Terrorist attacks
-
ఖలిస్తానీ శక్తుల భరతం పట్టండి
న్యూఢిల్లీ: ద్వీపదేశమైన న్యూజిలాండ్లో ఖలిస్తానీ శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతుండడం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయా శక్తులను కఠినంగా అణచివేయాలని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్కు విజ్ఞప్తి చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు న్యూజిలాండ్ను అడ్డాగా మారనివ్వకూడదని కోరారు. మోదీ, లక్సన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్–న్యూజిలాండ్ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 2019లో న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడులు, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సారూప్యం ఉందని మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాడికల్ శక్తులపై పోరాడే విషయంలో భారత్, న్యూజిలాండ్ మధ్య సహకారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి రోడ్మ్యాప్ భారత్, న్యూజిలాండ్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై చర్చలు ప్రారంభం కావడాన్ని మోదీ, లక్సన్ స్వాగతించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్, న్యూజిలాండ్ మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు. ఇండో–పసిఫిక్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాత్మక వైఖరిపై తాము చర్చించామని లక్సన్ వివరించారు. మోదీ, లక్సన్ భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల నడుమ రక్షణ సంబంధాలను వ్యవస్థీకృతంగా మార్చడం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు పక్షాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారం కోసం ఒక రోడ్మ్యాప్ రూపొందించాలని ఇరు దేశాలు నిర్ణయానికొచ్చాయి. విస్తరణవాదం వద్దు.. అభివృద్ధే కావాలి స్వేచ్ఛాయుత, భద్రతతో కూడిన, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్కు భారత్, న్యూజిలాండ్ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇండో–పసిఫిక్లో అభివృద్ధిని కోరుకుంటున్నాం తప్ప విస్తరణవాదాన్ని కాదంటూ పరోక్షంగా చైనా తీరును తప్పుపట్టారు. ఇండో–పసిఫిక్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను అందరూ గౌరవించాలని మోదీ, లక్సన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అక్రమ వలసల సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒక దేశానికి చెందిన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కార్మికులకు మరో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చట్టబద్ధమైన ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికి వచ్చారు. గాజాలో శాశ్వతంగా శాంతి నెలకొనాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు.అందుకే క్రికెట్ మాట ఎత్తలేదు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన చర్చల్లో క్రికెట్ అంశం ప్రస్తావనకు రాలేదని న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగానే ఆ అంశాన్ని విస్మరించానని అన్నారు. భారత్–న్యూజిలాండ్ మధ్య దౌత్య సంబంధాల దెబ్బతినకుండా అడ్డుకోవాలన్నదే తన ఆలోచన అని వివరించారు. దీంతో పక్కనే ఉన్న ప్రధాని మోదీ బిగ్గరగా నవ్వేశారు. సోమవారం భేటీ తర్వాత లక్సన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోïఫీలో భారత్ చేతిలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఓడిపో యిన సంగతి తెలిసిందే. అలాగే ఇండియాలో జరిగిన టెస్టు క్రికెట్ సిరీస్లో న్యూజిలాండ్ నెగ్గింది. తమ చర్చల్లో క్రికెట్ గురించి మాట్లాడనందుకు మోదీని అభినందిస్తున్నానని లక్సన్ చెప్పారు. మరోవైపు మోదీ, లక్సన్ కలిసి సోమవారం ఢిల్లీలోని చరిత్రాత్మక గురుద్వారా రకాబ్గంజ్ సాహిబ్ను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలే
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన పాకిస్తాన్కు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలను స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుందన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడులపై పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో శుక్రవారం భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ మాట్లాడారు. ఇదే సభలో తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్ 370పై మాట్లాడారు. దీనిపై భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించారు. సైన్యం పెత్తనం కింద నలుగుతూ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసే దేశమైన పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడడం ఏమటని నిలదీశారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్లు జరిగే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. భారతదేశ భూభాగాన్ని కబళించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకాలు సృష్టించడానికి ఉగ్రవాదాన్ని నమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి, చీకటి నేరాలకు మారుపేరైన పాకిస్తాన్కు భారత్ గురించి నోరువిప్పే అర్హత లేదని భవిక మంగళానందన్ పరోక్షంగా హెచ్చరించారు.పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఒక ఆయుధంగా ప్రయోగిస్తోందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. తమ దేశ పార్లమెంట్పై, ఆర్థిక రాజధాని ముంబై నగరంపై, మార్కెట్లపై, యాత్రా మార్గాలపై దాడులు చేసిన నీచ చరిత్ర పాకిస్తాన్ ఉందని నిప్పులు చెరిగారు. అలాంటి ధూర్త దేశం హింస గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అల్ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. -
జమ్మూలో దాడుల వెనుక...
కొన్ని వారాలుగా జమ్ము తీవ్రవాదుల దాడులతో దద్దరిల్లుతోంది. కశ్మీర్ లోయ నుండి ఉగ్రదాడులు జమ్మూకి ఎందుకు మారినట్టు? ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి. సైన్యానికి తెలియకుండా ఆకు కూడా కదలదు. కశ్మీర్తో పోల్చితే జమ్మూ తక్కువ సమస్యాత్మకం. జమ్ము–కశ్మీర్కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే ఉగ్రవాదుల లక్ష్యం అయి వుండాలి. శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని ఈ దాడులు గుర్తు చేస్తాయని వాళ్లు భావిస్తూవుండొచ్చు.ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ ప్రాంతంలోని రియాసీ నుంచి కాశ్మీర్లోని బారాముల్లా వరకు చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వంతెన మీదుగా ఈ నెలాఖరులో తొలి రైలు రన్ను ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, పీర్ పంజాల్కు దక్షిణాన ఇటీవల జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఈ ప్రాంత వాసుల్లో ఏర్పడుతున్న ఆందోళనకు ప్రధాన మంత్రి సమక్షంలో భరోసా లభిస్తుందా?గత కొన్ని వారాలు రక్తంతో తడిసిన భీకర శబ్దాన్ని గుర్తుచేస్తున్నాయి: జూలై 8న కఠువా జిల్లాలో ఐదుగురు సైనికులు హతమయ్యారు. జూలై 7న కుల్గామ్లో ఆరుగురు ఉగ్రవాదులతో సహా ఎనిమిది మంది హతమయ్యారు. జూన్ 26న డోడా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 9న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున రియాసి జిల్లాలో తొమ్మిది మంది యాత్రికులు హత్యకు గురయ్యారు.మరో నెల రోజుల్లో, జమ్ము–కశ్మీర్కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ‘సబ్ చంగా సీ’ (అంతా బాగుంది) పిలుపునకు ఏమైంది? ముడుచుకుపోయిన పెదవులు, పిడచకట్టుకుపోయిన నాలుకలపై కదులుతున్న ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్ లోయ నుండి ఉగ్రవాద దాడులు హిందూ మెజారిటీ జమ్మూకి ఎందుకు మారాయి?మొదట, వాస్తవాలు చూద్దాం. దాడులు చేస్తున్న ఉగ్రవాదులు విదేశీయులు. అంటే వారు పాకిస్తాన్కు చెందినవారు. అఫ్గాన్లు, చెచెన్లు మొదలైన ఇతర విదేశీ ఉగ్రవాదుల్ని ఇక్కడ గుర్తించలేదు. రెండవది, వారు అమెరికా తయారీ ఎమ్4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్స్ వంటి అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నారు. ఇవి తరచుగా జమ్ము–కశ్మీర్లో కంటే అఫ్గాన్ యుద్ధరంగంలో ఎక్కువగా కనిపిస్తాయి. మూడవది, వారు దాడులను నిర్వహించడానికి అత్యున్నత శిక్షణ పొందారు. నాల్గవది, ఈ ఉగ్రవాదులు అటవీ, అంతర్జాతీయ సరిహద్దు విభాగం నుండి జమ్మూ ప్రాంతంలోకి చొరబడ్డారు. వారు వేగవంతమైన ప్రవాహాల నుండి ఈదుకుంటూ వచ్చారు, అంతే తప్ప నిజంగా నియంత్రణ రేఖను దాటి కాదు.అంతర్జాతీయ సరిహద్దు నుంచి చొరబడవచ్చని చెబితే ఎక్కువగా ఆశ్చర్యపోవద్దు. రియాసీ, డోడా, కఠువా, సాంబాలో నేల మెత్తటిది. గతంలో ఉగ్రవాదులు సొరంగాల ద్వారా చొరబడ్డారు. ఇప్పుడైతే పాకిస్తానీ డ్రోన్లు వారికి సాయపడుతున్నాయి – 2021లో జమ్మూ వైమానిక క్షేత్రంపై దాడితో సహా!మరీ ముఖ్యంగా, పాకిస్తానీ వ్యూహంలో మార్పు – అంటే, లక్ష్య ప్రాంతాన్ని కశ్మీర్ నుండి జమ్మూకి మార్చడం అనేది కశ్మీరీ జనాభాకు ‘ఉపశమనం‘ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్పష్టంగా జరిగిన చర్య. కశ్మీర్ లోయ చాలా నిశితంగా పరిశీలించబడుతోంది. అక్కడ చెట్టు నుండి పడే ఆకు వేగం, కోణం, దూరం గురించి కూడా భద్రతా బలగాలకు తెలుసు. వారికి ముందుగా తెలియకుండా చిగురుటాకు కూడా రాలడం కష్టం. కశ్మీర్లోని పెద్ద భూభాగాలు ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించబడిన వాటిలో ఒకటిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వ్యవస్థ గురించి మాట్లాడితే లేదా వ్యతిరేకంగా మాట్లాడితే దానికి చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు తమ పనులు తాము చూసుకుంటారు.జమ్మూ ప్రాంతంలో అలా కాదు. పూంఛ్–రాజౌరీ సెక్టార్లో నిరంతరం దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ భూభాగాల భద్రత చాలావరకు సడలించబడింది. హిందూ మెజారిటీతో కూడిన జమ్మూ మరింత జాతీయవాదంతో, తక్కువ సమస్యాత్మకంగా ఉంటుంది. వాస్తవానికి, 2020 వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ అంతటా చైనీయులు కాలిడినట్లు గుర్తించిన వెంటనే, రాష్ట్రీయ రైఫిల్స్ వారి బ్రిగేడ్ను తూర్పు లద్దాఖ్కు తరలించారు. భద్రత పలుచబడిపోవడం వల్ల జమ్మూకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మాత్రమే ఇక్కడి బ్రిగేడ్ కొంతమంది రిజర్వ్ బలగాలతో భర్తీ అయింది.ఇక్కడ మరొకటి కూడా జరుగుతోంది. ఇది భద్రతా పరిస్థితులతో నేరుగా సంబంధం కలిగి ఉండకపోయినా, మారుతున్న పరిస్థితుల గురించి మీకు కొంత ఆలోచన ఇస్తుంది. అదేమిటంటే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కూడా బీజేపీ బలహీనపడటం!ఇది ఇలా ఉండకూడదు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మరింత అనుసంధానం చేయాలని భావించారు. దానికి బదులుగా, ఇప్పుడు స్థానిక నివాసితులు పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బయటి వ్యక్తులకు భూమి అమ్మకం, మద్యం వ్యాపారంలో పెరుగుదలతో పాటుగా, శ్రీనగర్ నుండి ఐదు లక్షల మందితో కూడిన బలమైన సైన్యం తరలింపును గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఇది స్థానిక వ్యాపారానికి ఊతమిచ్చేది.ఇటీవలి లోక్సభ ఎన్నికలు ఆ అసంతృప్తిని కొంతమేరకు ప్రదర్శించాయి. ఉధమ్పుర్ (40.11 శాతం ఓట్లు సాధించిన చౌధురీ లాల్ సింగ్ను 51.28 శాతంతో జితేంద్ర సింగ్ ఓడించారు), జమ్మూ (42.4 శాతం ఓట్లు సాధించిన రామన్ భల్లాను 52.8 శాతంతో జుగల్ కిషోర్ శర్మ ఓడించారు) స్థానాలను బీజేపీ గెలుచుకున్నప్పటికీ, వారి గెలుపు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. రెండూ 1.5 లక్షల కంటే తక్కువ. ఇలా జరగడం పట్ల అధికార పార్టీ ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. బహుశా, పాకిస్తానీ ఉగ్రవాదులు చేయాలనుకుంటున్నది అదే కావచ్చు. ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవం సందర్భంగా, సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే. తీవ్రవాద దాడుల స్థాయి ఇంకా కొద్దో గొప్పో నియంత్రణలోనే ఉందనీ, వ్యూహాలు మారినప్పటికీ అది ఎక్కువ ప్రతీకార చర్యలకు పురిగొల్పదనీ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులు సైనిక శిబిరాలకు ఎక్కువ నష్టం కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి. జమ్మూలో ఇవి సాయుధ గస్తీపై, పౌర వాహనాలపై మెరుపుదాడిగా మారాయి.బహుశా, మరొక కారణం ఉంది. పార్లమెంట్లో ప్రధాని మోదీ బలం తగ్గినప్పటికీ, ఆయన ప్రపంచంలో పర్యటిస్తున్నారనీ, ఆయన గౌరవం పొందుతున్నారనీ పాకిస్తాన్ సర్వశక్తిమంతమైన సైనిక వ్యవస్థ గమనించకుండా ఉండదు. న్యూఢిల్లీని దాని ఆత్మసంతృప్తి దశ నుండి కదిలించి, ఒక పరిష్కారాన్ని, శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని గుర్తించేలా ఈ దాడులు చేస్తాయని బహుశా రావల్పిండి భావిస్తూవుండొచ్చు.అయినప్పటికీ, అంతర్గత ఒత్తిడికి మోదీ చాలా ఎక్కువగా స్పందిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. 2019లో కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను బలవంతంగా ప్రారంభించిన పంజాబ్ మాదిరిగానే, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కశ్మీర్కు అవకాశం వస్తుంది. కశ్మీర్ లేదా జమ్మూ నుండి ఎన్నికైన ప్రతినిధులను ఢిల్లీ గానీ, రావల్పిండి గానీ విస్మరించలేవు. చేతిలో ఒక క్షణం ఉంటుంది. ఇది త్వరలో మళ్లీ రాకపోవచ్చు. భారతదేశం, పాకిస్తాన్ రెండూ ప్రయత్నించాలి, దానికి సిద్ధం కావాలి.జ్యోతీ మల్హోత్రా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎన్ఐఏ చేతికి ‘బస్సుపై ఉగ్రదాడి’ కేసు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఇటీవల బస్సుపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తును కేంద్రం హోంశాఖ... జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై వరుస సమీక్షా సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై రియాసి జిల్లాలో జూన్ 9న ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. డ్రైవర్కు బుల్లెట్ తగలడంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. -
ఇక... జమ్మూ వంతు!
జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాజౌరీ, పూంచ్ , రియాసీ, కఠువా, ఉధమ్పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్ 29 నుంచి అమరనాథ్ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక సెప్టెంబర్లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష. -
Pakistan General Elections 2024: పాక్లో నేడే సార్వత్రిక ఎన్నికలు
ఇస్లామాబాద్: పెచ్చరిల్లిన హింస, పెట్రేగిన ఉగ్రదాడులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధానిఇమ్రాన్ఖాన్ ఊచలు లెక్కపెడుతున్న వేళ ఆరేళ్ల ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం దన్నుతో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 74 ఏళ్ల షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. నవాజ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పారీ్ట అత్యధిక సీట్లు సాధించేలా కన్పిస్తోంది. ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్పై ఈసీ నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలో దిగారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సైతం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 12.85 కోట్ల ఓటర్లు ఈసారి ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. బుధవారమే బలూచిస్తాన్ ప్రావిన్స్న్స్లో ఉగ్రవాదులు జంట బాంబుదాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకున్న నేపథ్యంలో 6.5 లక్షల మంది భద్రతా సిబ్బందితో పోలింగ్స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల్లో ఈసారి 5,121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 336 సీట్లకుగాను 266 సీట్లకు బుధవారం పోలింగ్ జరగనుంది. మరో 60 సీట్లు మహిళలకు రిజర్వ్చేశారు. మరో 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్చేశారు. ఇంకొన్ని సీట్లు పార్టీలు గెలిచిన సీట్లను బట్టి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి. -
భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన NIA
సాక్షి, హైదరాబాద్/చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ NAI ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది. దక్షిణాదిలోని 31 చోట్ల సోదాలు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో భారీ ఉగ్రనెట్వర్క్ బయటపడింది. కోయంబత్తూరులో 22 ప్రాంతాల్లో, హైదరాబాద్లో ఐదు ప్రాంతాల్లో, మిగతా చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అరబిక్ భాషలో ఉన్న కొన్ని పేపర్లు, వీటితో పాటు రూ. 60 లక్షలు, 18,200 US డాలర్స్ స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నారు ఉగ్రవాదులు. రీజనల్ స్టడీ సెంటర్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ల ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను రిక్రూట్ చేసుకుంటున్నారు ఉగ్రవాదులు. కిందటి ఏడాది అక్టోబర్ 23 న కోయంబత్తూర్ లో కారు పేలుడు చర్యకు పాల్పడింది ఈ తరహా శిక్షణ పొందిన ఉగ్రవాదులేనని ఎన్ఐఏ గుర్తించింది. -
‘26/11’ కుట్రదారులు ఇంకా బయటే...
ముంబై: ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడుల కుట్రధారులు, పాత్రధారులు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు. నిక్షేపంగా తిరుగుతున్నారు. వారికి ఏ శిక్షలూ పడడం లేదు’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరించిందని, దానితో నష్టాల గురించి ఇతరుల కంటే భారత్కే ఎక్కువగా తెలుసని అన్నారు. ‘ఉగ్రవాద కార్యకలాపాలకు నూతన సాంకేతికను వాడుకోకుండా నిరోధించడం’ అనే అంశంపై 26/11 దాడులకు సాక్షిగా నిలిచిన ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు. దాడుల మృతులకు గబాన్ దేశ విదేశాంగ మంత్రి, యూఎన్ఎస్సీ అధ్యక్షుడు మైఖేల్ మౌసా–అడామో తదితరులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో దేశం నుంచి వచ్చిన ముష్కరులు మారణహోమం సృష్టించారని పాకిస్తాన్పై ధ్వజమెత్తారు. కరడుగట్టిన ఉగ్రవాదుల విషయంలో రాజకీయ కారణాల వల్ల ఐరాస భద్రతా మండలి చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. పాక్ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా చైనా çఅడ్డుకుంటోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఆ సంస్థలకు నిధులందకుండా చేయాలని సూచించారు. అలా చేస్తే వారి వెన్ను విరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. -
ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశం విస్తుపోయే ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి, దర్యాప్తును వేగవంతం చేసేందుకు వీలుగా అనుమానితులు, నేరస్తుల కొలతలు, బయోమెట్రిక్ నమూనాలను సేకరించే అధికారం పోలీసులు, జైలు వార్డెన్లకు కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అంతకుముందు ఈ బిల్లుపై చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ విజయసాయిరెడ్డి తూర్పారబట్టారు. నాడు కాంగ్రెస్ పాల్పడిన దుశ్చర్యల కారణంగానే తాను ఈ బిల్లును సమర్థిస్తున్నట్లు చెప్పారు. 2007లో సంఝౌతా ఎక్స్ప్రెస్లో, 2008లో అస్సాంలో, 2010లో పుణెలో బాంబు పేలుళ్లు, 2011లో ముంబైపై కసబ్ ముఠా దాడులు.. ఇలా దేశాన్ని నివ్వెరపరచిన ఈ ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కానీ నేడు మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరుతున్నారుగా.. మరి హోం మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించారు..’ అని చిదంబరాన్ని ప్రశ్నించారు. చిదంబరం చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవి తప్పుడు పనులు అని పేర్కొన్నారు. చిదంబరం, గులాంనబీ ఆజాద్ కలసి తనపై, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. అలాంటి దుష్టచింతన కలిగిన చిదంబరం బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉదాశీనత కారణంగానే ఉగ్రవాదులు రెచ్చిపోయారని చెప్పారు. దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలతో గడపాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రపంచం దృష్టిలో నాడు భారత్ బలహీనమైన దేశంగా ముద్రపడిందన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన తర్వాత టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని చెప్పారు. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న పొరుగు దేశంపై సర్జికల్ దాడులు చేయడానికి కూడా మోదీ వెనుకాడలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అనుసరించిన విధానాల వల్ల దేశ భద్రతపై ప్రజల్లో మళ్లీ విశ్వాసం కలిగిందని ప్రశంసించారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి ప్రసంగానికి విపక్షాలు అంతరాయం కలిగించడంతో హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సహచర సభ్యుడు మాట్లాడుతుంటే వినే ఓపిక, సహనం లేకపోతే ఎలా అని అమిత్షా ప్రశ్నించారు. మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షా సూచించారు. దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపండి మహిళలపై జరిగే అత్యాచారం కేసుల్లో నిందితులను త్వరితగతిన శిక్షించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లును తక్షణమే ఆమోదించాలని హోంమంత్రి అమిత్షాకు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శిక్షలు పడుతున్న కేసులు తక్కువ విజయసాయిరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎప్పుడో 1920లో చేసిన ఈ చట్టానికి మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేపట్టడం ఎంతైనా అవసరమని చెప్పారు. ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు హోంమంత్రి అమిత్షాను అభినందిస్తూ 2020 నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో వివిధ నేరాలకు పడుతున్న శిక్షల శాతాన్ని వివరించారు. మర్డర్ కేసుల్లో 40 శాతం, రేప్ కేసుల్లో 39 శాతం, హత్యాయత్నం కేసుల్లో 24 శాతం నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. శిక్షలు పడిన కేసుల శాతం ఇంత తక్కువగా ఉండటానికి కారణం నేరస్తులను శిక్షించే బలమైన ఆధారాల సేకరణకు పోలీసుల వద్ద తగిన ఉపకరణాలు లేకపోవడమేనని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో శిక్షలు పడుతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయన్నారు. యూకేలో 2020–21లో 83.6 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అమెరికాలో 93 శాతం, జపాన్లో 99 శాతం నేరాలకు తగిన శిక్షలు పడ్డాయని చెప్పారు. సమర్థమైన విచారణకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్స్, సిస్టమ్స్ ఎంతైనా అవసరమన్నారు. నేరస్తుల వేలి, కాలిముద్రల సేకరణ అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నదేమీ కాదని, అనేక క్రిమినల్ కేసుల్లో వాటిని సాక్ష్యాలుగా వినియోగించుకున్న సందర్భాలున్నాయని చెప్పారు. ఉదాహరణకు 2013లో బుద్ధగయలో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఘటనాస్థలంలో బౌద్ధభిక్షువు ధరించే వస్త్రం దొరికిందని, వస్త్రంలో దొరికిన వెంట్రుకలు బాంబు దాడికి పాల్పడిన నిందితుడి వెంట్రుకలకు సరితూగాయని గుర్తుచేశారు. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా అవే కీలక సాక్ష్యంగా మారాయన్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని మనం కచ్చితంగా వినియోగించుకుని తీరాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
Russia-Ukraine war: భీకర పోరు
మారియుపోల్/లెవివ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. రష్యా సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్తోపాటు ముఖ్య నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలనే కాదు, సాధారణ నివాస గృహాలను కూడా విడిచిపెట్టడం లేదు. కీవ్, మారియుపోల్లో పరిస్థితి భీతావహంగా మారింది. కాల్పుల మోత ఆగకపోవడంతో పౌరుల తరలింపు సాధ్యం కావడంలేదు. నీరు, ఆహారం, అత్యవసర ఔషధాలు అందక జనం హాహాకారాలు చేస్తున్నారు. ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మారియుపోల్లో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోయింది. రాజధాని కీవ్ చుట్టూ రష్యా సైన్యం మోహరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడొల్యాక్ చెప్పారు. కీవ్పై రష్యా సైన్యం చాలావరకు పట్టు సాధించిందని తెలిపారు. రాజధానిని ప్రత్యర్థుల కబంధ హస్తాల నుంచి కాపాడుకొనేందుకు జనం సిద్ధమవుతున్నారని వెల్లడించారు. పశ్చిమ ఉక్రెయిన్లోని లెవివ్ నగర సమీపంలో ఉన్న యారోవివ్ సైనిక శిక్షణా కేంద్రంపై ఆదివారం ఉదయం రష్యా గగనతల దాడుల్లో 35 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు. పోలండ్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న యారోవివ్ మిలటరీ రేంజ్పై రష్యా సైన్యం రాకెట్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. దీన్ని యారోవివ్ ఇంటర్నేషనల్ పీస్కీపింగ్, సెక్యూరిటీ సెంటర్గానూ పిలుస్తారు. అమెరికా సైనికాధికారులు ఇక్కడ ఉక్రెయిన్ సైన్యానికి స్వయంగా శిక్షణ ఇస్తుంటారు. ఈ మిలటరీ రేంజ్లో నాటో దేశాల సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి. అయితే, యారోవివ్ శిక్షణా కేంద్రంలో మాటువేసిన 180 మంది విదేశీ కిరాయి సైనికులను హతమార్చామని, విదేశీ ఆయుధాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఉక్రెయిన్కు మరో 20 కోట్ల డాలర్లు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్కు ఆయుధ సాయం అందజేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్కు ఆయుధాలు తెచ్చే నౌకలను పేల్చేస్తామని వెల్లడించింది. నకిలీ రిపబ్లిక్లను సృష్టిస్తే సహించం తమ దేశాన్ని ముక్కలు చేయడానికి రష్యా తమ భూభాగంలో నకిలీ రిపబ్లిక్లను సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. డొనెట్స్క్, లుహాన్స్క్ తరహా అనుభవాలను పునరావృతం కానివ్వబోమన్నారు. ఖేర్సన్ ప్రాంతాన్ని రిపబ్లిక్గా మార్చేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. మానవతా కారిడార్ల ద్వారా 1,25,000 మందిని దేశం నుంచి క్షేమంగా బయటకు పంపించామని వివరించారు. మరో మేయర్ను అపహరించిన రష్యా! దినిప్రొరుడ్నె నగర మేయర్ యెవ్హెన్ మాట్వెయెవ్ను ఆదివారం రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటికే మెలిటోపోల్ సిటీ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ను రష్యా సైన్యం అపహరించినట్లు వార్తలు రావడం తెలిసిందే. భారత ఎంబసీ పోలండ్కు మార్పు ఉక్రెయిన్లో పరిస్థితులు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్లోని తన రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) పొరుగు దేశం పోలండ్కు తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించింది. రాజధాని కీవ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ సిబ్బంది ఇప్పటికే లెవివ్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా దాడుల్లో అమెరికా జర్నలిస్టు మృతి ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఇర్పిన్లో రష్యా దాడుల్లో ప్రఖ్యాత ‘ద న్యూయార్క్ టైమ్స్’లో పనిచేసిన బ్రెంట్ రెనాడ్(51) మృతి చెందినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ పత్రిక ఆదివారం వెల్లడించింది. మరో ఇద్దరు అమెరికా జర్నలిస్టులు గాయపడ్డారని తెలియజేసింది. అమెరికాకు చెందిన బ్రెంట్ రెనాడ్ సినీ దర్శకుడిగానూ పని చేస్తున్నారు. నాటో జోలికొస్తే ప్రతిదాడులే: అమెరికా ఉక్రెయిన్–నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా దాడులకు దిగితే ప్రతిదాడులు చేస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై జేక్ సలీవన్, చైనా విదేశాంగ విధానం సీనియర్ సలహాదారు యాంగ్ జీచీ సోమవారం రోమ్లో చర్చలు జరుపనున్నారు. గూగుల్ ఉన్నతాధికారులకు బెదిరింపులు పుతిన్కు వ్యతిరేకంగా ఓట్లను నమోదు చేసే ఒక యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని రష్యా అధికారులు గూగుల్ మహిళా ఉన్నతాధికారిని బెదిరించారు. ఈ యాప్ను 24 గంటల్లో తొలగించకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించడంతో కంపెనీ ఆమెను ఒక హోటల్కు తరలించింది. కానీ కేజీబీ ఏజెంట్లు అక్కడకు వచ్చి మరోమారు బెదిరించారని తెలిపింది. దీంతో స్మార్ట్ ఓటింగ్ యాప్ గంటల్లో ప్లేస్టోర్ నుంచి మాయమైంది. తనకు ఇలాంటి బెదిరింపులే తమకూ వచ్చాయని యాపిల్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉక్రెయిన్తో చర్చల్లో పురోగతి: రష్యా ఇరుదేశాల మధ్య యుద్ధంపై ఉక్రెయిన్తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి లభించిందని రష్యా తరపు ప్రతినిధి లియోనిడ్ స్లట్స్కీ ఆదివారం చెప్పారు. చర్చల ప్రారంభం నాటితో పోలిస్తే ఇప్పుడు స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్–రష్యా ప్రతినిధుల మధ్య బెలారస్ సరిహద్దులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు ఇలాగే సానుకూల ధోరణితో కొనసాగితే రెండు దేశాల నడుమ ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని స్లట్స్కీ వివరించారు. ఆశ్రయమిస్తే నెలకు 350 పౌండ్లు ఉక్రెయిన్ శరణార్థులకు ఇళ్లల్లో ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తే నెలకు 350 పౌండ్లు చొప్పున భత్యం అందజేస్తామని యూకే హౌసింగ్ సెక్రెటరీ మైఖేల్ గోవ్ చెప్పారు. కనీసం 6 నెలలపాటు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఎంతోమంది ప్రాణభయంతో తరలివస్తున్నారని, ఒక్కొక్కరి అవసరాలను తీర్చడానికి గాను స్థానిక కౌన్సిళ్లకు 10 వేల పౌండ్లుచొప్పున ఇస్తామన్నారు. శరణార్థులకు వైద్య సేవలు, వారి పిల్లల స్కూళ్ల ఫీజులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఆసక్తి ఉన్నవారు సోమవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. శరణార్థులు మూడేళ్లపాటు ఉండొచ్చని తెలిపారు. -
విచారణ వేగవంతం చేయాలి
న్యూఢిల్లీ: ముంబైపై 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్ర దాడుల గాయాలు ఇంకా దేశాన్ని వెంటాడుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులపై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని వీడి విచారణను వేగవంతం చేయాలన్నారు. 26/11 దాడులు జరిగి శుక్రవారానికి 13 ఏళ్లు పూర్తికావడంతో అందులో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ కొత్త పద్ధతులు, కొత్త విధానాలు అనుసరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ దౌత్యవేత్తని పిలిచి గట్టి హెచ్చరికలే జారీ చేసింది. ముంబై దాడులపై విచారణను త్వరితగతిని పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. ‘26/11 బాధితులు 13 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. పాక్ భూభాగం నుంచే ఈ దాడులకు కుట్ర జరిగింది. అక్కడ్నుంచే దాడులకు తెగబడ్డారు. 15 దేశాలకు చెందిన 166 కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ కాస్తయినా నిజాయితీగా వ్యవహరించి కుట్రదారులను శిక్షించాలి’ అని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ముంబై దాడుల బాధితులకు న్యాయం జరిగే వరకు పాక్పై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని ఒక ప్రకటనలో పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ భూ భాగం నుంచే దాడులకు కుట్ర జరిగినట్టు అంగీకరించిన విషయాన్ని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. -
బుర్కినా ఫాసోలో ఉగ్రదాడి.. 19 మంది మృతి..
బుర్కినా ఫాసో(ఆఫ్రికా): ఆఫ్రికా దేశమైన బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ దాడులలో 19 మంది అమాయకులు మృతి చెందారు. వీరిలో 9 మంది భద్రత దళాలున్నట్లు సమాచారం. సెంటర్ నార్త్ రీజియన్లో జరిగిన ఈ దాడిలో ఆసుపత్రిని ముష్కరులు కాలబెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థల మధ్య ఘర్షణల కారణంగా బుర్కినాఫాసోలో హింస రోజురోజుకి పెరుగుతుంది. దీంతో వేలాది మంది అమాయకులు మరణిస్తున్నారు. ఇప్పటివరకు 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
దేశ చరిత్రలో అది చీకటి రోజు: మోదీ
చెన్నై: రెండేళ్ల క్రితం ఉగ్రమూకలు దొంగలాగా దాడిచేసి 40 మంది భారత జవానులను పొట్టన పెట్టుకున్న రోజు దేశ చరిత్రలో చీకటి రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14 న దాదాపు 2500 మంది సీఆర్పీఎఫ్ దళాలు 78 బస్సుల్లో జమ్ముకశ్మీర్ నుంచి శ్రీనగర్కు బయలుదేరారు. జైషే మహమ్మద్ కు చెందిన ఆత్మహుతి దళాలు సీఆర్పీఎఫ్ బస్సుపై దాడిచేశారు. ఆ ఘటనలో 40 మంది అసువులు బాశారు. తమిళనాడులో పర్యటనలో భాగంగా మోదీ.. ఆరోజు ఘటనను గుర్తుచేసుకొని వారికి ఘననివాళుర్పించారు. ఈ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ మరవదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపనలు చేశారు మోదీ. ఈ క్రమంలోనే స్వదేశీ పరిజ్జానంతో అభివృద్ధి చెందిన అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంక్ (మార్క్1ఎ)ను చెన్నైఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణేకు అందజేశారు. భారత్ ఉన్న రెండు రక్షణ కారిడర్లలో ఒకటి తమిళనాడులో ఉంది. దీనికి 8,100 కోట్లను ప్రాథమికంగా నిర్ణయించారు.వీటితోపాటు 9 కిలోమీటర్ల పొడవుగల చెన్నై మెట్రోతోపాటు, రెండు రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపను చేశారు. మద్రాస్లో ఐఐటీ క్యాంపస్ నిర్మాణానికి వెయ్యికోట్లవుతొందని కూడా అంచనావేశారు. దీనితోపాటు అనైకట్ కెనాల్ పునర్నిర్మాణ పనులకు కూడా ప్రారంభించారు. -
లండన్ వీధుల్లో బిన్ లాడెన్ ప్రతినిధి
సాక్షి, న్యూఢిల్లీ : 1998లో జరిపిన టెర్రరిస్టు దాడుల్లో 224 మంది మరణానికి కారణమై అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న దివంగత అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు అధికార ప్రతినిధి అయిన 60 ఏళ్ల అదెల్ అబ్దెల్ బేరీ ప్రస్తుతం లండన్ వీధుల్లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా ఎంబసీ కార్యాలయాలపై టెర్రరిస్టులు ఆగస్టు నెలలో జరిపిన వరుస బాంబు దాడుల్లో 224 మంది మరణించగా, 72 మంది గాయపడ్డారు. లండన్లోని తలదాచుకున్న అబ్దెల్ను బ్రిటన్ పోలీసులు 1999లో అరెస్ట్ చేసి, 2012లో అమెరికాకు అప్పగించారు. ఆయన అమెరికా కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. (చదవండి: ట్రంప్ రికార్డ్.. 130 ఏళ్లలో తొలిసారి) నాటి నుంచి న్యూజెర్సీలోని డిటెన్షన్ సెంటర్లో ఉన్న అబ్దెల్ బాగా లావు అవడంతోపాటు అస్థమాతో బాధ పడుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ అమెరికా ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న నేటి పరిస్థితుల్లో అయిన్ని సురక్షితంగా ఓ గదిలో నిర్బంధించడం తమ వల్ల కాదని డిటెక్షన్ సెంటర్ అధికారులు చేతులెత్తేయడంతో ఆయనకు ముందుగా క్షమాభిక్ష ప్రసాదించి మంగళవారం నాడు విడుదల చేశారు. ఆయన ఆ మరుసటి రోజు బుధవారం నాడే లండన్కు చేరుకున్నారు. మెయిడా వలేలోని తన ఫ్లాట్కు చేరుకున్నారు. 9.8 కోట్ల రూపాయల విలువైన ఆ ఫ్లాట్లో ఆయన భార్య రగా (59 ఏళ్లు) నివసిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన తన భార్యను కలసుకున్నారు. జన్మతా ఈజిప్షియన్ అయిన అబ్దెల్కు 1991 బ్రిటన్ ఆశ్రయం లభించింది. ఇప్పుడు ఆయన్ని వెనక్కి పంపించుదామంటే అమెరికా అధికారులు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అటు ఈజిప్టుకు పంపిద్దామంటే మానవ హక్కుల సమస్య ఉత్పన్నం అవుతుందని బ్రిటన్ అధికారులు ఆందోళన పడుతున్నారు. మళ్లీ ఆయన టెర్రరిస్టు కార్యాకలాపాలవైపు వెళ్లకుండా ఆయనపై నిఘా కొనసాగించే విషయంలోనూ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. -
దేశంలో పాగాకు అల్కాయిదా కుట్ర
న్యూఢిల్లీ/కోల్కతా: భారత్లో వేళ్లూనుకునేందుకు నిషేధిత అల్కాయిదా ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బట్టబయలు చేసింది. కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులు, కొందరు ముఖ్యులను చంపేందుకు సాగుతున్న యత్నాలను భగ్నం చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళలలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి ఈ ముఠాలోని 9 మందిని అరెస్ట్చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు, రాష్ట్రాలు పోలీసుల సాయంతో 18, 19 తేదీల్లో కేరళ, బెంగాల్లలో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. ముర్షీద్ హసన్, ఇయాకుబ్ బిశ్వాస్, మొసారఫ్ హొస్సేన్ అనే వారిని కేరళలోని ఎర్నాకులంలోను, నజ్ముస్ సకిబ్, అబూ సుఫియాన్, మైనుల్ మొండల్, లియు ఈన్ అహ్మద్, అల్ మమూన్ కమల్, అటిటుర్ రహ్మాన్లను ముర్షీదాబాద్లో అరెస్ట్చేశారు. ఈ ముఠాకు హసన్ నేతృత్వం వహిస్తున్నాడని చెప్పారు. కేరళలో పట్టుబడిన వారూ బెంగాల్ వాసులే. 11న అల్కాయిదా మాడ్యూల్పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా ఈ ఆపరేషన్ను చేపట్టింది. అరెస్టయిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్లోని అల్ కాయిదా ఉగ్రవాదుల బోధనల ప్రభావానికి లోనయ్యారు. ఢిల్లీ సహా దేశంలోని కీలకప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిపి భారీగా ప్రాణనష్టం కలిగించేందుకు, ప్రముఖులను చంపేందుకు పథకం వేశారు. ఇందుకు అవసరమైన డబ్బుతోపాటు ఆయుధాలు..ఆటోమేటిక్ రైఫిళ్లు, పిస్టళ్లు, పేలుడు పదార్థాల కోసం కశ్మీర్తోపాటు ఢిల్లీ వెళ్లాలని ఈ ముఠా పథకం వేసింది. అంతేకాకుండా, కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్కాయిదా నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. టపాసులను ఐఈడీ(ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)గా మార్చేందుకు ఈ ముఠా ప్రయత్నిం చిందని సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న స్విచ్చులు, బ్యాటరీలను బట్టి తేలిందని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. దాడుల్లో జిహాదీ సాహిత్యం, కొన్ని ఆయుధాలు, దేశవాళీ తయారీ తుపాకులు, స్థానికంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, పేలుడు పదార్థాల తయారీని తెలిపే సమాచారం, డిజిటల్ పరికరాలు లభించాయి. ఆరుగురికి 24 వరకు రిమాండ్ పశ్చిమబెంగాల్లో అరెస్టు చేసిన అల్కాయిదా ముఠాలోని ఆరుగురు సభ్యులకు కోల్కతాలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. బాంబుల తయారీ కేంద్రం బెంగాల్: గవర్నర్ ధన్కర్ పశ్చిమ బెంగాల్కు చెందిన అల్కాయిదా ఉగ్ర ముఠా సభ్యులను ఎన్ఐఏ అరెస్టు చేయడంపై రాష్ట్ర గవర్నర్ ధన్కర్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బాంబుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారిందని ధన్కర్ ఆరోపించారు. శాంతి, భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, డీజీపీ ఇందుకు బాధ్యత వహించకతప్పదని పేర్కొన్నారు. -
అస్సాం రైఫిల్స్పై ఉగ్రవాదుల దాడి
దిస్పూర్: మణిపూర్లో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో అస్సాం రైఫిల్స్కు చెందిన ముగ్గురు సైనికులు మరణించగా..మరో ఆరుగురు గాయపడ్డారు. చందేల్ జిల్లాలో స్థానిక పీపుల్స్ లిబరేషన్ పార్టీకి చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడినట్టు సమాచారం. ఉగ్రవాదులు తొలుత ఐఈడీతో దాడి చేసి ఆపై అస్సాం రైఫ్సిల్ సైనికులపై కాల్పులు జరిపారు. ఘటన జరిగిన ప్రాంతం మణిపూర్ రాజధాని ఇంఫాల్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘటనా ప్రాంతానికి అదనపు బలగాలను తరలించామని అధికారులు వెల్లడించారు. -
‘అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు’
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం అందినట్లు జమ్మూ కశ్మీర్ భద్రతా అధికారులు తెలిపారు. కుల్గాంలోని నాగర్-చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నాలుగు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (24 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టుల హతం) ‘అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. వారి దాడులను అడ్డుకోవడానికి తగిన సైనిక వ్యవస్థ, వనరులు ఉన్నాయి. యాత్రను శాంతియుతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాము’ అని బ్రిగేడియర్ వివేక్ సింగ్ ఠాకుర్ తెలిపారు. అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా సాగడానికి భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహదారి 44ను అమర్నాథ్ యాత్రికులు ఉపయోగించుకుంటారని తెలిపారు. -
