ఢిల్లీలో దాడులకు ఐఎం కుట్ర! | IM plotting attacks in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో దాడులకు ఐఎం కుట్ర!

Published Mon, Sep 8 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

IM plotting attacks in Delhi

న్యూఢిల్లీ: రానున్న పండుగ రోజుల్లో ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ప్రణాళికలు వేస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్‌లో  అరెస్టయిన ఐఎం ఉగ్రవాది అజీజ్ షేక్ వెల్లడించిన సమాచారం మేరకు ఆ అభిప్రాయానికి వచ్చారు. గత ఏడాది ఐఎం నేత యాసిన్‌భత్కల్ అరెస్ట్ అనంతరం అజీజ్ నేపాల్ పారిపోయాడు.

ఇటీవల రియాజ్‌భత్కల్, మొహ్సిన్‌ల నుంచి ఢిల్లీ వెళ్లాలని షేక్‌కు ఆదేశాలందాయి. నేరుగా కాకుండా, లక్నో, మొరాదాబాద్, సహారన్‌పూర్‌ల మీదుగా వెళ్లాలని షేక్‌కు చెప్పారు. ఆ మార్గంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.  ఢిల్లీలో దాడుల కోసం స్లీపర్ సెల్ ఉగ్రవాదులకు డబ్బులు సమకూర్చేందుకే షేక్ ఢిల్లీ వెళ్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement