిగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇది చదివాకైనా మారితే మంచిది. -
మరుగుదొడ్లకు పార్టీ రంగులు
తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా, ఉద్రిక్తంగా ఉన్న 2009– 2014 మధ్యకాలంలో కాలేజీలలో, ఆఫీస్లలో ఎవరైనా పింక్ డ్రెస్లో కనిపిస్తే చాలు.. ‘జై తెలంగాణ’ అనే మాట వినిపించేది. సమైక్య ఉద్వేగ అసంకల్పిత శుభాభివందన అది. చనువున్నా లేకున్నా, మనిషికి మనిషి తెలియకున్నా గులాబీ రంగు ఒకే జాతి, ఒకే మతం, ఒకే వర్ణం అన్నంత స్ట్రాంగ్గా ప్రత్యేక భావనతో ప్రజల్ని ఏకం చేసింది. అది ఒక పార్టీ జెండా రంగు అయినప్పటికీ ఒక ప్రత్యేక రాష్ట్ర జాతీయ రంగు అన్నంతగా మనుషుల్లో, మనసుల్లో కలిసిపోయింది. రాజకీయ, ఉద్యమ పార్టీలకు జెండా రంగు, లేదా జెండాలోని రంగులు ఇంతటి ఘనమైన ఐడెంటిటీని కల్పిస్తాయి. పవిత్రతను కూడా. ఆ రంగు ఉన్న మెట్లను ఎక్కవలసి వచ్చినా సంకోచిస్తాం. మెట్లంటే సరే. పార్టీ అధినాయకుడిని దర్శించుకోడానికి అవి గుడి మెట్ల వంటివి అనుకోవచ్చు. కానీ, గోరఖ్పుర్లోని లలిత్ నారాయణ్ మిశ్రా రైల్వే హాస్పిటల్ మరుగు దొడ్లకు కూడా ఎవరో రంగులు వేయించారు. ఎరుపు, ఆకుపచ్చ!! అవి సమాజ్ వాది పార్టీ జెండాలోని రంగులు. మూడుసార్లు (ములాయం రెండుసార్లు, అఖిలేష్ ఒకసారి) ఉత్తర ప్రదేశ్ని ఏలిన రంగులు అవి. మరుగుదొడ్లకు వేసిన ఆ రంగుల్ని వెంటనే మార్చాలని సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్ నగీనా సాహిని రైల్వే వాళ్లకు లెటర్ పెట్టారు. మరుగుదొడ్లకు ఆ రంగుల్ని ఎంపిక చేసిన వారి పై చర్య తీసుకోవాలని కూడా కోరారు. ఎరుపు, ఆకుపచ్చల్ని వేయించిన వారు అంత లోతుగా ఆలోచించి ఉండకపోవచ్చు. వేయించాకైనా అలోచించేందుకు అవకాశం ఉంది. రంగులే కనుక మార్చవచ్చు. రైల్వే వాళ్లు పొరపాటు చేసినా, ప్రమాద రహితమైన పొరపాటునే చేశారు. ఆకుపచ్చ, ఎరుపు కాకుండా.. ఆకుపచ్చ, ఆరెంజ్ వేయించి ఉంటే విషయం సీఎం యోగి ఆదిత్య నాథ్ వరకు వెళ్లేది. కొన్ని కార్మిక ఉద్యోగాలు ఊడేవి. చివరికి వాళ్లే కదా పై అధికారులకు దొరికేది! ఏమైనా రంగులు, మనోభావాలు తేలికగా మండే స్వభావం కలిగినవి. వాటితో జాగ్రత్తగా ఉండాలి. -
14 రోజుల తర్వాత టాయిలెట్లో శవమై..
ముంబై : 14 రోజుల పాటు కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి ఆసుపత్రి టాయిలెట్లో శవమై తేలాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యభన్ యాదవ్ అనే 27 ఏళ్ల వ్యక్తి టీబీతో బాధపడుతున్నాడు. దానికి తోడు కరోనా కూడా సోకడంతో కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్టోబర్ 3వ తేదీన టాయిలెట్లోకి వెళ్లి, ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో అక్కడే ప్రాణాలు విడిచాడు. ( భర్త వివాహేతర సంబంధం తట్టుకోలేక..) ఇక అప్పటినుంచి అతడు కనిపించకపోయే సరికి అక్టోబర్ 4న మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నెల 18న ఆసుపత్రి వార్డ్ బాయ్ అక్కడి టాయిలెట్లోనుంచి దుర్వాసన రావటం గుర్తించి తలుపు తెరిచి చూడగా.. సూర్యభన్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఇలా కూడా కరోనా వస్తుందంటే.. నమ్మలేం!
సాక్షి, న్యూఢిల్లీ : పలు అంతస్థులు గల అపార్ట్మెంట్లో ఏ ఒక్కరికి కరోనా వైరస్ సోకినా అపార్ట్మెంట్ వాసులందరికి స్వీయ నిర్బంధం విధించి అందరికి వైద్య పరీక్షలు చేసిన సంగతులు మనం ఎన్నో విన్నాం. అలా ఎందుకు చేసే వారంటే కరోనా వైరస్ సోకిన వ్యక్తి లిఫ్ట్ ద్వారా రాకపోకలు సాగించడం వల్ల, అదే లిఫ్ట్లో రాకపోకలు సాగించే ఇతరులకు వచ్చే అవకాశం ఉందని లేదా కరోనా సోకినా వ్యక్తితో చనువుగా ఉన్న ఇతరులకు కూడా కరోనా వైరస్ వచ్చే ఆస్కారం ఉందన్న కారణంగా నిర్బంధ వైద్య పరీక్షలు జరిపే వారు. చైనాలోని ఓ అపార్ట్మెంట్ విషయంలో ఎవరూ ఊహించని విధంగా ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకింది. (వెంటాడుతున్న కరోనా ఫోబియో..!) గ్వాంజౌ నగరంలోని ఓ బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో 15వ అంతస్తులో నివసిస్తున్న ఐదుగురు సభ్యులుగల ఓ కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్ సోకింది. వారి కారణంగా 25వ, 27వ అంతస్తుల్లో నివసిస్తున్న ఇరువురు దంపతులకు కరోనా వైరస్ సోకింది. వారు ఏనాడు ఒకరినొకరు కలసుకున్నది లేదు. కనీసం మొహామొహాలు చూసుకున్నదీ లేదు. కరోనా వైరస్ సోకిన రోగులు ఉపయోగించిన మెట్లు లేదా లిఫ్ట్లు కూడా 25, 27 అంతస్తుల్లో ఉంటున్న వద్ధ దంపతులు ఉపయోగించలేదు. పని మనుషుల ద్వారా వచ్చి ఉండవచ్చునుకుందామంటే ఆ రెండు అపార్ట్మెంట్లలో పని మనుషులు కూడా లేరు. కనీసం కొన్ని నెలలుగా ఆ రెండు అంతస్తుల వారు బయటకు కూడా రాలేదు. (కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు) మరి ఆ రెండు జంటలకు కరోనా ఎలా సోకింది? వైద్య నిపుణులకు ముందుగా ఏం అర్థం కాక తలలు బద్ధలు కొట్టుకున్నారు. ఎలాగైనా ఈ రహస్యాన్ని ఛేదించాలనే కృతనిశ్చయంతో వైరస్ను గుర్తించే మైక్రో లెన్స్లను పట్టుకొని 15వ అంతస్తులోన్ని అన్ని గదులను శోధించారు. అందులోని మాస్టర్ బెడ్ రూమ్లోని వాష్రూమ్ కమోడ్లో కరోనా వైరస్ ఎక్కువగా కనిపించింది. కమోడ్ నుంచి ఆపార్ట్మెంట్ వెలుపలి నుంచి వెళ్లే గ్యాస్ పైప్లైన్లోనూ కరోనా వైరస్ కనిపించింది. అదే పైప్ లైన్ వెంట వైద్య నిపుణులు పరిశీలిస్తూ పోగా, 16, 21 అంతస్తుల వద్ద గ్యాస్ పైప్లో ఓ మోస్తారుగా, 25,27 అంతస్తుల వద్ద గ్యాస్ పైప్లో తీవ్ర స్థాయిలో కరోనా వైరస్ కనిపించింది. 15వ అంతస్తులో కరోనా సోకిన వ్యక్తుల నుంచి టాయ్లెట్ గ్యాస్ పైప్ ద్వారా కరోనా వైరస్ 25, 27 అంతస్తుల్లోని దంపతులకు వైరస్ సోకినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. 16, 21 అంతస్తుల వద్ద గ్యాస్ పైప్లో కూడా వైరస్ కనిపించినందున వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. కమోడ్ గ్యాస్ పైప్ నుంచి కరోనా వైరస్ ‘బయో ఎయిరోసోల్స్’ రూపంలో బయటకు వస్తుందని, గాలిలో వైరస్ 30 నిమిషాలపాటు జీవించి ఉంటుందని, టాయ్లెట్స్కు సరైన వెంటిలేషన్ ఉండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నట్లయితే అర నిమిషంలో సగం వైరస్, నిమిషంలో పూర్తి వైరస్ బయటకు వెళ్లిపోతుందని నిపుణులు తెలిపారు. రెండు అంతస్తుల్లోని వద్ధ దంపతులు బాత్రూమ్ వెంటిలేటర్లను తెరవక పోవడం వల్ల, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను అసలు వాడక పోవడం వల్ల వారి బాత్రూమ్లో వైరస్ ఎక్కువ కాలం ఉండి ఉంటుందని, తద్వారా వారికి సోకి ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. 15వ అంతస్తులోని కుటుంబ సభ్యులు కరోనా ఆవిర్భవించిన ‘వుహాన్’ పట్టణం నుంచి కొంతకాలం క్రితమే వచ్చారట. అక్కడ వారు వైరస్ బారిన పడి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. -
‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు
-
‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు
పుదుచ్చేరి: ఎవరి బాధ్యతను వారు విస్మరించినపుడు వేరొకరి చేత ఆ బాధ్యతను గుర్తు చేయించుకోవలసిన దుస్థితి వస్తుంది. గుర్తు చేసినా వాళ్లు ఆ బాధ్యతను చేతుల్లోకి తీసుకోక పోతుంటే?! మల్లాది కృష్ణారావు గారు ఏం చేశారో చూడండి. ఆయన మన తెలుగువారు. పుదుచ్చేరిలో కీలకమైన వ్యక్తిగా పెద్ద స్థానంలో ఉన్నారు. శనివారం ఆయన ఇన్స్పెక్షన్కి వెళ్లారు. కోవిడ్ ఇన్స్పెక్షన్. ఎక్కడంటే.. ‘ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’లో. పేషెంట్లను పలకరించారు. ఏ పడక దగ్గరకు వెళ్లినా ఒకటే కంప్లయింట్. ‘టాయిలెట్స్ శుభ్రంగా ఉండటం లేదు సర్’ అని. ఆసుపత్రి అధికారులను పిలిపించడం, వాళ్లు పరుగున రావడం ఏం లేదు. వాళ్లు ఆయన పక్కన లేకుంటే కదా! ‘ఏమిటిది?’ అన్నట్లు వాళ్ల వైపు చూశారు కృష్ణారావు. (శశికళకు షాక్ ఇచ్చిన ఐటీ?) ఆ వెంటనే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. చట్టం అంటే.. చీపురు, నీళ్ల బకెట్, క్లీనింగ్ లిక్విడ్స్! నేరుగా అక్కడి ఒక టాయిలెట్ గదికి వెళ్లి క్లీన్ చెయ్యడం మొదలు పెట్టారు!! ‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు. ఎవరి పని వారు చెయ్యకపోతుంటే ‘ఎందుకు చెయ్యరు?’ అని నిలదీసి చేయించడం ఒక పద్దతి. అయితే ఎంత నిలదీసినా కదలని ఉచ్ఛస్థితి లోకి వచ్చేసిన వాళ్లు ఉంటారు. వాళ్ల చేత ఐక్యరాజ్యసమితి కూడా పని చేయించలేదు. ఇక కృష్ణారావు గారెంత? ఆఫ్టాల్ర్ ఆరోగ్యశాఖ మంత్రి. శుభ్రతే దైవం అంటారు. వృత్తిని దైవంలా భావించని వారి కారణంగానే దైవానికి భూమి మీద శుభ్రమైన చోటు లేకుండా పోతోంది. (మహిళ మంటల్లో కాలుతున్నా పట్టించుకోకుండా..) -
భయంతో ఒళ్లంతా గగుర్పొడుస్తుంది
-
వైరల్: టాయిలెట్లోకి పాము ఎలా వచ్చింది!