కరోనా కాలంలో పాక్ కుట్రలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వర్తమానంలో సైతం కశ్మీర్కు ఉగ్రవాద బెడద తప్పలేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల మోత ఆగలేదు. ఒకపక్క పాకిస్తాన్ కరోనాతో నానా యాతన పడుతోంది. అయినా తన కుటిల ఎత్తుగడల్ని యధావిధిగా కొనసాగిస్తోంది. ఉత్తర కశ్మీర్ లోని హంద్వారా మండలం పరిధిలోని గ్రామం వద్ద 16 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఎన్ కౌంటర్లో ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు ఆదివారం మన సైన్యానికి చెందిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, జవాన్లు నాయక్ రాజేష్, లాన్స్ నాయక్ దినేశ్లతోపాటు ఎస్ఐ సాగిర్ అహ్మద్ క్వాజీ పఠాన్ కన్నుమూశారు. ఆ మర్నాడు అదే హంద్వారా ప్రాంతంలోని మరో గ్రామంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి మరో ముగ్గురిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ రెండు దాడుల వెనకా పాక్ సైన్యం కుట్రే వుంది. గత నెలలోనే నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద అది పలుమార్లు కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పం దాన్ని ఉల్లంఘించింది. ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించడమే లక్ష్యంగా తరచు ఈ పని చేస్తోంది. గత నెల 5న ఎల్ఓసీ పొడవునావున్న ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో పాకిస్తాన్ వైపు నుంచి మన దేశంలో ప్రవేశించిన అయిదుగురు ఉగ్రవాదుల్ని మన జవాన్లు గుర్తించి కాల్చిచంపారు. అప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో అయిదుగురు సైనిక కమాండోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మన దేశాన్ని చికాకు పరచడానికి పాకిస్తాన్ ఇంకా అనేకానేక ఎత్తుగడలకు పాల్పడుతోంది. సైనిక పరంగా మాత్రమే కాక సాంకేతిక రంగంలోనూ భారత్పై అది కత్తి కట్టింది. మన దేశం కరోనా కట్టడి కోసమని రూపొందించిన ఆరోగ్యసేతు యాప్కు అది నకిలీని రూపొందించి సైబర్ ప్రపంచంలో వదిలిందని ఇటీవలే వెల్లడైంది. ఇరుగు పొరుగు దేశాల మధ్య ఘర్షణలు ముదిరితే వాటి పర్యవసానంగా రెండు దేశాలూ దెబ్బతింటాయి. పైగా కరోనా మహమ్మారి చుట్టుముట్టిన ఈ తరుణంలో ఘర్షణలకు దిగడం వల్ల ఆ వ్యాధి నియంత్రణ చర్యలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం సాధ్యం కాదు. పాకిస్తాన్ కూడా కరోనా బాధిత దేశమే అయినా, దాన్నుంచి బయటపడటానికి కొట్టుమిట్టాడుతున్నా అక్కడి సైన్యానికి భారత్ను చికాకు పరచడమే ప్రధాన లక్ష్యం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో సైన్యాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాల నుంచి ఎంతో కొంత ప్రయత్నం జరిగేది. కొన్నిసార్లు అది లొంగకతప్పేది కాదు. ఇప్పుడు పాక్ సైన్యానికి ఆ బాధ లేదు. ప్రస్తుతం ప్రధానిగావున్న ఇమ్రాన్ ఖాన్ వారి చలవతో గద్దెనెక్కిన వ్యక్తే. ఆయన పని తీరు ఎలావుంటున్నదో చెప్పడానికి మార్చి 15న జరిగిన సార్క్ అధినేతల వీడియో కాన్ఫరెన్సే నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ఆ కాన్ఫరెన్స్కు ఇమ్రాన్ తప్ప అన్ని దేశాల నేతలూ హాజరయ్యారు. కరోనా కట్టడిలో అనుసరిం చాల్సిన వ్యూహం గురించి, సభ్య దేశాల మధ్య వుండాల్సిన సహకారం గురించి అందులో చర్చిం చారు. మన దేశం తన వంతుగా ఏమేం చేయదల్చుకున్నదో తెలిపింది. పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ తరఫున ఒక అధికారి హాజరయ్యారు. ఆయన కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించకుండా కశ్మీర్ సమస్యను లేవనెత్తారు. ఆ తర్వాత గత నెల 10న జరిగిన సమావేశంలో సైతం అది వితండవాదన చేసింది. ఏం చేసినా సార్క్ చట్రం పరిధిలోనే చేయాలి తప్ప ఎవరో ఒకరు చొరవ తీసుకుని చేయడం కుదరదని వాదించింది. ఏకాభిప్రాయం వస్తే తప్ప ఏదీ చేయకూడదన్న నిబంధన విధించాలన్నదే ఈ వ్యూహంలోని ఎత్తుగడ. ఆ తర్వాత భారత్ ప్రతిపాదించే ఏ చర్యకైనా మోకాలడ్డవచ్చని అది భావించింది. ఇతర సభ్య దేశాలన్నీ మన ప్రతిపాదనకు అంగీకారం తెలిపి, సమష్టిగా పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో చేసేది లేక సమావేశం నుంచి పాక్ నిష్క్రమించింది. సంక్షోభ సమయాల్లో సైతం పాకిస్తాన్ పోకడ ఎలా వుంటుందో చెప్పడానికి సార్క్ అధినేతల వీడియో కాన్ఫరెన్స్లో అది వ్యవహరించిన తీరు, ఎల్ఓసీ వద్ద అది యధేచ్ఛగా సాగిస్తున్న కాల్పులు నిదర్శనం. ఉగ్రవాదుల దుశ్చర్యకు లక్ష్యంగా మారిన 21 రాష్ట్రీయ రైఫిల్స్(ఆర్ఆర్) అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. కశ్మీర్లో హంద్వారా సెక్టార్ దేశ భద్రత రీత్యా ఎంతో కీలకమైనది. ఆ ప్రాంతంనుంచే పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసీ వద్ద ఉగ్రవాదుల్ని సరి హద్దులు దాటిస్తుంటుంది. కల్నల్ అశుతోష్ శర్మ ఆధ్వర్యంలో మన జవాన్లు అక్కడ ఈమధ్య కాలంలో ఎన్నో విజయాలు సాధించారు. అక్కడ ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించే ప్రత్యేక దళాలు(ఎస్ఎఫ్) నాలుగేళ్లక్రితం పాకిస్తాన్ గడ్డపై వున్న ఉగ్రవాద స్థావరాలను సర్జికల్ దాడుల్లో ధ్వంసం చేశాయి. హఠాత్తుగా దాడి మొదలైనప్పుడు, అప్పటికప్పుడు అంచనా వేసుకుని ఎదురుదాడికి పాల్పడవలసివస్తుంది. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు నష్టాలు సంభవించడానికి ఆస్కారం వుంటుంది. ఈ తరహా ఆపరేషన్లలో కమాండింగ్ ఆఫీసర్(సీవో) ఎక్కడోవుండి ఆదేశాలివ్వడంకాక, ముందుండి తన దళాలను నడిపించవలసివుంటుంది. అక్కడ చావుకీ, బతుక్కీ మధ్య వెంట్రుకవాసి దూరం మాత్రమే వుంటుంది. సీవోగా వున్న కల్నల్ శర్మ హంద్వారా ప్రాంతంలో అలాంటి నాయకత్వ పటిమనే ప్రదర్శించారు. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటి ల్లకుండా అక్కడినుంచి ఖాళీ చేయించగలిగారు. కానీ ఆ క్రమంలో ఆయన, ఆయన సహచరులు నేలకొరిగారు. ఇతర కమాండోలు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టగలిగారు. ఉగ్రవాదులద్వారా మన దేశాన్ని చికాకు పరుస్తూ ఎప్పటికైనా పైచేయి సాధించగలనని పాకిస్తాన్ పగటి కలలు కంటోంది. దాని కుట్రలను వమ్ము చేస్తూనే, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకి చేయడమే మన కర్తవ్యం కావాలి. -
ఉగ్రవాదానికీ ఊతమిచ్చిన బాబ్రీ ఘటన!
బాబ్రీ మసీదు కూల్చివేతకు పూర్వమూ కొన్ని మతఘర్షణల దాఖలాలున్నాయి. కానీ బాబ్రీ తరువాత కొన్ని ఉగ్రవాద ఘటనలూ చోటుచేసుకున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ తనదైన ఆజ్యం పోయడం పరిస్థితి విషమించడానికి దారితీసింది. ఈ సంఘటన తరువాత దాన్ని కారణంగా చూపిస్తూ ఉగ్రమూకలు తెగబడిన దాడులు తక్కువేమీ కాదు.. 1993 ముంబై దాడులు.. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుట్ర పన్ని అమలు చేసిన పేలుళ్లు 1993 మార్చి 12న 257 మందిని బలిగొన్నాయి. మధ్యాహ్నం 1.30 నుంచి 3.40 గంటల మధ్యకాలంలో ముంబైలోని 12 చోట్ల కార్లు, స్కూటర్లలో బాంబులుంచి పేల్చేశారు. బాంబు ధాటికి ఓ డబుల్ డెక్కర్ బస్సు పూర్తిగా ధ్వంసమైపోగా ఈ ఒక్క ఘటనలోనే దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. జస్టిస్ పి.డి.కోడే సుమారు 100 మందిని దోషులుగా నిర్దారించారు. 2006లో ప్రత్యేక టాడా కోర్టు... టైగర్ మెమన్తోపాటు అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని దోషులుగా తేల్చింది. ముంబై, కేరళ, హైదరాబాద్లలోనూ... పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2006 జూలై 11న ముంబైలోని ఓ రైల్లో బాంబు పేలుళ్లకు తెగబడటంతో 187 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక స్థానిక ముస్లింలున్నట్లు విచారణలో తేలింది. కేరళలో ఏర్పాటైన అల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడగా.. సంస్థ నాయకుడు సయ్యద్ అహ్మద్ భాషాకు జీవిత ఖైదు విధిస్తూ 2007లో కోర్టు తీర్పునిచ్చింది. అల్ ఉమాపై నిషేధం విధించారు కూడా. బాబ్రీ కూల్చివేత తరువాత ఉగ్రవాదం వైపు మళ్లిన మరో సంస్థ దీన్దార్ అంజుమన్. యూపీలో ఏర్పాటైన సిమీలో ఒకదశలో దేశవ్యాప్తంగా 400 మంది పూర్తిస్థాయి కార్యకర్తలు, ఇరవై వేల మంది సభ్యులు ఉండేవారని, 30 ఏళ్ల వయసులోపు వారైన వీరు పలు ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, కొన్నింటిని అమలు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. సిమీ అధ్యక్షుడైన మెకానికల్ ఇంజనీర్, జర్నలిస్టుగానూ పనిచేసిన సఫ్దర్ నాగోరీ 2008లో అరెస్ట్ కావడంతో సంస్థ కార్యకలాపాలు దాదాపుగా సమసిపోయాయి. 2006 నుంచి దేశంలో అత్యంత చురుకుగా పనిచేసిన ఉగ్రవాద సంస్థల్లో ఇండియన్ ముజాహిదీన్ ఒకటి. యూపీ న్యాయస్థానాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. 2008 నాటి ముంబై దాడుల కోసం లష్కరే తోయిబా తరఫున ఐఎం రెక్కీ కూడా నిర్వహించినట్లు వార్తలున్నాయి. -
కొలంబోలో మళ్లీ బ్లాస్ట్.. సూసైడ్ బాంబర్లలో మహిళ!
