Cancer Patient
-
క్యాన్సర్ని జయించి శిశువుకు జన్మనిచ్చిన మహిళ
హైదరాబాద్: సాధారణంగా క్యాన్సర్ బాధితులకు జీవితమే అంధకారబంధురంగా ఉంటుంది. అందులోనూ గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ వచ్చిందంటే, ఆ తర్వాత ఇక గర్భం దాల్చడం, పిల్లలు పుట్టడం అనే ఆశలే వదిలేసుకోవాల్సి వస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన 27 ఏళ్ల మహిళకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు తెలిసింది. దాంతో వాళ్లు గర్భసంచి తొలగించుకునేందుకు హైదరాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆమెకు కౌన్సెలింగ్, చికిత్స చేసిన సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు, రోబిటిక్ & లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.“ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన మౌనిక అనే 27 ఏళ్ల మహిళకు తొలుత ఒకసారి గర్భం వచ్చింది. కానీ కొన్నాళ్ల తర్వాత లోపలున్న శిశువుకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో స్థానికంగా తప్పనిసరై గర్భస్రావం చేయించాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత మౌనిక ఆరోగ్యం బాగోలేదని పరీక్ష చేయించుకోగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. దాంతో తప్పనిసరిగా ఆమెకు గర్భసంచి తొలగించాలని అక్కడి వైద్యులు చెప్పారు. కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ ఆస్పత్రిలో ఆ శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించి, ఇక్కడకు వచ్చారు. క్యాన్సర్ ఉన్నంత మాత్రాన గర్భసంచి తొలగిస్తే, తర్వాత ఇక జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. గర్భసంచి తొలగించకుండానే క్యాన్సర్ చికిత్స చేయొచ్చని, ఆ తర్వాత పిల్లలను కూడా పొందవచ్చని వివరించాము. క్యాన్సర్ ఇతర ప్రాంతాలకు విస్తరించకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం నూరుశాతం ఉంటుందని, నిరాశ చెందక్కర్లేదని కౌన్సెలింగ్ చేశాము. అలా రెండు మూడు సార్లు కౌన్సెలింగ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్లు సమాధానపడి, చికిత్సకు సిద్ధమయ్యారు. ముందుగానే పిండాలను (ఎంబ్రియో) సేకరించి, వాటిని ఫ్రీజ్ చేసిన తర్వాత అప్పుడు క్యాన్సర్ శస్త్రచికిత్స ప్రారంభించాము. క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా గుర్తించి, దాన్ని మాత్రమే తొలగించాము. గర్భసంచికి కూడా కుట్లు వేశాం. తొలగించిన ప్రాంతానికి బయాప్సీ చేయించగా క్యాన్సర్ అక్కడ మాత్రమే ఉందని, ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదని నిర్ధారణ అయ్యింది.క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత ఫ్రీజ్ చేసిన రెండు పిండాలను గర్భసంచిలో ప్రవేశపెట్టాము. రెండూ ఫలదీకరణం చెందాయి. అయితే, కుట్లు వేయడం వల్ల గర్భసంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండకపోవచ్చని ముందుజాగ్రత్తగా ఒక పిండాన్ని తీసేయాల్సి వచ్చింది. మిగిలిన ఒక పిండాన్నే కొనసాగించాము. మధ్యలో కూడా ఎందుకైనా మంచిదని క్యాన్సర్ పరీక్షలు, ఇతర పరీక్షలు చేశాము. 32 వారాల తర్వాత ముందుజాగ్రత్తగా లోపల శిశువుకు ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు ఇంజెక్షన్లు చేశాము. 34, 35 వారాల సమయంలోనే ప్రసవం కావచ్చని చూశాము గానీ, గర్భసంచి బాగానే ఉండటంతో వేచి చూశాము. సరిగ్గా 37 వారాల తర్వాత అంతా బాగుండటంతో ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స చేశాము. పూర్తి ఆరోగ్యవంతమైన పాప పుట్టింది.పాప పుట్టిన తర్వాత, ఒకసారి క్యాన్సర్ వచ్చింది కాబట్టి తర్వాత ఇక ఇబ్బంది లేకుండా ఉంటుందని గర్భసంచి తొలగించాల్సిందిగా ఆ దంపతులు కోరారు. కానీ, సిజేరియన్ చేసిన సమయంలోనే హిస్టరెక్టమీ కూడా చేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పైగా ఇప్పుడు క్యాన్సర్ సమస్య లేదు కాబట్టి అలాగే వదిలేయడం మంచిదని వారికి చెప్పాము. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు” అని డాక్టర్ చీపురుపల్లి వసుంధర తెలిపారు. “ఒకానొక దశలో మేము అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకున్నాం. కానీ డాక్టర్ వసుంధర చీపురుపల్లి, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి బృందం ఎంతగానో మాకు నచ్చజెప్పారు. ఇప్పుడు మాకు మంచి ఆరోగ్యకరమైన పాప పుట్టింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి, డాక్టర్ వసుంధర, ఆమె బృందానికి మేమెంతో కృతజ్ఞులై ఉంటాము” అని మౌనిక భర్త మహేష్ చెప్పారు. -
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
క్యాన్సర్ రోగి పట్ల సీఎం పెద్ద మనసు
దత్తిరాజేరు : క్యాన్సర్తో బాధ పడుతున్న ఓ మహిళ పట్ల సీఎం జగన్ పెద్దమనసుతో స్పందించారు. మరడాం హెలిప్యాడ్ వద్ద విజయనగరం జిల్లా కొండదాడికి చెందిన సరస్వతి సీఎంను కలిసి తన కష్టాలు చెప్పుకుంది. తల్లిదండ్రులిద్దరూ క్యాన్సర్తో మృతి చెందారని, తను కూడా క్యాన్సర్తో బాధపడుతున్నానని, ఆస్పత్రి, ఇతరత్రా ఖర్చులకు ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని వేడుకుంది. స్పందించిన సీఎం రూ.3 లక్షల సాయంతో పాటు ఉచిత వైద్యం అందించాలని కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. ఈ మేరకు కొద్ది గంటల్లోనే బాధితురాలికి మంత్రి బొత్స సత్యనారాయణ రూ.3 లక్షల చెక్కు అందజేశారు. -
మంత్రి జగదీష్రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: క్యాన్సర్ వ్యాధి బాధితురాలు ధరావత్ స్వాతి కలను తెలంగాణ పోలీసులు నెరవేర్చారు. ఒక్కరోజు ఎస్సైగా ఉండాలన్న స్వాతి కోరికను తీర్చారు. ఇటీవల మంత్రి జగదీష్రెడ్డిని కలిసిన ఆమె.. తన కల ఎస్సై కావాలని స్పష్టం చేసింది. దానికి స్పందించిన మంత్రి.. అందుకు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్వాతి కలను నేడు పోలీసులు నెరవేర్చారు. కాగా, నియోజకవర్గానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు అయిన స్వాతి అనే యువతిని ఆయన ఇటీవలే మంత్రి జగదీష్రెడ్డి పరామర్శించారు. ఎప్పటినుంచో మంత్రి జగదీష్ రెడ్డిని కలుసుకోవాలని అనుకుంటున్న యువతి కోరికను కుటుంబ సభ్యులు, వైద్యాధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయానికి స్వాతితో పాటు కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. స్వాతి తో ముచ్చటించిన మంత్రి మనో ధైర్యంతో ఉండాలని.. ధైర్యంగా ఉంటే ఏ రోగాలు మనల్ని ఏం చేయలేవని స్వాతికి సూచించారు. కుటుంబం నేపథ్యాన్ని స్వాతి పరిస్థితిని చూసిన మంత్రి ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. పక్షపాతానికి గురైనటువంటి స్వాతి తండ్రి ధరావత్ చింప్లా వైద్య ఖర్చులను కూడా తానే భరించి చికిత్స చేయించేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసు అధికారి కావాలని తన జీవిత లక్ష్మామని స్వాతి మంత్రి దృష్టికికి తీసుకెళ్లింది. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కోరికను కూడా త్వరలోనే నెరవేరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు గంటపాటు స్వాతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ఏ సాయం కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్పందన చూసిన గిరిజన యువతి కుటుంబ సభ్యులు పట్టరాని సంతోషంతో ధన్యవాదాలు తెలిపారు. తాజాగా స్వాతి ఒక్క రోజు ఎస్సైగా ఉండాలన్న కోరిక తీరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. -
మంత్రి జగదీష్రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
-
మరోసారి గొప్ప మనుసు చాటుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్లో ధైర్యం, సాహసం, సాయం, సేవా వంటి గుణాలు కలిగిన అతి తక్కువ నటీనటుల్లో వరలక్ష్మి శరత్కుమార్ ఒకరు. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన స్వసక్తితోనే ఎదిగారు. నటిగా దక్షిణాదిలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్లో తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రకరకాల పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. తెరపై విలన్గా భయపెట్టే వరలక్ష్మిలో సేవ గుణం ఎక్కువే అనే విషయం తెలిసిందే. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. తరచూ ఆమె సామాజిక సేవలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆమె మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను సాయం చేసి అండగా నిలిచారు. కాగా శనివారం తన పుట్టిన రోజును స్థానిక ఎగ్మోర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్లో హాస్పిటల్లో వైద్యులు, క్యాన్సర్ బాధితుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జాయ్ ఆఫ్ షేరింగ్ పేరుతో శివశక్తి సంకల్ప్ బ్యటిఫుల్ వరల్డ్ సేవా సంస్థలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న వైద్యుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మన సన్నిహితులు, దగ్గరి వారు మాత్రమే క్యాన్సర్ బాధితులైనప్పుడు వ్యాధి గురించి ఆలోస్తున్నామని అభిప్రాయపడ్డారు. చేతిలో ఉన్న పది రూపాయలు సాయం చేసినా బాధితుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందన్నారు. అలాగే దేశమంత సైకిల్ యాత్ర చేస్తూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న చెన్నైకి చెందిన శివ రవి, జై అశ్వాణిలపై ఆమె ప్రశంసలు కురిపించారు. చదవండి: తీవ్రమైన గుండెపోటు నుంచి కాపాడింది అదే: సుస్మితాసేన్ కాగా క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కలిగించే విధంగా శివ రవి అనే 26 ఏళ్ల వ్యక్తి, జై అశ్వాణి అనే 18 ఏళ్ల యువకుడు కలిసి చెన్నై నుంచి కోల్కత్తా వరకూ 1746 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు అదే విధంగా అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న సంకల్ప్ సేవా సంస్థ, వైద్యుల చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సాయంగా అందించారు. అదేవిధంగా సైకిల్ యాత్రతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రవన్ని చేపట్టిన యువకులకు జ్ఞాపికలను అందజేశారు. -
పెళ్లి మండపంలో వధువు అనూహ్య నిర్ణయం.. కుటుంబం కంటతడి..
పెళ్లి అంటే ఓ పండగ. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకునే వేడుక. రెండు జీవితాలను ఒక్కటి చేసే వేదిక. చాలా మంది తమ పెళ్లిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పలు జంటలు తమ వివాహాన్ని మంచి పనులకు వేదికగా మలుచుకుంటున్నారు. సమాజం కోసం, భవిష్యత్తు కోసం ఉపయోగపడే పనులకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఓ వధువు కూడా ఇలాగే ఆలోచించింది. పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండేలా అందమైన, పొడవాటి తన జుట్టును కత్తిరించేందుకు సిద్ధపడింది. వధువు అనూహ్య నిర్ణయంతో మండపంలోని అతిథులందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. అనంతరం ఆమె క్యాన్సర్ బాధితులకు జుట్టు డొనెట్ చేసిందుకు ఇలా చేసిందని తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. పెళ్లిలో వధువు తన జుట్టు కత్తిరించుకుంటున్న ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేశారు. విందులో పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు.. వివాహ వేడుక అనంతరం తన పొడవాటి జుట్టును కత్తిరించుకోవడం కనిపిస్తోంది. క్యాన్సర్ రోగులకు సాయం చేసేందుకు ఇలా చేస్తున్నట్లు ఆమె తెలిపింది. వధువు జుట్టు కత్తిరించుకుంటుంటే ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులతో సహా అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. లక్షల్లో వ్యూస్ వచ్చి చేరుతున్నాయి. వధువు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Michigan Wedding Photographer & Videographer | Brianna Eslinger (@theunfilteredcollective) -
వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా..
వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు ఓ యువకుడికి శాపంగా మారింది. అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలిగించాల్సి వచ్చింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు నుంచి అనుకులంగా తీర్పు వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి యాజమాన్యం అతనికి భారీ పరిహారం చెల్లించింది. ఫ్రాన్స్ నాంటెస్ యూనివర్సిటీలో 2014లో ఈ ఘటన జరిగింది. అప్పుడు యువకుడి వయసు 30 ఏళ్లు. పెళ్లి కూడా అయింది. అయితే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కార్సినోమా క్యాన్సర్ అని తేలింది. అంటే చర్మ ఎపిథీలియల్ కణజాలం లేదా అంతర్గత అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకింది. పొరపాటుతో తలకిందులు.. అయితే వైద్యులు అతనికి చికిత్స అందించారు. టిష్యూల నుంచి క్యాన్సర్ను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చేసిన పొరపాట్లు అతనికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. క్యాన్సర్ మర్మాంగానికి కూడా సోకింది. దీంతో భరించలేని నొప్పితో అతను నరకయాతన అనుభవించాడు. ఒకానొక సమయంలో కట్టర్తో స్వయంగా తానే మర్మంగాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ భార్య వద్దని చెప్పడంతో ఆగిపోయాడు. కానీ రానురాను అతని క్యాన్సర్ తీవ్రత పెరిగింది. మొత్తం మర్మాంగానికి అది సోకింది. ఇక గత్యంతరం లేదని భావించిన వైద్యులు యువకుడి మర్మాంగాన్ని పూర్తిగా తొలగించారు. అలా చేయకపోతే అతని ప్రాణాలు పోయేవని చెప్పారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై యువకుడు న్యాయపరంగా పోరాడాడు. వైద్యులు పొరపాటు వల్లే మర్మాంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చిందని, ఆ బాధ వర్ణనాతీతం అని వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం తమ తప్పును అంగీకరించి యువకుడికి రూ.54 లక్షలు పరిహారంగా ఇచ్చింది. చదవండి: అఫ్గాన్లో విద్యార్థినుల నిరసన గళం -
వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!