పామును చూస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. భయంతో ఒళ్లంతా గగుర్పొడుస్తుంది. ఇటీవల ఈ పాములు జనసమూహంలోకి ఎక్కువగా వస్తున్నాయి. ఇంట్లోకి, ముఖ్యంగా టాయిలెట్లో ఈ మధ్య కాలంలో పాములు దర్శనమిస్తున్నాయి. అలాంటి ఓ భయంకర ఘటనే తాజాగా అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్ నగరంలో నివసించే గుస్ వెస్ట్ అనే వ్యక్తి ఇంట్లోని టాయిలెట్లోకి పాము చొరబడింది. దీనికి సంబంధించిన వీడియోను వాతావరణ శాస్త్రవేత్త పేటన్ మలోన్ తన ట్విటర్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో టాయిలెట్ బౌల్ లోపల పాము కనిపిస్తోంది. ఓ వ్యక్తి దానిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. (టాయ్లెట్లో నాలుగడుగుల పాము) అనంతరం ఈ సంఘటన గురించి పాములను పట్టేవాళ్లకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పామును పట్టుకున్నారు. ఆ పాము విషపూరితమైనది కాకపోవడంతో దానిని పెరడులో వదిలేశారు. టాయిలెట్లో పాము చొరబడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం షేర్చేసిన ఈ వీడియోను ఇప్పటికే 2.3 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. 10 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. కాగా టాయిలెట్లోకి పాము ఎలా చొరబడిందని కొంత మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘టాయిలెట్ ఉపయోగం లేని సమయంలో ఎల్లప్పుడూ మూత పెట్టి ఉంచాలి. ఇంటి సమీపంలో కాలువలు, డ్రైనేజీ వ్యవ ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. (జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..) -
టాయ్లెట్లో నాలుగడుగుల పాము
కొలరాడో: అమెరికాలోని ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. టాయ్లెట్లో పాము కనిపించడంతో గుండె ఆగినంత పనైంది. కొలరాడోకు చెందిన మిరాండా స్టీవార్ట్ గత బుధవారం తన బాత్రూం గదిలోకి వెళ్లింది. టాయ్లెట్కి వెళ్లిందో లేదో టాయ్లెట్ సీట్లోంచి ఏదో శబ్ధం వినిపించింది. ఏమిటా అని దగ్గరకు మొహం పెట్టి చూసేసరికి అక్కడ బుసలు కొడుతూ పాము తల పైకెత్తి చూడటంతో ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే గావుకేకతో తన బాయ్ఫ్రెండ్ను పిలిచి అపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తిని పిలుచుకురమ్మంది. అనంతరం ఆ గది నుంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. మరోవైపు ఆ సిబ్బంది వెంటనే బాత్రూంలోకి చేరుకుని టాయ్లెట్ సీటులో ఉన్న పామును బయటకు తీశాడు. (అర్జంట్ బాత్రూం: 185 కిమీ వేగంతో) అది సుమారు నాలుగు అడుగుల పొడవుంది. కెమెరాలో బంధించిన పాము ఫొటోలను స్టీవార్ట్ ఫేస్బుక్లో పోస్టు చేసింది. "నా జీవితంలో ఇంతగా ఎప్పుడు భయపడలేదు" అని చెప్పుకొచ్చింది. అయితే అది విషసర్పం కాకపోవడంతో పామును పట్టుకున్న సాన్ఫోర్డ్ దాన్ని పెంచుకునేందుకు ముందుకు వచ్చాడు. సాన్ఫోర్డ్ దంపతులు ఆ పాముకు "బూట్స్" అని నామకరణం చేసి ఎంచక్కా ఇంటికి తీసుకు వెళ్లారు. (ప్యాంటులో పాము, రాత్రంతా జాగారం) -
మహిళ ఫిర్యాదు, మరుగుదొడ్లు కడిగిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ గ్వాలియర్లోని కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తరువాత మరుగుదొడ్లు శుభ్రపరిచే సామాన్లలను అందించాలని కోరిన ఆయన స్వయంగా పౌర రక్షణా సిబ్బందితో కలిసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయడంలేదని కమిషనర్ కార్యాలయంలోని ఒక మహిళ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘మరుగుదొడ్లు అందరికి ముఖ్యం. టాయ్లెట్లు సరిగా లేనందువల్ల మహిళలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఉపయోగపడేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. తోమర్ మార్చి నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. చదవండి: పీపీఈ సూట్తో ఓటు.. మరో ఎమ్మెల్యేకు కరోనా -
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, విసర్జించినా
‘కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. ఇలాంటి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైకి చెందిన రాజ్కుమార్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ పిటిషన్లోని వివరాలు ఇలా ఉన్నాయి. 1939లో అమల్లోకి వచ్చిన ప్రజారోగ్యచట్టం ప్రకారం ప్రజలకు ఆరోగ్యవసతులు కల్పించాల్సి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఉమ్మేయడం, వీధుల్లో చెత్త వేయడంపై నిషేధం విధిస్తూ 2002లో మరో చట్టం వచ్చింది. కాగితాలకే పరిమితమైన ఈ చట్టా న్ని అమలు చేసేందుకు తీవ్రమైన చర్యలు చేపట్టాలి. తమిళనాడులో జనాభా దామాషా ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగుదొడ్లకు పర్యవేక్షణ లేదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం, మూత్ర విసర్జన నిరోధించలేకపోయారు. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మూత్ర విసర్జన చేసినా శిక్షించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. వైద్యవ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులను శాస్త్రీయంగా విభంజించి నిర్మూలించాలి. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో తగిన మరుగుదొడ్ల వసతి ఉందోలేదో తనిఖీ చేయాలి. ఘనవ్యర్థాల మేనేజ్మెంట్ విధులను కఠినంగా అమలుచేయాలి. వీధుల్లో నివసించే వారిని కేటగిరి వారీగా విభజించి శరణాలయాలకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించాలి అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, హేమలతతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు వచ్చింది. సదరు పిటిషన్పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఒకటి నుంచి మాస్క్ల పంపిణీ ఇంటింటికీ ఉచిత మాస్కుల పంపిణీకి ఆగస్టు 1వ తేదీ నుంచి టోకెన్ల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఎన్నిమార్లు ప్రచారం చేసినా ప్రజల్లో అధిక శాతం మాస్కులు ధరించనందునే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా రెండు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని సంకల్పించింది. మాస్కుల పంపిణీ సులువుగా సాగేందుకు రేషన్ దుకాణదారులు వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో ఇంటింటా టోకన్లు పంపిణీ చేయనున్నట్టు గురువారం తెలిపింది. ఇదిలావుండగా లాక్డౌన్ కారణంగా అమెరికా, నెదర్లాండ్, సౌదీ, కతర్, జపాన్, థాయ్లాండ్ దేశాల్లో చిక్కుకున్న 834 మంది భారతీయులు ఆరు ప్రత్యేక విమానాల ద్వారా గురువారం చెన్నైకి చేరుకున్నారు. -
అర్జంట్ బాత్రూం: 185 కిమీ వేగంతో
లండన్: కొన్నిసార్లు అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.. అవి మనకు తెలీకుండానే కొన్ని నిబంధనలను అతిక్రమించేలా చేస్తాయి. ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇంగ్లండ్లోని సౌత్ యార్క్షైర్లో ఓ కారు డ్రైవర్కు పెద్ద కష్టమొచ్చిపడింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అతనికి అర్జంటుగా బాత్రూం వచ్చింది. కానీ అప్పటికే హైవేపై ఎక్కాడు. దిగడానికి వీలు లేదు. దీంతో స్పీడు దంచి కొట్టాడు. ఏకంగా గంటకు 185 కి.మీ.(115 మైళ్లు) వేగంతో రయ్మని దూసుకుపోయాడు. ఇది పోలీసుల కంట పడింది. ఇంకేముందీ సినిమా సీన్ అక్కడ ప్రత్యక్షమైంది. సునామీలా దూసుకుపోతున్న ఆ వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు వెంట పడ్డారు. ఇది గమనించని సదరు వ్యక్తి ఏమాత్రం స్పీడు తగ్గించలేదు. (ఫ్లోర్ విరిగి, ఇంటి కింద బావిలో పడ్డ వ్యక్తి) ఎట్టకేలకు పోలీసులు దాన్ని అడ్డుకుని డ్రైవర్ను ప్రశ్నించారు. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. అర్జంటుగా యూరిన్కు వెళ్లాలని, అందుకే ఇంత వేగంగా కారు నడుపుతున్నానని సమాధానమిచ్చాడు. లండన్ నుంచి నిర్విరామంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక కారు వేగాన్ని నమోదు చేసిన స్పీడ్ గన్ ఫొటోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసి, దాని గురించిన కథను రాసుకొచ్చారు. అయితే అతను తన సీటులో సాధారణంగా కూర్చున్నాడని, ఎలాంటి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తున్నందుకుగానూ అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. (మదిని దోచేస్తున్న పానీపూరీ ఏటీఎం) -
టాయిలెట్ పోటీ.. గెలిస్తే 26.5 లక్షలు
వాషింగ్టన్ డీసీ : చంద్రుడిపై శాశ్వతంగా తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఆ దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఆర్టెమిస్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2024లొ చంద్రుడిపై శాశ్వత నివాస స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఈ మిషన్ లక్ష్య. శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలంటే అందులో టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలి. భూమిపై ఉపయోగించే టాయిలెట్ను అక్క ఉపయోగించలేము. కారణం, గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటమే. దీంతొ టాయిలెట్ నిర్మాణం నాసా వినూత్న పోటీని పెట్టింది. చంద్రునిపై టాయిలెట్ రూపకల్పన చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను సవాలు చేసింది. మంచి డిజైన్ తయారుచేసి ఇచ్చిన వారికి నగదు బహుమతి కూడా ఇవ్వనుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా టాయిలెట్ ను డిజైన్ చేసిన వాళ్లకు 35వేల డాలర్ల(దాదాపు 26.5 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆసక్తిగల వ్యక్తులు ఆగష్టు 17నాటికి డిజైన్లను పంపించాలని నాసా పేర్కొన్నది. 18 ఏళ్లు దాటిన వారు జట్టుగా లేదా వ్యక్తిగా ఈ డిజైన్ చేయవచ్చు. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఈ పోటీలో పాల్గొనాలంటే వారి డిజైన్లలను సమర్పించడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేర్లు నమోదు చేసుకోవాలి. (జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం) భూమిపై మాదిరిగా గురుత్వాకర్షణ శక్తి చంద్రునిపై లేదు. అందువలన ప్రతిదీ అంతరిక్షంలో తిరుగుతుంది. అందుకే ఈ పని నాసాకు సవాలుగా మిగిలిపోయింది. అందుకే ఈ పోటీని పెట్టింది. భారీ నగదు బహుమతి ఉండడంతో కచ్చితంగా వేలకొద్ది డిజైన్లు నాసా దగ్గరకు వస్తాయి. అంతరిక్షంపై అవగాహన ఉండే వాళ్లకు ఇదో సువర్ణావకాశం. నాసా కోసం టాయిలెట్ డిజైన్ చేసి లక్షల్లో బహుమతి పొందొచ్చు. -
10 బీర్లు తాగి పడుకున్నాడు, ఆ తరువాత..
బీజింగ్: మీరు అదే పనిగా ఎత్తిన బాటిల్ దించకుండా బీర్లు తాగుతున్నారా? ఒకటి, రెండు కాదు ఏకంగా 10, 12 తాగుతూ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కానీ స్థితిలోకి వెళ్తున్నారా? ఏది మర్చిపోయినా సరే బీర్ కానీ లేదా ద్రవ పదార్థాలు ఏవైనా తీసుకున్నప్పుడు మూత్ర విసర్జన చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చైనాలో ఒక వ్యక్తి పది బీర్లకు పైగా తాగి మత్తులో మూత్ర విసర్జన చేయకుండా నిద్రపోయాడు. ఉదయం లేచే సరికి అతడి మూత్రాశయం పగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. (అబ్రకదబ్ర.. సెలబ్రిటీ అయిపోయింది!) చైనాకు చెందిన హూ(40) ఒక రోజు రాత్రి బార్లో 10 బీర్లకు పైగా తాగేసి ఆ మత్తులో మూత్రం పోయకుండానే 18 గంటల పాటు నిద్రపోయాడు. నిద్రలేవగానే అతనికి తీవ్రమైన నొప్పి రావడంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు హూ మూత్రాశయం మూడు చోట్ల పగిలి ద్రవం అతని కడుపులోకి చేరి నొప్పి వచ్చిందని తెలిపారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడంతో అతని ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారు. ఈ విషయం పై డాక్టర్ మాట్లాడుతూ, మనం ఏం తాగినా అది మూత్రాశయంలోకి చేరుతుందని, అది నిండగానే మూత్రం పోయాలన్నా సంకేతాలు వస్తాయన్నారు. మత్తులో ఉన్న కారణంగా మెదడు నుంచి సంకేతాలు రాకపోవడంతో హూ అలాగే నిద్రపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. ఎంత నీరు తాగితే దానికి తగ్గట్టుగా మూత్రవిసర్జన చేయాలని తెలిపారు. ('ఇది తయారు చేసినవాడిని చంపేస్తా’) -
ప్రెగ్నెంట్ అని తెలీకుండానే బిడ్డకు ప్రసవం
లండన్: ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అయ్యేవరకు ఆమె గర్భవతన్న విషయం సదరు మహిళకే తెలియకపోవడం గమనార్హం. ఈ విచిత్ర ఘటన బ్రిటన్లోని లిటిల్ హాంప్టన్ పరిధిలోని వెస్ట్ సస్సెక్స్లో చోటు చేసుకుంది. గ్రేస్ మీకిమ్(32) అనే మహిళ ముప్పై ఏడు వారాల గర్భవతి. కానీ ఈ విషయం ఆమెకు తెలియదు. ఓ రోజు ఆమె బాత్రూమ్కు వెళ్లగా కడుపులో నొప్పి మొదలైంది. దీంతో ఆమె నొప్పులు తాళలేక గట్టిగా అరవడంతో ఆమె భర్త జేమ్స్, కొడుకు టైలర్ బాత్రూమ్ దగ్గరకు పరుగెత్తుకెళ్లారు. (జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై) అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె భర్త ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే షాక్ నుంచి తేరుకుని ఈ లోకంలోకి అప్పుడే అడుగుపెట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకున్నాడు. అనంతరం అంబులెన్స్కు కాల్ చేసి తల్లీబిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయం గురించి గ్రేస్ మాట్లాడుతూ.. "గతంలో కడుపు కాస్త ఉబ్బినట్లుగా అనిపించగానే ఆసుపత్రికి వెళ్లాను. అయితే మూడు సార్లు గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తే మూడుసార్లూ నెగెటివ్ అనే వచ్చింది. అయినప్పటికీ బిడ్డకు జన్మనివ్వడం నాకూ ఆశ్చర్యంగానే ఉంది" అని తెలిపింది. (పెళ్లి రోజు: చనిపోయిన తండ్రి లేఖ) -
టాయ్లెట్లో వారం రోజుల క్వారంటైన్
భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఓ యువకుడికి దీన స్థితి ఎదురైంది. ఓవైపు ప్రభుత్వ నిబంధనలు, మరోవైపు కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అతడు టాయ్లెట్లోనే వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉపాధి నిమిత్తం తమిళనాడుకు వెళ్లిన ఒడిశా యువకుడు స్వస్థలమైన జగత్సింగ్పూర్కు చేరుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలుత వారం రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉన్నాడు. (తమిళనాడులో మరోసారి సంపూర్ణ లాక్డౌన్) అనంతరం అధికారులు అతడిని విడుదల చేస్తూ హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. దీంతో అతను మరో వారం రోజుల పాటు క్వారంటైన్ కేంద్రంలోనే ఉంటానని అధికారులను అభ్యర్థించాడు. కానీ వారు అతని విన్నపాన్ని తిరస్కరించారు. దీంతో చేసేదేం లేక ఇంటికి చేరుకున్నాడు. కానీ అతని ఇల్లు చిన్నగా ఉండటంతోపాటు స్వీయ నిర్బంధం విధించుకునేందుకు ప్రత్యేక గది అందుబాటులో లేకపోవడంతో తప్పని పరిస్థితిలో ఇంటికి సమీపంలోని స్వచ్ఛ భారత్ టాయ్లెట్లో జూన్ 9 నుంచి 15 వరకు క్వారంటైన్లో ఉన్నాడు. అతనికి కరోనా లక్షణాలు లేవని తెలిసింది. (నాడు గాలికి వదిలేసి.. ఇప్పుడు రమ్మంటే) -
మూత పెడితేనే మటాష్!