కొలంబో: శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు భద్రతా బలగాలు జల్లెడ పడుతుండగా.. మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా కొలంబోలో మరో పేలుడు సంభవించింది. స్థానిక సవోయ్ థియేటర్ వద్ద ఉగ్రవాదులు డియో బైక్లో బాంబులు అమర్చి పేల్చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బైక్ అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్నప్పటికీ.. ఎవరూ గుర్తించకపోవడం భద్రతా లోపాన్ని స్పష్టంచేస్తోంది. ఐసిస్ ఈసారి బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికా నిఘా వర్గాలు శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అమెరికన్ ఇంటలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగానే.. ఉదయం 10.50గంటల సమయంలో సవోయ్ థియేటర్ ఎదుట పేలుడు సంభవించింది. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చి మసీదుల్లో పేలుళ్లకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు జరిపినట్టు ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే తెలిపారు. మరో ఇద్దరిని బడా వ్యాపారవేత్త మహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం కుమారులుగా గుర్తించారు. 33 ఏళ్ల ఇమ్సాత్ కొలంబోలోని సిన్నమన్ గ్రాండ్ హోటల్లో, 31ఏళ్ల ఇల్హామ్.. షాంగ్రిల్లా హోటల్లో పేలుళ్లకు తెగబడినట్టు వెల్లడైంది. ఈస్టర్ సండే రోజు వరుస దాడులతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పోలీసులు, త్రివిధ దళాలు ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. 359కి చేరిన మృతుల సంఖ్య శ్రీలంకలో ఈస్టర్ సండేరోజు జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 359కి చేరింది. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుల కోసం జరుపుతున్న గాలింపు చర్యలు ముమ్మరంగా సాగినట్లు పోలీసు అధికార ప్రతినిధి గుణశేఖర తెలిపారు. మంగళవారం రాత్రి మరో 18 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పవరకు పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య 60కి చేరింది. అలాగే మరిన్ని దాడులు జరిపేందుకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం అందడంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లంక ప్రధాని రనిల్ విక్రమసింఘే పిలుపునిచ్చారు. దాడులకు సంబంధించి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు శ్రీలంకను ముందే హెచ్చరించింది. మూడు సార్లు ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా ధ్రువీకరించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. హైదరాబాద్కు భౌతికకాయం శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో హైదరాబాద్ అమీర్పేటకు చెందిన ఒకరు మృతిచెందారు. మణికొండకు చెందిన బిల్డర్ మాకినేని శ్రీనివాస్, ఆయన బంధువు వేమూరి తులసీరామ్ స్నేహితులతో కలిసి ఐదురోజుల క్రితం శ్రీలంక సమ్మర్ ట్రిప్కు వెళ్లారు. శ్రీలంక హోటల్లో ఉన్న సమయంలో జరిగిన బాంబు దాడిలో తులసీరామ్ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాస్కు గాయాలయ్యాయి. ముష్కరుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తులసీరాం భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చారు. కొలంబో నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. -
లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే
కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ను అభివృద్ధి చేసింది. -
‘ఆమె ఇక రాదు.. నువ్వు ఇంటికి వెళ్లు’
క్రైస్ట్చర్చ్ : బంగ్లాదేశ్కు చెందిన హుస్నా తన 19 ఏట ఫరీద్ అహ్మద్ను వివాహం చేసుకుని తొలిసారి న్యూజిలాండ్ గడ్డ మీద అడుగు పెట్టింది. గత పాతికేళ్లుగా వారిద్దరు ఎంతో అన్యోనంగా జీవిస్తూ.. ప్రేమ, సంతోషం అనే పునాదుల మీద ఓ అందమైన పొదరింటిని నిర్మించుకున్నారు. మాతృ దేశాన్ని విడిచి.. న్యూజిలాండ్లో అడుగు పెట్టిన నాటి నుంచి దాన్నే తన సొంత ఇంటిగా భావించి.. ప్రేమించింది హుస్నా. ఆర్నెళ్లు గడిచేలోపే ఇంగ్లీష్ నేర్చుకుంది. కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంది. భర్తకు అన్ని వేళలా చేదోడువాదోడుగా నిలుస్తూ.. కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేది. ఫరీద్ ఇంట్లోనే హోమియోపతి మందుల దుకాణాన్ని నడుపుతుండేవాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. వారి అన్యోన్యతను చూసి విధికి సైతం కన్ను కుట్టింది. అందుకే ఉగ్రదాడి రూపంలో వారి పాతికేళ్ల దాంపత్య జీవితాన్ని ముక్కలు చేసింది. ఎప్పటిలానే దైవ ప్రార్థనల నిమిత్తం మసీదుకెళ్లిన హుస్నాను మరణం ఉన్మాది రూపంలో వెంటాడింది. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం పూట న్యూజిలాండ్లోని మసీదుల్లో నరమేధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత వారం జరిగిన ఈ దారుణ సంఘటనలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. ఇలా మరణించిన వారిలో ఫరీద్ భార్య హుస్నా కూడా ఉన్నారు. ప్రార్థనల నిమిత్తం మసీదుకు వెళ్లినప్పుడు.. జరిగిన నరమేధంలో ఉగ్రవాది హుస్నాను ఫుట్పాత్ మీదనే కాల్చేశాడు. గతంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా వీల్ చైర్కే పరిమితమైన ఫరీద్ మసీదులో కాకుండా బయట ఉండే చిన్న గదిలో ప్రార్థనలు చేసుకుంటుండటం వల్ల ఈ దారుణం నుంచి తప్పించుకోగలిగాడు. పేలుళ్ల శబ్దం వినిపడగానే సంఘటనా స్థలానికి వచ్చిన ఫరీద్కు అతని స్నేహితులు, ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు కనిపించాయి. కొందరు గాయాలతో బాధపడుతుండగా.. మరి కొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. వారిలో హుస్నా కూడా ఉన్నారు. జరిగిన దారుణం అర్థం కావడానికి కాస్త సమయం పట్టింది ఫరీద్కు. ఈ లోపు ఒక స్త్రీ వచ్చి.. ‘మీ భార్య ఇక ఎన్నటికి తిరిగి రారు. మీరు రాత్రంతా ఇక్కడే వేచి ఉండటం వల్ల ఎటువంటి లాభం లేదు. ఇంటికి వెళ్లండి’ అని చెప్పింది. ఆ మాట వినగానే మూగ బోయాడు ఫరీద్. తన ప్రపంచమే కుప్పకూలిపోయిందంటూ విలపించాడు. (‘క్షమించండి.. మేము అలాంటి వాళ్లం కాదు’) జరిగిన దారుణం గురించి ఫరీద్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు హుస్నా మాటలు, నవ్వులతో కిలకిలలాడే నా ఇళ్లు ఈ రోజు మూగబోయింది. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని నేను క్షమిస్తున్నాను. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి, అతనిలానే ఆలోచించే అతని స్నేహితులకు నేనిచ్చే సందేశం ఇదే. ఇప్పటికి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని కౌగిలించుకుని.. మీ ముఖంలోకి చూస్తూ.. నా మనస్పూర్తిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేను ఇప్పటికి.. ఎప్పటికి మిమ్మల్ని ద్వేషించను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక తన భార్య గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నాకు తల్లి, తండ్రి, నేస్తం. ఇతరుల మేలు కోరే వ్యక్తి తను. వేరొకరి జీవితాన్ని కాపాడ్డం కోసం ఆమె చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది’ అంటూ భార్యను తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యాడు ఫరీద్. ఈ నరమేధానికి పాల్పడిన వారిలో ఒకరిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెటంన్ టారంట్(28)గా గుర్తించారు పోలీసులు. (చదవండి : ‘అతని పేరును ఎవరూ పలకరాదు’) -
‘అతని పేరును ఎవరూ పలకరాదు’
క్రైస్ట్చర్చ్ : ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారంట్(28) అనే ఉగ్రవాది ఇటీవల న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో కాల్పులకు పాల్పడి దాదాపు 50 మంది అమాయకులకు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై న్యూజిలాండ్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్ ప్రసంగించారు. ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్లో మరణహోమం సృష్టించిన ఉగ్రవాది పేరును తాను ప్రస్తావించబోనని తేల్చి చెప్పారు. ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి అనైతికంగా ప్రవర్తించి బీభత్సం సృష్టించాడని, అతని పేరును తాను ఎప్పుడూ ప్రస్తావించనని చెప్పారు. దేశ ప్రజలు కూడా అతని పేరును ఉచ్చరించొద్దని కోరారు. కాల్పుల్లో ప్రాణాలను కోల్పోయిన వారి పేర్లను బయటకు చెప్పండి కానీ.. ఆ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి పేరును ఎక్కడ ఉచ్చరించకూడదని చెప్పారు. అతనో ఉగ్రవాది, క్రిమినల్, తీవ్రవాది అని, తాను మాట్లాడుతున్నప్పుడు అతని పేరును ప్రస్తావించబోనన్నారు. దేశంలోని చట్టాల ప్రకారం అతన్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. జాత్యహంకారంతో ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి గత శుక్రవారం న్యూజిలాండ్లోని అల్ నూర్, లిన్వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దురాగతం మొత్తాన్ని వీడియో తీస్తూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. వీడియో ప్రకారం దుండగుడు మసీదు పక్కన కారు పార్కు చేసి తుపాకీ తీశాడు. కారుడిక్కీలోంచి మరో గన్ తీసుకుని మసీదులోకి నడిచాడు. ద్వారం వద్ద ఉన్న ఓ వ్యక్తిని కాల్చాడు. అక్కడి నుంచి రైఫిల్తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మసీదులోపలికి వెళ్లాడు. కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. (న్యూజిలాండ్లో నరమేధం) -
న్యూజిలాండ్లో నరమేధం
క్రైస్ట్చర్చ్: ప్రపంచంలోనే ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్లో మారణహోమం. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం న్యూజిలాండ్లోని మసీదుల్లో నరమేధం చోటుచేసుకుంది. క్రైస్ట్చర్చ్ సిటీలోని రెండు మసీదులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 9 మంది భారతీయుల జాడ తెలీడంలేదని న్యూజిలాండ్లోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. ఈ దాడి ఉగ్రవాద చర్యేనని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ధ్రువీకరించారు. కాల్పులు జరిగిన అల్ నూర్ మసీదు, లిన్వుడ్ అవెన్యూ మసీదుల మధ్య దూరం దాదాపు ఐదు కిలోమీటర్లు కాగా, రెండు చోట్లా కాల్పులు వేర్వేరు సమయాల్లో చోటుచేసుకున్నాయి. దీంతో రెండు మసీదుల్లో కాల్పులు జరిపింది ఒక్క ఉగ్రవాదేనా లేక ఇద్దరున్నారా అన్న విషయంపై స్పష్టతరాలేదు. కాగా, కాల్పుల ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు త్రుటిలో తప్పించుకుంది. వారంతా అల్నూర్ మసీదుకు బస్సులో వెళ్తుండగా, బస్ మసీదు వద్దకు చేరాక, ఆటగాళ్లు ఇంకా బస్లో ఉండగానే కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి: ప్రధాని జసిండా న్యూజిలాండ్లో ముస్లింలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని తెలుస్తోంది. ప్రధాని జసిండా మాట్లాడుతూ ‘ఇది ఉగ్రవాద దాడేనన్న విషయం స్పష్టమవుతోంది. న్యూజిలాండ్కు అత్యంత చీకటిరోజుల్లో ఇదొకటి. ఇది పక్కాగా ప్రణాళిక రచించి జరిపిన దాడి’ అని చెప్పారు. ఎంత మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ తాము ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని జసిండా వెల్లడించారు. రెండు భారీ పేలుడు పరికరాలను మిలిటరీ గుర్తించి నిర్వీర్యం చేసిందన్నారు. ఇది అసాధారణ, ఎవరూ ఊహించని హింసాత్మక ఘటన అని ఆమె పేర్కొన్నారు. అల్ నూర్ మసీదు వద్ద 41 మంది, లిన్వుడ్ అవెన్యూ మసీదు వద్ద ఏడుగురు చనిపోయారనీ, ఇంకొకరు ఎక్కడ చనిపోయిందీ స్పష్టత లేదని పోలీసులు చెప్పారు. ముందు జాగ్రత్తగా న్యూజిలాండ్లో శుక్రవారం ముస్లింలెవరూ మసీదులకు వెళ్లవద్దని పోలీసులు కోరారు. 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు కాల్పుల ఘటన తర్వాత మొత్తం 9 మంది భారతీయులు లేదా భారత సంతతి ప్రజల ఆచూకీ గల్లంతయిందని న్యూజిలాండ్లోని భారత హై కమిషన్ కార్యాలయం వెల్లడించింది. అయితే ఇంకా అధికారిక సమాచారమేదీ రాలేదని తెలిపింది. భారత హై కమిషన్ అక్కడి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందనీ, కాల్పుల ఘటన వల్ల అక్కడ ఎవరైనా భారతీయులు ఏ రకంగానైనా ప్రభావితులయ్యుంటారని అనుమానం ఉంటే వారి బంధువులు నేరుగా భారత హై కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశాంగ శాఖ కోరింది. ఇందుకోసం 021803899, 021850033 అనే రెండు హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ చెప్పారు. మోదీ దిగ్భ్రాంతి.. న్యూజిలాండ్ ప్రధానికి లేఖ న్యూజిలాండ్లో కాల్పుల ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చే వారిని భారత్ ఖండిస్తోందని మోదీ పునరుద్ఘాటించారంది. కష్టకాలంలో న్యూజిలాండ్కు సంఘీభావం తెలుపుతూ ఆ దేశ ప్రధాని జసిండాకు మోదీ ఓ లేఖ రాశారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘భిన్నత్వంతో కూడిన ప్రజాస్వామ్య సమాజాల్లో హింస, ద్వేషాలకు తావు లేదు. ఈ ఘటనతో నష్టపోయిన కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారంది. మనుషులని ఎలా పిలుస్తారు?: ఆస్ట్రేలియా ప్రధాని రెండింటిలో ఒక మసీదు వద్ద కాల్పులు జరిపింది తమ దేశంలో పుట్టిన వాడేనని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. ఇలాంటి ద్వేష, హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని మనుషులని ఎలా పిలుస్తారో తనకు అర్థం కాదని ఆయన అన్నారు. ఈ ఘటనలో అతని పాత్రపై విచారణ ప్రారంభమైందని మారిసన్ చెప్పారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వలసదారులంటే ద్వేషం.. యూరప్ దాడులతో కలత! సిడ్నీ: మసీదు నరమేధంలో పాల్గొన్న వ్యక్తిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టర్రంట్(28)గా అధికారులు గుర్తించారు. వలసదారుల్ని తీవ్రంగా ద్వేషించే బ్రెంటన్, యూరప్లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులతో కలత చెందాడని తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడని వ్యాఖ్యానించారు. గతంలో ఆస్ట్రేలియాలోని గ్రాఫ్టన్ సిటీలో ‘బిగ్ రివర్ జిమ్’లో పర్సనల్ ట్రైనర్గా బ్రెంటన్ పనిచేశాడు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. బ్రెంటన్ తండ్రి రోడ్నీ(49) కేన్సర్తో 2010లో కన్నుమూశారు. స్కూలు పూర్తిచేశాక బ్రెంటన్ 2009–11 మధ్యకాలంలో జిమ్ ట్రైనర్గా చేశాడు. తర్వాత ‘బిట్కనెక్ట్’ అనే క్రిప్టోకరెన్సీ ద్వారా నగదును సమీకరించి ప్రపంచమంతా పర్యటించాడు. ఇందులో భాగంగా ఆసియా, యూరప్లోని పలుదేశాలను సందర్శించాడు. పశ్చిమయూరప్ పర్యటనలో ఉండగా 2017లో ఐసిస్ ఉగ్రమూకలు చేపట్టిన దాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని బ్రెంటన్ నిర్ణయించుకున్నాడు. ప్రపంచంలోనే మారుమూల ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్ కూడా సురక్షితం కాదని చాటిచెప్పేందుకే నిందితుడు ఈ దారుణానికి తెగబడినట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే న్యూజిలాండ్కు భారీగా వలసలు సాగుతుండంపై బ్రెంటన్ ఆగ్రహంతో రగిలిపోయినట్లు అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్లో హత్యలు చాలా అరుదుగా జరుగుతాయి. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం న్యూజిలాండ్లో 2017లో 35 హత్యలు జరిగాయి. అలాగే తుపాకీ హత్యలు కూడా చాలా అరుదుగా జరుగుతాయని నివేదిక పేర్కొంది. ఘటనాస్థలివద్ద రక్తమోడుతున్న జహంగీర్, కాల్పుల్లో గాయపడ్డ ఫరాజ్ (ఫైల్) ఇద్దరు హైదరాబాదీలకు గాయాలు తీవ్రంగా గాయపడ్డ జహంగీర్కు వెంటనే శస్త్రచికిత్స సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ క్రైస్ట్చర్చిలో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఇద్దరు చిక్కుకున్నారు. మహమ్మద్ జహంగీర్ (49) అక్కడ హోటల్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జహంగీర్కు శరీరంలో బుల్లెట్లు దిగాయి. అతనికి ఆదివారం శస్త్రచికిత్స చేయనున్నారని న్యూజిలాండ్ అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 15 ఏళ్ల క్రితమే న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ జహంగీర్ ఈ ఏడాదిలో రెండుసార్లు హైదరాబాద్కు వచ్చాడు. జనవరి 19న ఒకసారి, అదేనెల 30వ తేదీన మరోసారి హైదరాబాద్కు వచ్చాడు. ఈమేరకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ విభాగపు స్టాంపులు కూడా ఆయన పాస్పోర్టుపై ముద్రించి ఉన్నాయి. ఇదే దుర్ఘటనలో టోలీచౌకీ నదీమ్ కాలనీకి చెందిన హసన్ ఫరాజ్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. ఘటన జరిగిన సమయంలో ఫరాజ్ అక్కడ నమాజ్ చేయడానికి వెళ్లినట్లు స్నేహితులు చెబుతున్నారు. 9 ఏళ్ల క్రితం ఉన్నతవిద్య కోసం ఫరాజ్ న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డాడు. సాయం చేయండి: అసదుద్దీన్ ఒవైసీ మహమ్మద్ జహంగీర్ను కలుసుకునేందుకు వెంటనే వారి కుటుంబ సభ్యులను అనుమతించాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విదేశాంగ శాఖ, ఆ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. జహంగీర్ సోదరుడు ఇక్బాల్ న్యూజిలాండ్ వెళ్లేందుకు సొంతంగా అన్ని ఖర్చులూ భరించుకుంటాడనీ, వెంటనే వీసా మాత్రం ఇప్పించి సాయం చేయాలని ఒవైసీ కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్ తప్పకుండా జహంగీర్ కుటుంబ సభ్యులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాల్పులు జరుపుతూ ఫేస్బుక్ లైవ్ కాల్పులు జరిపిన ఆస్ట్రేలియా వ్యక్తి ఈ దురాగతం మొత్తాన్ని వీడియో తీస్తూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. శుక్రవారం ఉదయమే తాను జరపబోయే కాల్పుల గురించి 74 పేజీల ‘మేనిఫెస్టో’ను దుండగుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కాగా, శరీరంపై కెమెరా అమర్చుకుని ప్రార్థనలు చేసుకుంటున్న వారిని ఒక్కో గదిలోకి వెళ్తూ దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. వీడియో ప్రకారం దుండగుడు మసీదు పక్కన కారు పార్కు చేసి తుపాకీ తీశాడు. కారుడిక్కీలోంచి మరో గన్ తీసుకుని మసీదులోకి నడిచాడు. ద్వారం వద్ద ఉన్న ఓ వ్యక్తిని కాల్చాడు. అక్కడి నుంచి రైఫిల్తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మసీదులోపలికి వెళ్లాడు. కాల్పులకు భయపడి పరుగులు తీస్తున్న జనంపై బులెట్ల వర్షం కురిపించాడు. దుండగుడు పోస్ట్ చేసిన మేనిఫెస్టోకు ‘ది గ్రేట్ రిప్లేస్మెంట్’అని పేరు పెట్టాడు. ఫ్రాన్స్లో ఆవిర్భవించిన కుట్ర సిద్ధాంతమే ఈ ది గ్రేట్ రిప్లేస్మెంట్. దీని ప్రకారం స్వస్థలాల్లో ఎక్కువ జనన రేటు ఉన్న వలసదారులు వచ్చి యూరోపియన్లను వెళ్లగొడుతున్నారని నమ్ముతారు. ఫ్రెంచ్ నేత మారిన్ లె పెన్ 2017 ఎన్నికల్లో ఓడిపోవడం, 2017లో స్టాక్హోం ట్రక్ దాడిలో 11 ఏళ్ల ఎబ్బా అకర్లాండ్ బాలిక మరణం తనను అతివాదిగా మార్చాయని పేర్కొన్నాడు. కాల్పులు జరిగిన కొద్ది సేపటికే దుండగుడి ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం ఖాతాలను తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది. -
బాధను భరిస్తూ కూర్చోం
టోంక్ (రాజస్తాన్): ఉగ్రవాద దాడుల బాధను భరిస్తూ కూర్చునే ప్రభుత్వం తమది కాదనీ, తప్పక ప్రతీకారం ఉంటుందని ప్రధాని∙మోదీ అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దళాలు వాటి పని అవి పూర్తి చేస్తాయన్నారు. ప్రభుత్వ పోరాటం కశ్మీర్ కోసమే తప్ప కశ్మీర్కు వ్యతిరేకంగానో లేక కశ్మీరీలపైనో కాదని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో కశ్మీరీ యవతీ యువకులు ప్రభుత్వంతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని మనతోనే ఉంచుకోవాలి తప్ప వారిపై ఎవరూ దాడులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాద దాడి తర్వాత దేశంలో అక్కడక్కడ కశ్మీరీలపై దాడులు జరిగినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో మోదీ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం అంతానికే తాము పోరాడుతున్నామనీ, చేతులు ముడుచుకుని కూర్చోబోమని అన్నారు. రాజస్తాన్లోని టోంక్లో బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదం అనే ఫ్యాక్టరీ నడుస్తున్నంత కాలం ప్రపంచంలో శాంతి నెలకొనదు. ఆ ఫ్యాక్టరీని నేనే అంతం చేయాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దాడి తర్వాత మనలో ఎంత కోపం, ప్రతీకారం రగులుతున్నాయో మీరు చూస్తున్నారు. మన కొత్త విధానాల వల్ల పాకిస్తాన్ కష్టాలను ఎదుర్కొంటోంది. ఇది కొత్త ఇండియా. మేం బాధను భరిస్తూ నోర్మూసుకుని కూర్చునే రకం కాదు’ అంటూ పాక్ను మోదీ పరోక్షంగా హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా సైనికులు కోరుతున్న ఒక ర్యాంకు, ఒక పెన్షన్ని తమ ప్రభుత్వం అమలు చేసిందనీ, 20 లక్షల మంది విశ్రాంత సైనికులకు రూ. 11 వేల కోట్ల పాత బకాయిలను చెల్లించిందని చెప్పారు. పాక్ ప్రధాని మాట నిలబెట్టుకుంటారా? ‘ఇమ్రాన్ ఖాన్ పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైనప్పుడు మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పా. ఇన్నాళ్లూ పోట్లాడుకున్నామనీ, ఇకపై చేతులు కలిపి పేదరికం, నిరక్షరాస్యతలను రూపుమాపేందుకు కృషి చేద్దామని కోరా. అందుకు ఆయన ఒప్పుకుంటూ తాను పఠాన్ల కుమారుడిననీ, అబద్ధాలు చెప్పనని అన్నారు. మరి ఆ మాటను ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటారో లేదో చూడాలి’ అని మోదీ అన్నారు. ‘మన దేశంలో నివసిస్తున్న కొందరు ప్రజలు పాకిస్తాన్ భాషలో మాట్లాడటం నన్ను బాధిస్తుంది. మీరు ఏమైనా చేయండి, మోదీని పదవి నుంచి దింపేయండి అని పాకిస్తాన్కు వెళ్లి చెప్పొచ్చేది వీళ్లే. ముంబైలో ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి సమాధానం ఇవ్వలేని వాళ్లే వీళ్లు’ అని మోదీ కాంగ్రెస్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘ఉగ్రవాద చర్యల్లో కశ్మీర్లోని పాఠశాలలు తగలబడి పోకుండా చూసుకోవాలని గతంలో కశ్మీర్ సర్పంచ్లను కోరా. తమ ప్రాణాలైనా అడ్డుపెట్టి పాఠశాలలు తగలబడకుండా అడ్డుకుంటామని హామీనిచ్చారు. రెండేళ్లలో ఒక్క పాఠశాల కూడా కశ్మీర్ లోయలో నాశనం కాలేదని చెప్పడానికి గర్వపడుతున్నా’ అన్నారు. స్వాగతించిన నేషనల్ కాన్ఫరెన్స్ కశ్మీరీలపై దాడులను నిరసిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాలు స్వాగతించారు. దాడులను ఖండించడంలో మోదీ ఆలస్యంగా స్పందించారనీ, ఇప్పటికైనా దాడులు వద్దంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని స్వాగతిస్తున్నామని ఓ ప్రకటన ద్వారా వారు తెలిపారు. అయితే మాటల్లో చెప్పడం కాకుండా దాడులను నివారించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతికి బదులు అత్యధిక వృద్ధి రేటు ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ వాణిజ్య సదస్సులోనూ మోదీ మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పాలనలో అవినీతిలో పోటీ ఉండేదనీ, ఇప్పుడు తమ ప్రభుత్వం 1991 నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక సగటు వృద్ధి రేటును, అత్యల్ప సగటు ద్రవ్యోల్బణాన్ని సాధించిందని మోదీ చెప్పారు. ఇండియాను 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చేందుకు తమ ప్రణాళికలను మోదీ వివరించారు. -
‘రక్షణ’లో పెట్టుబడులకు స్వాగతం
సాక్షి, బెంగళూరు: ప్రధాని మోదీ ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం మరింత విజయవంతమయ్యేలా వైమానిక రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని సంస్థలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. బుధవారం బెంగళూరులోని యలహంక వాయుసేన స్థావరంలో ఐదురోజుల అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా, 2019’ను నిర్మల ప్రారంభించారు. రక్షణ రంగంలో పరికరాల తయారీ కోసం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)కు కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు. ఇందులో 600 దేశీయ, 400 విదేశీ సంస్థలు పాల్గొన్నాయి. అత్యాధునిక యుద్ధ, పౌర విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించాయి. పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధం ఉగ్రవాదులు దాడులతో భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని నిర్మల అన్నారు. పాకిస్తాన్తో యుద్ధమే వస్తే అందుకు కూడా సైనికులు సిద్ధమేనని చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో యుద్ధ విమానాలు, ఆయుధాలు, రక్షణరంగ పరికరాలను కొనుగోలుకు సంబంధించి భారత రక్షణశాఖ రూ. 1,27,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుందన్నారు. 2 వేల పౌర విమానాలు అవసరం ప్రతీ భారతీయుడికి విమాన సేవలను అందిం చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు విమానయాన మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. దేశానికి 2000కుపైగా పౌర విమానాల అవసరముందన్నారు. దేశంలో 235 నగరాలకు విమానసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎయిర్పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్పోర్ట్ల కోసం 65 బిలియన్ డాలర్లను ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాల అధిపతులు, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఉన్నతాధికారులు, వందలాది మంది సందర్శకులు హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా రఫేల్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న రఫేల్ యుద్ధవిమానం ఎయిర్షోలో సందర్శకుల మనసు దోచుకుంది. మంగళ వారం సూర్యకిరణ్ విన్యాసవిమానాలు ఢీకొన్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్, పైలట్ సాహిల్ గాంధీకి నివాళిగా తక్కువ ఎత్తులో, తలకిందులుగా ప్రయాణించింది. షోలో డకోటా విమానం, ధృవ్, హాక్, హెచ్టీటీ40 తదితర విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాలతో సందర్శకులు అలరించాయి. -
ఇండోనేసియాలో ఉగ్రదాడి
సురబయ: ఇండోనేసియాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన సురబయలోని మూడు చర్చిలపై ఆత్మాహుతిదళ ఉగ్రవాదుల దాడిలో 13 మంది మృతిచెందగా.. 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ మహిళ, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఇండోనేసియాలో మైనారిటీలైన క్రిస్టియన్లపై కొంతకాలంగా దాడులు జరుగుతున్నప్పటికీ.. 2000 తర్వాత వీరిపై ఉగ్రదాడి జరగటం ఇదే తొలిసారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. సురబయలోని సాంటామారియా రోమన్ కేథలిక్ చర్చిపై ఉదయం 7.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) తొలిదాడి జరిగింది. ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులతోపాటు నలుగురు మృతిచెందారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే సమీపంలోని క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ డిపొనెగొరోలో రెండో ఉగ్రదాడి జరిగింది. వెంటనే మాంగెరలోని పెంతెకోస్ట్ చర్చ్పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఘటన గురించి తెలియగానే ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సురబయ చేరుకుని బాధితులకు అందుతున్న వైద్యసేవలను సమీక్షించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐసిస్ పేర్కొంది. ఉగ్రవాదులంతా ఒకే కుటుంబం వారే ఈ మూడు దాడుల్లో ఆరుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. దాడులకు పాల్పడిన ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని.. ఇందులో ఇద్దరు బాలికలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కూతుళ్లు (9, 12 ఏళ్లు), ఇద్దరు యువకులు ఈ దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. ఈ కుటుంబమంతా ఇటీవలే సిరియానుంచి తిరిగి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది. నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత ఆదివారం తెల్లవారుజామున వెస్ట్ జావా టౌన్స్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు కాల్చిచంపారు. మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు నిరసనగానే దాడి జరిగి ఉంటుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అరెస్టయిన వారు ఇండోనేసియాలో దాడులకు పాల్పడుతున్న జేఏడీ సభ్యులని సమాచారం. -
రెడీ.. యాక్షన్