ప్రస్తుత జనరేషన్లో ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువుకు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటోంది. ఇక, మనం ధరించే వాచ్ల విషయానికి వస్తే.. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ అయిన యాపిల్ వాచ్ ఎంతో స్పెషల్. అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న యాపిల్ వాచ్.. క్రేజీ లైఫ్ సేవింగ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ యాపిల్ వాచ్ ఎంతో మంది ప్రాణాలకు కాపాడింది. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. దీంతో, మరోసారి యాపిల్ స్మార్ట్వాచ్ తన ప్రత్యేకతను చాటుకుంది. వివరాల ప్రకారం.. ఇమాని మైల్స్(12)కి యాపిల్ వాచ్ అంటే ఎంతో ఇష్టం. దీంతో, యాపిక్ స్మార్ట్వాచ్ కొనుగోలు చేసి తన చేతికి పెట్టుకోవడం ప్రారంభించింది. కాగా, యాపిల్ వాచ్ ధరించిన అనంతరం.. ఇమాన్ హెల్త్ గురించి వాచ్ ఎప్పటికప్పుడు ఆమెకు తెలియజేసింది. ఈ క్రమంలో ఓరోజు.. ఒక్కసారిగా యాపిల్ వాచ్.. ఇమాని హార్ట్రేట్ అసాధరణంగా ఎక్కువగా ఉందంటూ పలుమార్లు హెచ్చరించింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి జెస్సికా కిచెన్ ఆందోళనకు గురైంది. తన కూతురుకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని భావించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. దీంతో, ఇమానికి వైద్య చికిత్సలు అందించిన అనంతరం.. ఆమెకు అపెండిక్స్లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉందని కనుగొన్నారు. ఇటీవలి కాలంలో ట్యూమర్ పెరుగుతూ, ఇతర అవయాలకూ కూడా విస్తరిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని కేన్సర్ ట్యూమర్గా గుర్తించిన వైద్యులు.. సర్జరీ చేసి కణతులను తొలగించారు. ఇలా యాపిల్ వాచ్.. ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన అనంతరం.. ఇమాని తల్లి జెస్సికా కిచెన్ మాట్లాడుతూ.. వాచ్ కారణంగా నా కూతురుకు ఎంతో మేలు జరిగింది. ఈ విషయం తెలియకపోతే ఇంకా కొన్ని రోజలు ఆసుపత్రికి వెళ్లకుండా అలాగే ఉండిపోయేవాళ్లము అని తెలిపారు. ఇక, అంతకుముందు కూడా యాపిల్ వాచ్ యూకేకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. #AppleWatch detects signs of rare #cancer, saves life of 12-year-old girlhttps://t.co/u9mPi3YXQp — DNA (@dna) October 22, 2022 -
పేగు క్యాన్సర్ చికిత్సలో అద్భుతం.. క్యాన్సర్ కణాలన్నీ మాయం
న్యూయార్క్: పెద్దపేగు క్యాన్సర్తో బాధపడుతున్న రోగులపై ప్రయోగించిన ఒక కొత్త ఔషధం అద్భుత ఫలితాలిచ్చింది. డోస్టార్లిమాబ్గా పిలిచే ఈ కొత్త మందును వారికి మూడు వారాలకోసారి చొప్పున ఆర్నెల్లు ఇవ్వడంతో క్యాన్సర్ కణతులు పూర్తిగా కనుమరుగయ్యాయని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఎండోస్కోపీ నుంచి ఎంఆర్ఐ దాకా ఏ పరీక్షలోనూ క్యాన్సర్ కణాల జాడ కనిపించలేదు. క్లినికల్ పరీక్షలో భాగమైన రోగులు తర్వాత కీమోథెరపీ, రేడియేషన్, చిన్నపాటి సర్జరీలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ రోగులకు ఆ అవసరం రాలేదని న్యూయార్క్ మెమోరియల్ స్లో ఆన్ కాటరింగ్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ లూయిస్ డియాజ్ అన్నారు. ‘‘ఇది 18 మంది రోగులపైనే జరిగిన ప్రయోగం. భారీ సంఖ్యలో ప్రయోగాలు జరిగాకే ఈ ఔషధంపై అవగాహనకు రావాలి’’ అని వైద్యరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. చదవండి👇 పబ్జీ ఆడొద్దన్నందుకు తల్లిని కాల్చి చంపిన కొడుకు ఇవి మామూలు టొమాటోలు కావు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు -
నాకు జాబ్ కావాలి.. మీ జాలి కాదు..
సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటితో పోరాడుతున్న వారికి కావాల్సింది మద్దతు. అంతేకాని జాలి కాదు. బాధల్లో ఉన్నవాళ్లు చెడ్డవాళ్లు కాదు. వాళ్లను చూడగానే మీ ముఖ కవళికలు మార్చాల్సిన అవసరం లేదంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరు క్షణమే అతన్ని మెచ్చకుంటూ తమ కంపెనీలో ఉద్యోగం చేయాలంటూ అనేక మంది సీఈవోలు ఆఫర్లు ఇస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తికి ఉన్న సమస్య ఏంటీ అతను ఎందుకలా స్పందించాడు? ఝార్ఖండ్కి చెందిన ఆర్ష్ నందన్ ప్రసాద్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా భయంకరమైన నిజం బయటపడింది. అతని ఒంట్లోకి ప్రవేశించిన క్యాన్సర్ వ్యాధి క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మొదలెట్టింది. దీంతో ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు జూమ్లో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఇంటర్వ్యూలో అవతలి వ్యక్తులు అడుగుతున్న ప్రశ్నలకు ఆర్ష్ నందన్ సరైన సమాధానలు ఇస్తూనే ఉన్నాడు. అయితే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులకు అతనిచ్చే సమాధానాల కంటే అతని ఆరోగ్య పరిస్థితిపైనే ఎక్కువ కన్సర్న్ చూపిండం ఆర్ష్ నందన్ ప్రసాద్కు కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టింది. జాబ్ ఇవ్వడం మాట అటుంచి... ఆస్పత్రి బెడ్పై ఉన్న అతన్ని చూడగానే ముఖకవళికలు మార్చడం, జాలిగా మాట్లాడటం. అతని నైపుణ్యాలు, సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేయడం ఎక్కువైంది. ఓవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్కి ఇంటర్వ్యూయర్ల ప్రవర్తన మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టింది. కీమో థెరపీతో క్యాన్సర్తో పోరాడే సమయంలో వీళ్ల ప్రవర్తన తనకు ఇబ్బందిగా ఉంటోందని పేర్కొటూ లింక్డ్ ఇన్లో మేసేజ్ పెట్టాడు. అందులో నా స్కిల్స్, సామర్థ్యం చూడండి అంతే కానీ నాకున్న వ్యాధిని చూసి జాలి పడొద్దు. నాకు కావాల్సింది అది కాదంటూ పేర్కొన్నాడు. ఆర్ష్ నందన్ ప్రసాద్ లింక్డ్ఇన్ పోస్టు నెట్టింట వైరల్గా మారింది. మహారాష్ట్రకు చెందిన అప్లైడ్ కంప్యూటింగ్ సంస్థ సీఈవో నీలేశ్ సప్తూర్ స్పందించాడు. క్యాన్సర్తో ధైర్యంగా పోరాడుతున్న నువ్వు ఒక యోధుడివి. ఇకపై ఇంటరర్వ్యూలు ఇవ్వడం ఆపేయ్. నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టు. ట్రీట్మెంట్ తీసుకో. నీ క్రెడెన్షియల్స్ నేను చూశాను. అన్నింటా సూపర్గా ఉన్నావ్. నీలాంటి యోధుడికి మా కంపెనీలో ఎప్పుడూ ఉద్యోగం రెడీగా ఉంటుంది. నువ్వు కావాలనుకున్నప్పు వచ్చి జాయిన్ అవమంటూ ఆఫర్ ఇచ్చాడు. విదేశాల నుంచి కూడా అనేక కంపెనీలకు చెందిన సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్ల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. నందన్ ప్రసాద్ మద్దతుగా అనేక మంది గళం విప్పారు. మొత్తానికి కార్పోరేట్ వరల్డ్ చేపట్టే ఇంటర్వ్యూలపై ప్రసాద్ సరికొత్త చర్చకు తెర తీశాడు. చదవండి: మస్క్ చేతికి ట్విటర్.. సీఈవో పరాగ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు -
మరో వారం రోజుల్లో కేన్సర్ చికిత్స.. అయ్యో కేటుగాళ్లు..
సాక్షి, మహబూబాబాద్(వరంగల్): రిటైర్డ్ ఉద్యోగి ఖాతాలోనుంచి రూ.2.30 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన మానుకోట జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. మాజీ సైనికుడు పెద్దబోయిన భిక్షపతి మానుకోట సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈయనకు ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో రూ.95 వేలు, ఇండియన్ బ్యాంకు ఖాతాలో రూ.35 వేలు మాయమయ్యాయి. బాధితుడు భిక్షపతి ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో చెక్బుక్ కోసమని దరఖాస్తు చేయగా వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేసి మాట్లాడి ఫోన్ పెట్టేయగానే మరో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు వివరాలు అడగగానే బ్యాంకు వారే అనుకుని వారు అడిగిన సమాచారం అందించి ఫోన్ కట్చేశాడు. ఆ వెంటనే ఆయన ఫోన్కు రూ.2.30 లక్షలు ఉపసంహరణ (డ్రా) అయినట్లు మెసేజ్ వచ్చింది. సదరు మూడు బ్యాంకు ఖాతాలకు ఒకే ఫోన్నంబర్ లింకు చేశారు. బ్యాంకు అధికారులు అనుకుని గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్కు స్పందించి సమాచారం ఇవ్వడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. బ్యాంకు ఖాతాల్లో నగదు పోయినట్లు గుర్తించి వెంటనే బ్యాంకులకు వెళ్లి ఆరాతీయగా ఆయన ఖాతాల్లోని నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. తనకు మోసం జరిగిందని గుర్తించిన సదరు బాధితుడు భిక్షపతి, మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరో వారం రోజుల్లో భిక్షపతికి కేన్సర్ చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లాల్సి ఉండగా ఇంతపెద్ద గోరం జరిగిందని గుండె బాదుకుంటూ బోరున విలపించాడు. పోలీసులు, బ్యాంకు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరాడు. చదవండి: వివాహితతో పరిచయం .. చేనులోకి బలవంతంగా తీసుకెళ్లి.. -
క్యాన్సర్ బారిన పడ్డ చిన్నారి కోరిక నెరవేర్చిన విజయ్ సేతుపతి
చెన్నై: మొన్న మెదడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కెనడాకు చెందిన అభిమానితో నటుడు కమల్హాసన్ జూమ్ కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. అదేవిధంగా నటుడు విజయ్ సేతుపతి క్యాన్సర్ బారిన పడిన చిన్నారిని అక్కున చేర్చుకుని మనోబలాన్ని పెంచారు. క్యాన్సర్ వ్యాధికి గురైన ఒక చిన్నారి నటుడు విజయ్ సేతుపతిని దగ్గరగా చూడాలన్న కోరికను వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తన అభిమాన సంఘం నిర్వాహకుల ద్వారా తెలుసుకున్న విజయ్ సేతుపతి ఆ బాలుడిని, అతని కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించి మాట్లాడారు. బాలుడిని గుండెలకు హత్తుకున్నారు. ఆ బాలుడి వివరాలు తెలియకపోయినా ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విజయ్సేతుపతి మానవత్వాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. చదవండి : అభిమానికి బ్రెయిన్ క్యాన్సర్: ధైర్యం చెప్పిన కమల్ -
మరోసారి తన సహృదయాన్ని చాటుకున్న చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: కేన్సర్తో బాధపడుతున్న ప్రముఖ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్కు సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి రూ.50వేల ఆర్థిక సహాయం చేసి తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న భరత్ భూషణ్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి రక్తనిధి కార్యాలయానికి వెళ్లి చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు, బ్లడ్ బ్యాంక్ బాధ్యుడు రవణం స్వామినాయుడు నుంచి చెక్కు అందుకున్నారు. తనకు సహాయం చేసిన చిరంజీవికి.. భరత్ భూషణ్ కృతజ్ఞతలు తెలిపారు. -
‘వన్ డే కొత్వాల్’ సాదిఖ్ ఇకలేడు
సాక్షి, సిటీబ్యూరో: పదేళ్ల వయసులో హైదరాబాద్ నగరానికి ఒక రోజు పోలీసు కమిషనర్గా పని చేసిన బాలుడు సాదిఖ్ బుధవారం కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో కన్నుమూశాడు. సుదీర్ఘ కాలంగా రక్త కేన్సర్తో (లుకేమియా) బాధపడుతున్న బాలుడి వయసు ప్రస్తుతం 17 ఏళ్లని తండ్రి జావేద్ బాషా తెలిపారు. సాదిఖ్కు పోలీసు ఉద్యోగం అంటే మక్కువ. ఈ నేపథ్యంలోనే మేక్ ఏ విష్ ఫౌండేషన్ అతడి కోరిక తీర్చడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఈ సంస్థ 2014 అక్టోబర్ 15న సాదిఖ్ను హైదరాబాద్ నగరానికి ఒక రోజు కమిషనర్గా చేసింది. అప్పట్లో నగర కొత్వాల్గా ఉన్న ఎం.మహేందర్రెడ్డి నుంచి సాదిఖ్ ఈ బాధ్యతలు స్వీకరించారు. సాదిఖ్ ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తన కుమారుడి కోరిక తీర్చిన పోలీసు విభాగానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జావేద్ బాషా అన్నారు. -
డాక్టర్ గారికి తాను చనిపోతానని తెలిసిన తరువాత...