కరోనా.. తుమ్మితే వస్తుంది.. దగ్గితే వస్తుంది. రోగి ముట్టుకున్నవి ముట్టుకుంటే వస్తుంది.. ఇవన్నీ మనకు తెలిసినవే.. అందుకే మాస్కులు, శానిటైజర్లు వాడుతున్నాం.. అయితే.. షేర్డ్, పబ్లిక్ టాయిలెట్ల వినియోగంలో సరైన జాగ్రత్తలు పాటించకున్నా వస్తుందా? వస్తుందనే అంటున్నారు చైనాలోని యాంగ్జౌ వర్సిటీ పరిశోధకులు.. అలా రాకుండా ఉండాలంటే.. టాయిలెట్(వెస్ట్రన్) మూత పెట్టాకే.. ఫ్లష్ చేయాలని సూచిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. ఓసారి కోవిడ్ వచ్చి.. చికిత్స అనంతరం నెగెటివ్ వచ్చినవారి మలంలో 4, 5 వారాల వరకూ వైరస్ తాలూకు అవశేషాలు ఉంటాయట. దీనికి సంబంధించి గత నెల్లో ‘లాన్సెట్’ జర్నల్లో ఓ పరిశోధన కూడా ప్రచురితమైంది.. ఈ నేపథ్యంలో ముఖ్యంగా షేర్డ్, పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మూత పెట్టకుండా ఫ్లష్ చేయడం వల్ల.. ఒకేసారి వేగంగా నీళ్లు వచ్చి.. సుడిగుండంలా ఏర్పడుతుంది.. ఆ సమయంలో వైరస్ మేఘంలాంటిది నీటిపైన 3 అడుగుల దూరం వరకూ ఏర్పడుతుందని సదరు వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇది గాల్లో ఒక నిమిషం పాటు ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల పరుచుకుంటుంది. తద్వారా వైరస్ వేరొకరికి వ్యాప్తి చెందే అవకాశముంటుంది. దీన్ని నివారించాలంటే మూత పెట్టాకే ఫ్లష్ చేయాలి.. దీని వల్ల వైరస్ బయటకు రాదు. ఆరోగ్యవంతులైనవారు టాయిలెట్ ఉపయోగిస్తే.. సమస్యే లేదు.. కోవిడ్ రోగులు లేదా కరోనా వచ్చి తగ్గినవాళ్లు ఉపయోగించినప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది’ అని వర్సిటీ పరిశోధకులు తెలిపారు. పైగా.. సామాన్య జనానికి ఈ మార్గంలోనూ వైరస్ వస్తుందన్న విషయం పెద్దగా తెలీదని.. వారికి అవగాహన పెంచాల్సిన అవసరముందని చెప్పారు. ఇకపై కరోనా రోగిలో వైరస్ పూర్తిగా పోయిందా లేదా అన్నది తెలుసుకునేందుకు మల పరీక్షలు కూడా చేస్తే మంచిదని వారు సూచిస్తున్నారు. సో.. ఇకపై షేర్డ్, పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించేటట్లయితే.. జాగ్రత్తలు పాటించడం మరువద్దు సుమా.. -
300 మంది.. 4 మరుగుదొడ్లు
సాక్షి, కరీంనగర్ : రాష్ట్రంలోనే పేరున్న నగరం. లక్షలమంది జనాభా. స్మార్ట్సిటీలో చోటు. ఆ దిశగా సాగుతున్న అభివృద్ధి పనులు. కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేసే ముఖ్య అధికారులు, సిబ్బంది 300కు పైగానే ఉంటారు. నిత్యం వెయ్యికి పైగా మంది ప్రజలు నగరపాలకకు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. ఉదయం 10 గంటలకు వచ్చిన సిబ్బంది సాయంత్రం ఇంటికి వెళ్తారు. పనుల నిమిత్తం వచ్చిన వారు ఒక్కోసారి రోజంతా ఇక్కడే గడపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒంటికి, రెంటికి ఇబ్బందులు తప్పడం లేదు. నగరపాలక సంస్థలో కేవలం నాలుగు మాత్రమే మరుగుదొడ్లు ఉండడంతో సిబ్బందికే సరిపోవడం లేదు. ఈ విషయమై ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకున్న నాథుడే లేడు. మూడువందలకు పైగా సిబ్బంది.. కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్, మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక చాంబర్లు ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్, అదనపు కమిషనర్తో పాటు సుమారు 300 వందల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. 60మంది కార్పొరేటర్లు, వారి తరఫునవారు వస్తుంటారు. వివిధ పనుల నిమిత్తం రోజుకు వెయ్యి మంది వరకు ప్రజలు వస్తుంటారు. దీంతో పాటు పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్టర్లు వస్తుంటారు. వీరందరూ మరుగుదొడ్లకు ఇబ్బంది పడాల్సిందే. ఇంటికి వెళ్లే వరకు ఒంటికి, రెంటికి ఓపిక పట్టాల్సిందే. కార్పొరేషన్ కార్యాలయంలో ఎక్కడా టాయిలెట్స్ కనిపించవు. నాలుగు ఉన్నా.. రెండు సమావేశ మందిరం, మొదటి అంతస్తులో రెండు ఉన్నాయి. వీటినే అటు సిబ్బంది, ఇటు తెలిసిన ప్రజలు వినియోగిస్తున్నారు. ఒక్కో టాయిలెట్ను సుమారు 150 మంది చొప్పున వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో సిబ్బంది, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహిళా సిబ్బంది తిప్పలు.. నగరపాలక సంస్థ కార్యాలయంలో 150 మందికిపైగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా సుమారు 200మందికి పైగా మహిళలు కార్యాలయానికి వస్తుంటారు. వీరందరికి కలిపి కార్యాలయంలో ఉన్న టాయిలెట్స్ కేవలం రెండు మాత్రమే. అవి కూడా సమావేశం మందిరంలో ఉన్నాయి. ఏవైనా సమావేశాలు జరుగుతుంటే.. ఒక్కటే అందుబాటులో ఉంటుంది. దీంతో కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోజంతా నీళ్లు తాగడానికే భయపడుతున్న పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో సమీపంలో బస్టాండ్కు వెళ్లాల్సిన దుస్థితి. అక్కడ కూడా పేయిడ్ టాయిలెట్స్ ఉంటాయి. దగ్గర్లో ఉన్నవారు ఇంటికి సైతం వెళ్లిరావాల్సిన దుస్థితి అని మహిళా సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. మేయర్ దృష్టికి తీసుకువెళ్లినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. పట్టణంలో నిర్మించారు..కార్యాలయంలో మరిచారు.. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 3లక్షలకు పైగా జనాభా ఉంది. నగరానికి ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా వస్తుంటారు. ప్రస్తుతం నగరంలో 17 సులభ్ కాంప్లెక్స్లు అందుబాటులో ఉన్నాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మరో 28 నిర్మించడానికి స్థలాలు గుర్తించారు. ఇవి కాకుండా స్మార్ట్సిటీలో భాగంగా మరో ఎనిమిది నిర్మించనున్నారు. కొన్ని నిర్మాణ దశలో ఉండగా.. ఈనెల 11వ తేదీన ఎస్సారార్ కళాశాల వద్ద స్మార్ట్సిటీ టాయిలెల్స్ను మంత్రి గంగుల ప్రారంభించారు. ఆగస్టు 15నాటిని మరో 40నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే కార్పొరేషన్ కార్యాలయంలో మాత్రం ఒక్క నూతన టాయిలెట్ నిర్మించడానికి ఆలోచన చేయలేదు. స్థలం ఉన్నా.. ఆ దిశగా అడుగులు వేయలేదు. దీంతో నగరపాలక సిబ్బందికి, ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. -
సుందరంగా మన బడి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యారంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ‘మన బడి నాడు–నేడు’ పేరుతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 4412 ప్రాథమిక , ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితి నుంచి వాటిని మౌలిక వసతుల పరంగా కార్పొరేట్ పాఠశాలల స్థాయికి అభివృద్ధి చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1382 పాఠశాలలు ఎంపిక చేసి వాటిని తొమ్మిది విభాగాల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలుత ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం జూన్ నాటికి పూర్తి చేయాలని భావించిన లాక్డౌన్ నేపథ్యంలో జులై నెలాఖరు వరకు పొడిగించి పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ ఉన్నత అధికారులు సూచించారు. ముందస్తు పైలట్ ప్రాజెక్టు స్కూల్గా జిల్లాలో హుకుంపేట, కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెం, మడికి గ్రామాల్లో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయనున్నారు. ఆ పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఇలా.. నిరంతర తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లకు నిరంతరం వాడుక నీరు, విద్యార్థులకు ఫర్నిచర్, పాఠశాలలకు రంగులు, గదులకు మరమ్మతులు, డిజిటల్ తరగతులు, బ్లాక్బోర్డు, ప్రహరీల నిర్మాణం, ఇంగ్లిష్ ల్యాబ్ వంటి వాటిని అభివృద్ధి చేయనున్నారు. సకాలంలో పనులు పూర్తి చేస్తాం నాడే–నేడు పనులు సకాలంలో పూర్తిచేస్తాం. లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు కల్పించారు. ఇప్పటి వరకు 16.20 కోట్లు రాగా మరో రూ.25 కోట్లు రెండు రోజుల్లో వస్తాయి. నిధులు ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో నేరుగా జమవుతున్నాయి. పనులు సర్వశిక్షాఅభియాన్, ట్రైబుల్ వెల్ఫేర్, ఏపీడబ్లూఈసీ విభాగాలకు కేటాయించారు. – పి.విజయకుమార్, సమగ్ర శిక్షాఅభియాన్ ఏపీసీ -
ఆ గుడిలో టాయిలెట్ వారికి మాత్రమే..
త్రిస్సూర్: కేరళలోని కుట్టుముక్కు మహదేవ దేవస్థానానికి చెందిన టాయిలెట్లలో ఒకటి బ్రాహ్మణులు మాత్రమే వినియోగించాలని రాసి ఉండటం కలకలం రేపింది. పురుషులు.. మహిళలు.. బ్రాహ్మణులు అంటూ మూడు బోర్డులతో మూడు టాయిలెట్లు ఉన్న ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు దీనికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ విషయం ఆలయ కమిటీ సభ్యుల వరకూ వెళ్లడంతో ఆ బోర్డును తొలగించి అర్చకులకు, ఉద్యోగులకు అని మార్చారు. దాదాపు 20 ఏళ్ల కిందట ఆ బోర్డు పెట్టారని, అది తమ నోటీసుకు రాలేదని కమిటీ సభ్యులు తెలిపారు. అనైతిక ఆచారాలకు ఆలయం, పాలకమండలి వ్యతిరేకమని స్థానిక వార్డు కౌన్సిలర్, సీపీఎం నేత కన్నన్ స్పష్టం చేశారు. మూడు బోర్డుల ఫొటోను సోషల్ మీడియాపై పోస్ట్ చేసిన వ్యక్తిపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల సమయంలో ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. (చదవండి: ఆ రెండు చానళ్లపై 48 గంటల నిషేధం) -
కర్మకాలి టాయిలెట్ హోల్లో చేయి పెట్టాడంతే..