26/11.. ప్రపంచం మరచిపోలేని రోజు.. 2008 నవంబర్ 26 భారతదేశ ప్రజలు భయబ్రాంతులయిన రోజు. పాకిస్తాన్కు చెందిన పదిమంది ముష్కరులు అరేబియా సముద్ర జలాల నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మారణ హోమం సృష్టించారు. ప్రతి భారతీయుడు మరిచిపోలేని ఘట్టం. 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. 304 మంది గాయాలపాలయ్యారు. ఆ మారణ హోమంలో స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా అశువులు బాశారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన పది నక్షత్రాల తాజ్ మహల్ హోటల్లో జరిగిన 60 గంటలపాటు మిలటరీ ఆపరేషన్. ఇది భారతదేశ చరిత్రలో రక్తంతో రాజుకున్న పుటలు. అలాంటి పరిస్థితులు ఇక ఎన్నడూ దేశంలో ఏ ఒక్కచోట జరుగకూడదన్నది భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం. అందులో భాగంగా తీర ప్రాంతంలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు. అప్పుడప్పుడు సాగర్ కవచ్ పేరుతో తీర ప్రాంతంలో అప్రమత్తం. నిఘా నీడలో రెండు రోజులపాటు జిల్లాలోని తీర ప్రాంతాన్ని జల్లెడ పట్టనున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు నిర్వహణకు జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు రెండు రోజులపాటు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఒంగోలు క్రైం: జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం పోలీస్ నిఘా నీడలో కట్టుదిట్టమైన భద్రత నడుమ అప్రమత్తం చేస్తున్నారు. సాగర్ కవచ్ పేరుతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. అటు గుంటూరు జిల్లా సరిహద్దు మొదలుకొని ఇటు నెల్లూరు జిల్లా సరిహద్దు చేవూరు వరకు సముద్ర తీరాన్ని పోలీసులు తమ కనుసన్నల్లోకి తీసుకున్నారు. అటు పోలీసులతో పాటు తీర ప్రాంతంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేసేవిధంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులపాటు తీరం వెంబడి పోలీస్ కసరత్తు ప్రారంభించారు. బుధవారం తెల్లవారు జాము 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రత్యేక పహారా, కట్టుదిట్టమైన భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సన్నద్ధమయింది. తీరం వెంబడి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లు రెండు ఉన్నాయి. ఒకటి కొత్తపట్నం కాగా రెండోది రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లు. ఆ రెండు పోలీస్ స్టేషన్ల పోలీసులతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా పోలీస్ బృందాలను కేటాయించింది. అందుకుగాను తీరం వెంబడి ఉన్న పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు వాటికి సంబంధించిన పోలీస్ సర్కిళ్ల ఇన్స్పెక్టర్లను కూడా జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు అప్రమత్తం చేశారు. ఇటు జిల్లాకు ఈశాన్య సరిహద్దులోని చీరాల రూరల్ పోలీస్స్టేషన్ మొదలుకొని దక్షిణం వైపున ఉన్న కందుకూరు సర్కిల్ వరకు పోలీస్ అధికారులు మొదలుకొని సిబ్బంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని నిఘా చేపట్టనున్నారు. చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ మొదలుకొని ఈపూరు పాలెం, వేటపాలెం, చిన్నగంజాం, నాగులుప్పలపాడు, ఒంగోలు తాలూకా, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బందోబస్తు.. సాగర్ కవచ్ కోసం సముద్ర తీరం వెంబడి గ్రామాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం 160 మంది పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీరం వెంబడి 102 కిలో మీటర్ల మేర 8 చెక్ పోస్ట్లు, 18 ల్యాండింగ్ పాయింట్లు, 12 పోలీస్ బీట్లు, 10 పోలీస్ పికెట్లు, ఐదు క్విక్ రీయాక్షన్ టీంలను సిద్ధం చేశారు. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలే లక్ష్యం.... ముష్కరులు ప్రజలను తద్వారా ప్రభుత్వాలను భయబ్రాంతులను చేసేందుకు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుంటారు. అందుకోసం సాగర్ కవచ్లో భాగంగా పోలీసులు 10 పోలస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని పరిపాలనా కేంద్రం వద్ద ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒంగోలు రైల్వే స్టేషన్ , ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రిమ్స్ ఆస్పత్రి, సూరారెడ్డిపాలెం, అమ్మనబ్రోలు, కరవది, సింగరాయకొండ, టంగుటూరు రైల్వే స్టేషన్లు, సింగరాయకొండ బస్టాండ్లో పికెట్లు ఏర్పాటు చేశారు. -
తొక్కిస్తున్నారు
► చవకగా... తేలికగా ► వాహనంతో దాడులకు ఉగ్రసంస్థల మొగ్గు ‘సాధ్యమైనంత ఎక్కువగా ప్రాణనష్టం కలిగించడం... అదీ పెద్దగా వ్యూహరచన అవసరం లేకుండా, అత్యంత చవకగా’ అనేది ఇప్పుడు ఉగ్ర సంస్థల లక్ష్యంగా మారింది. ఒకప్పుడు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి, ఎంతోమందిని దాడిలో భాగస్వాములను చేసి... రెక్కీలు నిర్వహించి, పక్కా ప్రణాళికతో దాడులు చేసి విధ్వంసం సృష్టించేవారు. ఎక్కడ, ఏ రోజు, ఏ సమయానికి దాడికి తెగబడాలనే దాన్ని ముందే నిర్ణయించుకునే వారు. భారీ ప్రాణనష్టం కలిగించడం ద్వారా పాశ్చాత్యులను భయభ్రాంతులకు గురిచేసేవారు. కానీ ఇప్పుడు పంథా మారింది. ఓ పికప్ (సరుకు రవాణా) వాహనాన్ని అత్యంత వేగంగా నడుపుతూ జనాన్ని తొక్కించడమే. ఉగ్రవాద సంస్థలు ఈ తరహా దాడులకు మొగ్గడం వెనుక పలు అనుకూలతలు ఉన్నాయి. బార్సిలోనా దాడి నేపథ్యంలో అవేమిటో చూద్దాం... కనిపెట్టే అవకాశం ఉండదు... రైళ్లలో, బస్సుల్లో, స్టేడియాల్లో లేదా ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో బాంబులు పెట్టాలంటే... వాటిని గుట్టుగా రవాణా చేయాలి. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ లాంటి చోట్ల మెటల్ డికెట్లర్లు, సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంటుంది. కాబట్టి బాంబులను అనుకున్న చోటకు చేర్చడం కష్టం. మానవ బాంబులుగా మారి దాడి చేద్దామన్నా ఇదే పరిస్థితి. పైగా బాంబులను తయారుచేయడం, రవాణా... రిస్క్తో కూడుకున్నవి. ఏమాత్రం తేడా వచ్చినా... పేలిపోతారు. కుట్ర భగ్నం చేయడం కష్టం... సాధారణంగా నిఘా వ్యవస్థలు ఉగ్ర కదలికలపై గట్టి నిఘా పెడతాయి. ఇంటర్నెట్పై, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే సంభాషణలపై కన్నేసి ఉంచుతాయి. ఫోన్ సంభాషణలపైనా నిఘా ఉంటుంది. ఆధునిక భద్రతా వ్యవస్థల కళ్లుగప్పి... ఐసిస్ ఆక్రమిత ప్రాంతం నుంచి యూరోప్ దేశాల్లోని తమ సానుభూతిపరులతో, ఉగ్రవాదులుగా మారిన వారితో సంప్రదింపులు జరపడం అంత తేలిక కాదు. ఇలా ప్రయత్నించే సందర్భాల్లో పలు ఉగ్రకుట్రలు భగ్నమవుతుంటాయి. అదే సానుభూతిపరులను ఒంటరిగా వాహనదాడులకు ప్రేరేపిస్తే... ఎలాంటి అవరోధాలు లేకుండా పని ఇట్టే పూర్తయిపోతుంది. భారీ ప్రాణనష్టం ద్వారా... విపరీతమైన ప్రచారం లభిస్తుంది. ఉగ్ర సంస్థల లక్ష్యం తేలికగా నెరవేరుతుంది. అందుకే ఉగ్రసంస్థలు తమ మాధ్యమాల ద్వారా ఇలా ఒంటరిగా దాడులు చేసే వారిని అమరయోధులుగా కీర్తిస్తూ ఆకాశానికెత్తుతున్నాయి. తద్వారా మరింత మందిని ఈ దిశగా ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాయి. శిక్షణ అక్కర్లేదు... ఉగ్రసంస్థలు తాము రిక్రూట్ చేసుకునే వారిని... తమ అనుకూల ప్రాంతాలకు రప్పించి శిక్షణ ఇస్తుంటాయి. తుపాకీ కాల్చడం, బాంబుల తయారీ, ఎవరికీ అనుమానం రాకుండా పనిచేసుకుపోవడం, సంభాషణల్లో వాడే కోడ్ భాష... తదితర అంశాల్లో శిక్షణ ఇస్తుంటాయి. అదే పికప్ వ్యాన్తో జనాన్ని తొక్కించాలంటే ఎలాంటి శిక్షణా అక్కర్లేదు. డ్రైవింగ్ తెలిస్తే చాలు. చవక... తేలిక బాంబుదాడుల్లో ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. అదే పికప్తో చేసే దాడి చాలా చవక. చేయాల్సిందల్లా ఓ వాహనాన్ని అద్దెకు తీసుకోవడం. పైగా చట్టవిరుద్ధం కూడా కాదు. జనంతో కిటకిటలాడే ప్రదేశానికి వెళ్లి విచక్షణారహితంగా వాహనాన్ని నడిపి భీభత్సాన్ని సృష్టించడం. ఖర్చుపరంగా ఇది చాలా చవక, అమలుపరంగా అత్యంత తేలిక. ఒకవేళ ముందుజాగ్రత్తగా ఇలాంటి వాహనాలను తనిఖీ చేసినా... నడుపుతున్న వ్యక్తి ఉద్దేశాన్ని పసిగట్టం అసాధ్యం. ఎలా మొదలైంది... పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో శత్రు శిబిరంలోకి చొచ్చుకెళ్లి పేల్చివేయడం... చాలా కాలంగా ఉంది. కానీ వాహనంతో గుద్దిచంపడాన్ని 2008లో ఇజ్రాయిలీలపై దాడికి పాలస్తీనియన్లు తొలుత ప్రారంభించారు. తర్వాత అల్ఖైదా, ఐసిస్లు వ్యతిరేకులపై దాడికి దీన్నో సమర్థ ఆయుధంగా వాడొచ్చని గుర్తించి ప్రచారం ప్రారంభించాయి. 2014లో ఐసిస్ మీడియా గ్రూపు ఎనిమిది నిమిషాల వీడియోను విడుదల చేసింది. పాశ్చాత్యులను, ఇస్లాంను అనుసరించని వారిని భయబ్రాంతులకు గురిచేయండి. ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో వారికి నిద్ర కూడా పట్టకూడదు. మనవారి కోసం పొరాడటానికి సిరియా, ఇరాక్లకు రానక్కర్లేదు. మీరున్న చోటే... మీ కార్లను ఆయుధాలుగా వాడండి. జనాన్ని కార్లతో తొక్కిచంపండి’ అని ఇందులో ఐసిస్ పిలుపిచ్చింది. తర్వాత ఈ తరహా దాడులు పెరిగాయి. డిసెంబరు 2014: ఫ్రాన్స్లోని నాంతెస్లో క్రిస్మస్ మార్కెట్లోకి ఒక వ్యాన్ దూసుకెళ్లింది. అలాగే డిజాన్లో ఓ కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ రెండు ఘటనల్లో 20 మంది గాయపడ్డారు. జులై 14, 2016: ఫ్రాన్స్లోని నైస్లో అత్యంత ఘోర దుర్ఘటన జరిగింది. ట్యునీషియా దేశస్థుడైన మహ్మద్ బౌహ్లెల్ ఓ భారీట్రక్కుతో జనంపైకి దూసుకెళ్లి ఏకంగా 86 మంది చావుకు కారణమయ్యాడు. వందమంది పైచిలుకు క్షతగాత్రులయ్యారు. ఉగ్రభావాలతో ప్రేరేపితుడైన బౌహ్లెల్ జనాన్ని ట్రక్కుతో తొక్కిస్తూ మైలు దూరం వెళ్లాక చివరికి పోలీసులు అతన్ని కాల్చిచంపారు. డిసెంబరు 19, 2016: బెర్లిన్లోని క్రిస్మస్ మార్కెట్లోకి ట్రాక్టర్ ట్రైలర్ను నడపి అనిస్ అమ్రీ (ట్యునీషియా) 12 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నాడు. యూరప్ను జల్లెడ పట్టిన పోలీసులు... ఘటన జరిగిన నాలుగురోజులకు అమ్రీని ఇటలీలోని మిలన్లో కాల్చిచంపారు. ఇతను ఐసిస్కు విధేయతను ప్రకటిస్తున్న వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది. మార్చి 22, 2017: లండన్లోని వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై నడిచి వెళుతున్న పాదచారులపైకి ఎస్యూవీని నడిపి నలుగురిని చంపిన ఖాలిద్ మసూద్... తర్వాత వాహనం ఆగిపోవడంతో... కిందకు దిగి ఓ పోలీసు అధికారిని పొడిచి చంపాడు. చివరకు పార్లమెంటుకు సమీపంలో భద్రతాబలగాలు ఇతన్ని కాల్చి చంపాయి. ఏప్రిల్ 7, 2017: స్వీడన్లోని స్టాక్హోమ్లో ఓ ఫుట్పాత్పైకి ట్రక్కును నడిపి ఐదుగురిని పొట్టనబెట్టుకున్నాడు ఉబ్జెకిస్థాన్కు చెందిన రఖ్మత్ అకిలోవ్. ఉగ్రదాడిగా నిందితుడు అంగీకరించాడు. జూన్ 3, 2017: లండన్ బ్రిడ్జిపై పాదచారులపైకి వ్యాన్ను నడిపి... తర్వాత దారినే పోయేవారిని కత్తులతో పొడిచారు ముగ్గురు తీవ్రవాదులు. ఈ దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. జూన్ 19, 2017: మసీదులో ప్రార్థన చేసుకువచ్చిన వారిపైకి డారెన్ ఓస్బోర్న్ అనే వ్యక్తి వ్యాన్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. నిందితుడిపై తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అనుమానం కూడా ఉంది. ఆగష్టు 17, 2017: బార్సిలోనాలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జనంపైకి ఓ వ్యాన్ దూసుకెళ్లింది. 13 మంది మృతి చెందగా, 100 మంది దాకా గాయపడ్డారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ముగిసిన పోలింగ్
మధ్యాహ్నానికి బ్రిటన్ ఫలితాలు లండన్: బ్రిటన్ పార్లమెంటుకు గురువారం పోలింగ్ ముగిసింది. మూడేళ్లు ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు భారీగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల మాంచెస్టర్, లండన్లలో ఉగ్రవాదుల దాడుల అనంతరం ఈ ఎన్నికలు జరుగుతుండటంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 2016లో బ్రెగ్జిట్ (ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలగడం)పై రెఫరెండంలో తీర్పు ఫలితంగా డేవిడ్ కామెరాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయగా, థెరిసా మే పీఠమెక్కారు. షెడ్యూల్ ప్రకారమైతే తర్వాతి ఎన్నికలు 2020లో జరగాల్సి ఉంది. అయితే పార్లమెంటులో తన బలం పెంచుకొని అనంతరం సమర్థవంతంగా బ్రెగ్జిట్ చర్చలను సాగించేందుకు థెరిసా మే మూడేళ్లు ముందుగానే ఎన్నికలకు పిలుపునిచ్చారు. థెరిసా మే తన భర్తతో కలిసి మెయిడెన్హెడ్ నియోజకవర్గంలోను, ఆమె ప్రత్యర్థి లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరిమే కార్బిన్ లండన్లోని హల్లొవేలోను ఓటు వేశారు. మొత్తం 40 వేల పోలింగ్ బూత్లలో 650 ఎంపీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. అధికారం చేపట్టాలంటే కనీసం 326 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. బ్రిటన్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 4.69 కోట్లు కాగా వీరిలో భారత సంతతి ఓటర్లు 15 లక్షల మంది ఉంటారని అంచనా. ఒపీనియన్ పోల్స్ అన్నీ థెరిసా మే గెలుస్తుందని అంచనా వేశాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. ఫలితాలపై భారీగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. -
భారత్లో దాడులకు కుట్ర.. ఎన్నారైకి జైలు
న్యూయార్క్: భారత్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులకు సహకరించిన బల్వీందర్ సింగ్ (42) అనే ప్రవాస భారతీయుడికి అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడైన సింగ్ భారత్లో దాడులకు కుట్ర పన్నినట్లు నిర్ధారణ కావడంతో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్డి లానీ హిక్స్ అతడికి శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చినట్లు యూఎస్ అటార్నీ డేనియల్ బోగ్డెన్ తెలిపారు. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం... పంజాబ్ ప్రాంతంలో స్వతంత్ర సిక్కు రాజ్యం స్థాపించే లక్ష్యంతో చేపట్టిన ఖలిస్థాన్ ఉద్యమంలో భాగంగా భారత్లో దాడులకు పాల్పడేందుకు బల్వీందర్ సింగ్, మరికొందరు 2013 అక్టోబర్– డిసెంబర్ మధ్య కుట్రపన్నారు. 2013 డిసెంబర్లో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బ్యాంకాక్ వెళ్తున్న అతడిని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. -
భారత్లో జాగ్రత్త!