‘ఛలో’తో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక విజయయాత్ర ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు కొనసాగుతూనే ఉంది. పుస్తకాలు ఎక్కువగా చదివే రష్మికకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి వెన్ బ్రీత్ బికమ్స్ ఏయిర్. 37 సంవత్సరాల వయసులోనే ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోయిన అమెరికన్ న్యూరోసర్జన్ పాల్ కళానిధి ఆటోబయోగ్రఫీలాంటి పుస్తకం ఇది. ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్సెల్లర్’ జాబితాలో నెంబర్వన్గా నిలిచి, ఎంతోమందికి ఉత్తేజాన్ని ఇచ్చిన ఈ పుస్తకం పరిచయం... ఎప్పడూ చురుగ్గా, ఉల్లాసంగా ఉండే కుర్రాడికి తనకు క్యాన్సర్ అనే భరించలేని విషాదవార్త తెలిస్తే ఎలా ఉంటుంది? కాళ్ల కింది భూమి కదిలిపోతుంది. కళ్ల ముందు చీకటి కమ్ముకుంటుంది. అయితే తనకు క్యాన్సర్ ఉందని తెలియగానే పాల్ కళానిధి స్పందించిన తీరు వేరు. ఆయన తన మిత్రుడికి ఇలా మెయిల్ చేశాడు...‘గూడ్న్యూస్ ఏమిటంటే మహాకవులు కీట్స్, స్టీఫెన్ క్రేన్ల సాహిత్యాన్ని చదువుకోవడం. బ్యాడ్న్యూస్ ఏమిటంటే ఇంత వరకు ఒక్క అక్షరం కూడా నేను రాయకపోవడం’ కళానిధి వైద్యాన్ని ఎంతగా ప్రేమించాడో, సాహిత్యాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. ‘పదిహేడేళ్ల వయసులో నువ్వు ఏమవుతావు? అని నన్ను ఎవరైనా అడిగి ఉంటే కచ్చితంగా రచయిత అనేవాడిని. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సాహిత్యాన్ని మించిన సాధనం లేదు’ అనే కళానిధి యెల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు ముందు స్టాన్ఫోర్డ్లో సాహిత్యంలో రెండు బీఏలు చేశాడు. కేంబ్రిడ్జిలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫి చేశాడు. ఈ విషాదవార్త తెలియగానే కుటుంబసభ్యులు, స్నేహితులతో అతని జోక్స్ ఆగిపోలేదు. ప్రకృతిని ఆరాధించడం ఆగిపోలేదు. ఫుట్బాల్ ఆడడం ఆగిపోలేదు. అన్నిటికి మించి బతుకును ప్రేమించడం ఆగిపోలేదు. చావుకు, బతుకు మధ్య ఉన్న స్వల్పకాలాన్ని ఈ పుస్తకం రాయడానికి ఉపయోగించాడు. అలా అని ఇది జ్ఞాపకాల సమహారం మాత్రమే అనుకోనక్కర్లేదు. ‘జీవితాన్ని కొత్తగా ఎలా చూడాలి?’ అనేది ఎవరికి వారు దిశానిర్దేశం చేసుకునేలా ఉంటుంది. బరువు తగ్గుతూ పోవడం, జ్వరం, చెమటలు పట్టడం, వెన్నునొప్పి, దగ్గు...ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకం రాయడం ఆషామాషీ విషయం కాదు. పుస్తక రచన పట్ల తన ఇష్టం ఆ కష్టాన్ని తగ్గించింది. తనలో నూతనోత్సాహం. మరోశక్తి....పాప. ‘నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్నిరోజులకు పాప పుట్టింది. ఆ పాప హావభావాలు, నవ్వులు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. డైనమిజం అనేది పాప రూపంలో మా ఇంట్లోకి వచ్చింది’ అంటాడు కళానిధి. స్ట్రిక్ట్ మదర్, మెడిసిన్తో లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్, కుందేలు, తాబేలు పరుగుపందెం నుంచి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? దేవుడిపై తన నమ్మకం, సెటన్: హిజ్ సైకోథెరపీ అండ్ క్యూర్ బై ది అన్ఫార్చునెట్... పుస్తకం తనపై కలిగించిన ప్రభావం, చావుకు మానసికంగా సంసిద్ధం కావడం, ‘నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలి’ అని భార్యను ప్రిపేర్ చేయడం, తన ట్రీట్మెంట్ కోసం డాక్టర్ ఎమ్మా హెవార్డ్ను ఎంచుకోవడానికి కారణం, చికిత్స సత్ఫలితాన్ని ఇస్తున్న పరిస్థితుల్లో మళ్లీ జీవితంపై కొత్త ఆశ, కొద్దికాలానికి ఆ ఆశ కొడిగట్టడం, మళ్లీ ధైర్యంతో పైకిలేవడం...ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం ఎంత పాప్లర్ అయిందంటే ఎంతోమంది డాక్టర్లు కళానిధికి ఫోన్ చేసి ‘డిప్రెషన్తో మా దగ్గరకి వచ్చే వాళ్లకు మందులేమీ ఇవ్వడం లేదు. మీ పుస్తకం చేతిలో పెడుతున్నాం. అంతే... వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో చెప్పలేం’ అనేవాళ్లు.అన్నీ ఉన్నా ఏమీ లేదు అనుకువాళ్లు, చిన్న చిన్న విషయాలకే కుంగుబాటలో ప్రయాణించే వాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. చదవండి: ఇదే తొలిసారి.. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది : రష్మిక -
ధన్యవాదాలు ఎమ్మెల్సీ గారూ: సుశీలమ్మ
సాక్షి, హిందూపురం: ‘సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్న నాకు హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించి ప్రాణభిక్ష పెట్టిన మీకు ధన్యవాదాలు సార్’ అంటూ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్కు హిందూపురంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన సుశీలమ్మ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తన కుటుంబసభ్యులతో పాలు ఎమ్మెల్సీని ఆమె కలిసి మాట్లాడారు. పేదరికం కారణంగా మెరుగైన చికిత్సలుఇ అందులోని స్థితిలో ఉన్న తన పరిస్థితికి సకాలంలో స్పందించి ప్రభుత్వ పరంగా ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట వైఎస్సార్సీపీ నాయకులు గోపీకృష్ణ, ఇందాద్, లతీఫ్, రహమత్, సునీల్, మంజునాథ్, సురేష్ తదితరులు ఉన్నారు. (చంద్రబాబూ.. ఇప్పుడేమంటారు?) -
చికిత్స అందక రెండేళ్ల క్యాన్సర్ చిన్నారి మృతి
కోల్కతా : లాక్డౌన్ కారణంగా చికిత్స అందక రెండేళ్ల క్యాన్సర్ చిన్నారి కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. కీమోథెరపీ కోసం ఆసుపత్రుల చూట్టూ తిరగాల్సి వచ్చిందని, సరైన సమయంలో చికిత్స అందక తన కూతురు చనిపోయినట్లు తండ్రి బిస్వజిత్ కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది క్యాన్సర్ కారణంగా ప్రియాంషి సాహా అనే రెండేళ్ల చిన్నరికి కలకత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్ర్తచికిత్స చేయించారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా కీమో ధెరపీ చేయించాలని వైద్యులు సూచించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కీమో థెరపీ చేయలేమంటూ హాస్పిటల్ నిర్వాహకులు చెప్పడంతో గత నెల నుంచి సరిగ్గా వైద్యం అందక ఆరోగ్యం క్షీణించినట్లు ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. కోల్కతాలోని బరాసత్ జిల్లా హాస్పిటల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి పలు ఆసుపత్రల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ప్రియాంషి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన మమతా బెనర్జీ.. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని నిర్లక్ష్యం చేయవద్దని, అత్యవసరంగా చికిత్స అవసరం ఉన్న వారి పట్ల వెంటనే స్పందించాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. గత పదేళ్లలో బెంగాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఈ పేరును అప్రతిష్ట చేయవద్దని కోరారు. ( ‘వీడియో కాన్ఫరెన్స్లతో మాకు ఒరిగిందేమీ లేదు’ ) -
ఈ వీడియో నిజంగా కంటతడి పెట్టిస్తుంది
నార్త్ కరోలినా : మనం ఇంటర్నెట్లో రోజుకి ఎన్నో వీడియోలు చూస్తుంటాం. అయితే మీరు ఇప్పుడు చూసే వీడియో మాత్రం కంటతడి పెట్టిస్తుంది. అమెరికాకు చెందిన గ్యాబీ క్యాన్సర్ బారిన పడింది. ట్రీట్మెంట్ కోసం గ్యాబీకి తలమీద జుట్టు, కనుబొమ్మలు తొలగించారు. అయితే ఆమెకు క్యాన్సర్ సోకిన దానికంటే అందవికారంగా ఉందనే భావన ఆమె మనుసును ఎక్కువగా కలచివేసేది. దీంతో గ్యాబీ బాధను పోగొట్టేందుకు ఆమె సోదరి క్యామి కూడా తన జుట్టు, కనుబొమ్మలు తీసేసింది. ఆ తర్వాత క్యామి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోనూ షేర్ చేసింది. క్యామి మాటలు ఇప్పుడు అందరి గుండెలను బరువెక్కిస్తున్నాయి. (కరోనా: ఆసుపత్రిలో అమెరికా డాక్టర్ల డ్యాన్స్) 'నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు ఎలా ఉన్నా నాకు మాత్రం అందంగానే కనిపిస్తావు. నువ్వు రోగంతో బాధపడుతూ నీ జట్టు, కనుబొమ్మలు తీసేసుకోవాల్సి వచ్చింది. కనుబొమ్మలు తీసేసిన తర్వాత అందంగా లేకపోవడం వల్లే కదా నువ్వు బాధపడుతున్నావు. ఇదిగో ఇప్పుడు నేను కూడా నా కనుబొమ్మలు, జుట్టు తొలగించుకున్నా. ఒక్కటి మాత్రం నిజం.. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఇదంతా నేను ఎవరికోసమే చేయడం లేదు.. కేవలం నీకోసమే మై లవ్లీ సిస్టర్ అంటూ' తన చెల్లికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత వారిద్దరు ఏడుస్తూ ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్మీడియాలో తెగ వైరల్గా మారింది. గ్యాబీ తొందరగా కోలుకోవాలి... మీరిద్దరు ఆనందంగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram cant say everything thats been going on has been easy, its been hard, it hurts. but this isnt for any of you or for me, this is for you gaby. I LOVE YOU w every bone in my body. u fight bitch & u do it damn well. hair does not make you. and even bald u still manage to b the prettiest sister, u whore. i love you so so so so much boot boot & every battle u go thru, i promise to go thru it w u cus thats what mf sisters do ❤️ A post shared by yung mila (@trillcami) on Mar 25, 2020 at 6:59pm PDT -
కేన్సర్తో పోరాడుతున్న సేవకుడు
సాక్షి, హైదరాబాద్: అతనో సేవకుడు. తాను పేదరికంలో ఉన్నా.. ఆపన్నులకు సేవా హస్తం అందించి సాయపడే గుణం అతనిది. స్వతహాగా ఆటో డ్రైవరైన అతను వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణులకు తన ఆటోను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చేవాడు. ఇలా ఎంతో మందికి తోడ్పాటును అందించిన ఆపద్బాంధవుడు మ్యాదరి సంజీవ్కు ఆపద వచ్చింది. ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నాడు. నలుగురికి సేవలందిస్తున్న ఆ పేదవాడి జీవితంలో కేన్సర్ దుఃఖాన్ని మిగిల్చింది. అందినకాడల్లా అప్పులు చేసి మూడెళ్ల క్రితం ఎముకల కేన్సర్కు ఆపరేషన్ చేయించుకున్నాడు. కోలుకుంటున్న తరుణంలో కేన్సర్ మహమ్మారి మళ్లీ సోకింది. అయినా కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడపడం మానుకోలేదు. ఈ క్రమంలోనే శరీరంలోని మిగతా భాగాలకు వ్యాధి సోకినట్లు వైద్యులు ప్రకటించారు. మరోసారి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. కుటుంబ పోషణ, అప్పుల భాదతో తల్లడిల్లుతున్న సంజీవ్కు ఆపరేషన్ చేయించుకోవడం మృగ్యంగా మారింది. దిక్కుతోచని స్ధితిలో అటు ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్ధితి లేక ఇటు కుటుంబాన్ని పోషించుకోలేక సంజీవ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆపదలో నేనున్నానంటూ.. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ఎవరికి ఆపద వచ్చినా తన ఆటోలో వారి గమ్యస్థానాలకు చేర్చేవాడు సంజీవ్. అర్ధరాత్రయినా సరే వెంటనే చేరుకునేవాడు. తన ఆటోపై వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం ఉచితంగా ప్రయాణం అని తన ఫోన్ నంబర్ రాసి ఎంతో మందిని ఆపదల్లో ఆదుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో లేక తాను ఎదుర్కొన్న అవస్థలు మరొకరికి రావద్దని నిర్ణయించుకున్న సంజీవ్ సేవలందించాడు. తనయుడే ఆటో నడుపుతూ.. ఎస్పీఆర్హిల్స్లోని వినాయకనగర్ బస్తీకి చెందిన మ్యాదరి సంజీవ్ తన కుటుంబంతో కిరాయి గృహంలో ఉంటున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న సంజీవ్ కుమారుడు కార్తీక్ తండ్రి దయనీయ పరిస్థితితో రహమత్నగర్, ఎస్పీఆర్హిల్స్ మార్గంలో ఆటో నడుపుతున్నాడు. వచ్చిన డబ్బులతో తండ్రి వైద్య ఖర్చులు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంజీవ్ కూతురు కల్యాణి ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపి కుటుంబ పనుల్లో తల్లికి చేదుడువాదోడుగా ఉంటోంది. దాతలు తనను ఆదుకోవాలని సంజీవ్ కోరుతున్నాడు. ఆర్థికంగా సాయపడేవారు 80080 55788ను సంప్రదించాలని వేడుకుంటున్నాడు. -
ఆసుపత్రి బెడ్మీద టెన్త్ క్లాస్ ఎగ్జామ్..
ముంబై : చదువుమీద ఉన్న శ్రద్ధ ఓ బాలికను ఆసుపత్రి బెడ్మీద నుంచి ఎగ్జామ్ హాల్కు నడిపించింది. ప్రాణం తీసే రోగాన్ని లెక్కచేయకుండా పదవ తరగతి పరీక్షలు రాయటానికి వెళ్లింది. అయితే బాలిక పరిస్థితిని గుర్తించిన ఎగ్జామ్ సెంటర్ అధికారుల చొరవతో ఆసుపత్రి బెడ్మీదనుంచే ఎగ్జామ్స్ రాసే అవకాశం దొరికింది. ఈ సంఘటన ముంబైలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ బాలిక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. పరేల్లోని టాటా మెమోరియల్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. అయితే తను ఎగ్జామ్స్ రాయటానికి దగ్గరలోని ఎగ్జామ్ సెంటర్, ఎక్కువ సమయం కేటాయించాలని స్టేట్ బోర్డుకు విన్నవించుకుంది. దీంతో దగ్గరలోని కన్నోసా హైస్కూల్లో ఎగ్జామ్స్ రాసేందుకు ఆమెకు ఏర్పాటుచేయబడింది. మొదటి నాలుగిటి కోసం బాలిక సెంటర్ దగ్గరకు వెళ్లింది. ఆమె పరిస్థితిని గుర్తించిన సెంటర్ అధికారులు బోర్డుకు ఓ విన్నపం చేశారు. ఆసుపత్రి బెడ్మీద నుంచే తను ఎగ్జామ్స్ రాసేలా చూడాలని కోరారు. ఇందుకు స్టేట్బోర్డు ఒప్పుకోవటంతో శనివారం ఆసుపత్రి బెడ్మీదనుంచే జియోమెట్రీ ఎగ్జామ్ రాసింది. -
చావుకు ముందు అతడికి ఓ సర్ప్రైజ్!
సిడ్నీ : క్యాన్సర్తో బాధపడుతూ ఇంకొద్దిరోజుల్లో చనిపోతాడని తెలిసి ఆ ముసలాయనకు సర్ప్రైజ్ వీడ్కోలు ఇచ్చారు కుటుంబసభ్యులు. అతడికి ఎంతో ఇష్టమైన, బెస్ట్ ఫ్రెండ్ను కలుసుకునేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. సిడ్నీకి చెందిన పాల్ లీవిస్ అనే ముసలాయన గత కొద్ది సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి ముదరడంతో కొన్ని రోజుల నుంచి అతడ్ని ఆస్పత్రిలోనే ఉంచి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. పాల్కు రోజులు దగ్గర పడ్డాయని భావించిన కుటుంబసభ్యులు బ్రతికున్న కొన్ని క్షణాలైనా అతడ్ని సంతోషపెట్టాలనుకున్నారు. ఆస్పత్రి బెడ్ వద్ద పాల్ బెస్ట్ ఫ్రెండ్ కోకో ఇందుకోసం పాల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన 19 ఏళ్ల కోకో అనే పిల్లిని అతడి వద్దకు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. ఆస్పత్రి బెడ్ మీద కదలలేని పరిస్థితిలో ఉన్న అతడు దాన్ని చూడగానే ఎంతో సంతోషపడ్డాడు. పాల్ మనవరాలు ఎలిసా ఫోటి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచింది. దీంతో వీడియో కాస్తా వైరల్గా మారింది. అయితే కోకోను కలుసుకున్న రెండు రోజులకు పాల్ కిడ్నీ ఫేయిల్యూర్ కారణంగా మరణించాడు. -
తలకొరివి పెడతాడనుకున్నా.. కానీ వాడే..
కన్నతల్లి.. కట్టుకున్న భార్య.. ఇద్దరు కూతుళ్లకు అతడే కొండంత అండ. పేదరికంలో ఉన్నా ఏనాడు వారికి లోటు రాకుండా చూసుకున్నాడు. ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తూ నలుగురిలో మంచిపేరు సంపాదించుకున్నాడు. అయితే విధి మాత్రం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. క్యాన్సర్ రూపంలో వెంటాడి.. ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. దీంతో తనకు తల కొరివి పెడుతాడకున్న కొడుకు తన కళ్లముందే వేదన అనుభవిస్తుండటం ఆ తల్లి తట్టుకోలేకపోతోంది. ఇన్నాళ్లు తమను కంటికి రెప్పలా కాచిన తండ్రి శాశ్వతంగా దూరమవుతాడని తెలిసి అతడి కూతుళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కడదాకా తోడుంటానని బాస చేసిన భర్త.. ఇలా తనకు జీవిత కాలపు విషాదాన్ని మిగల్చబోతున్నాడంటూ అతడి భార్య విలపిస్తోంది. భర్తను కాపాడుకునేందుకు దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి సమ్మయ్య(40)కు ఇరవై ఏళ్ల క్రితం.. తన మేనమామ కూతురు కవిత(34)తో వివాహం జరిగింది. ఆయన ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తూ తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తుండేవాడు. కవిత తన భర్తతో కలిసి వ్యవసాయం పనులకు వెళ్తుండేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉన్నంతలో హాయిగా జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు సుచిత్ర(18), వైష్ణవి(14) ఉన్నారు. నాలుగేళ్ల కింద వెన్నంపల్లిలో అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉండడంతో కవిత ఆయాగా ఎంపికైంది. భర్త సంపాదన, అంగన్వాడీ విధులతో కుటుంబం హాయిగా గడుస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం సమ్మయ్యకు తీవ్రమైన తలనొప్పి రావడంతో కరీంనగర్లోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోమని సూచించారు. ఆ స్కానింగ్లో తలలో ట్యూమర్ ఉందని తేలడంతో 5 నెలలు చికిత్స చేయించారు. అయినా తలనొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్లో చికిత్స తీసుకోవాలని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ న్యూరో విభాగం ప్రత్యేక వైద్యులను సంప్రదించగా ఆపరేషన్ చేయాలని సూచించారు. నెలరోజులు హైదరాబాద్లో ఉండి ఆపరేషన్ చేయించారు. శస్తచికిత్స అనంతరం క్యాన్సర్ కణాలు పెరగకుండా రేడియేషన్ చేయించుకోవాలని సూచించడంతో తమకు ఉన్న ఎకరం పొలం తాకట్టు పెట్టి.. అప్పులు చేసి దాదాపు రూ. 8 లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేసుకున్నారు. 70 ఏళ్ల వయస్సులో కూలీ పనులకు.. సమ్మయ్య భార్య కవితకు వస్తున్న రూ. 6 వేల జీతం సరిపోక ఇద్దరు కుటుంబ పిల్లల పోషణ, భర్త వైద్యం ఖర్చులు భరించలేక కుటుంబం విలవిల్లాడిపోతుంది. ఇలాంటి సమయంలో సమ్మయ్య తల్లి మధురమ్మ తనకు వచ్చే పెన్షన్ డబ్బులను కొడుకు వైద్యం కోసం ఖర్చుపెడుతోంది. 70 ఏళ్ల వయసులో కొడుకు వైద్యం ఖర్చుల కోసం ఆమె కూలీ పనులకు వెళ్తుండడం పలువురిని కలిచివేస్తోంది.. రేడియేషన్ అనంతరం శరీరం బాగా క్షీణించడంతో సమ్మయ్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. చార్జీలకు సైతం ఇబ్బందే.. సమ్మయ్య పదిహేను రోజులకొకసారి హైదరాబాద్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రవాణా ఖర్చులకు సైతం డబ్బులేదని కవిత వాపోతోంది. ఇరుగుపొరుగు, బంధువుల వద్ద చార్జీలకు డబ్బు తీసుకుని ఆసుపత్రికి వెళ్తున్నారు. క్యాన్సర్ రోగులకు వర్తించే ఫించను మంజూరు చేస్తే కొంత మేరకైనా ఖర్చులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ప్రస్తుతం తన వద్ద చిల్లిగవ్వ కూడా లేక భర్తను బతికించుకునేందుకు ఆయాగా విధులు నిర్వర్తిస్తూ.. రాత్రిపూట నిద్ర లేకుండా భర్తకు సేవలు చేస్తూ గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మనసున్న మారాజులు, స్వచ్చంద సంస్థలు ఎవరైనా ఆపన్నహస్తం అందించకపోతారా..! అని ఆశగా ఎదురుచూస్తోంది. మెరుగైన వైద్య సేవలు అందించి కొంత కాలమైనా తన భర్తను కాపాడుకోవాలని ఆకాంక్షిస్తోంది. సమ్మయ్యతో తల్లి మధురమ్మ, కూతురు వైష్ణవి నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్దోళ్లు ఇద్దరూ ఉన్నంతలో కష్టపడి బతుకుతున్నారు. చిన్న కొడుకు సమ్మయ్యకు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నాకు కడుపుకోత మిగిలేలా ఉంది. కొరివి పెడతాడనుకున్న చిన్న కొడుకు... ఇలా ఎముకల గూడై పోవడంతో.. ఇది చూసేందుకేనా నేను బతికి ఉన్నది అనిపిస్తోంది. చుట్టాలు, ఇంటి పక్కనోళ్లు చేతనైంత సాయం చేశారు. అయినా వాడి చికిత్సకు డబ్బులు చాలడం లేదు. పెద్ద మనసు చేసుకుని నా కొడుకును బతికించేందుకు ఆర్థిక సాయం చేయండి. ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారు. వారి పరిస్థితేంటో.. నా కోడలు బతుకు ఏమవుతుందో తెలుస్తలేదు- మధురమ్మ, సమ్మయ్య తల్లి సమ్మయ్య కుటుంబానికి సహాయం చేయాలనుకున్న వారు: మొలుగూరి కవిత(మాతంగి శారద- పుట్టింట్లో పేరు)- అకౌంట్ నంబరు: 62333133861...ifsc: SBHY0020143లో డబ్బు జమచేయగలరు. వివరాల కోసం: ఫోన్ నంబరు: 8897077534లో సంప్రదించగలరు. -
క్యాన్సర్ రోగులకు పరిమితులొద్దు..