చెన్నై : కాలకృత్యాలు తీర్చుకుందామని టాయిలెట్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. టాయిలెట్ హోల్లో పడ్డ కారు తాళంచెవికోసం అందులో చేయిపెట్టడం ఇబ్బందులకు గురిచేసింది. ఈ సంఘటన తమిళనాడులోని మధురై పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరుకు చెందిన మణిమారన్ అనే వ్యక్తికి సొంతంగా ఓ కారు ఉంది. అతడు ఆ కారును దూరప్రాంతాలకు బాడుగలకు నడుపుకుంటూ ఉంటాడు. ఈ ఉదయం కూడా తంజావూరునుంచి ప్రయాణికులను మధురైకి తీసుకుని వచ్చాడు. వారిని గమ్యస్థానం వద్ద దింపేసిన తర్వాత తంజావూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకు దగ్గర కారు ఆపి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాష్రూంలోకి నడిచాడు. కొద్దిసేపటి తర్వాత అతడి కారు తాళంచెవి టాయిలెట్ హోల్లో పడిపోయింది. దీంతో అతడు తాళంచెవిని తీసేందకు చేతిని హోల్లో పెట్టాడు. ఈ ప్రయత్నంలో ముందుగా అతడికి వేరే వ్యక్తికి చెందిన ఓ సెల్ఫోన్ దొరికింది. ఆ తర్వాత అతడు మరింత లోపలికి చేతిని పోనిచ్చాడు. దీంతో చేయి అందులో ఇరుక్కుపోయింది. ఎంతమొత్తుకున్నా అతడి ఆర్తనాదాలు బయటివారికి వినిపించలేదు. దాదాపు గంటన్నరసేపు నరకం అనుభవించాడు. ఆ తర్వాత వాష్రూంలోకి వచ్చిన పెట్రోల్ బంకు సిబ్బంది ఒకరు అతడ్ని గమనించాడు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశాడు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మణిమారన్ చేతిని సురక్షితంగా టాయిలెట్ హోల్లోంచి బయటకుతీశారు. -
కోవిడ్-19: టాయిలెట్ పేపర్ దొంగతనం
హాంకాంగ్: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) బారిన పడిన బాధితుల సంఖ్య పెరుగుతోంది. అదేవిధంగా రోజురోజుకు కోవిడ్ వైరస్ వ్యాప్తి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కాగా, కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా పలు కంపెనీలు బాధితుల కోసం మాస్క్లు, శానిటరీ నాప్కిన్ల ఉత్పత్తిని పెంచిన విషయం తెలిసిందే. చైనాలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కోవిడ్ వైరస్పై హాంకాంగ్ ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హాంకాంగ్లోని వెల్కమ్ స్టోర్ అనే సూపర్ మార్కెట్లో ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. (కోవిడ్ మృతులు 1,665) వివరాలు.. ముగ్గురు దుండగులు సూపర్ మార్కెట్లోని 130 డాలర్ల విలువ గల 600 టాయిలెట్ పేపర్ రోల్స్ను దొంగిలించారు. దీంతో సమాచారాన్ని అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. టాయిట్ పేపర్ రోల్స్ దోపిడికి పాల్పడ్డ ముగ్గురిలో ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. దుండగుల వద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. కోవిడ్ వైరస్ సంక్రమించకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే మాస్క్లు, నాప్కిన్ల కొరత రానుందనే అసత్యపు వార్తలు సోషల్ మీడియా, ఆన్లైన్లో వ్యాప్తి చెందడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (‘కోవిడ్’ పేరిట రైతులకు బురిడీ) -
టాయిలెట్కు వెళ్లేముందు ఓసారి..
పామును చూస్తే చాలు అయ్య బాబోయ్ అంటూ ఆమడ దూరం పరుగెడుతాం. అది కనిపించిన ప్రదేశానికి మరోసారి వెళ్లాలంటేనే జంకుతాం. కానీ ఓ మహిళ మాత్రం పామును భయపడలేదు. టాయిలెట్లోకి వచ్చిన పాముతో యుద్ధమే చేసింది. తనను కాటు వేసినా.. తన మెడను గట్టిగా బిగించినా.. అదరకుండా.. బెదరకుండా పాముతో పోరాటం చేసింది. చివరకు పామును చంపి.. తాను ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన థాయ్లాండ్లో జనవరి 12న జరిగింది. ఆ పాము నుంచి మహిళ ఎలా తప్పించుకుందో ఆమె కూతురు సోషల్ మీడియా ద్వారా వివరించింది. ఇకపై బాత్రూంకు వెళ్లే ముందు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి వెళ్లాలని కోరింది. ‘మాది అడవికి దూరంగా ఉన్న ఓ చిన్న పల్లెటూరు. ఈ నెల 12న మా అమ్మ టాయిలెట్కు వెళ్లింది. అప్పటికే ఓ పెద్ద పాము అందులోకి వచ్చి చేరింది. అమ్మ వెళ్లగానే అది బుసలు కొడుతూ అమ్మ తొడను కరిచింది. దాంతో అగకుండా తొడ భాగాన్ని గట్టిగా చుట్టేసింది. అమ్మ గట్టిగా అరవడంతో మేమంతా బాత్రూం దగ్గరకి వెళ్లాం. పెద్ద పామును చూసి మేమంతా భయపడినా అమ్మ మాత్రం భయపడలేదు. పామును వదిలించేందుకు గట్టి ప్రయత్నం చేసింది. రెండు చేతులతో పామును తోకను పట్టుకొని గట్టిగా లాగింది. అయినా ఫలితం లేదు. చివరికి మా సోదరుడి ద్వారా సుత్తె, కత్తిని తెప్పించుకొని పామును పొడిచి చంపింది. ఈ ప్రయత్నంలో మా అమ్మ శరీరానికి కూడా కత్తిపోట్లు పడ్డాయి. పాము బారి నుంచి బయటపడిన అమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాం. ఇప్పుడు అమ్మ ఆరోగ్యంగా ఉంది. మీ ఇల్లు అడవికి దూరంగా ఉన్నప్పటికీ... టాయిలెట్లోకి వెళ్లేముందు గదిని క్షుణ్ణంగా పరిశీలించి వెళ్ళండి’ అని మహిళ కూతురు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. -
అద్దం ఆలోచన అదుర్స్
బెంగళూరు, (కర్ణాటక): ఉద్యాన నగరిని స్వచ్ఛ నగరిగా మార్చేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. నగర వాసులు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుండటంతో వాటిని అడ్డుకోవడానికి పాలికె వినూత్న ఆలోచన చేపట్టింది. బెంగళూరు నగరంలో ఫుట్పాత్లు, రోడ్లపై నగర వాసులు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుండటంతో స్వచ్ఛతను కాపాడటానికి పాలికె ఫుట్పాత్ ప్రాంతాల్లో భారీ అద్దాలను (మిర్రర్) అమర్చింది. మూత్ర విసర్జన సమయంలో అద్దంలో కనబడుతుంటే సిగ్గుతోనైనా బహిరంగ మూత్ర విసర్జన మానుకుంటారని ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో నగరంలో బీబీఎంపీ పలు చోట్ల భారీ సైజులో ఉన్న అద్దాలను అమర్చడానికి యత్నిస్తోంది. తాజాగా చర్చ్స్ట్రీట్, ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద భారీ అద్దాలను అమర్చింది. నగరంలో పలు చోట్ల మరుగుదొడ్లు అమర్చినప్పటికి బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకోవడం సాధ్యం కాలేదు. దీంతో బీబీఎంపీ గోడలకు భారీ అద్దాలను అమర్చి బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకోవడానికి వినూత్న పథకంతో ప్రజల్లో మార్పు వస్తుందేమో వేచి చూడాలి. -
నగరంలో త్వరలో మొబైల్ షీ టాయిలెట్స్
నగరంలో పబ్లిక్ టాయిలెట్ల వ్యవస్థ ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులుఎదుర్కోక తప్పడం లేదు. ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి సంబంధించిన టాయిలెట్లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. దీంతో మహిళా ఉద్యోగులు, చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు, ఇతర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చిన వారు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో మొబైల్ షీ టాయిలెట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగర శివార్లలోని ఐటీ, ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే మహిళల సౌకర్యార్థం ‘మొబైల్ షీ టాయిలెట్’ను ఏర్పాటు చేసేందుకు జలగం అసోసియేట్స్ ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనంపైఅత్యాధునిక హంగులతో మొబైల్ టాయిలెట్ను ఏర్పాటు చేసి..దీన్ని రద్దీ కూడళ్లలో ఉంచుతారు.అన్ని అనుమతులు లభిస్తే ఇవి కొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పబ్లిక్ టాయిలెట్ల కొరత.. జీహెచ్ఎంసీ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల సమస్య వేధిస్తోంది. సులబ్ కాంప్లెక్స్లు, స్వచ్ఛ టాయిలెట్లలో నిర్వహణ లోపం కారణంగా అక్కడికి వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. షీ టాయిలెట్లు ఏర్పాటు చేసినా పనిచేయడం లేదని మహిళలు పేర్కొంటున్నారు. సరైన అవగాహనం లేకపోవడంతో మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, హోటళ్లలోని టాయిలెట్లకు వెళ్లలేకపోతున్నారు. లూ కేఫ్లు కొన్నిచోట్ల పెట్టినా అంతటా అందుబాటులో లేవు. వాటిలో కార్పొరేట్ లుక్ ఉండటంతో టాయిలెట్లోకి ఉచితంగా వెళ్లలేమనే భావన మహిళల్లో కలుగుతోంది. ఇలా పబ్లిక్ టాయిలెట్లు అక్కడక్కడా ఉన్నా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. సుష్మా ఆలోచనతోనే.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్, సుష్మా కల్లెంపూడి దంపతులు అమెరికాలో ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ‘సంపాదనకు విరామం.. సమాజానికి సహాయం’ అనే నినాదంతో ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్కు తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పొల్యూషన్ తగ్గించేందుకు జలగం సుధీర్ గ్రీన్ ఎనర్జీ పేరిట ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రమోట్ చేసే ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో సుష్మాకు ఓ ఆలోచన తట్టింది. తాను చదువుకున్న రోజులతో పాటు ఉద్యోగం చేస్తున్నప్పుడు టాయిలెట్లు లేక హైదరాబాద్లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మొబైల్ షీ టాయిలెట్ రూపకల్పన చేస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చారు. ఈ క్రమంలో జలగం అసోసియేట్ మొబైల్ షీ టాయిలెట్ను తయారు చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల డెమోలు కూడా ఇచ్చారు. జీహెచ్ఎంసీకి ప్రతిపాదన.. మొబైల్ షీ టాయిలెట్లను ప్రవేశపెట్టాలని జలగం అసోసియేట్ ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ను సంప్రదించారు. మొబైల్ షీ టాయిలెట్ల ప్రతిపాదనను పరిశీలించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆయన సూచించారు. దీంతో జలగం అసోసియేట్స్ ప్రతినిధులు జీహెచ్ఎంసీ అధికారులను కలిశారు. జీహెచ్ఎంసీతోపాటు ఆర్టీఏ, పోలీసుల అనుమతులు ఇప్పించాలని, నీటిని నింపుకోవడం, వ్యర్థాలను వదిలే ఔట్లెట్లను కల్పించాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని, షీ టాయిలెట్ను వారు నిర్వహించేలా చర్యలు తీసుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రతిపాదించారు. ఈ క్రమంలో జలగం అసోసియేట్స్ ప్రతినిధులు వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరిని కలిశారు. మొబైల్ షీ టాయిలెట్ గురించి వివరించారు. ఒకట్రెండు నెలల్లో జీహెచ్ఎంసీ అధికారుల సమక్షంలో షీ టాయిలెట్ డెమో ఇవ్వనున్నామని వారు తెలిపారు. జీహెచ్ఎంసీ సానుకూలంగా స్పందిస్తే ఇక మొబైల్ షీ టాయిలెట్ కొద్దిరోజుల్లోనేఅందుబాటులోకి రానుంది. ప్రైవేట్ సంస్థలకు.. స్వచ్ఛ భారత్లో భాగంగా మొబైల్ షీ టాయిలెట్ను ప్రమోట్ చేయాలని జలగం అసోసియేట్ ఇప్పటికే ఎన్ఎండీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వీ హబ్, ఇన్ఫోసిస్ సంస్థలను సంప్రదించింది. ఆర్డర్ ఇస్తే మొబైల్ షీ టాయిలెట్ తయారు చేస్తామనడంతో కంపెనీలు సానుకూలంగా స్పందించాయని జలగం అసోసియేట్స్ ప్రతినిధులు చెప్పారు. మొబైల్ షీ టాయిలెట్ ఇలా.. ♦ ఎలక్ట్రిక్ వెహికల్లో మొబైల్ షీ టాయిలెట్ఏర్పాటుకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. ♦ చైనా మాన్యుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఖర్చుతగ్గే అవకాశం ఉంది. ♦ వాహనంపై 40 లీటర్ల కెపాసిటీ వాటర్ట్యాంక్ఉంటుంది. అడుగు భాగంలో 40 లీటర్ల కెపాసిటీ సెప్టిక్ ట్యాంకు ఉంటుంది. ♦ వాహనం లోపల వాష్బేసిన్తో పాటు టాయిలెట్ ఉంటుంది. ♦ వాష్ బేసిన్లో వాడిన నీళ్లు ఫ్లష్ ట్యాంక్లోకి వెళ్తాయి. ఆ నీటిని టాయిలెట్ ఫ్లష్కు వాడతారు. ♦ ప్రతి ఫ్లష్కు 4 లీటర్ల నీరు వాడాల్సి ఉంటుంది. వ్యాక్యూమ్ టెక్నాలజీతో కేవలం అర లీటరు నీరు మాత్రమే ఫ్లష్కు పోతుంది. ♦ మొబైల్ షీ టాయిలెట్ వద్ద శానిటరీ ప్యాడ్లతోపాటు మహిళలకు సంబంధించిన ఇతర వస్తువుల సేల్ కౌంటర్ ఏర్పాటు చేయవచ్చు. అనుభవం నుంచి ఆలోచన.. చదువుకున్నప్పుడు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు పబ్లిక్ టాయిలెట్లు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనుభవంలోంచే మొబైల్ షీ టాయిలెట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. గతంలో తయారు చేసి డెమో ఇచ్చాం. మరిన్ని హంగులతో ఎల్బీ నగర్, సూర్యాపేటలో రెండు టాయిలెట్లను తయారు చేస్తున్నాం. జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇప్పిస్తే కొద్ది నెలల్లోనే జీహెచ్ఎంసీ పరిధిలో టాయిలెట్ అందుబాటులోకి రానుంది. మొబైల్ షీ టాయిలెట్తో స్వచ్ఛ భారత్ లక్ష్యంతో నెరవేరడంతో పాటు మహిళలకు గౌరవం లభిస్తుంది. – సుష్మా కల్లెంపూడి, వ్యవస్థాపకురాలు,సీఈఓ, జలగం అసోసియేట్స్ -
మూత్ర విసర్జన చేస్తుండగా హత్యాయత్నం
కర్నూలు ,కల్లూరు : ఉలిందకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని పుసులూరు–రేవడూరు గ్రామాల మధ్య ఆదివారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుసులూరు గ్రామానికి చెందిన మాల మౌలాలి తన స్నేహితుడితో కలిసి వెల్దుర్తికి వెళ్లి తిరిగొస్తూ రేమడూరు–పుసులూరు మధ్య మూత్ర విసర్జనకు నిలిచారు. మౌలాలి మూత్ర విసర్జన చేస్తుండగా రేమడూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాగంటయ్య పాత కక్షలు మనసులో పెట్టుకుని ఆటోతో ఢీ కొట్టాడు. అతను ఎగిరి కిందపడ్డాడు. పక్కనే ఉన్న మౌలాలి స్నేహితుడు ఆటోను కొద్దిదూరం వెంబడించాడు. అయితే.. అతను దొరకలేదు. గాయపడిన మౌలాలిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ శంకరయ్య ఆసుపత్రి దగ్గరకు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. -
విమానంలో మహిళను టాయిలెట్కు వెళ్లనీయకుండా..
బొగటా : కొలంబియాలో దారుణం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఘోరమైన వేధింపులకు గురి చేశారు సిబ్బంది. మూత్ర విసర్జన కోసం టాయిలెట్లోకి అనుమతి ఇవ్వలేదు. రెండు గంటల పాటు ప్రాధేయపడినా కనికరించలేదు. చివరకు తన సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆదే సీటులో ఆమెను కూర్చోబెట్టి 7 గంటల ప్రయాణం చేయించారు. ఈ దారుణ ఘటన కొలంబియాలోని బొగటాలో జరిగింది. గత నెలలో ఐర్లాండ్లోని డబ్లిన్ వెళ్లేందుకు ఓ 26 ఏళ్ల మహిళ కొలంబియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ఎక్కారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఆ విమానం రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో విమానంలో ఉన్న మహిళ మూత్ర విసర్జన కోసం టాయిలెట్కు వెళ్లబోయారు. విమాన సిబ్బంది టాయిలెట్లోకి అనుమతించలేదు. తనకు ఇబ్బందిగా ఉందని, త్వరగా టాయిలెట్కు వెళ్లాలని సిబ్బందిని ప్రాధేయపడినా కనికరించలేదు. టాయిలెట్లోకి వెళ్లేందుకు వెళ్లిన ప్రతిసారి ఆమెను అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమిలేక తాను కూర్చున సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆమెను అదే సిటులో కూర్చొబెట్టి 7గంటల ప్రయాణం చేయించారు. ఆమె కెనాడియన్ సీటీకి వెళ్లాక ఓ హోటల్కి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకున్నారు. అనంతరం విమానాశ్రయానికి వెళ్లి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను ఘోరంగా వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఈ ఫొటో ప్రత్యేకత ఏమంటే..
ఈ ఫొటో ప్రత్యేకత ఏమంటే.. ఈ అమ్మాయి ధరించిన వెడ్డింగ్ డ్రెస్ను టాయిలెట్ పేపర్తో తయారు చేశారు. న్యూయార్క్లో నిర్వహించిన ఓ పోటీలో ఈ డ్రెస్ను ఉత్తమమైనదిగా ఎంపికచేశారు. -
బాత్రూంలో బడి బియ్యం
చంచల్గూడ: రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బియ్యం అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే వసతి గృహాల్లో విద్యార్థులకు వండిపెట్టాల్సిన సన్న బియ్యం బహిరంగ మార్కెట్కు తరలిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలోని నాంపల్లి, గోషామహల్ వసతి గృహాలు యాకుత్ పురా నియోజకవర్గం కుర్మగూడలోని ఓ భవనంలో కొనసాగుతున్నాయి. పౌరసరఫరా శాఖ అధికారులు తనిఖీల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని వసతి గృహాల్లో సరుకులు, బియ్యం నిల్వలకు సంబంధించి సోదా లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న మధ్యాహ్నం కుర్మగూడ లోని వసతి గృహాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్, వంటశాలను కూడా పరిశీలించారు. బాత్రూంలో 16 సంచుల బియ్యం. తనిఖీలు నిర్వహించిన అధికారులు అంతా సక్రమంగానే ఉందని నిర్థారణకు వచ్చారు. అయితే అధికారులు వెనుదిరిగిన అనంతరం భవనంలోని ఓ బాత్రూమ్లో 16 సంచుల బియ్యం దర్శనం ఇచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాత్రూమ్లో బియ్యం బస్తాలను గుర్తించిన విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తుంది. స్టోర్ రూమ్లో ఉండాల్సి బియ్యాన్ని బాత్రూమ్లోకి ఎందుకు తరలించారనే వాదన వినిపిస్తోంది. దీంతో హాస్టల్ వార్డన్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తుత్తి తనిఖీలేనా...? రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు వసతి గృహంలో చేపట్టిన తనిఖీలు విమర్శలకు తావిస్తోంది. దాదాపు 8 నుంచి 10 క్వింటళ్ల బియ్యం బాత్రూంలో నిల్వ చేసినా తనిఖీలకు వచ్చిన అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. అసలు వసతి గృహంలో తనిఖీలు జరుగుతున్నట్లు హాస్టల్ వార్డెన్కు ముందుగానే సమాచారం అందినట్లు తెలుస్తెంది. ఈ అంశంపై సివిల్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. తనిఖీలు జరిగాయి.. తనిఖీల విషయమై జిల్లా బీసీ సంక్షేమాధికారి విమలాదేవిని ‘సాక్షి ప్రతినిధి’ ఫోన్లో సంప్రదించగా కుర్మగూడలోని (నాంపల్లి, గోషామహాల్) వసతి గృహాల్లో ఈ నెల 13న సివిల్ సప్లయ్ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే దీనిపై కమిషనర్కు నివేదిక అందజేస్తారని ఆమె వివరించారు.–విమలాదేవి,జిల్లా బీసీ సంక్షేమ అధికారి -
బంగారు టాయిలెట్ దోచుకెళ్లారు
లండన్: బ్రిటన్లోని బ్లెన్హీమ్ ప్యాలెస్లోని 18 క్యారెట్ల బంగారు టాయిలెట్ను దొంగలు శనివారం దోచుకెళ్లారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా పేరందుకున్న ప్యాలెస్లో ఈ చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 66 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం ఉదయం 4:50 గంటలకు ఈ దొంగతనం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. టాయిలెట్ పైపులు గోడల లోపలికి బిగించి ఉండటం వల్ల గోడలకు నష్టం జరిగిందని, ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయిందని తెలిపారు. దీన్ని దొంగిలించడానికి నిందితులు రెండు వాహనాలు ఉపయోగించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ప్యాలెస్ డిస్ప్లేపై చూపిన బంగారు టాయిలెట్ను దోచుకెళ్లారని పోలీసు అధికారి చెప్పారు. నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్పాత్ టైల్స్, టాయిలెట్లు
గచ్చిబౌలి: ప్లాస్టిక్ భూతం మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చెత్తలో పేరుకుపోయిన ప్లాస్టిక్ భూసారంతో పాటు భూగర్భ జలాలు కలుషితం చేస్తూ మానవాళిని ఆందోళనకు గురి చేస్తోంది. అలాంటి ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసి టైల్స్ను తయారు చేశారు. ఆ టైల్స్తో ఫుట్పాత్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ అధికారులు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ప్లాస్టిక్ రీసైక్లింగ్తో తయారు చేసిన వాల్, రూఫ్ షీట్స్తో టాయిలెట్ల నిర్మాణం చేపట్టడం విశేషం. మియాపూర్ మెట్రో వద్ద ప్లాస్టిక్ రీసైక్లింగ్తో తయారు చేసిన షీట్స్తో ఫైర్ ప్రూఫ్ గదిని నిర్మించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రీసైక్లింగ్తో ప్లాస్టిక్ వ్యర్థానికి ఓ అర్థం చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అయ్యప్ప సొసైటీలో ఫుట్పాత్ల నిర్మాణం.. ఆర్డర్ చేసి ఇండోర్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్ను తెప్పిస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్– 20లోని డాగ్ పార్క్, శిల్పారామం ముందు, చందానగర్ సర్కిల్ 21లోని అయ్యప్ప సొసైటీ 100 అడుగుల రోడ్డులో ఫుట్పాత్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్ట్గా చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ, బ్యాంబూ హౌస్ ఇండియా సంయుక్తంగా ఫుట్పాత్ల నిర్మాణం చేస్తున్నాయి. 6 నెలలకోసారి ఈ టైల్స్ను మార్చాల్సిన అవసరం లేకపోవడంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. 600 పాలీబ్యాగ్స్ను రీసైక్లింగ్ చేస్తే 300 గ్రాముల బరువైన ఒక టైల్ను తయారు చేయవచ్చు. దృఢంగా ఉండే ఈ టైల్స్ డ్యామేజ్ కావు. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేందుకు వీలుంటుంది. భూగర్భ జలాలు పెంపొందేందుకు అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్ను బెస్ట్ ప్రాక్టీస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి టైల్స్ను వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎకో ఫ్రెండ్లీ టైల్స్ వాడకంతో ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ యార్డ్కు చేరకుండా చేయవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ గుర్తించింది.. ప్లాస్టిక్ రిసైక్టింగ్ టైల్స్తో ఫుట్పాత్లు వేయడాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ అఫైర్స్ గుర్తించింది. ఇలాగే దేశవ్యాప్తంగా అమలు చేయాలని మార్గదర్శకాలు పంపించింది. రీసైక్లింగ్తో డంప్ యార్డ్లకు ప్లాస్టిక్ తగ్గే అవకాశం ఉంది. మన దగ్గర ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి 3000 చెత్త డబ్బాలు ఉత్పత్తి చేసి జోనల్ పరిధిలో పెట్టాం. ఇప్పుడు 21 చెరువుల వద్ద రిసైక్లింగ్ షీట్స్తో టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్లాస్టిక్ రిసైక్లింగ్ వాల్, రూఫ్ టాప్ షీట్లతో ఫైర్ ప్రూఫ్, సేఫ్టీ గదిని మియాపూర్ మెట్రో వద్ద ప్రయోగాత్మకంగా నిర్మించాం. – హరిచందన దాసరి, వెస్ట్ జోనల్ కమిషనర్ ఫైర్ ప్రూఫ్ గది నిర్మాణం.. మియాపూర్ మెట్రో స్టేషన్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్తో చేసి షీట్స్తో వాచ్మెన్ ఉండేందుకు ఫైర్ప్రూఫ్ గదిని నిర్మించారు. రూ.1.50 లక్షల వ్యయంతో ఈ హౌస్ను ఏర్పాటు చేశారు. ఐరన్ రాడ్లతో నిర్మాణం చేపడితే ఖర్చు రెట్టింపు కానుంది. టెట్రాప్యాక్స్, బాటిల్ క్యాప్స్, పాలీబ్యాగ్స్ను రీసైక్లింగ్ చేసిన వాల్, రూఫ్ షీట్స్తో గదిని నిర్మించారు. ఈ మెటీరియల్ వాడి హీట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ డ్యామేజ్ ఫ్రీ హౌస్లను తయారు చేయవచ్చు. చెరువుల వద్ద టాయిలెట్ల నిర్మాణం.. ప్లాస్టిక్ రీసైక్లింగ్తో చేసిన షీట్స్తో చెరువుల వద్ద టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ పరిధిలోని 21 చెరువుల వద్ద ప్లాస్టిక్ టాయిలెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చందానగర్లోని గంగారం చెరువుతో పాటు రామసముద్రం, గుర్నాథం చెరువు, మల్కం చెరువు సమీపాల్లో టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నారు. వినాయక నిమజ్జనం నాటికి 21 చెరువుల వద్ద టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే వెస్ట్ జోనల్ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారైన బిన్స్ను వాడుకలోకి తెచ్చారు. డంపింగ్ యార్డ్తో వేరు చేసిన ప్లాస్టిక్ను సేకరించి సనత్నగర్లోనే రీసైక్లింగ్ చేసి వాల్షీట్స్, చెత్త బిన్స్ను తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్తో చేసిన టైల్స్తో వేసిన ఫుట్పాత్ -
‘400 మందికి కేవలం 2 మరుగుదొడ్లేనా?’