సాక్షి, అమరావతి: కళ్లకు క్యాన్సర్ సోకిన చిన్నారి హేమ అనారోగ్యంపై పత్రికల్లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమ అనారోగ్యంపై సీఎం జగన్ ఆరా తీశారు. చిన్నారి కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించాలని సీఎం స్పష్టం చేశారు. చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స అందింస్తున్నామని చెప్పారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తోందని.. అత్యవసర కేసులు ఉంటే.. ఆ రోగులకు వెంటనే చికిత్సలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. -
ఇవ్వడంలోనే ఉంది సంతోషం
ఉద్యోగం చేసేవారైనా, ఇంటిపట్టున ఉండేవారైనా ఆడవాళ్లు పొడవైన శిరోజాలను ఇష్టపడతారు. ఏ ఉద్యోగంలో ఉన్నా వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకే.. కేరళలో మహిళా పోలీస్ అధికారి అపర్ణ లవకుమార్ ఓ క్యాన్సర్ బాలిక విగ్గు కోసం పొడవాటి తన జడ కత్తిరించి ఇవ్వడం ఒక విశేషం అవడమే కాకుండా.. ఎందరికో ఆమె ప్రేరణగా నిలిచారు. త్రిశూర్ సమీపంలోని ఇరింజలకుడ మహిళా పోలీస్ స్టేషన్లో అపర్ణ సీనియర్ పోలీస్ అధికారి. 17 ఏళ్ల క్రితం పోలీసుగా విధులను చేపట్టారు అపర్ణ. ఆమె కురులు తల నుంచి మోకాలి పొడవు వరకు ఉండేవి. మూడేళ్ల క్రితం తొలిసారిగా ఆమె జుట్టును క్యాన్సర్ పేషంట్ల కోసం దానం చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ పనికి పూనుకున్నారు. ‘ముందు ఎవరికీ చెప్పలేదు. అలా చెబితే నాకు అడ్డు చెప్పేవారే ఎక్కువ ఉంటారు. ఆలోచన వచ్చిన వెంటనే సెలూన్కి వెళ్లిపోయాను. విగ్గులు తయారు చేసేవారికి ఆ వెంట్రుకలు ఇచ్చేశాను. ఆ విగ్గును క్యాన్సర్ బారిన పడిన పిల్లలకు చేరేలా చూశాను. ఇదో పెద్ద విషయంగా పరిగణించలేదు’’ అని చెబుతారు అపర్ణ. ప్రజలకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో లేను, ఇలా కొందరి పిల్లల ముఖాల్లో నవ్వులు చూడాలనుకున్నాను అంతే’’ అంటూ సంతోషంగా చెబుతున్నారు అపర్ణ. ఆత్మన్యూనతను పోగొట్టేందుకు క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగినా, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా చూడడం కష్టం. పిల్లలకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమో గురించి అంతగా తెలియదు. ‘‘క్యాన్సర్ బారిన పడిన పిల్లలు కీమోథెరపీ చేయించుకుని జుట్టు కోల్పోయిన తరువాత పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ తోటి పిల్లల నుంచి ఎగతాళిని ఎదుర్కోవచ్చు. లేదంటే అందరికీ జుట్టు బాగా ఉండి తమకెందుకు ఇలా జరిగిందని బాధపడవచ్చు. ఈ ఆలోచనలు వారిలోని ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి. క్యాన్సర్ బారిన పడి, కీమో థెరపీ చేయించుకున్న ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే అమ్మాయిని చూసినప్పుడు ఇలాగే బాధనిపించింది. అలాంటి పిల్లలు పడే బాధను తొలగించి, వారిలో ఆత్మ విశ్వాసం పెరిగేందుకు ఏం చేయచ్చు అనిపించినప్పుడు ఈ ఆలోచన వచ్చింది’’ అని చెప్పారు ఈ పోలీస్ అధికారిణి. అనుష్కా శర్మ : ‘అపర్ణ చేసిన పని సాధారణమైనదేమీ కాదు. అమెకు నా అభినందనలు’ అపర్ణకు ఇద్దరు కుమార్తెలు.ఎంఎస్సీ చదువుతున్న దేవిక, పదోతరగతి చదువుతున్న గౌరీ కూడా రెండేళ్ల క్రితం తల్లిలాగే విగ్గుల కోసం తమ పొడవైన కురులను దానం చేశారు. అపర్ణ బంధువు, తోటి మహిళా పోలీసు అధికారి కూడా ఆమె ధైర్యమైన చర్యతో ప్రేరణ పొంది తమ శిరోజాలను దానం చేశారు. బాలీవుడ్ నటి అనుష్కా శర్మ అపర్ణ పెద్దమనసుకు ప్రశంసలు కురిపించారు. వెల్లువలా వచ్చి పడుతున్న అభినందనలపై అపర్ణ స్పందిస్తూ.. తాను చేసింది పెద్ద ఘన కార్యమేమీ కాదని.. వెంట్రుకలు కత్తిరించుకుంటే ఏడాదికో, రెండేళ్లకో పెరుగుతాయని, నిజమైన త్యాగం అవయయ దానం చేసే వారిదేనని అన్నారు. – ఆరెన్నార్ -
పోలీసులంటే అందరికీ భయం..అందుకే
కేరళకు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ అపర్ణ లవకుమార్ (46) సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీలకు సహజంగా ఉండే కేశ సౌందర్యాభిలాష గురించి ఏమాత్రం పట్టించుకోకుండా..ఔదార్యాన్ని ప్రదర్శించారు. ఇటువంటి చర్యలతో, పోలీసులు ప్రజల మధ్య అంతరం తగ్గుతుందని నమ్ముతున్నానని ఆమె చెప్పారు. సాధారణంగా పోలీసులంటే ప్రజలకు మంచి అభిప్రాయం ఉండదు. భయపడిపోతారు. కానీ మానవతా దృక్పథంతో దీన్ని మార్చాలనుకుంటున్నానని ఆమె చెప్పడం గమనార్హం. న్యూస్ మినిట్ అందించిన కథనం ప్రకారం అపర్ణ క్యాన్సర్ రోగి కోసం తన పొడవాటి జుట్టును త్యాగం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కృషి చేయాల్సి వచ్చింది. తన సీనియర్ అధికారులనుంచి ప్రత్యేక అనుమతి పొంది మరీ గుండు కొట్టించుకుని, పలువురి ప్రశంసలకు పాత్రలయ్యారు త్రిశూర్లోని ఇరింజలకుడలోని మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసే ఇద్దరు బిడ్డల తల్లి క్యాన్సర్ బారిన పడినపుడు ఆమె తొలిసారి తన జుట్టును దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్లో భాగంగా స్థానిక పాఠశాలలో ఓ చిన్నారి (10) కలిసిన తరువాత తన నిర్ణయాన్ని మరింత దృఢపర్చుకున్నారు. క్యాన్సర్ రోగులకు విగ్స్ తయారు చేయడానికి తన పొడవాటి జుట్టును దానం చేశారు. కీమోథెరపీ తర్వాత జుట్టును పోగొట్టుకున్న బాధితుకు మద్దతుగా తన వంతు సాయం చేశానని అపర్ణ చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే అపర్ణ ఇంతకుముందు కూడా తన జుట్టును దానం చేశారు. అయితే అపుడు భుజాలవరకు మాత్రమే జుట్టును కత్తిరించుకున్నారు. కానీ ఈ సారి మాత్రం మొత్తం జుట్టును దానం చేయడం విశేషం. ముఖ్యంగా పిల్లలు క్యాన్సర్ బారిన పడినపుడు.. కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోతే, వారి పరిస్థితి మరీ బాధాకరం. తోటిపిల్లల వింతగా చూడటం, అవహేళన చేయడం వారి బాధను మరింత పెంచుతుంది. అందుకే మానసికంగా కృంగిపోయిన అలాంటి చిన్నారులకు సాయం చేయాలన్నదే తప్ప అందం గురించి తానెపుడూ పట్టించుకోలేదని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ఆమెకు కటింగ్ చేసిన పార్లర్ ఓనర్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. 2008 లో, ఆసుపత్రి బిల్లు కట్టలేని బాధితునికి, అపర్ణ తన బంగారు గాజులను విరాళంగా ఇచ్చారట. అపర్ణ నిర్ణయంతో ఉన్నతాధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. కేరళ పోలీసు మాన్యువల్లో యూనిఫామ్కు సంబంధించి,ఇతర కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే మహిళలు మొత్తం గుండు చేయించు కోకూడదు. కానీ ఒక గొప్ప విషయంకోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆమె జుట్టును దానం చేయడానికి అనుమతినిచ్చినట్టు త్రిస్సూర్ పోలీసు చీఫ్ విజయకుమార్ చెప్పారు. అంతేకాదు ఒక పోలీసు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారని, ఇది నిజంగా ప్రశంసనీయమని ఆయన అభినందించారు. -
‘ఇన్నాళ్లు బతికి ఉంటాననుకోలేదు’
వినూత్నమైన ఫొటోషూట్తో తన కవలల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపింది ఓ తల్లి. పిల్లలు ఇష్టపడే రీతిలో ఫొటోలు తీసి... చిరకాలం తమ ఆల్బమ్లో నిలిచిపోయేలా తన ఫొటోగ్రఫీతో మ్యాజిక్ చేసింది. క్యాన్సర్తో బాధపడుతున్న తనకు ఇకపై పిల్లల వేడుకలు చేసే అవకాశం వస్తుందోలేననే బెంగ కాస్తైనా తీరిందని ఉద్వేగానికి గురైంది. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని.. అయితే తాను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చినా ఫొటోల తాలూకు ఙ్ఞాపకాలు పిల్లల మదిలో కలకాలం నిలిచి ఉంటాయని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘వాళ్ల ఐదో పుట్టినరోజు వరకు బతికి ఉంటాననుకోలేదు. కానీ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు’ అని ఉద్వేగానికి లోనైంది. వివరాలు... అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ రేచల్ పర్మన్కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్దమ్మాయి తర్వాత కవలలు ఎలిజా, ఎమిలీలు జన్మించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే తాను క్యాన్సర్ బారిన విషయం రేచల్కు తెలిసింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె..కొన్ని రోజుల క్రితం తన కవలల ఐదో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించింది. ఇందులో భాగంగా యానిమేషన్ సినిమాల ఫ్యాన్ అయిన ఎలీజా...‘అప్’ మూవీ థీమ్ను ఎంచుకోగా... తనకు గుర్రంతో ఫొటోలు దిగాలని ఉందని ఎమిలీ తల్లిని కోరింది. ఈ క్రమంలో ఎలీజా ముత్తాత-అవ్వ అప్ మూవీలోని కార్ల్, ఎల్లీలుగా ముస్తాబై మునిమనవడితో ఫొటోలకు ఫోజిచ్చారు. ఇక ఎమిలీ కూడా తెల్ల గుర్రంపై ఎక్కి తన ముచ్చటను తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రేచల్ మూడు వారాల క్రితం ఫేస్బుక్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. తాము చూసిన బెస్ట్ ఫొటోల్లో ఇవే అత్యుత్తమైనవి అంటూ చిన్నారుల ఫొటోలకు నెటిజన్లు లైకులు కొడుతున్నారు. -
చిన్నపిల్లల పెద్ద మనసు
పిల్లలను టీవీలో వచ్చే కమర్షియల్ యాడ్స్ బాగా ఆకర్షిస్తుంటాయి. వాటిని చూసిన వెంటనే కొనివ్వమని మారాం చేస్తారు. కొంతమంది పిల్లలు ఇలా అడిగేసి అలా మర్చిపోతుంటారు. కొందరు అమ్మానాన్నలకు మర్చిపోయే చాన్సివ్వకుండా కొనిచ్చే వరకు అడుగుతూనే ఉంటారు. అయితే ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ అక్కాచెల్లెళ్లు ఇలాక్షి, సమారియాలు ఓ యాడ్ని చూసి పెద్దవాళ్లకంటే బాధ్యతగా స్పందించారు! ఆన్లైన్లో చూసిన ఒక వీడియో ఈ అక్కాచెల్లెళ్లను కదిలించింది ఆ వీడియోలో ఓ అమ్మాయి.. ఒత్తయిన జుట్టుతో స్కూలుకు వెళ్తుంది. స్కూల్లో మిగిలిన పిల్లలు ఆ అమ్మాయి చుట్టూ చేరి ప్రశ్నలతో ముంచెత్తుతారు. ప్రశంసలతో ఊపిరాడనివ్వరు. అప్పుడా అమ్మాయి ఎవరో దాతలు తనకు విగ్గును బహుమతిగా ఇచ్చారని చెబుతుంది. ఆ మాట చెప్పిన అమ్మాయి క్యాన్సర్ బాధితురాలు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి జుట్టు పూర్తిగా రాలిపోయి ఉంటుంది. గుండుతో బయటకు రావడానికి బిడియపడిన ఆ అమ్మాయి కొన్నాళ్లపాటు ఇల్లు దాటకుండా గడిపి ఉంటుంది. దాతల దాతృత్వంతో విగ్గు రావడంతో ఇప్పుడు సంతోషంగా స్కూలుకు వస్తున్నట్లు చెప్తుందామె ఆ వీడియోలో. ఆ మాట చెప్పేటప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆనందం ప్రతి క్యాన్సర్ బాధితులకు అందాలని కోరుకుంది ఇలాక్షి. ఈ అమ్మాయి ఆరవ తరగతి, చెల్లెలు మూడవ తరగతి. చిన్నమ్మాయికి అంత పెద్ద ఫీలింగ్ అర్థమైనట్లు లేదు. కానీ అక్క ఫీలింగ్కి మాత్రం అర్థమైంది. అందుకే వాళ్లిద్దరూ తమ జుట్టును క్యాన్సర్ బాధితులకు విరాళంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదే విషయాన్ని వాళ్లమ్మతో చెప్పారు. ఆమె సెలూన్కి తీసుకెళ్లి జుట్టు కత్తిరించి ముంబయిలో క్యాన్సర్ బాధితుల కోసం పనిచేసే çసంస్థలకు అందచేశారు. అందుకే అంటారు బాల్యం స్వచ్ఛమైనది అని. అరమరికలు లేకుండా అభిమానిస్తుంది బాల్యం. ఇవ్వడంలో సంతోషాన్ని పొందేది, సంతోషాన్ని పంచుకునేది, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చేదీ బాల్యమే. సేకరించే సంస్థలు ఉన్నాయి దాతల నుంచి కేశాలను సేకరించి వాటిని విగ్గులు తయారు చేసే కంపెనీలకు చేర్చడం, తయారైన విగ్గులను క్యాన్సర్ పేషెంట్లకు అందచేయడం వంటి సర్వీస్ అందించడానికి కొన్ని ఆర్గనైజేషన్లు పని చేస్తున్నాయి. ‘హెయిర్ క్రౌన్ ఆర్గనైజేషన్’ తమిళనాడులోని తేనిలో ఉంది. గడచిన ఐదేళ్లుగా పని చేస్తున్న ఈ ఎన్జీవో ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల మంది దాతల నుంచి జుట్టును సేకరించింది. ఒక విగ్ తయారు చేయాలంటే ఐదారుగురు మహిళల నుంచి సేకరించిన జుట్టు అవసరమవుతుంది. వెంట్రుక మందం అనేది పెద్ద విషయం కాదు, అయితే పొడవు మాత్రం పన్నెండు అంగుళాలు ఉండాల్సిందేనంటారు విగ్ తయారీదారులు. ఇక ముంబయిలో ‘కోప్ విత్ క్యాన్సర్’ అనే సంస్థ ఈ సేవలనందిస్తోంది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో గడచిన ఆరేళ్లుగా పని చేస్తున్న ‘సర్గక్షేత్ర’ ఎన్జీవోకి వెయ్యిమందికి పైగా దాతలు తమ కేశాలను విరాళంగా ఇచ్చారు. ఈ ఎన్జీవో మగవాళ్ల నుంచి కూడా కేశాలను సేకరిస్తోంది. ‘ఫర్ యు ట్రస్ట్’ కూడా కేరళలోనే ఉంది. ఇది కన్నూరులో ఉంది. ఈ ఎన్జీవో కార్యకలాపాల గురించిన సమగ్ర వివరాలు ఆయా వెబ్సైట్లలో ఉంటాయి. ఇచ్చే జుట్టు ఎలా ఉండాలి? తల స్నానం చేసి, చక్కగా ఆరిన తరవాత మాత్రమే కట్ చేయాలి. కలర్స్ వేసిన జుట్టు పనికి రాదు. అలాగే హెయిర్ స్టయిల్స్ నిలవడం కోసం హెయిర్ స్ప్రేలు వాడిన కేశాలు శుభ్రపరిచిన తర్వాత మాత్రమే కలెక్ట్ చేయాలి. కత్తిరించిన జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసి పోనీ టైల్లాగ చేసి జిప్లాక్ కవర్లో పెట్టాలి. దీనిని గట్టి కవర్లో పెట్టి కొరియర్ చేయాలి. కవర్ మీద దాత పేరు, ఈ మెయిల్ ఐడి, ఫోన్ నంబరు తప్పనిసరిగా రాయాలి. చిన్న సంగతేమీ కాదు తల మీద జుట్టు లేకుండా గుండుతో బయటకు రావడం చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ భరించేవాళ్లకది చాలా పెద్ద విషయమే. వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే ఇబ్బంది ఒకటైతే... అంతకంటే పెద్ద ఇబ్బందిని మానసికంగా అనుభవిస్తుంటారు. అందరూ ముఖానికి ప్రశ్నార్థకాన్ని అతికించుకుని మరీ జుట్టే లేని తల వైపు తదేకంగా చూస్తారు. అంతెందుకు? దేవుడికి గుండు గీయించుకున్న పిల్లలను కూడా స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటారు. కీమో గుండు ఉన్న వాళ్లను ఏడిపించకూడదని పిల్లలకు తెలియచెప్పినప్పటికీ, చూపులను తట్టుకోవడం అంత తేలికకాదు. అందుకే క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు ట్రీట్మెంట్ తర్వాత మామూలు మనుషుల్లాగానే ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవడానికి కొంచెం జంకుతుంటారు. అలాంటిది చిన్న పిల్లలు ఆ స్థితిని భరించడం చిన్న సంగతేమీ కాదు. అయితే సమాజంలో తోటి వాళ్లు కొద్దిగా బాధ్యత వహిస్తే ఆ జంకును చాలా సులభంగా తొలగించవచ్చు. ఆ సహకారం ఇవ్వడానికి ముందుకొచ్చారు ఈ అక్కాచెల్లెళ్లు. ‘‘ఇప్పుడు కత్తిరించిన జుట్టు మరో ఆరు నెలల్లో తిరిగి వస్తుంది. అప్పుడు మళ్లీ జడలు వేసుకుంటాం. మా జుట్టుతో మరో అమ్మాయి సంతోషంగా ఉంటుందంటే అంతకంటే మాకు స్వీట్ మెమొరీ ఇంకేం కావాలి’’ అని అడుగుతున్నారీ అక్కాచెల్లెళ్లు.– మంజీర -
ఆత్మహత్య కోసం ఆమె దూకితే.....
చైనాలోని హార్బిన్ పట్టణంలో సోమవారం హార్బిన్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో దురదృష్ణకర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ 20 ఏళ్ల యువతి ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతోంది. క్యాన్సర్ బాగా ముదురిపోయిందని, బతికే అవకాశాలు పెద్దగా లేవని డాక్టర్లు ఆమెకు తేల్చి చెప్పారు. దాంతో ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురయింది. ఆత్మహత్య చేసుకునేందుకు తానుంటున్న వార్డు నుంచి కిందకు దూకేసింది. అప్పుడే ఓ రోగిని పరామర్శించడం కోసం వచ్చి ఆస్పత్రి లాంజ్లో పచార్లు చేస్తున్న ఓ యువకుడిపై క్యాన్సర్ రోగి అనూహ్యంగా పడిపోయింది. ఆమె బరువు, వేగానికి ఆ యువకుడు నేలకు ఢీకొని ఎగిరి పక్కన పడిపోయాడు. ఆ యువకుడిని ఢీకొని పక్కకు పడిపోయిన క్యాన్సర్ రోగి అక్కడికక్కడే మరణించింది. యువకుడు మాత్రం వెన్నుముక విరిగి ప్రస్తుతం అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చైనా పోలీసులు తెలిపారు. అంతకుమించి వివరాలు తెలియజేసేందుకు వారు తిరస్కరించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆస్పత్రి లాంజ్లో పది మంది సాక్షులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
క్యాన్సర్ సోకిందని కన్న తండ్రిని..
జడ్చర్ల: చిన్నప్పటి నుంచి ఆలనా పాలనా చూసిన తండ్రికి క్యాన్సర్ సోకితే వెన్నంటి ఉండి వైద్యం చేయించాల్సింది పోయి.. అవగాహన లేక ఇంటికి తమకూ ఆ వ్యాధి సోకుతుందంటూ ఇంటికి దూరంగా వదిలిపెట్టారు. ఓ వైపు జబ్బు.. మరో వైపు కుటుంబసభ్యులు ఎవరూ పక్కన లేరనే క్షోభతో చివరికి ఓ తండ్రి తనువు చాలించిన అమానవీయమైన సంఘటన మంగళవారం బాదేపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. స్థానిక శ్రీరాంనగర్ కాలనీకి చెందిన వెంకటయ్య(65) క్యాన్సర్ వ్యాధికి గురయ్యాడు. ఇతని భార్య కొన్నేళ్ల క్రితమే మృతిచెందగా కుమారుడు రాజు, కోడలు పద్మ ఉన్నారు. వీరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా వెంకటయ్య మెడపై గల క్యాన్సర్ గడ్డ ఇటీవల పగలడంతో 15 రోజుల క్రితం ఇంటికి దూరంగా అతనిని స్థానిక ప్రభుత్వ గోదాముల దగ్గర గల పాడుబడిన కార్యాలయ గదిలో అతని కుమారుడు విడిచి వెళ్లాడు. నిత్యం చుట్టుపక్కల వారు లేదా కుమారుడు అతనికి కావాల్సిన ఆహారం, బీడీలు ఇచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఆయన మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన తండ్రి క్యాన్సర్కు గురికావడంతో ఆ వ్యాధి తమకు సోకుతుందని చుట్టుపక్కల వారు అభ్యంతరం చెప్పడంతో ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లానని కుమారుడు రాజు ఈసందర్భంగా పేర్కొనగా.. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు అతనే తన తండ్రిని దూరంగా పెట్టాడని కాలనీవాసులు తెలిపారు. ఏదిఏమైనా వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, చివరి సమయంలో కన్న తండ్రిని దూరంగా పెట్టడం అమానవీయమని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక సహాయం అందజేత మృతుడు వెంకటయ్య కుటుంబానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని యార్డు చైర్మెన్ మురళి, నాయకులు పరమటయ్య, శేఖర్, చైతన్య, హరి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారి ఆకాంక్షను నెరవేర్చిన మహేశ్
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు తన చిన్నారి అభిమాని ఆకాంక్షను నెరవేర్చారు. క్యాన్సర్తో బాధపడుతున్న పర్వీన్ అనే చిన్నారిని కలిసి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వీన్ అనే చిన్నారి క్యాన్సర్తో బాధపడుతోంది. మహేశ్ బాబును అమితంగా ఇష్టపడే ఆమె.. తన ఫేవరేట్ హీరోను చూడాలని ఆరాటపడింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్.. ఆమెను కలిసి పరామర్శించారు. పర్వీన్తో కాసేపు గడిపిన మహేశ్.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తన అభిమాన నటుడు తన కోసం రావడంతో ఆ చిన్నారి ఆనందంతో పరవశించిపోయింది. ప్రస్తుతం మహేశ్ బాబు ఆ చిన్నారితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సూపర్ స్టార్ మంచి మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్గా అలరించనుంది. -
అందానికి కొత్త భాష్యం చెప్పింది
స్త్రీలకు అందం కురులే. అందుకే మహిళలు శిరోజాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది క్యాన్సర్ చికిత్సలో భాగంగా జుట్టంతా ఊడిపోయి.. గుండు చేయించుకోవాల్సి వస్తే ఆ బాధను మాటల్లో వర్ణించడం కష్టం. అసలు గుండు చేయించుకోవడమే కష్టం అంటే.. ఇక ఆ అవతారంతో మనుషుల్లో కలవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది ఓ క్యాన్సర్ పేషంట్ మాత్రం గుండు మీదనే పెళ్లి కూతురుగా తయారయ్యి ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాక ఆమె ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తున్నారు నెటిజన్లు. నవి ఇంద్రాణ్ పిల్లయ్ కొన్నేళ్ల కిందట రొమ్ము క్యాన్సర్ బారిన పడి.. చికిత్స తరువాత కోలుకుంది. కానీ దురదృష్టవషాత్తు ఐదేళ్ల తర్వాత మళ్లీ క్యాన్సర్ వచ్చింది. ఈసారి ఆమె కాలేయం, వెన్నుపూసకు క్యాన్సర్ సోకింది. అప్పటికే కిమోథెరపీలతో రూపం కోల్పోయిన ఆమె.. మళ్లీ అదే ట్రీట్మెంట్ తీసుకోక తప్పలేదు. దాంతో ఆమె జుట్టు ఊడిపోయి ఆరోగ్యం మరింత క్షీణించింది. అయితే, ఆత్మస్థైర్యంతో రెండోసారి కూడా క్యాన్సర్ను జయించింది. ఈ నేపథ్యంలో తనలా క్యాన్సర్తో బాధపడేవారికి స్ఫూర్తిగా ఉండేందుకు పెళ్లి కూతురిగా మారి ఫోటోషూట్ చేసింది నవి. ఈ విషయం గురించి నవి మాట్లాడుతూ.. ‘క్యాన్సర్ పేషంట్గా చికిత్స తీసుకుంటున్నప్పుడు నేను నా జీవితం గురించి కలలు కనే దాన్ని. ప్రేమించిన వ్యక్తి గురించి కలలు కనేదాన్ని. పెళ్లి కూతురి అలంకరణలో నేను ఎలా ఉంటానా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఈ చికిత్సలో నా జుట్టు పూర్తిగా పోయింది. దాంతో నేను అందంగా ఉండనని అనిపించేది. కానీ ఈ నిరాశవాదం నుంచి బయటడాలని భావించాను. మనం ఎలా ఉన్నామో అలానే అంగీకరించడంలోనే సంతోషం ఉంటుందని తెలిసింది. పరిస్థితులు ఏవైనా సరే వాటిని అంగీకరించడం.. మనల్ని మనం అభినందించుకోవడం జీవితంలో అన్నింటికంటే ముఖ్యం అని అర్థమయ్యింది. అందుకే ఈ ఫోటో షూట్ చేసానం’టూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఎంతో మంది మహిళలు ఈ వ్యాధి బారినపడి మానసికంగా కుంగిపోతున్నారని పేర్కొంది. వారిలో ధైర్యం నింపేందుకు తాను ఈ ఫొటో షూట్ చేశానని, క్యాన్సర్ బాధితులు ‘బోల్డ్ అండ్ బ్యూటీఫుల్’ అని చెప్పడమే తన ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపింది. ప్రస్తుతం ‘బోల్డ్ ఇండియన్ బ్రైడ్’తో ఈ ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అందం అంటే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు.. ఆత్మవిశ్వాసంతో ఉండటమే అసలైన అందమంటూ అభినందిస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram Nothing can stop me.. Nope NOTHING! Not even CANCER.. 😋 . . . . . 📸: @shi.vaa90 @celesgrd MUA: @blushbeautybeyond @emmanuel_ravi98 Accesories: @desirec.my Outfit:@pattushastra Henna: @bdazzled_beauty #kissedbycancer #cancersurvivor #cancersucks #youngadultcancer #letsfcancer A post shared by Navi Indran Pillai (@naviindranpillai) on Feb 23, 2019 at 1:16am PST -
అమానుషం : క్యాన్సర్ పేషంట్ను చితకబాదిన సిబ్బంది
లక్నో : అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల పట్ల సానుభూతి చూపాల్సింది పోయి వారిని చితక్కొట్టారు ఆస్పత్రి సిబ్బంది. స్టాఫ్ టాయిలెట్స్ వాడినందుకు గాను క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను దారుణంగా అవమానించడమే కాక ఆమె కుమారుడి మీద కూడా దాచి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో జరిగిందీ దారుణం. స్టాఫ్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందన్న కారణంతో ఓ క్యాన్సర్ పేషెంట్ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడమే కాక ఆమె కొడుకుపై కూడా దాడికి పాల్పడ్డారు సదరు ఆస్పత్రి సిబ్బంది. గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ దాడి ఘటనపై ఔట్ పేషెంట్ ఇన్చార్జి ప్రొ.మనీష్ బాజ్పాయి సీరియస్ అయ్యారు. యువకుడిపై దాడి చేసిన ముగ్గురు సిబ్బందిని గుర్తించి.. వారిని విధుల నుంచి తొలగించారు. ఇక మీదట ఇలాంటి గొడవలు జరగకుండా చూస్తామని తెలిపారు. -
విధివంచిత సుజాత
నెల్లూరు(స్టోన్హౌస్పేట): వాళ్లిద్దరివి వేర్వేరు మతాలు. పెద్దలను ఎదిరించారు. పెళ్లి చేసుకున్నారు. అయితే విధి వారి మీద పగబట్టింది. సుజాతకేన్సర్ బారిన పడింది. సాయం కోసం కనబడిన ప్రతి ఒక్కరినీ అర్థిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్లో నివాసం ఉంటున్న ఇస్మాయిల్, సుజాత ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇరువురి పెద్దలు వారిని దగ్గరకు రానివ్వలేదు. టింకరింగ్ పనిచేస్తూ ఇస్మాయిల్ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఇలా పదేళ్లు గడిచిపోయాయి. గతేడాది నుంచి సుజాతకు తరచూ కడుపునొప్పి రావడం, ఆస్పత్రుల చుట్టూ తిరగడం ప్రారంభమైంది. వైద్యులు పరీక్షలు చేసి గర్భకోశ సంబంధిత కేన్సర్గా నిర్ధారించారు. ఇస్మాయిల్ రోజువారీ టింకరింగ్ పని ఆగిపోయింది. ఆమెకు సేవలు చేయడంతోనే సరిపోతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా చితికిపోయారు. ఆస్పత్రిలో మందులకు, పరీక్షలకు అప్పులు చేయాల్సివచ్చింది. కనీసం తిండికి కూడా లేని పరిస్థితులతో కేన్సర్ వ్యాధి తీవ్రస్థాయికి చేరుకుంది. సుజాత మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం దర్గామిట్ట సుజాతమ్మ కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ పరిస్థితిని చెప్పేందుకు సుజాత గొంతు పెగలడం లేదు. ఇస్మాయిల్ నిస్సహాయ స్థితిలో సాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఆర్థికంగా చేయూతనందించదలచిన వారు పి.సుజాత, బ్యాంక్ అకౌంట్ నంబర్: 3462200115726, సిండికేట్ బ్యాంక్, దర్గామిట్ట, నెల్లూరు, ఐఎఫ్సీ కోడ్: ఎస్వైఎన్బీ 0003462 బ్రాంచిలో జమ చేయాలని అర్థిస్తున్నారు. వివరాలకు ఫోన్నంబర్: 81063 77737లో సంప్రదించవచ్చు. -
ఆదుకోండయ్యా
చిత్తూరు, పలమనేరు: పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన శంకర, హంసవేణిలు భార్యా భర్తలు. వీరికి ముగ్గురు సంతానం. భర్త తాపీకూలీగా, భార్య కూరగాయలమ్ముతూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఏడాది క్రితం భర్తకు నడుముకింద చిన్నపాటి గడ్డ ఉండడంతో స్థానిక వైద్యుడి సూచన మేరకు స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. రోగికి పరీక్షలు నిర్వహించిన ఆంకాలజీ డిపార్ట్మెంటు క్యాన్సర్గా నిర్ధారించారు. ఆపరేషన్ చేయాలని సూచించారు. అయితే వారివద్ద డబ్బులు లేకపోవడంతో ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా అదే ఆస్పత్రిలో చేరారు. కీమోథెరపీ చేయాలని చెప్పి కొన్నాళ్లు పెట్టుకుని ఇక్కడ కుదరదంటూ పంపేశారు. ఇక చేసేదిలేక భర్తను ఇంట్లో ఉంచి కూలీ పనులు చేసుకుంటోంది. భర్త పడుతున్న నరకాన్ని చూసి కుమిలిపోతోంది. దాతల కోసం ఎదురుచూస్తోంది. స్థానికంగా ఉన్న మంత్రి అమరనాథరెడ్డి అయినా ఈమెకు న్యాయం చేయాలని కాలనీవాసులు విన్నవిస్తున్నారు. వైద్య సదుపాయం కల్పించే వారెవరైనా ఉంటే ఆదుకోవాలని హంసవేణి వేడుకుంటోంది( సెల్ 09703257343 ). -
సొనాలీ భావోద్వేగానికి లోనయ్యారు
-
సొనాలీ బింద్రే భావోద్వేగం