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు చేరువయ్యేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగా ‘దీదీ కో బోలో’ వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. అంతేకాక మురికివాడల్లో ఆకస్మిక పర్యటనలు కూడా చేపడతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హౌరా ప్రాంతంలోని ఓ మురికి వాడలో పర్యటించారు దీదీ. ఆ సమయంలో ఆమెతో పాటు పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహరాల శాఖ మంత్రి ఫిర్హాధ్ హకీమ్ కూడా ఉన్నారు. పర్యటనలో భాగంగా దీదీ అక్కడి ప్రజల స్థితి గతులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో 400మంది నివసిస్తున్న ఆ ప్రాంతంలో కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నట్లు దీదీ దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హకీమ్ను వివరణ అడిగారు దీదీ. ‘మురికి వాడల అభివృద్ధి కోరకు ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది. కానీ ఇక్కడ 400 మందికి కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాంత కౌన్సిలర్ ఏక్కడ.. ఏం చేస్తున్నాడు’ అంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హకీమ్ స్పందిస్తూ.. కౌన్సిలర్ ఓ హత్యా నేరం కింద ప్రస్తుతం జైలులో ఉన్నాడని.. అందుకే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని తెలిపాడు. అందుకు దీదీ.. ‘కౌన్సిలర్ జైలులో ఉన్నాడు సరే.. మున్సిపాలిటీ ఇక్కడే ఉంది కదా. మీరు పర్యవేక్షించడం లేదా. 400 మంది కోసం కేవలం రెండు మరుగుదొడ్లు ఎలా సరిపోతాయి. కనీసం 8,10 అయినా ఉండాలి కదా. మీకొక వారం రోజుల గడువు ఇస్తున్నాను. ఈ లోపు అన్ని మురికివాడల్లో తిరిగి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించండి’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రతి 20 నిమిషాలకు ఓ మహిళపై లైంగిక దాడి
న్యాయం కావాలి అని అడగడం ప్రతి పౌరుడి హక్కు! జరుగుతోంది అన్యాయం అని తెలిస్తే కదా.. న్యాయం గురించి అడిగేది!! ముందు న్యాయం ఏమిటో చెప్పే కన్నా.. అన్యాయం ఏంటో చూపించాలి! దానికి బాలీవుడే దిక్సూచీ!! న్యాయం కావాలంటే .. న్యాయం చూడాలని ఎన్నో సినిమాలను ఆవిష్కరించింది!! నాలుగైదేళ్ల కిందట అనుకుంటా.. హైదరాబాద్లోని ‘లామకాన్’లో ఎల్జీబీటీక్యూ ఫెస్టివల్ ఏదో జరుగుతోంది. లోపలికి వెళ్లే ముందు ఆ ఇంటి ప్రహరీ గేట్కు.. ‘‘ప్లీజ్ లీవ్ యువర్ ప్రిజుడీస్ హియర్’’ అని రాసున్న బోర్డ్ ఉంది. అంటే భ్రమలు, భ్రాంతులు తొలగించుకొమ్మని అర్థం. ఇప్పుడు బాలీవుడ్ అదే చేస్తోంది. నాలుగు ఫైట్లు, ఆరు డ్యుయెట్లు, ఐటమ్ సాంగ్, ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఒక వ్యాంప్ వంటి స్టీరియో టైప్ ఫార్ములాను కత్తిరించింది. సమకాలీన సమస్యల మీద ఫోకస్ చేసింది. హీరోయిన్ అయినా.. హీరో అయినా.. ఆఖరకు విలన్ అయినా కథే! కథావసరంగా పాత్రలు పుట్టుకు రావాలి కాని పాత్రల కోసం కథ అల్లట్లేదు. సమకాలీన ఆలోచనా ధోరణులు, అనుబంధాలు, సామాజిక అంశాలనే థీమ్గా తీసుకుంటోంది. అలా తెరకెక్కి కమర్షియల్ హిట్లయినవి ఉన్నాయి. క్రిటిక్స్ ప్రశంసలు పొందినవి ఉన్నాయి. విదేశీ ఫిల్మోత్సవ్లలో సందడి చేసి భారతీయ సినిమా పట్ల గౌరవాన్ని పెంపొందించనవీ ఉన్నాయి. థియేటర్ల నుంచి సైలెంట్గా ప్రేక్షకుల మెదళ్లకెక్కి చెరగని ముద్ర వేసినవీ ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి ప్రస్తావించుకోకపోతే మార్పును స్వాగతించనట్టే! పైగా వాటి గురించి చెప్పుకోవాల్సిన సందర్భం కూడా. కిందటి నెలలోనే ‘ఆర్టికల్ 15’ సినిమా విడుదలై టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది. సెప్టెంబర్ 13న ‘‘సెక్షన్ 375’’ చిత్రం రిలీజ్కానుంది. ట్రయిలర్స్తో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. సెక్షన్ 375.. ఇండియన్ పీనల్ కోడ్లోని ‘సెక్షన్ 375’ రేప్ గురించి తెలియజేస్తుంది. స్త్రీ ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా ఆమె పట్ల ఎలాంటి సెక్సువల్ యాక్ట్ జరిగినా దాన్ని రేప్ కిందే పరిగణిస్తుందీ సెక్షన్. దీనికి సంబంధించి ఆరు రకాల వివరాలనూ ఇందులో పొందుపర్చారు. ఆమెకు ఇష్టం లేకుండా, ఆమె అనుమతి లేకుండా, ఆమెను బెదిరించి, భయాందోళనలకు గురి చేసి ఆమె అనుమతి తీసుకున్నా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, పెళ్లికి ముందే ఆమెతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఆమె మానసిక స్థితి బాగా లేనప్పుడు ఆమె నుంచి అనుమతి తీసుకున్నా, దాని పర్యవసానాలు తెలియక ఆమె అనుమతి ఇచ్చినా, పద్దెనిమిదేళ్ల లోపున్న అమ్మాయి ఇష్టపడి, అనుమతి ఇచ్చినా.. జరిగిన సెక్సువల్ యాక్ట్ రేప్ కిందకే వస్తుందని ఈ సెక్షన్లో ఉంది. అలాగే ఎలాంటి సెక్సువల్ యాక్ట్ను రేప్గా పరిగణిస్తారో కూడా వివరిస్తోందీ సెక్షన్. నిజ జీవితంలోని రేప్ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ ఐపీసీ 375ను చర్చించే కోర్ట్ రూమ్ మూవీయే‘సెక్షన్ 375’. ట్రైలర్ను బట్టి ఒక దళిత కాస్ట్ అసిస్టెంట్ను సినిమా డైరెక్టర్ రేప్ చేసిన కేస్ను డిఫెన్స్, ప్రాసిక్యూట్ అడ్వకేట్స్ వాదిస్తూంటారు. డిఫెన్స్ లాయర్గా అక్షయ్ ఖన్నా, ప్రాసిక్యూటర్గా రిచా చద్దా నటించారు. ఈ దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక మహిళ లైంగిక దాడిని ఎదర్కోవాల్సి వస్తోందని, ప్రతి లక్షమంది మహిళల్లో 1.8 మంది మహిళలు రేప్ జరిగే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, రేప్ చేసిన వాళ్లలో కేవలం 25 శాతం మంది నేరస్తులకు మాత్రమే శిక్ష పడ్తోందని, దాదాపు 75 శాతం కేసుల్లో నిందితులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని ఈ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ లెక్క చెప్తోంది. ‘‘సెక్షన్ 375’’కు అజయ్ బహెల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్టికల్ 15.. కుల మత జాతి ప్రాంత లింగ వివక్ష లేకుండా దేశంలోని పౌరులంతా సమానమే. అన్నిచోట్లా అందరికీ ప్రవేశం ఉంటుంది. అలాగని స్త్రీలు, పిల్లలు, వెనకబడిన వర్గాల వాళ్ల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలనుకున్నప్పుడు ఈ ఆర్టికల్ 15 వర్తించదు. వెనకబడిన వర్గాలను మిగిలిన పౌరులతో సమానంగా చేయడానికి ఈ ఆర్టికల్ సహకరిస్తుంది. 2014, ఉత్తరప్రదేశ్లోని బదాన్లో ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్ చేసి, చంపి అదే ఊళ్లో చెట్టుకు ఉరేసిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. స్వతంత్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఇంకా కుల వ్యవస్థ గురించి, అది చేసే దారుణాల గురించి మాట్లాడుకునే స్థితిలో ఉండడమే విషాదం. తమ కూలి మూడు రూపాయలు పెంచమని అడిగిన పాపానికి ఇద్దరు దళిత అమ్మాయిలను రేప్ చేసి, చంపి.. వాళ్ల ఔఖాద్ అంటే వాళ్ల స్థానం ఏంటో చూపించామని విర్రవీగిన ఆ ఊరి కామందుతో తలపడిన ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ పోరాటమే ‘ఆర్టికల్ 15’. పాతుకుపోయిన నాలుగంచెల కుల వ్యవస్థ, ఓట్ల కోసం దాన్ని కాపాడుకుంటున్న రాజకీయ వ్యవస్థ.. అధికారం కోసం అట్టడుగు వర్గాలను చీలుస్తున్న పాలనా వ్యవస్థను సినిమాటిక్గా షో చేయకుండా వాస్తవానికి దగ్గరగా చూపించిన సినిమా. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ అయి ఆడియెన్స్ అవార్డ్నూ అందుకుంది. ఆయుష్మాన్ ఖురానా, ఈషా తల్వార్, సయానీ గుప్తా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకుడు. ఈ నెల 24 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్కానున్నట్టు అంచనా. అలీగఢ్.. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్ నిజ జీవిత కథే ‘అలీగఢ్’ మూవీ. స్వలింగ సంపర్కం నేరమని.. తర్వాత జరిగిన ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాల ఫలితంతో నేరం కాదని చెప్పిన ఆర్టికల్ 377ను ఇండికేట్ చేసిన సినిమా ఇది. కథేంటంటే.. ప్రొఫెసర్ శ్రీనివాస్ రాంచంద్ర్ సిరాస్ హోమోసెక్సువల్ రిలేషన్షిప్స్ను వీడియో తీసి బయటపెడ్తారు కొందరు. దాంతో సిరాస్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. కుటుంబ సభ్యులూ అతణ్ణి ఇంట్లోంచి వెళ్లగొడ్తారు. హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీ ఇది. ఎల్జీబీటీ హక్కుల గురించి డిస్కస్ చేసిన చలన చిత్రం. ‘‘ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా జొరబడే హక్కు ఎవరికీ లేదు.. ఆ మనిషి సమాజానికి హాని తలపెడితే తప్ప. అలాగే స్వలింగ సంపర్కం అనేది ఒక ధోరణి కాదని, నేచురల్ సెక్స్లాగే అదీ బయాలాజికల్ ఇన్స్టింక్ట్’’ అని అర్థం చేయించే సినిమా. హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు. ప్రొఫెసర్ పాత్రలో మనోజ్ బాజ్పాయ్ నటించారు. ఇరోస్ నౌ, అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. ఆర్టికల్ 377 సడలింపు తర్వాత ఎల్జీబీటీ రైట్స్ మీద వచ్చిన మరో సినిమా ‘‘377’’. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది. పింక్... అమ్మాయి కట్టూబొట్టూ తీరు, వెళ్లే పార్టీలు, కలుసుకునే మనుషులను బట్టి ఆ అమ్మాయి మీద ఫలానా అని లేబుల్ వేసి.. చొరవ తీసుకొని ఒంటి మీద చేయి వేసే మగవాళ్లకు లెంప కాయ ‘పింక్’. అమ్మాయి ‘‘నో’’ అంటే ‘‘నో’’ అనే .. దానికి ఇంకా ఏ అర్థాలు ఉండవనీ.. వెదకొద్దని హెచ్చరించిన సినిమా. స్త్రీల లైంగిక హక్కులు, ఇష్టాయిష్టాల స్వేచ్ఛ గురించి మొదటి సారి స్క్రీన్ మీద చర్చించిన చిత్రం. ఆధునిక దుస్తుల్లో, అంతే ఆధునిక జీవనశైలితో ఉన్న అమ్మాయిలు మగవాళ్లతో చనువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్లు పడగ్గదికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కాదని.. తీర్పునిస్తుంది. మురికి తలపులతో ఉన్న మనసులను శుభ్రంగా కడిగేస్తుంది పింక్. నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. పాడ్మన్... బహిష్టు.. అనే మాటను గట్టిగా అనడానికి ఆడవాళ్లే సాహసించని సమాజంలో ఓ భర్త.. ఆ క్రమం చుట్టూ ఉన్న అనారోగ్య వాతావరణాన్ని గూర్చి మథనపడి.. ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపెడ్తాడు. అదే ‘పాడ్మన్’ సినిమా. నిజ జీవిత గాథ. రుతుక్రమం పట్ల ఉన్న అపోహలు, అంధవిశ్వాసాలకు చెక్ పెట్టి.. సైలెన్స్ను బ్రేక్ చేసింది. ఇదీ సినిమాకు కథాంశమే అని నిరూపించింది. నెట్ఫ్లిక్స్, జీ5ల్లో ఉంది. టాయ్లెట్.. సేమ్ అండ్ షేమ్.. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా.. గ్రామీణ భారతం.. ఆ మాటకొస్తే నగరాల్లోని స్లమ్స్లో కూడా మరుగుదొడ్లు లేని పరిస్థితి. రియల్లైఫ్లోని ప్రియాంక అనే నవ వధువే ఈ సినిమాకు ప్రేరణ. ఓ ఇంటి కోడలు అత్తింట్లో మరుగుదొడ్డి కట్టించుకోవడమే కథ.. అదే హీరోయిన్.. హీరో అన్నీ! ఇదీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. న్యూ బిగినింగ్.. ఇలా దాదాపు 2000 సంవత్సరం నుంచీ బాలీవుడ్ కొత్త స్క్రీన్ను షేర్ చేస్తోంది. మనుషులనే పాత్రలుగా మలిచి జీవితాలను ఆవిష్కరిస్తోంది. కళ్లముందు కనిపిస్తున్నా మెదడుకు ఎక్కించుకోని విషయాలెన్నిటినో కథలుగా రాసుకుంటోంది. అందరికీ తెలియాల్సిన రాజ్యాంగ అధికరణల నుంచి అందరికి కావాల్సిన మరుగుదొడ్ల వరకు ఏ చిన్న డిటైల్నూ మిస్ చేయట్లేదు. ఇలాంటి సినిమాలతో బాలీవుడ్ న్యూ బిగినింగ్ను స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అక్షరం లేని, రాని చోట దృశ్యమే ఆయుధం అవుతుంది. సమస్యల అవగాహనకు సినిమాను మించిన మాధ్యమం ఏముంటుంది? అందుకే వీటిని మల్టీప్లెక్స్లకే కాకుండా గ్రామాల్లోని టాకీసులకూ పంపాలి. అందరూ చూసేలా చేయాలి. ఔర్ కు .. ‘ఉరి’ తీసిన కెమెరాతోనే ఇస్లామాఫోబియా ఇతివృత్తంగా ‘ముల్క్’ను, ‘హమీద్’, ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’అంటూ కశ్మిరీల పోరాటాన్నీ చూపించింది బాలీవుడ్. కశ్మీరియత్ ఉనికి అవసరాన్ని చెప్పింది. ‘నిల్ బట్టి సన్నాటా’తో స్త్రీ చదువును ప్రోత్సహిస్తూనే ‘లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా’, ‘వీరే దీ వెడ్డింగ్’లతో మహిళా సాధికారత మరో కోణాన్నీ పరిచయం చేసింది. ‘ఆలిఫ్’, ‘సూపర్ థర్టి’తో అందరికీ చదువుకునే రైట్ ఉందని డాల్బీ డిజిటల్ సౌండ్తో నినదించింంది. వీటన్నిటినీ నెట్ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్స్టార్, జీ5, ఇరోస్ నౌల్లో వీక్షించొచ్చు. ఇలాంటి కొత్త ట్రెండ్తో సెట్స్ మీద ఇంకెన్ని సినిమాలున్నాయో! వేచి చూద్దాం.. ఈ చేంజ్కు వెల్కమ్ చెప్దాం!– సరస్వతి రమ -
అవిగో టాయ్లెట్స్.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు!
గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పల్లెజనం పట్టణాల నుంచి ఏం నేర్చుకుంటున్నారో తెలియదు కానీ చాలా విషయాల్లో గ్రామీణ ప్రజల్లోని మానవత్వం, అమాయకత్వం, ప్రేమా మన మనసుల్ని పల్లెలవైపు పరుగులు తీయిస్తుంటుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా మననుంచి దూరమైనవేవో మనసుని నొప్పిస్తుంటాయి. ఇటీవల ఆగస్టు తొలివారంలో తల్లిపాల ప్రాధాన్యతను చాటిచెప్పే వారోత్సవాలను గురించి చదివినప్పుడు గుండెల్లో అలాంటిదే ఏదో నొప్పి బయలుదేరింది. కొద్దినెలల క్రితం చదివిన ఓ విషయం గుర్తొచ్చింది. బహుశా అలాంటి నొప్పినే, అలాంటి బరువునే గుండెల్లో నింపుకొని భారంగా, బాధగా బతుకులీడుస్తోన్న లక్షలాది మంది పట్టణాల్లోని పసిబిడ్డల తల్లులు గుర్తొచ్చి నాగరికత పేరుతో, అభివృద్ధి పేరుతో కుప్పలు తెప్పలుగా నిర్మితమౌతోన్న అమానవీయ, అనాగరిక కట్టడాలపై ఏహ్యభావం ఏర్పడింది. బహుళంతస్తుల సెంట్రలైజ్డ్ ఏసీ భవనాల్లో ఆరోగ్యం కోసం కూడా నాలుగు మెట్లు ఎక్కే బాధే లేకుండా ఎస్కులేటర్లు చాలా సుఖవంతమైనవే. అలాంటి చాలా సౌకర్యవంతమైన ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్లూ, మల్టీప్లెక్స్లూ నగరం నిండా జనానికి చోటే లేకుండా అవే భవనాలు. అలా సకల సౌకర్యాలతో విలసిల్లుతోన్న షాపింగ్ ‘పెద్ద’ బజారుల్లో ఓ తల్లి కళ్లు దేనికోసమో వెతుకుతూనే ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్లోని ట్రయల్ రూం ముందున్న సింగిల్ స్టూల్పై కూర్చొని జీన్స్ పైన సౌలభ్యం కోసం వేసుకున్న లూజ్ టీషర్టుని ఓ వారగా గబగబా పైకి లాగి చిన్నారి నోటికి స్థనాన్ని అందించిందో చిన్నపిల్ల తల్లి. అంతే! అంతలోనే అక్కడికొచ్చిన ఓ వ్యక్తి అది పిల్లలకు పాలివ్వడం కోసం ఏర్పాటుచేసిన స్థలం కాదనీ, తక్షణమే ఖాళీ చేయాలనీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడు. మరి ఏడుస్తున్న బిడ్డకి పాలెక్కడివ్వాలి? ఆమె ప్రశ్నకి సమాధానంగా ప్రతీకాత్మక చిత్రం : ‘పాలిచ్చే తల్లులకుకాస్త చోటు చూపించండి’ అంటూ ఇటీవలేఆన్లైన్ వేదికగా ఒక ఉద్యమం మొదలైంది. ‘అదిగో అక్కడుంటాయి టాయ్లెట్స్.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు’ అని ఉచిత సలహా ఒకటి పారేసి వెళ్లాడు. తల్లిపాలు కల్తీ లేనివి. కల్తీ చేయలేనివి. గుండెల్నిండుగా హత్తుకుని ఇచ్చే తల్లిపాలు బిడ్డ ఆకలి మాత్రమే తీర్చవు. ప్రేమతో నిండిన పాలిండ్ల స్పర్శ బిడ్డకూ, తల్లికీ కూడా ఆరోగ్యాన్నిస్తాయి. అలాంటిది అపరిశుభ్రమైన ప్రాంతంలో, దుర్గంధంతో నిండిన విసర్జిత ప్రాంతంలో బిడ్డకు పాలివ్వమని చెప్పే పరిస్థితి ఈ పట్టణాల్లో మనం మిస్సవుతోన్నదేమిటో మనకు గుర్తు చేస్తోంది. అంతెందుకు చాలా రోజుల క్రితం రోడ్డుపక్కగా (మిగిలిన వాహనదారులకు ఏ ఆటంకం లేకుండా) కారు ఆపుకుని బిడ్డకు పాలిస్తోన్న తల్లిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన రుబాబూ, రాద్ధాంతం టీవీ చూసినవారందరికీ గుర్తుండే ఉంటుంది. రోడ్డుపైన అడ్డదిడ్డంగా కార్లు పార్కుచేసినా కిమ్మనకుండా వెళ్లిపోయే వాళ్లు కూడా పసిబిడ్డకు పాలిచ్చేప్పుడు ఆటంక పరచకూడదనే ఇంగితం లేకుండా పోయింది. అయితే ఆ ఇంగితం ఉండాల్సిందెవరికి? నిజానికి నగరాలకే. పర్యావరణాన్ని గాలికి వదిలేసి, అనుమతులకు చెల్లుచీటీ ఇచ్చేసి, కుప్పలుతెప్పలుగా కట్టేసోన్న బహుళంతస్థుల భవనాల్లో మహిళలకు కావాల్సిందేమిటో ఎవ్వరైనా ఆలోచించారా? పసిబిడ్డలకు పాలిచ్చే ఓ రెండడుగుల ప్రైవసీ స్థలం. ఓ చిన్ని కుర్చీ. ఇంత చిన్న విషయం కొన్ని వేల మంది సమస్య అయినప్పుడు ఇదెందుకు తట్టదు ఎవరికీ? అంటే అది స్త్రీల సమస్య మాత్రమే కాబట్టి. ఆడపిల్లలకి ఏరకంగానూ అక్కరకు రాని నగరాలను నాగరికంగా మార్చగలమా? – అరుణ అత్తలూరి -
‘మరుగుదొడ్లో వంట.. అయితే ఏంటి’
ముంబై: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లలో వంట చేస్తున్నారనే వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తి దేవి స్పందిస్తూ.. ‘టాయిలెట్లలో వంట చేస్తే తప్పేంటి. టాయిలేట్ సీట్కు, స్టవ్కు మధ్య విభజన ఉంటే అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం మన ఇళ్లలో అటాచ్డ్ బాత్రూంలు ఉంటున్నాయి. అంతమాత్రాన ఇంటికి వచ్చిన బంధువులు భోజనం చేయడం మానేయడం లేదు కదా. ప్రస్తుతం ఆ బాత్రూంను వినియోగించడం లేదు. దాన్ని గులకరాళ్లతో నింపేశారు. అలాంటప్పుడు పాత్రలను బాత్రూం సీట్ మీద ఉంచితే ఏం అవుతుంది. మన ఇళ్లలో కూడా పాత్రలను కిందే పెడతాం కదా’ అన్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు ఇమర్తి దేవి. ఈ విషయంపై జిల్లా అధికారి దేవేంద్ర సుంద్రియాల్ స్పందిస్తూ.. ‘మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయం సహాయక బృందానికి అప్పగించాం. వారే టాయిలెట్ను కిచెన్గా మార్చారు. ఇందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటాం’ అన్నారు. -
సాధ్విని మందలించిన జేపీ నడ్డా!
సాక్షి, న్యూఢిల్లీ: మరుగుదొడ్లు కడగడం కోసమో.. వీధులు ఊడ్చడం కోసమో తాను ఎంపీగా ఎన్నికవ్వలేదంటూ బీజేపీ భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మానస పథకంగా ‘స్వచ్ఛ భారత్’కు విశేషమైన ప్రాచుర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఆయన సొంత పార్టీ ఎంపీ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్ ఎంపీ సాధ్విపై కన్నెర్ర జేసింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సాధ్వి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ.. ఆమెను మందలించినట్టు తెలుస్తోంది. ఇకముందు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ఆమెకు సూచించినట్టు సమాచారం. టాయిలెట్ వ్యాఖ్యల నేపథ్యంలో జేపీ నడ్డాతోపాటు బీజేపీ ఆర్గనైజషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ఆమెను పిలిపించుకొని.. ఈ వ్యాఖ్యల విషయమై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. -
‘సాధ్వి ప్రజ్ఞా.. మోదీ వ్యతిరేకురాలు’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు ఎంఐఎం పార్టీ అధినేత, అసదుద్దీన్ ఒవైసీ. మమ్మల్ని ఎన్నుకుంది టాయిలెట్లు శుభ్రం చేయడానికి కాదు అంటూ సాధ్వి ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఒవైసీ స్పందిస్తూ.. సాధ్వి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. సాధ్వి ఉన్నత కులానికి చెందిన వ్యక్తి కాబట్టే ఇలా మాట్లాడారని ఆరోపించారు. మరగుదొడ్లు శుభ్రం చేసేవారిని ఆమె తనతో సమానంగా చూడలేకపోతున్నారని.. ఇలాంటి వారు నూతన భారతదేశాన్ని ఎలా సృష్టిస్తారని ఒవైసీ ప్రశ్నించారు. వర్షాకాలం కావడంతో.. సాధ్వి ప్రాతినిథ్యం వహిస్తోన్న భోపాల్ పరిసర ప్రాంతాలు అపరిశ్రుభంగా మారాయి. అయితే ఆ ప్రాంత డ్రైనేజీ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి ప్రజలు. తమ ప్రాంతంలో ఓసారి స్వచ్ఛభారత్ చేపట్టండని ఆమెకి విజ్ఞప్తి చేశారు. దీనిపై సాధ్వి తీవ్రంగా మండి పడుతూ.. ‘ఒకటి గుర్తుంచుకోండి.. నన్ను ఎన్నుకున్నది మురికి కాలువలు, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు కాదు. నన్ను దేనికోసం అయితే ఎన్నుకున్నారో ఆ బాధ్యతల్ని నిజాయతీగా నిర్వర్తిస్తాను. ఒక ఎంపీగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయడమే నా విధి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అంతా వారిష్టం..
సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో ప్రతి రోజూ దాదాపు 40 లక్షల వాహనాలు ఇంధనం పోయించుకుంటుంటాయి. పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వాహనాల్లో పొస్తున్న ప్రతి చుక్కకు సొమ్ము చేసుకుంటుంటారే తప్ప వినియోగదారులకు కనీస సౌకర్యాల కల్పనలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు.ఏకంగా బంకుల యాజమాన్యాలు చమురు సంస్థల నిబంధనలను సైతం తుంగలో తొకేస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్ బంకులకు వస్తున్న వాహనదారులకు ఇంధనం తప్ప ఇతర సేవలు అందని దాక్ష్రగా మారాయి. పౌరసరఫరాల శాఖ, జైళ్ల శాఖ ఆధ్వరంలో నడిచే పెట్రోల్ బంకుల్లో మాత్రం సౌకర్యాలు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి తప్ప మిగిలిన ఆయిల్ కంపెనీల ఔట్ లేట్, ప్రయివేటు బంకుల్లో వాటి ఊసే కనిపించడం లేదు. పెట్రోల్ బంకులకు వచ్చే వాహనాల్లో పెట్రోల్, డీజిల్ వేసి పంపడమే కాదు... వాహనాల్లో ఉచితంగా గాలి, వాహనదారులకు తాగు నీరు, మరుగు దొడ్లు సౌకర్యం ఖచ్చితంగా కల్పించాల్సి బాధ్యత యాజమాన్యాలపై ఉంది. మరోవైపు పెట్రోబంకుల్లో ఇంధనం నాణ్యత పరీక్ష పరికరాలను అందుబాటులో ఉంచాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎండ, వానల నుంచి రక్షణకు తగిన నీడ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అయితే పెట్రోల్ బం కుల నిర్వాహకులు వీటిని పట్టించుకోవడం లేదు. నగరంలో 60.34 లక్షల వాహనాలు.. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 60.34 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. అందులో పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్ర వాహనాలు 20.30 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. మహానగర పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్ బంక్లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. జాగ్రత్తలేవీ.... పెట్రోల్ బంకుల ఏర్పాటు సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే తక్షణమే చర్యలు తీసుకునేందుకు అనువుగా పరిసరాలు ఉండాలి. పెట్రో బంకులకు మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ, బకెట్లలో ఇసు క. సమీపంలో నీరు అందుబాటులో ఉంచాలి. మరోవైపు ఫస్టె్టయిడ్ కిట్లు అత్యవసరం. సిబ్బం దికి అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన ధృవప త్రం యాజమాన్యం వద్ద ఉండాల్సి ఉంటుంది. బంకుల వద్ద విద్యుత్ తీగలు బయటకు కనిపించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు సమీపం లో హైటెన్షన్ తీగలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పొగతాగరాదు బోర్డులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. అయితేఇవేమి బంకుల్లో కనిపించవనేది జగమేరిగిన సత్యం. ఉచితంగా గాలి... పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపుకున్న వాహనాల్లో ఉచితంగా గాలి నింపాలి. ఎండ కాలం కారణంగా చల్లని మంచి నీరు అందుబాటులో ఉంచాలి. మరుగు దొడ్లు ఏర్పాటు చేసి వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించాలి. బంకుల్లో కనీసం 20 లీటర్ల పెట్రోల్, 50 లీటర్ల డీజిల్ నిల్వ నిరంతరం ఉండాలి. అంబులెన్స్, పోలీసు, వికలాంగులకు ఇంధనం లేదనుకుండా పోయాల్సి ఉంటుంది. నాణ్యత పరీక్షలు ఇలా.. వినియోగదారులు ఇంధనం కొనుగోలు చేసే ముందు నాణ్యతను పరిశీలించవచ్చు. పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరిశీలనేది ఖచ్చితంగా ఉండాలి. పెట్రో బంకుల్లో ఇంధనం నాణ్యతను పరిరక్షించేందుకు హైడ్రో ధర్మా మీటర్లు అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు అడిగితే వాటిని ఇచ్చి ఇంధనం నాణ్యత పరీ రక్షించడానికి సహకరించాలి..పెట్రోల్ బంకుల్లో హైడ్రోమీటర్, ఫిల్టర్ పేపర్, ఐదు లీటర్ల క్యాన్ అందుబాటులో ఉంచడమేగాక వినియోగదారులు అడిగిన వెంటనే అందజేయాల్సి ఉంటుంది. పెట్రోల్లో హైడ్రోమీటర్ పెట్టినప్పుడు సాంద్రత 700–760 మధ్యలో , డీజిల్ 800–860 చూపితే నాణ్యమైనది. కొలతల్లో అనుమానం ఉంటే క్యాన్లో పోయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు పెట్రో బంకుల యాజమానులు మాత్రం అనుమతించడం లేదు. ఇంధనం నాణ్యతను పరిరక్షించే అధికారం వినియోగదారులకు ఉంటుంది. అందుకు సంబంధించిన కిట్లను వారు కోరినప్పుడు బంక్ సిబ్బందికి అందించాలి. కిట్లు అందుబాటులో లేకపోయినా, వాటిని ఇవ్వడానికి వెనుకాడినా మోసం జరుగుతుందని గ్రహించాలి. కల్తీ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఫిల్టర్ పేపర్పై ఒక్క చుక్క ఇంధనం వేస్తే పది సెకన్లలో ఆవిరి అయిపోతుంది. ఆరిన తర్వాత పేపర్పై మరక కనిపించకూడదు మరక కనిపిస్తే కల్తీ జరిగినట్లు గ్రహించాలి. హైడ్రో మీటర్ల ద్వారా కూడా నాణ్యత తెలుసుకోవచ్చు. -
యూరిన్ పరీక్షలు సొంతంగా చేసుకోవాల్సిందే..