క్యాన్సర్తో బాధపడుతున్న హీరోయిన్ సొనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సొనాలీ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సొనాలి.. కష్ట సమయంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ‘నా అభిమాన రచయిత్రి ఇసాబెల్ అలెండే మాటలు ఎప్పుడూ నాకు గుర్తుంటాయి. కష్టం వచ్చినపుడే మనలో దాగున్న ధైర్య సాహసాలు వెలుగులోకి వస్తాయి. విషాదకరమైన సమయాల్లోనే కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటాయి. నాపై ఇంతగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తమ స్ఫూర్తివంతమైన కథలతో నాలో ధైర్యం నింపుతున్న వారికి రుణపడి ఉంటాను. క్యాన్సర్ను జయించిన మీ వంటి వారి గురించి తెలుసుకున్నపుడు నేను ఒంటరిని కాననే భావన నాలో కొత్త ఆశల్ని చిగురింపజేస్తుంది. ప్రస్తుతం నా జీవితంలో ప్రతిరోజూ ఒక సవాలుతో కూడుకున్నదే. సూర్యోదయం కోసం సానుకూల దృక్పథంతో ఎదురుచూస్తున్నానంటూ’ ఆమె చేసిన పోస్ట్ చేసిన సందేశం అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. ఆమె ఓ స్ఫూర్తి ప్రధాత.. ఇసాబెల్ అలెండే చిలీకి చెందిన ప్రఖ్యాత రచయిత్రి. పెరూలోని లీమాలో జన్మించిన ఆమె రెండేళ్ల వయసులో తండ్రి వృత్తి రీత్యా చిలీకి వచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఇసాబెల్ తండ్రి సాల్వెడార్ అలండే 1970లో చిలీ దేశానికి తొలి సామ్యవాద అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇసాబెల్ జర్నలిస్టుగా తన కెరీర్ను ఆరంభించారు. 1973లో మిలటరీ కుట్ర కారణంగా ఇసాబెల్ తండ్రి సాల్వెడార్ ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంలో ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన అలండే వాటికి అక్షరరూపం ఇచ్చారు. అవే పలువురికి స్పూర్తిగా నిలిచాయి. ఆమె చెప్పిన నాలుగు మాటలను తలుచుకున్న మన బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే మనోధైర్యంతో క్యాన్సర్పై పోరాడుతున్నారు. ఇసాబెల్ రచనల్లో ది హౌజ్ ఆఫ్ స్పిరిట్స్, సిటీ ఆఫ్ బీస్ట్స్లు ప్రముఖమైనవి. అమెరికా అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను కూడా ఇసాబెల్ అందుకున్నారు. In the words of my favourite author Isabel Allende, “We don't even know how strong we are until we are forced to bring that hidden strength forward. In times of tragedy, of war, of necessity, people do amazing things. The human capacity for survival and renewal is awesome.” The outpouring of love I’ve received in the last few days has been so overwhelming… and I’m especially grateful to those of you who shared stories of your experiences in dealing with cancer, whether it was your own or of loved ones. Your stories have given me an extra dosage of strength and courage, and more importantly, the knowledge that I’m not alone. Each day comes with its own challenges and victories and so for now, I’m taking this #OneDayAtATime. The only thing I’m trying to be consistent about is maintaining a positive outlook... literally #SwitchOnTheSunshine - it’s my way of dealing with this. Sharing my journey is also part of this process... I can only hope it reminds you that all is not lost and that someone, somewhere understands what you’re going through. 🤞🌞 A post shared by Sonali Bendre (@iamsonalibendre) on Jul 10, 2018 at 12:20am PDT -
కత్తిగట్టిన క్యాన్సర్
కడప కార్పొరేషన్: ఆ నిరుపేద కుటుంబంపై క్యాన్సర్ మహమ్మారి కత్తిగట్టింది. పెద్ద కుమారుడిని పొట్టనబెట్టుకున్న సైతాన్ చిన్న కుమారుడిని కూడా కబళించడానికి సిద్ధమైంది. దీంతో ఆ తల్లిదండ్రులు అతన్ని కాపాడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి... కడప నగరం కాగితాలపెంటలో చికెన్ అంగడి నడుపుకొనే రహమతుల్లా, సయ్యద్ హసీనా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాలుగేళ్లక్రితం పెద్ద కుమారుడు బాబ్జాన్(31) క్యాన్సర్ బారిన పడి మృతిచెందాడు. ఇప్పుడు అదే భూతం చిన్న కుమారుడు ఎస్. అరబ్జాన్(34)ను కూడా పట్టిపీడిస్తోంది. 4నెలల క్రితమే ఈ విషయం బయట పడింది. కర్నూల్కు తీసుకుపోతే పెద్ద ఆపరేషన్ చేశారు. తర్వాత అంతా బాగుందని పంపించేశారు. ప్రస్తుతం అరబ్జాన్ ఏమీ తినలేడు, లేవలేడు, కూర్చోలేడు. టెంకాయనీళ్లు, జ్యూస్లే అతని ఆహారం. ప్రతిరోజూ జ్వరం వస్తుండటంతో ఒళ్లు సలసలా కాలిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడూ నోట్లోంచి రక్తం ప్రవాహంలా వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. స్థానిక వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా భయపడిపోతున్నారు. ప్రతిసారి కర్నూల్కు వెళ్లి రావాలంటే కనీసం రూ.10వేలు ఖర్చు అవుతోంది. బస్సులో కూర్చోలేడు కనుక ప్రత్యేకంగా ఆటో తీసుకొని వెళ్లాల్సిందే. పెళ్లి అయి పిల్లలు ఉండాల్సిన వయసులో మంచాన పడిన కుమారుడిని చూసి ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఆపరేషన్ అయ్యింది.. ఇక ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే వారు బంగారు తాకట్టుపెట్టి, అప్పులు తెచ్చి వారి శక్తిమేర లక్ష రూపాయల వరకూ ఖర్చు చేశారు. పెద్దకొడుకు భార్య, కొడుకు, కుమార్తె వీరిపైనే ఆధారపడి బతుకున్నారు. ప్రతిరోజూ నాలుగు టెంకాయలు, జ్యూస్లు కొనడానికే రూ.200 కావలసి వస్తోంది. ఇంట్లో పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది. ఇవన్నీ తలుచుకొని వారు నిత్యం కుమిలిపోతూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. దాతలు స్పందించి క్యాన్సర్ బారిన పడిన తమ కుమారుడిని ఆదుకోవాలని ఆ పేద తల్లిదండ్రులు కోరుతున్నారు. వారి సెల్ నంబర్ 9550073585 ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సోదరుడు అరబ్జాన్ పరిస్థితి తెలుసుకున్న కడప శాసనసభ్యుడు ఎస్బి అంజద్బాషా సోదరుడు ఎస్బి అహ్మద్బాషా కాగితాలపెంటలోని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. వారి తల్లిదండ్రులను అడిగి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని రూ.10వేలు ఆర్థిక సాయం చేశారు. దాతలు స్పందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
బుజ్జి ఫ్యాన్తో యువీ
ఇండోర్ : క్యాన్సర్ బారిన పడి మృత్యువు అంచుల దాకా వెళ్లిన యువీ(యువరాజ్ సింగ్), ఆ మహమ్మారిని జయించి తిరిగి క్రికెట్లోకి పునరాగమనం చేసిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. కేవలం భారతీయులు మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సైతం యువరాజ్ సింగ్ను ఇష్టపడతారు. ఇటీవల క్యాన్సర్తో బాధపడుతున్న ఓ యువ అభిమానిని యువీ కలుసుకుని, తన ఔదార్యాన్ని చాటుకున్నారు. యువరాజ్ ప్రస్తుతం ఐపీఎల్ 2018 సిరీస్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుఫున ఆడుతున్నారు. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు యువీ, క్యాన్సర్తో బాధపడుతున్న ఓ బాలుడిని కలుసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో షేర్చేసింది. ‘క్యాన్సర్తో బాధపడుతున్న 11 ఏళ్ల రాకీ, తన ఆదర్శంగా తీసుకునే వ్యక్తి@యువ్స్ట్రాంగ్12ను కలుకున్నాడు. యువ్తో రాకీ కొంత సమయం పాటు గడిపాడు. రాకీ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం’ అనే క్యాప్షన్తో ఆ ఫోటోను షేర్ చేసింది. రాకీ అసలు పేరు దైనిక్ భాస్కర్. గత 10 ఏళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో రాకీ బాధపడుతున్నాడు. తనకు క్యాన్సర్ చికిత్స ప్రారంభం కావడానికి కాస్త ముందు యువీని కలుసుకోవాలని ఆ పిల్లాడు భావించాడు. ఇలా యువరాజ్, రాకీని కలుసుకున్నారు. పిల్లాడి చేతులు పట్టుకున్న యువీ ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపు రాకీతో సరదాగా మాట్లాడుతూ పిల్లాడిని ఉత్సాహపరిచాడు. స్కూల్ బ్యాగ్, క్యాప్, టీ-షర్ట్ను రాకీకి గిఫ్ట్గా ఇచ్చారు. రాకీ కచ్చితంగా ఈ మహమ్మారిని నుంచి జయిస్తాడని యువీ అన్నారు. రాకీ తండ్రికి కూడా యువీ ధైర్యమిచ్చారు. గుండె నిబ్బరం చేసుకుని ఉండాలని రాకీ తండ్రికి సూచించారు. యువరాజ్ సైతం 2011 తర్వాత క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. క్యాన్సర్ జయించుకుని వచ్చిన యువీ, క్రికెట్లోకి మళ్లీ పునరాగమనం చేశారు. ఆ బాలుడితో కలిసి యువీ దిగిన ఫోటోలు, నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. రాకీ త్వరగా కోలుకోవాలంటూ యువీ అభిమానులు సైతం ప్రార్థిస్తున్నారు. చికిత్స కోసం రాకీ ఆరు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది.కొడుకును బతికించుకోవడం కోసం రాకీ తండ్రి తన బోన్ మారోను దానం చేశాడు. -
ముంబై పోలీసుల ఔదార్యం
న్యూ ఢిల్లీ : ఆడుతూ, పాడుతూ స్నేహితులతో కలిసి హుషారుగా బడికి వెళ్లాల్సిన ఆ చిన్నారి పై విధి కక్ష కట్టింది. మరికొన్ని రోజుల్లో ఆ పసివాడు బాల్యాన్నే కాదు జీవితాన్నే కోల్పోనున్నాడు. నిండా ఏడేళ్లు కూడా లేని పసివాడిని క్యాన్సర్ రూపంలో విధి వెక్కిరించింది. మృత్యువు ఎప్పుడు తనను కబళిస్తుందో తెలియని ఆ చిన్నారికి ఒక కోరిక ఉంది. అందరి పిల్లల్లానే తాను బాగా చదువుకుని పెద్దయ్యాక పోలీసాఫీసర్ కావాలనుకున్నాడు. మరి ఇప్పుడు ఆ కల నెరవేరెందుకు అవకాశం లేదు. కానీ ఆ కోరికను ముంబై పోలీసుల సహకారంతో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ వారు తీర్చారు. పోలీసుల ఔదార్యాన్ని తెలిపే ఈ సంఘటన ముంబైలో జరిగింది. అర్పిత్ మండల్ అనే ఏడేళ్ల బాలుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అతని చివరి కోరిక పోలీసు ఆఫీసర్ కావడం. మేక్ ఏ విష్ వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అర్పిత్ను ఒక రోజు ములంద్ పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్గా నియమించారు. అర్పిత్ పోలీస్ దుస్తుల్లో రాగ మిగితా పోలీసు అధికారులు అతనికి గౌరవ వందనం చేశారు. వారి సెల్యూట్ని స్వీకరించి డెస్కులో కూర్చున్న అర్పిత్ కళ్లలో సంతోషం అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ముంబై పోలీసులు తమ ట్విటర్లో పోస్టు చేశారు. ముంబై పోలీసుల ఔదర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లల కోరికలను తీరుస్తున్న మేక్ ఏ విష్ సంస్థ 2015లో కూడా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడిని బోయవాడ పోలీస్స్టేషన్కు ఒక రోజు పోలీసాఫిసర్గా చేసింది. -
బస్టాండ్లో ప్రయాణికుడి మృతి
హన్మకొండ చౌరస్తా: తన కొడుక్కి జబ్బు తగ్గాలని ఆస్పత్రిలో చికిత్స అందించిన తల్లి.. తన కొడుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన హృదయ విదారక సంఘటన శుక్రవారం హన్మకొండ కొత్త బస్టాండ్లో చోటు చేసుకుంది. మృతుడి తల్లి అనసూర్య తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు వెంకటాపూర్ మండలంలోని రంగరాజుపల్లి కాలనీకి చెందిన గుండ్ల జయరాజ్(30) పెయింటింగ్ కార్మికుడు. కొద్దికాలంగా కేన్సర్తో భాదపడుతున్నాడు. జయరాజ్ను వైద్యుల సూచనల మేరకు రెండు నెలలుగా హైదబాద్లోని ఎంఎన్జే కేన్సర్ ఇనిస్టిట్యూట్లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స ముగియడంతో ఇంటికి తీసుకెళ్లవచ్చన్న వైద్య నిపుణుల సూచనల మేరకు జయరాజ్ను తల్లి అనసూర్య హైదరాబాద్ నుంచి సొంతూరుకు తీసుకెళ్తోంది. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హన్మకొండ బస్టాండ్కు వారు చేరుకున్నారు. అయితే వారు బస్ కోసం ఎదురు చూస్తుండగా మృతుడు జయరాజ్ కాసేపు ఎండలో ఉంటానని తల్లి అనసూర్యకు చెప్పి బస్టాండ్ ఆవరణలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద వెళ్లి కూర్చున్నాడు. అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో గమనించిన తల్లి కేకలు వేస్తూ రోదిస్తుండంతో సాటి ప్రయాణికులు 108కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్, సిబ్బంది జయరాజ్ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ ఎస్సై ప్రవీణ్కమార్ మృతుడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాతల సాయంతో ఇంటికి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సైతం డబ్బులు లేకపోవడంతో ఎస్సై ప్రవీణ్కుమార్, సాటి ప్రయాణికులు కొంత మొత్తాన్ని సేకరించి రూ.8 వేలను జయరాజ్ తల్లికి అందించారు. అంతేకాకుండా అంబులెన్స్ను మాట్లాడి జయరాజ్ మృతదేహాన్ని సొంతూరికి తరలించారు. -
దారుణం: కేన్సర్ బాధితురాలిపై గ్యాంగ్రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్లో మృగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కేన్సర్తో బాధపడుతున్న ఓ మైనర్ బాలికపై శనివారం ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాధితురాలు సాయం కోసం అర్థించడంతో అటుగా వచ్చిన మరో వ్యక్తి మానవత్వం మరిచి ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. చివరికి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. యూపీలోని సరోజినీనగర్లో ఉంటున్న బాధితురాలు(15) రక్తకేన్సర్తో బాధపడుతోంది. యువతికి పరిచయస్తుడైన శుభమ్ అనే వ్యక్తి శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో నూడుల్స్ తినేందుకు ఆమెను ఆహ్వానించడంతో బైక్పై అతనితో బయలుదేరింది. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన శుభమ్, తన స్నేహితుడు సుమిత్తో కలిసి ఆమెను బంధించాడు. ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం యువతి సాయం కోసం అర్థించడంతో.. అటుగా వెళ్తున్న వీరేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఆమెపై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వీరేంద్ర యాదవ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న శుభమ్, సుమిత్ల కోసం గాలింపు చేపట్టామన్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులూ సరోజినీనగర్కు చెందిన వారేనన్నారు. ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం హిస్సార్: హరియాణాలో మరో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. ఉక్లానాలోని ఆరేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారం చేసి ఆపై ఆ బాలికను దారుణంగా హత్య చేశాడు. హిస్సార్ పోలీసుల కథనం ప్రకారం... ఫతేబాద్ జిల్లా తొహనా పట్టణానికి చెందిన దంపతులు కూలీ పనులు చేస్తుంటారు. రైల్వే లైన్ పక్కనే నివసించే వీరికి ఇద్దరు సంతానం. అందులో ఆరేళ్ల చిన్నారి శుక్రవారం రాత్రి తన తల్లి, అక్కతో కలసి నిద్రిస్తుం డగా..గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
ఆమె చివరికోరిక నెరవేర్చేందుకు..
ఆమె ఒక క్యాన్సర్ పేషంట్. ఆమె చివరికోరికను నెరవేర్చేందుకు ఇప్పుడు నెటిజన్లు నడుం బిగించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ను కలువాలన్న ఆమె జీవితకాల ఆకాంక్షను సాకారం చేసేందుకు.. ఏకంగా ఎస్ఆర్కేమీట్స్అరుణ్ (#SRKMeetsAruna) యాష్ట్యాగ్ను ఇప్పుడు వైరల్గా మార్చారు. ఆమె ఫొటోతోపాటు షారుఖ్ను ఆమె కలిసినట్టు ఉన్న స్కెచ్ను కలిపి ట్వీట్చేస్తూ.. షారుఖ్ దృష్టికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అరుణ పీకే ప్రముఖ నెటిజన్ అని చెప్పాలి. భారత్లోని వివిధ రాష్ట్రాల ప్రజలకు తనకు ఎందుకు నచ్చుతారో పేర్కొంటూ ఆమె గత జూలైలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. అరుణ ధైర్యవంతురాలు. చాలా సానుకూల దృక్పథం కల వ్యక్తి. తన చుట్టు ఉన్న వారిలో నిత్యం ఉత్సాహం నింపే ఆమె ఈ మార్చి నాటికి క్యాన్సర్పై పోరాటంలో ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిపై పోరాడుతూ.. ధైర్యంగా ముందుకు సాగుతున్న ఆమె.. ఈ సందర్భంగా వైద్యులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు రుణపడి ఉంటానని అన్నారు. అదేవిధంగా తన అభిమాన నటుడు షారుఖ్ఖాన్ తనలో శక్తిని నింపుతున్నారని, ఈ విషయం ఆయనకు తెలిసి ఉండకపోవచ్చునని ట్వీట్ చేశారు. 'షారుఖ్పై ఉన్న ప్రేమ కన్నా మరేది గొప్పది కాదు..ఒకవేళ నేను ఆయనను కలిస్తే.. నేను బాగుంటాను' అంటూ అరుణ పేర్కొన్నట్టు కామెంట్లు పెట్టి.. నెటిజన్లు ఈ పోస్టును వైరల్ చేశారు. త్వరగా షారుఖ్ ఆమెను కలువాలని కోరుకుంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. Dear @iamsrk please meet your biggest fan @Arunapk57 ji, that's her last wish.#SRKmeetsAruna pic.twitter.com/NOyRSInvbC — Scarface (@al_kameeno) 18 October 2017 #KingKhan's biggest fan and a #cancer patient with critical health condition @Arunapk57 has her ultimate wish to meet @iamsrk#SRKmeetsAruna pic.twitter.com/Uel6kOHpki — Parikshit Sachdeva (@sachdevaparik) 17 October 2017 "No love is greater than the love for #SRK @iamsrk If I would meet him I'll be just fine." - @Arunapk57#SRKmeetsAruna #cancerpatient pic.twitter.com/ZRJ3dlMiVW — Parikshit Sachdeva (@sachdevaparik) 17 October 2017 Dearest @iamsrk .. How many RTs to meet this larger than life woman with can-survive-no-matter-what spirit —> @Arunapk57? #SRKmeetsAruna — #SRKmeetsAruna (@Sai_ki_bitiya) 18 October 2017 If meeting someone means life to them, would you meet them @iamsrk? Your die hard fan @Arunapk57 needs to meet you once.#SRKmeetsAruna pic.twitter.com/6hW2OIeTlE — Parikshit Sachdeva (@sachdevaparik) 17 October 2017 I hope #SRKmeetsAruna. Such fans need to be treated as special ones by their fav star. Hey @iamsrk do meet her at least for 5 mins. — Hunting Tiger!!!!! (@_EternalSalman_) 18 October 2017 Please trend so Shahrukh Sir notices it.. please make this wish come true #SRKMeetsAruna — #SRKmeetsAruna (@Sai_ki_bitiya) 18 October 2017 -
వాళ్ల వేధింపులే సాయిశ్రీ మృతికి కారణం
విజయవాడ: చంద్రబాబు పాలనలో సంక్షేమ, ఆరోగ్య రక్ష వంటి పథకాలు అమలు కావడం లేదని, అందుకు నిదర్శనమే మాధవశెట్టి సాయిశ్రీ మృతి అని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సాయిశ్రీ మృతికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. టీడీపీ పాలనలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య రక్ష వంటి పథకాలు ప్రచారం చేసుకోవడమే తప్ప అమలు కావడం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో చిన్నారి తనను బతికించమని వేడుకుంటే, స్థానిక ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలతో ఎటువంటి సాయం అందలేదన్నారు. ప్రపంచ విషయాలు తన డ్యాష్ బోర్డులో చూసే బాబుకు రాజధానిలోని చిన్నారి వేడుకోలు వినిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. టీడీపీ పాలనలో చిన్నారి రోదన అరణ్య రోదనైందనీ, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని బాబు తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
కాశీబుగ్గలో ఇంటి ఓనర్ అమానుషం
-
కేరళలో ఘోరం.. కేన్సర్ రోగిపై లైంగిక దాడి
కేరళలో ఘోరం జరిగింది. 90 ఏళ్ల వయసున్న కేన్సర్ రోగిపై ఆమె ఇంటి పక్కన ఉండే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కొల్లాం జిల్లాలోని కడక్కల్లో జరిగింది. తన ఇంటి ఆనుపానుల గురించి అతడికి బాగా తెలుసని బాధితురాలు తెలిపారు. వెనక తలుపు లోంచి అతడు వచ్చాడని, ఇల్లు బాగా తెలిస్తేనే ఎవరైనా అలా చేయగలరని ఆమె అన్నారు. తనను ఏమీ చేయొద్దని అతడిని వేడుకున్నా వినిపించుకోలేదని, పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేయాలని చెప్పారు. ఈ ఘోరం ఐదు రోజుల క్రితమే జరిగినా, బుధవారమే వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై ఐపీసీ 377 డి, 354 సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నామని, ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలుచేశామని కొల్లాం రూరల్ ఎస్పీ అజితా బేగం తెలిపారు. ఆమె బంధువులను కూడా విచారించి వివరాలు తెలుసుకుంటామన్నారు. -
తొమ్మిదేళ్లకే పోలీసు ఆఫీసర్!
డాక్టర్ల లెక్క ప్రకారం చూస్తే.. అసలు ఈ పాటికి అతడు స్పృహలో కూడా ఉండకూడదు. కానీ అతడు మాత్రం తన కలలను నెరవేర్చుకుంటూ బ్రహ్మాండంగా పోలీసు కూడా అయ్యాడు. తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మెదడు కేన్సర్తో బాదపడుతున్న కోలిన్ టోలండ్ అనే తొమ్మిదేళ్ల అబ్బాయి.. ఇప్పుడు అక్కడ పోలీసు అధికారి ఉద్యోగంలో చేరాడు. అవును.. అతడికి చిన్నప్పటి నుంచి పోలీసు అవ్వాలని కల ఉండేది. దాంతో అమెరికాలోని ఇటాకా పోలీసు శాఖ ముందుకొచ్చి అతడిని గౌరవ పోలీసు అధికారిగా నియమించింది. అతడి కుటుంబ సభ్యులు, బోలెడంత మంది పోలీసులు, అతడి క్లాస్మేట్ల సమక్షంలో అతడిని గౌరవ పోలీసును చేసి యూనిఫాం కూడా ఇచ్చారు. తనకు అన్నింటికంటే ఇష్టమైనది బ్యాడ్జి మీద తన పేరు చూసుకోవడం అని ఈ సందర్భంగా కోలిన్ చెప్పాడు. ఇప్పటికి అతడికి మూడుసార్లు మెదడుకు ఆపరేషన్ అయ్యింది. వైద్యుల లెక్కప్రకారం అయితే అసలు ఈపాటికి అతడు స్పృహలోనే లేకుండా ఉండాలి. కానీ అతడి మానసిక స్థైర్యం వల్లే ఇంతకాలం ఉన్నాడని, బతికున్న ప్రతిరోజూ జీవితాన్ని ఆస్వాదించడానికి లభించిన ఒక అవకాశంగా భావిస్తాడని కోలిన్ తల్లిదండ్రులు చెప్పారు. బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక జోక్ వేసి నవ్వుతాడని అన్నారు. కోలిన్ లాంటి ధైర్యవంతులు తమ శాఖలోకి రావడం తమకే గర్వకారణమని ఇతాకా పోలీసు చీఫ్ జాన్ బార్బర్ అన్నారు. ఇతాకా పోలీసు శాఖలో ఇప్పటివరకు చేసిన నియామకాలలో ఇదే అత్యుత్తమమని నగర మేయర్ స్వాంటే మిరిక్ చెప్పారు. అతడికి చాలా తక్కువ సమయం ఉన్నందున ఉద్యోగాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని.. అతడిని ఎవరూ మర్చిపోకూడదనే తాను భావిస్తున్నానని కోలిన్ తండ్రి అన్నారు. -
దారుణంగా తలపై గాజు సీసాలతో కొట్టి..
హౌరా: ఒక వ్యక్తి మరో వ్యక్తి విషయంలో ఎంతటి ఏహ్య భావంతో ఉంటాడో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి తాను నడుపుతున్న బైక్ ను ఓ యువకుడికి కొంచెం తగిలించాడని కారణంతో అతడిని దారుణంగా దాడి చేశారు. అతడిని చావు దెబ్బలు కొట్టారు. అప్పటికే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతడు ఇటీవల కీమో థెరపీ తీసుకున్నాడు. ఆదివారం రాత్రి తన పని ముగించుకొని ఇంటికి తిరిగొస్తుండగా అతడిపై ఏమాత్రం దయచూపకుండా చితక్కొట్టారు. దాంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడి తలలో నాలుగు చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియో, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ మిరాజ్(35) అనే వ్యక్తి హౌరాలోని బేలూరు ప్రాంతంలో ఉంటున్నాడు. అతడికి క్యాన్సర్ ఉంది. ఈ మధ్యే కీమో థెరపీకి వెళ్లొచ్చాడు. అయితే, క్యాన్సర్ వ్యాధితో ఉన్న అతడి వల్ల చుట్టుపక్కలవారికి అదే జబ్బు వస్తుందని, ఆ ప్రాంతం విడిచిపెట్టి పోవాలని కొందరు అతడిని బెదిరస్తూ వస్తున్నారు. మిరాజ్ కు చిన్న వ్యాపారం ఉంది. ఆదివారం రాత్రి తన పనులు ముగించుకొని వస్తుండగా తాను ఉండే ప్రాంతానికి చెందిన యువకుల్లో ఓ యువకుడి కాలుకి తను బైక్ పార్కింగ్ చేస్తుండగా కొంచెం తగిలింది. దీంతో అదే అదనుగా తీసుకొని అక్కడ ఉన్నవారంతా అతడిని దారుణంగా కొట్టారు. సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ మిరాజ్ తలపై పగులగొట్టారు. బైక్ తగలడం తప్పే అని ఒప్పుకున్నా విడిచిపెట్టకుండా కొట్టి కాలనీ ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. ప్రస్తుతం మిరాజ్ ను ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి దిగిన యువకులను 15 ఏళ్లు జైల్లో వేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్
-
క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్
-
క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్
యంగ్ జనరేషన్ హీరోలు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఉత్సాహం పాల్గొంటున్నారు. ముఖ్యంగా నయం కానీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతీ ఒక్కరు కదలివస్తున్నారు. ఇటీవల క్యానర్తో బాధపడుతున్న అమ్మాయిని తమిళ హీరో ధనుష్ పరామర్శించగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్కు క్యాన్సర్ బాధితున్ని కలిసి ధైర్యం చెప్పాడు. బెంగళూరుకు చెందిన నాగార్జున కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్ను కలవటమే తన ఆఖరి కోరిక అని తెలపటంతో.. ఆ అభిమానిని కలిసేందుకు ఎన్టీఆర్ సమయమిచ్చాడు. నాగార్జునతో కొంత సమయం గడిపిన జూనియర్, అతని ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ చేసిన పనికి అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులనుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
టవరెక్కిన క్యాన్సర్ పేషెంట్
అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో మంగళవారం ఓ క్యాన్సర్ పేషెంట్ సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గ్రామానికి చెందిన నాగరాజు(37) అనే వ్యక్తి కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతోన్నాడు. క్యాన్సర్ వచ్చినా కుటుంబసభ్యులూ, బంధువులూ పట్టించుకోవటం లేదని మనస్తాపం చెందిన నాగరాజు మంగళవారం టవర్ పైకి ఎక్కి దూకుతానని బెదిరిస్తోన్నాడు. నాగరాజును కిందదించే ప్రయత్నం గ్రామస్తులు చేస్తోన్నారు. -
తల్లి చివరి కోరిక కోసం..