ఈ ఫొటోను చూడండి. గైనిక్ ఓపీ లేబొరేటరీ ఎదుట ఈ మహిళ ప్రెగ్నెన్సీ స్ట్రిప్తో సొంతంగా పరీక్ష చేసుకుంటోంది. వాస్తవంగా గర్భం దాల్చారా? లేదా? అనే విషయమై గైనిక్ వైద్యులు యూరిన్ పరీక్షకు రెఫర్ చేస్తారు. ల్యాబ్ సిబ్బంది యూరిన్ సేకరించి పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆసుపత్రిలో దిగజారిన వైద్య సేవలకు అద్దం పడుతోంది. అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యమే. ప్రధానంగా గైనిక్ ఓపీ, పోస్టునేటల్ వార్డులో గర్భిణిలు, బాలింతలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఎంతలా అంటే.. యూరిన్ పరీక్షలు కూడా సొంతంగా చేసుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక బాలింతల బాత్రూంలు శుభ్రపరిచే ఓపిక లేక ఏకంగా తాళాలు వేయడం గమనార్హం. ఈ కారణంగా అత్యవసర సమయంలో బాలింతలు ఇతర వార్డులకు పరుగు తీయాల్సి వస్తోంది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గైనిక్ సేవలు ఈ స్థాయికిదిగజారినట్లు తెలుస్తోంది. మహిళా రోగులకు సర్వజనాస్పత్రిలో అందుతున్న సేవలను పరిశీలిస్తే ఈ సమాజం ఎటువైపు పయనిస్తోందనే అనుమానం కలుగక మానదు. మహిళ గర్భం దాల్చిందా? లేదా? అనేందుకు నిర్వహించే పరీక్షలను చూస్తే ప్రభుత్వాసుపత్రుల పరువు నానాటికీ ఎందుకు దిగజారుతుందో అర్థమవుతుంది. సిబ్బంది చేయాల్సిన పరీక్షలను, ఆసుపత్రికి వచ్చే మహిళల చేతనే చేయిస్తున్నారు. ఎదురు సమాధానం చెప్పలేక.. మహిళలు, గర్భిణిలు ఓపీ ముందే యూరిన్ పరీక్షలు సొంతంగా చేసుకుంటున్న దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యం. ఇదేమిటని ఎవరైనా ల్యాబ్ సిబ్బందిని ప్రశ్నిస్తే చీవాట్లు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకొని తిరిగి వైద్యులను కలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్కు చీమ కుట్టినట్లయినా లేకపోవడం గమనార్హం. బాత్రూంలకు తాళాలు బాత్రూం కష్టాలతో బాలింతలు చుక్కలు చూడాల్సి వస్తోంది. పోస్టునేటల్ వార్డుకి చెందిన మరుగుదొడ్డికి తాళం వేయడంతో కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. అసలే మంచానికి ఇద్దరు, ముగ్గురు ఇరుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాత్రూంకు తాళం వేయడంతో యాంటీనేటల్ వార్డుకు పరుగు తీస్తున్నారు. ఇటీవల ఓ బాలింత కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయింది. స్టాఫ్ నర్సులు గమనించి సెక్యూరిటీ సాయంతో వార్డుకు తరలించారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? అనే చర్చ ఆసుపత్రిలో జరుగుతోంది. కలెక్టర్ గారూ.. చూస్తున్నారా! నిరుపేద కుటుంబం నుంచి కలెక్టర్గా ఎన్నికైన వీరపాండియన్ కూడా ఆసుపత్రిలోని వైద్య సేవల విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో దిగజారిన వైద్య సేవల విషయమై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురిస్తోంది. ఇంత జరుగుతున్నా సూపరింటెండెంట్కు వత్తాసు పలుకుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. కనీసం ఆసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం చూస్తే నిరుపేదలకు అందుతున్న వైద్యంపై కలెక్టర్కు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. చీదరించుకుంటున్నారు యూరిన్ పరీక్ష కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తీరా మా కోడలు నర్మదాకి కంటైనర్, స్ట్రిప్ ఇచ్చారు. ఇదేమిటని అడిగితే మీరే యూరిన్ పట్టుకుని, స్ట్రిప్ అందులో అద్ది తీసుకురమ్మన్నారు. మీరు పరీక్ష చేయరా? అని అడిగితే చీదిరించుకున్నారు. గర్భిణీలన్న దయ కూడా లేదు. ప్రభుత్వాసుపత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా?– లక్ష్మిదేవి, నాల్గవ రోడ్డు, అనంతపురం -
నరక'వేతన'
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్ఆర్పేట): పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మండల సమాఖ్యల ద్వారా నియమించిన పారిశుద్ధ్య కార్మికులకు ఈ విద్యా సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా వేతనం ఇవ్వకుండా వారి కుటుంబాలను ప్రభుత్వం పస్తులు పెట్టింది. పాఠశాలలను బట్టి, విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి అరకొరగా వేతనం నిర్ణయించిన సర్కారు దానినీ కనీసం మూడు నెలలకో, ఆరు నెలలకో కూడా విడుదల చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. సాధారణంగా నివాస గృహాల్లో నలుగురుకు మించకుండా వినియోగించే మరుగుదొడ్లను శుభ్రం చేయడానికే పారిశుద్ధ్య కార్మికులు రూ.1000పైగా వేతనం తీసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో అసలు ఆ పని చేయడానికీ కార్మికులు ముందుకు రాని పరిస్థితి ఉంది. అటువంటి వారికి వేతనం ఎక్కువగా నిర్ణయించాల్సి ఉండగా అతితక్కువ వేతనాన్ని నిర్ణయించింది. అయినా పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కార్మికులు ఆ అరకొర వేతనానికీ సిద్ధపడ్డారు. అయినా ప్రభుత్వం వారికి వేతనాలు ఇవ్వకుండా కాలం వెళ్ళబుచ్చడంతో కార్మికులు తిండిమెతుకుల కోసం కూడా అప్పు చేయాల్సి వస్తోంది. రూ.800 నుంచిరూ. 4 వేల లోపు వేతనాలు.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 3,297 ఉన్నాయి. వాటిలో 2,550 ప్రాథమిక, 251 ప్రాథమికోన్నత, 496 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,916 పాఠశాలల్లోమాత్రమే పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం నియమించింది. వీటిల్లో 20 మంది నుంచి సుమారు వెయ్యి మంది వరకూ విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి పారిశుద్ధ్య నిర్వహణకు కార్మికులకు రూ.800 నుంచి రూ. 4వేల వరకూ వేతనంగా నిర్ణయించారు. డీఆర్డీఏ, అటవీశాఖల నుంచి చెల్లింపులు.. పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీశాఖల నుంచి చెల్లింపులు చేస్తోంది. అటవీ శాఖ నుంచి 1,466 మంది కార్మికులకు, గ్రామీణాభివృద్ధిసంస్థ నుంచి 1,450 మంది కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే అటవీ శాఖ నుంచి చెల్లిస్తున్న కార్మికులకు గత జనవరి నుంచి వేతనాలు నిలిచిపోగా గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అంటే గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ ఒక్క నయాపైసా కూడా వేతనాలు చెల్లించలేదు. ఈ లెక్కన అటవీశాఖ నుంచి సుమారు రూ. 1.30 కోట్లు, గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి రూ. 2.60 కోట్లు మొత్తం కలిపి సుమారు రూ.3.90 కోట్లు వేతనాల బకాయిలు ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖకు రూ.100 కోట్ల బడ్జెట్ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం 2017–18, 2018–19 సంవత్సరాలకు ప్రభుత్వం గత జనవరిలో పాఠశాల విద్యాశాఖకు రూ.100 కోట్లు విడుదల చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ అటవీశాఖకు గానీ, గ్రామీణాభివృద్ధి సంస్థకు గానీ పాఠశాల విద్యాశాఖ నిధులు విడుదల చేయలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన మండల సమాఖ్యలు చేతులెత్తేశాయి. ఈ నెలలోనే అన్ని తరగతులకూ సమ్మెటివ్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో విద్యా సంవత్సరం కూడా ముగిసిపోతోంది. తిరిగి పాఠశాలలు తెరిచే వరకూ పారిశుద్ధ్య కార్మికుల అవసరమే ఉండదు కనుక వారికి వేతనాలు చెల్లించే విషయంలో అధికారులు పెద్దగా పట్టించుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. -
అమానుషం : క్యాన్సర్ పేషంట్ను చితకబాదిన సిబ్బంది
లక్నో : అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల పట్ల సానుభూతి చూపాల్సింది పోయి వారిని చితక్కొట్టారు ఆస్పత్రి సిబ్బంది. స్టాఫ్ టాయిలెట్స్ వాడినందుకు గాను క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను దారుణంగా అవమానించడమే కాక ఆమె కుమారుడి మీద కూడా దాచి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో జరిగిందీ దారుణం. స్టాఫ్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందన్న కారణంతో ఓ క్యాన్సర్ పేషెంట్ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడమే కాక ఆమె కొడుకుపై కూడా దాడికి పాల్పడ్డారు సదరు ఆస్పత్రి సిబ్బంది. గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ దాడి ఘటనపై ఔట్ పేషెంట్ ఇన్చార్జి ప్రొ.మనీష్ బాజ్పాయి సీరియస్ అయ్యారు. యువకుడిపై దాడి చేసిన ముగ్గురు సిబ్బందిని గుర్తించి.. వారిని విధుల నుంచి తొలగించారు. ఇక మీదట ఇలాంటి గొడవలు జరగకుండా చూస్తామని తెలిపారు. -
‘టాయిలెట్ చూడటానికి సగం ప్రపంచం తిరిగాను’
సామాజిక మాధ్యమాల్లో పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకునే విధంగా పలు ఛాలెంజ్లు వైరల్ అవుతున్నాయి. అందులో టీబీటీ(త్రో బ్యాక్ థర్స్డే) ఛాలెంజ్ కూడా ఒకటి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పలువురు ఈ ఛాలెంజ్లో పాల్గొని తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ టీబీటీ చాలెంజ్లో భాగంగా ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను షేర్ చేశారు. గేట్స్ ప్రపంచ కుబేరుల్లో ఒకరైప్పటికీ సాధారణ జీవితాన్ని గడపటానికి ఇష్టపడుతుంటారు. గతంలో ఓ టాయిలెట్ వద్ద తాను దిగిన ఫొటోను గేట్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆ సమయంలో ఓ టాయిలెట్ను చూడటానికి తాను సగం ప్రపంచం తిరిగానని ఆయన పేర్కొన్నారు. గేట్స్ షేర్ చేసిన ఫొటోలోని టాయిలెట్ చెక్కతో చేసినది చూడటానికి అపరిశుభ్రంగా ఉంది. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడాని బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు ‘రీ ఇన్వెంటెడ్ టాయిలెట్ ఎక్స్పో’ పేరుతో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ పారిశుద్ధ్య రంగంలో సరికొత్త, చవకైన ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. View this post on Instagram #TBT to that time I traveled halfway across the world to look at a toilet. A post shared by Bill Gates (@thisisbillgates) on Feb 21, 2019 at 7:10am PST -
బురఖాతో లేడీస్ టాయ్లెట్లోకి...అరెస్ట్
పనాజీ : బురఖా ధరించి మహిళల టాయ్లెట్లోకి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ సంఘటన పనాజీ సెంట్రల్ బస్టాండ్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... విర్గిల్ ఫెర్నాండేజ్ (35) ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్ టాయ్లెట్లోకి వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతగాడిపై సెక్షన్ 419 కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు ఈ చర్యకు ఎందుకు పాల్పడాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.