కర్ణాటకలో కేన్సర్తో బాధపడుతున్న ఓ తల్లి.. తన కొడుకును ఓ చిత్రమైన కోరిక కోరింది. అతడు కూడా దాన్ని తీర్చడానికి కాస్త కష్టపడినా.. చివరకు తీర్చాడు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా మాకనడకు గ్రామ నివాసి లలితమ్మ కేన్సర్ బాధితురాలు. ఆ తల్లి వెల్లడించిన తన చివరి కోరికను ఆమె కుమారుడు కిరణ్కుమార్ నెరవేర్చాడు. జేడీఎస్ పార్టీలో కొనసాగుతున్న కిరణ్కుమార్ తల్లి లలితమ్మకు తాను చనిపోయేలోగా జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ.కుమారస్వామిని ఒకసారైనా చూడాలన్న కోరిక కలిగింది. ఆ కోరిక గురించి కిరణ్కుమార్ తమ పార్టీ అధ్యక్షునికి ఫోన్లో వివరించగా, చెళ్లకెరె పర్యటనకు వచ్చిన ఆయన అందుకు సమ్మతించి, వెంటనే తల్లితో కలిసి చెళ్లకెరె బయలుదేరి రావాలని సూచించారు. దీంతో ఆయన చెళ్లకెరెలో జరిగిన జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తర్వాత అక్కడకు వచ్చిన లలితమ్మను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుమారస్వామితో మాట్లాడినందుకు తనకు ఎంతో సంతోషం కలిగిందని లలితమ్మ ఆనందం వ్యక్తం చేసింది. -
క్యాన్సర్ వీధిన పడేసింది
మెదక్ రూరల్ : క్యాన్సర్ వ్యాధి సోకి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ తన ఇంట్లో చనిపోతుందేమోనని భయపడి ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో తలదాచుకునేందుకు కనీసం పూరిపాకైనా లేకపోవటంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను ఆమె భర్త నడిరోడ్డుపై పడుకోబెట్టి గుండెలవిసెలా రోదిస్తున్నాడు. 'భగవంతుడా... నాలాంటి పాపపు రాత ఎవరికీ రావద్దు దేవుడా' అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. మెదక్ మండల పరిధిలోని పేరూరు గ్రామానికి కొంతదూరంలో పోచమ్మగుట్ట దేవాలయం ఉంది. దేవాలయానికి దగ్గర్లోనే రాములు, అంజమ్మ దంపతులు పూరిపాక నిర్మించుకుని ఉంటున్నారు. రెండేళ్ల క్రితం అంజమ్మకు క్యాన్సర్ వచ్చింది. దీంతో రాములు తలకు మించిన అప్పులు చేసి ఆస్పత్రులకు తిప్పాడు. ఈ క్రమంలోనే పోచమ్మ ఆలయం వద్ద వేసుకున్న పూరిపాక పూర్తిగా కూలిపోవటంతో కొన్ని నెలల క్రితం పేరూర్ గ్రామానికి వెళ్లి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొన్ని రోజులుగా అంజమ్మ పరిస్థితి విషమించింది. దీంతో తమ ఇంట్లో మరిణిస్తుందనే ఉద్దేశంతో ఇంటి యజమాని వారిని ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. దాంతో ఏం చేయాలో తోచక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భార్యను రాములు ఓ ఆలయం పక్కనే గల రోడ్డుపై పడుకోబెట్టి కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఆస్పత్రిలో చూపించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక, కనీసం మందుబిళ్లలకు డబ్బుల్లేక తన భార్య కళ్ల ముందే చస్తుంటే ఏం చేయలేని నిర్భాగ్యుడనయ్యానంటూ రాములు ఆవేదన చెందుతున్నాడు. చలించిన గ్రామ సర్పంచ్ ర్యావ సుగుణ కుమారుడు రాంచందర్రెడ్డి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో పూరిగుడిసెను నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. -
గాయంతో నవ్వులు పూయించిన కేన్సర్ రోగి
న్యూఢిల్లీ: కేన్సర్ సోకిందని తెలియగానే ఇక మరణ శాసనం రాసుకున్నట్టు భయపడిపోతాం. తీరని విషాదంలో మునిగిపోతాం. కానీ అంతటి విషాదంలో తన గాయానికి, కొంచెం చతురతను జోడించి నలుగురికీ నవ్వులు పంచిన వైనం పలువురి ప్రశంసలందుకుంది. బ్రెయిన్ ఆపరేషన్ తర్వాత మిగిలిన మచ్చతో కలిపి ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో కేన్సర్ రోగి. ఫొటో చూసిన నెటిజన్లు ఆ యువకుడిని పలువురు అభినందనల్లో ముంచెత్తారు. త్వరలో కేన్సర్ బారి నుంచి బయట పడాలని ఆకాంక్షించారు. ఆత్మవిశ్వాంసతో కేన్సర్ను జయించాలని కోరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్రెయిన్ కేన్సర్ బారిన పడి ఓ యువకుడికి ఆపరేషన్ చేసి మెదడులో ఉన్న కణితి తొలగించారు వైద్యులు. ఈ సందర్భంగా ఆపరేషన్ తరువాత కుట్లు వేయడానికి పిన్నులు వాడారు. చూడ్డానికి అచ్చం కోటు జిప్లాగా ఉన్న తన గాయాన్ని చూసి అతనికి ఓ ఐడియా వచ్చింది. అంతే.. తల పైనుంచి మెడ వరకు పిన్నులతో ఉన్న ఆ గాయానికి జిప్లకు చివర ఉండే పిన్ను అంటించాడు. ఆ పిన్నులను తొలగించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లేముందు దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు 'మెడుల్లా బ్లాస్టోమా' అనే వ్యాధి సోకిందని తెలిపాడు. బ్రెయిన్ సర్జరీ అయిందనీ, ఈ సందర్భంగా తన గాయాన్ని ఇలా సరదాగా పోస్ట్ చేశానని కామెంట్ పెట్టాడు. -
కపాలాన్నే మార్చేశారు!
అమెరికాలో వైద్యరంగంలోనే ఓ అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా కపాలం మార్పిడి ఆపరేషన్ చేశారు. కేన్సర్ చికిత్స కారణంగా తలమీద పెద్ద గాయం కావడంతో.. అతడికి కపాలాన్ని మార్చడం తప్ప వేరే గత్యంతరం లేకపోయింది. దీంతో 15 గంటల పాటు ఆపరేషన్ చేసి అతడికి పూర్తిగా కొత్త కపాలాన్ని అమర్చారు. జేమ్స్ బోయ్సెన్ (55) ఆస్టిన్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నారు. ఆయనకు క్రానియోఫేషియల్ టిష్యూ మార్పిడితో పాటు ఒకేసారి కిడ్నీ, పాంక్రియాస్ కూడా మార్పిడి చేశారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ బృందానికి డాక్టర్ మైఖేల్ క్లెబక్ నేతృత్వం వహించారు. ఇది చాలా సంక్లిష్టమైన మైక్రోవాస్క్యులర్ ప్రొసీజర్ అని ఆయన తెలిపారు. తాము పుర్రె ఎముకలతో పాటు మాడు కణజాలాన్ని, దాంతోపాటు వచ్చే రక్తనాళాలను కూడా మార్చామన్నారు. ఇలా కపాలాన్ని మార్చడం గానీ, ఒకేసారి మూడు అవయవాలను మార్చడం గానీ ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడూ, ఎవరికీ మార్చలేదని కూడా క్లెబక్ వివరించారు. రోగి బోయ్సెన్కు వరుసపెట్టి రకరకాల కేన్సర్లు వచ్చాయని, దాంతో అనేక ఆపరేషన్లు, రేడియేషన్ జరిగాయని తెలిపారు. ఫలితంగా ఆయన తల మీద పెద్ద గాయం అయ్యిందన్నారు. గతంలోనే ఆయనకు ఒకసారి కిడ్నీమార్పిడి జరగడంతో అప్పటి నుంచి ఇమ్యూన్ సప్రెషన్ మందులు వాడుతున్నారు. కేన్సర్ చికిత్సలో రేడియేషన్ కారణంగా కపాలం దెబ్బతిన్నప్పుడు ఈ మందుల కారణంగా అది నయం కాలేదు. దాంతో ఈ మార్పిడి అంతా చేయాల్సి వచ్చింది. -
లక్ష్మి గెలిచింది..!
బొబ్బిలి: తీవ్రమైన చర్మ క్యాన్సర్తో బాధపడుతూ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థిని లక్ష్మి పాసైంది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన చిన్ని లక్ష్మికి చర్మ క్యాన్సర్ సొకింది. దీనికి తోడు కంటి చూపు కూడా కోల్పోవడంతో మండలంలోని భోజరాజపురం వద్ద ఉండే అంధుల పాఠశాలలో ఉంటూ బొబ్బిలిలోని విద్వాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్లో హెచ్ఈసీ చదివింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తయ్యేసరికే లక్ష్మికి వ్యాధి ముదిరి, ముఖమంతా అస్తవ్యస్థంగా తయారైంది. కానీ ఆమె రెండో ఏడాది కూడా ఆత్మస్థైర్యంతో చదివింది. ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు రాయడానికి వాసు జూనియర్ కళాశాలకు వచ్చింది. స్క్రైబ్ను పెట్టుకొని పరీక్షలు రాసి నేడు సీ గ్రేడ్లో ఉత్తీర్ణురాలై 564 మార్కులు సా ధించింది. తనకు టీచరు అవ్వాలనుందని సాక్షికి చెప్పింది. లక్ష్మీ ఉత్తీర్ణత సాధించడంతో అంధుల పాఠశాలలో ఆనందోత్సహాలు వ్యక్తమయ్యాయి. ఈ పాఠశాల నుంచి ఈ ఏడాది 11 మంది ఇంటర్ పరీక్షలు రాస్తే శతశాతం ఉత్తీర్ణత వచ్చిందని ప్రిన్సిపాల్ పాల్సన్ తెలిపారు. -
17 ఏళ్ల హేమంత్ కోరిక 'అలా తీరింది'
ఉదయ్పూర్: కేన్సర్ వ్యాధితో మరణానికి చేరువవుతున్న చిన్న బాలుడు చివరి కోరిక...పోలీసు కమిషనర్గా విధులు నిర్వహించాలి. ఆ విషయాన్ని బాలుడు తల్లిదండ్రులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు వెల్లడిస్తే... వారు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతారు. దాంతో సదరు బాలుడు ఓ రోజు పోలీసు కమిషనర్గా విధులు నిర్వహిస్తాడు. ఈ సంఘటన అలా మొదలైంది చిత్రంలో చూశాం. అచ్చు గుద్దినట్లు ఇలాంటి సంఘటనే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటు చేసుకుంది. 17 ఏళ్ల యువకుడి హేమంత్ లోహర్కు క్యాన్సర్ సోకింది. దీంతో అతడు ఉదయ్పూర్లోని పసిఫిక్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. తాను సదరు కాలేజీ ప్రిన్సిపల్ కావాలనుకుంటున్నట్లు అతడి మనసులోని మాటను కుటుంబ సభ్యులకు వివరించాడు. దాంతో ఆ విషయాన్ని మెడికల్ కాలేజీ యాజమాన్యానికి తెలిపడంతో... అందుకు వారు అంగీకరించారు. దీంతో బుధవారం ఓ రోజు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్గా హేమంత్ వ్యవహారించారు. మెడికల్ కాలేజి యాజమాన్యం హేమంత్కు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తుంది. -
కేన్సర్ రోగితో రెహమాన్ పుట్టినరోజు వేడుకలు
చెన్నై: మ్యూజిక్ మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం 48వ ఏట అడుగుపెట్టిన ఆయన.. చెన్నైలో కేన్సర్ తో బాధపడుతున్న ఓ అభిమానిని పరామర్శించారు. పుట్టినరోజున తన కుటుంబంతో కాసేపు గడిపిన రెహమాన్.. కేన్సర్ రోగిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఫేస్ బుక్ లో అభిమానులతో కాసేపు చాట్ చేశారు. 'ఆయన తన పుట్టినరోజును విలాసవంతంగా జరుపుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. తల్లి ఆశీర్వాదంతో ఆ రోజును ప్రారంభించిన రెహమాన్.. అనంతరం చెన్నై లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లి అక్కడ కేన్సర్ తో బాధపడుతున్న ఆయన అభిమానిని పరామర్శించారు.' అని రెహమాన్ సన్నిహితులు వెల్లడించారు. పుట్టినరోజున కూడా పని చేయడానికి ఆయన ఇష్టపడతారని, ఆ రోజు కూడా స్టూడియోలో కాసేపు గడిపారని తెలిపారు. అనంతరం తన ఫేస్ బుక్ అభిమానులతో చాటింగ్ చేసినట్టు వెల్లడించారు. -
కేన్సర్ బాధితురాలికి కేబీసీలో 7 కోట్ల ప్రైజ్మనీ
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా మహా కరోడ్పతి గేమ్ షో టీవీ రికార్డులన్నింటినీ బద్దలుకొడుతోంది. ఈ సీజన్లో ఇప్పటికే ఇద్దరు సోదరులు కలిసి 7 కోట్ల రూపాయలు గెలుచుకోగా, తొలిసారి ఓ మహిళ.. ఈ అత్యంత భారీ ప్రైజ్మనీని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు కేబీసీలో మహిళలు ఇంత పెద్ద మొత్తాలు గెలుచుకోవడం ఎప్పుడూ లేదు. వాసాయ్ ప్రాంతానికి చెందిన మేఘా పాటిల్ ఓ సాధారణ గృహిణి. ఆమె ఇంట్లోనే ట్యూషన్లు చెప్పుకొంటూ ఉంటారు. ఆమె ఈ సీజన్లో 7 కోట్ల రూపాయల బహుమతి సొంతం చేసుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తు ఆమె కేన్సర్తో బాధపడుతున్నారు. కేవలం మరికొన్ని నెలలు మాత్రమే బతుకుతారు. అయినా పట్టుదలతో కేబీసీకి వచ్చి, ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్ కూడా దాటి హాట్ సీటు వరకు వచ్చి, అక్కడ కూడా మొత్తం 14 ప్రశ్నలకూ సరైన సమాధానాలు ఇచ్చి ఏడు కోట్ల రూపాయలను తన సొంతం చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ఇది చాలా గర్వకారణం. -
ఇంట్లోకి రానివ్వని తల్లి.. ప్రాణాలొదిలిన కొడుకు!
ఒకవైపు కేన్సర్ బాధ.. మరోవైపు కన్నతల్లి ఇంట్లోకి రానివ్వలేదన్న వ్యథ.. ఈ రెండూ కలిసి ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నాయి. రక్తకేన్సర్తో బాధపడుతున్న కన్న కొడుకును ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయిందో తల్లి. దాంతో ఇంటి దూలానికే సెలైన్ బాటిల్ కట్టి.. ఆరు బయటే భర్తను పడుకోబెట్టింది అతడి భార్య. చివరకు చుట్టుపక్కల వాళ్లు, పోలీసులు కలగజేసుకుని ఇంటి తాళం పగలగొట్టి లోపల పడుకోబెట్టినా, కన్నతల్లి ఆదరణకు నోచుకోలేకపోయానన్న మనోవ్యథతో ఆ కన్నకొడుకు ప్రాణం గిలగిలా కొట్టుకుని.. ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది! ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది. కందుకూరులోని ఓ మెడికల్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్న తాళ్లూరి కాశీ విశ్వనాథ్ (45) గత డిసెంబర్లో అస్వస్థతకు గురయ్యాడు. పరీక్ష చేయిస్తే బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. దీంతో అప్పటి నుంచి హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స చేయించుకున్నాడు. రెండు నెలల క్రితం చికిత్స ముగిసి ఇంటికి వచ్చినా, మళ్లీ వారం క్రితం ముక్కు, నోటివెంట రక్తం వచ్చింది. అతడిని పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమించిందని, ఇక ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ విషయాన్ని కాశీవిశ్వనాథ్ భార్య లక్ష్మీ కమల కందుకూరులో ఉంటున్న అతని తల్లికి చెప్పి, అతని తీసుకుని బుధవారం రాత్రి ఇంటికి వచ్చింది. వారిని ఇంట్లోకి రానివ్వకుండా తల్లి తాళం వేసి మరో కుమారుడి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంటి ముందు అతన్ని పడుకోబెట్టి.. ఇంటికి ఉన్న దూలానికి సెలైన్ బాటిల్ కట్టి ఎక్కిస్తూ రెండు గంటలపాటు గడిపింది. చివరకు పోలీసులు, చుట్టుపక్కల వాళ్లు తాళం పగలగొట్టి విశ్వనాథ్ను ఇంట్లోకి తీసుకెళ్లారు. అయినా.. ఒకవైపు వ్యాధి తీవ్రత, మరోవైపు మనోవ్యథతో అతడు గురువారం ఉదయం ప్రాణాలు వదిలేశాడు!