తమ పౌరులకు ఇజ్రాయెల్ సూచన జెరూసలెం/న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాల పౌరులు, పర్యాటకులపై భారత్లో ఉగ్ర దాడుల అవకాశం ఎక్కువగా ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరించింది. ముఖ్యంగా భారత్లోని నైరుతి ప్రాంతంలో ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని కార్యాలయం, ఉగ్రవాద వ్యతిరేక దళం ఒక ప్రకటన విడుదల చేశాయి. ‘భారత్కు వెళ్లే ఇజ్రాయెల్ పర్యాటకులు ఎప్పటికప్పుడు స్థానిక మీడియా నివేదికలను, భద్రతా దళాల హెచ్చరికలపై దృష్టి సారించాలి. భారత్లో ఎవరైనా బంధువులు ఉంటే వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొని పర్యటించాలి. అలాగే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా బీచ్ పార్టీలు, క్లబ్లు లాంటి జనసంచారం ఎక్కువగా ఉండే చోట అప్రమత్తంగా ఉండాలి’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఇంకెంత మంది సైనికులు మరణించాలి?
న్యూఢిల్లీ: ‘దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో టెర్రరిస్టులకు, మిలిటెంట్లకు నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మన దేశ సరిహద్దులన్నీ పూర్తిగా సురక్షితం’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నవంబర్ 27వ తేదీ నాడు వ్యాఖ్యానించారు. ‘ఒక్కసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు కూడా భారత్లోకి అడుగు పెట్టేందుకు సాహసించరు’ అని 2014, ఏప్రిల్ నెలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ భూభాగంలోకి మన సైనికులు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు సూపర్గా చేశారని ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కిందిస్థాయి నుంచి పైస్థాయి నాయకత్వం వరకు చంకలు గుద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ నేడు నిజమే అయితే మంగళవారం నాడు జమ్మూకు సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగ్రోటాలోని భద్రతా బలగాల స్థావరంపై సరిహద్దులు దాటి వచ్చిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు? సర్జికల్ దాడులతోపాటు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కేవలం ప్రచార అస్త్రాలుగానే మిగిలిపోతున్నాయా? నగ్రోటాలో భద్రతా బలగాల స్థావరంపై సైనిక దళాలు జరిపిన దాడుల్లో ఇద్దరు అధికారులు, ఐదుగురు సైనికులు మరణించిన విషయం తెల్సిందే. ఈ ఒక్క నెలలోనే 11 మంది మరణించగా, గడిచిన మూడు నెలల్లో టెర్రరిస్టుల దాడులకు 40 మంది సైనికులు మరణించారు. పంజాబ్లోని గురుదాస్పూర్తో మొదలైన ఈ దాడులు పఠాన్కోట్, ఊడికి విస్తరించి, ఇప్పుడు నగ్రోటాకు పాకాయి. ఈ అన్ని దాడులు సూచిస్తున్న ఓ కామన్ పాయింట్నన్నా కేంద్ర ప్రభుత్వం పట్టుకుందా? అదే సైనికులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు దాడులను నిర్వహించడం. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.... నగ్రోటాలోని 16వ పటాలానికి కమాండింగ్ జనరల్ ఆఫీసర్గా గత అక్టోబర్ నెలలోనే బాధ్యతలు స్వీకరించిన లెఫ్ట్నెంట్ జనరల్ ఏకే శర్మకు వారం రోజుల క్రితమే పటాలంపై పెద్ద దాడి జరగబోతోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందట. వాస్తవానికి రెండో సిక్కు రిజిమెంట్ బెటాలియన్కు చెందిన శర్మకు తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అపారమైన అనుభవం ఉందట. అందుకనే ఈకొత్త విధులు అప్పగించారట. అయినా ఆయన తనకందిన సమాచారం ప్రకారం తన కిందిస్థాయి అధికారులందరికి అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారట. అయినా అన్ని చోట్ల లోపాలు.... నగ్రోట స్థావరంలోకి వచ్చిన తమిళ పటాలంకు అసలు ఆయుధాలే ఇవ్వలేదట. భోజన శాలకు సమీపంలో టెంటుల్లో పడుకున్న సైనికుల వద్ద ఎదురు కాల్పులు జరపడానికి ఆయుధాలే లేవట. ఎదురుకాల్పుల్లో చనిపోయింది ముగ్గురు ఉగ్రవాదులని, మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకుపోయారని కొందరు అధికారులు చెబుతుండగా, మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు చనిపోయారని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఎందుకీ సమన్వయ లోపం, లోపాలకు ఎవరు బాధ్యలు? పక్కా ప్రణాళిక ఎప్పుడు? పఠాన్కోట్ నుంచి ఊడి వరకు టెర్రరిస్టులు దాడులు జరిపినా, 40 మంది వీరులు మరణించినా పాలకులు ఎందుకు మేల్కోవడం లేదు? ఇలాంటి దాడులు పునరావతం కాకుండా పక్కా ప్రణాళికను ఎందుకు రచించడం లేదు ? సైన్యానికి, ప్రభుత్వానికే కాకుండా, ప్రభుత్వం పెద్దల మధ్యనే సమన్వయలోపం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పఠాన్కోట్ దాడిలో ఆరుగురు టెర్రరిస్టులు మరణించారని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించగా, ప్రభుత్వం నలుగురే దాడి చేశారని, ఆ నలుగురు మరణించారని నవంబర్ 29న పార్లమెంట్లో ప్రకటించింది. పాలకులు కేవలం ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, చిత్తశుద్ధితో పక్కావ్యూహంతో ముందుకు వెళ్లనంతా కాలం మన సైనిక వీరులు అన్యాయంగా మరణిస్తూనే ఉంటారు. పాలకులు నివాళులర్పించడం మినహా చేయగలిగిందీ ఏమీ ఉండదు. -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
భారతదేశ ద్రోహికి అమెరికాలో శిక్ష
రెనో: భారతీయుడై ఉండి అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందిన ఓ సిక్కు వ్యక్తి అమెరికాలో కటకటాల పాలయ్యాడు. అతడు భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు సహాయపడ్డాడని అక్కడి జిల్లా కోర్టు నిర్ధారించడంతో దాదాపు 15 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించనున్నాడు. బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు. ఇతడిది వాస్తవానికి పంజాబ్. ఖలిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పంజాబ్లో పేలుళ్లకు పాల్పడే కుట్రతోపాటు భారత అధికారులను హత్య చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అందుకు కావాల్సిన సామాగ్రిని కూడా అతడే పంపిణీ చేశాడు. తమ ప్రణాళిక అమలుకు సంబంధించి ఫోన్ ద్వారా మాట్లాడాడు. అయితే, కొన్నాళ్లుగా అతడి చర్యలను గమనించిన అమెరికా అధికారులు.. 2013 డిసెంబర్లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. దానికి సంబంధించి చివరి వాదోపవాదాలు మంగళవారం కోర్టు ముందుకు రాగా అతడు నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ‘భారత్ వంటి విదేశాల్లో ఉగ్రవాద దాడులతో హింసకు పాల్పడేందుకు, జన జీవితాన్ని చెదరగొట్టేందుకు బల్వీందర్ సింగ్ సహాయపడ్డాడు’ అని ఈ సందర్భంగా జడ్జీ స్పష్టం చేశారు. -
నదుల గుండా చొరబడి.. దేశంలో భారీ బ్లాస్ట్స్!
-
నదుల గుండా చొరబడి.. దేశంలో భారీ బ్లాస్ట్స్!
భారీ విధ్వంసానికి కుట్రపన్నిన లష్కరే ఉగ్రవాద దాడులు పొంచి ఉండటంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను భారీగా పెంచిన నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరో మార్గం మీదుగా దేశంలోకి ప్రవేశించి.. భారీ విధ్వంసానికి పాల్పడాలని కుట్రపన్నారు. నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం.. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ భారత్లో మరో భారీ విధ్వంసానికి పథకం రచిస్తున్నాడు. ఇందుకోసం సరిహద్దుల్లో ఉన్న నదులు, కాలువలను ఉపయోగించుకొని తన ఉగ్రమూకను దేశంలోకి పంపాలని అతను కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాద ఆపరేషన్కు లష్కరే కమాండర్ అబు ఇర్ఫాన్ తందేవాలాను ఇన్చార్జిగా సయీద్ నియమించినట్టు సమాచారం. దేశంలో భారీ మారణహోమం లక్ష్యంగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఈ ఆపరేషన్లో పాల్గొనబోతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు వీలుగా పాక్ సైన్యం లోపాయికారి సహకారం అందిస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల మీదుగా ఉన్న నదులు, కాలువ మార్గాల వద్ద భారత సైన్యం నిఘాను, భద్రతను మరింత పెంచింది. అంతేకాకుండా అనుమానిత చొరబాటు మార్గాల వద్ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పహారా కాస్తున్నది. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా రికార్డుస్థాయిలో ఉగ్రవాద చొరబాటు యత్నాలు ఈసారి జరిగాయని, సెప్టెంబర్ 29 తర్వాత దాదాపు 15 చొరబాటు యత్నాలను బీఎస్ఎఫ్ భగ్నం చేసిందని సమాచారం. కాగా, భారత్-పాక్ సరిహద్దుల్లో మూడు నదులు, 11 కాలువలు ఉన్నాయి. -
‘ఉగ్రవాదులకు ప్రజల మద్దతు’
న్యూఢిల్లీ: దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులకు, చొరబాటుదార్లకు ప్రజల మద్దతు లభిస్తోందని, దీన్ని అడ్డుకోకపోతే ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉంటాయని జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) తన నివేదికలో హెచ్చరించింది. ప్రజలు ఎలా మద్దతిస్తున్నారో ఇందులో వివరించకున్నా.. బాంబు పేలుళ్లకు పాల్పడిన వారికి, స్థానికులకు మధ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య దేశంలో జరిగిన పేలుళ్లను విశ్లేషిస్తూ నివేదిక రూపొందించారు. నివేదిక ప్రకారం.. ఆయుధాగారాల్లో తయారు చేసిన గ్రెనేడ్ల వంటి వాటిని కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెంట్లు వాడుతున్నట్లు నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్బీడీసీ) సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో మొత్తం 93 పేలుళ్లు జరగ్గా 39 మంది చనిపోయారు. ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 48 పేలుళ్లు జరిగాయి. -
సగం ఉగ్రదాడులు ఐదు దేశాల్లోనే
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది జరిగిన ఉగ్రదాడుల్లో సగానికిపైగా దాడులు భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాక్, నైజీరియా దేశాల్లోనే చోటుచేసుకున్నాయని అమెరికా అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద దాడుల మరణాల్లో 74 శాతం ఈ దేశాల్లోనే చోటుచేసుకుంటున్నాయని అమెరికా ఉగ్రవాద నిరోధక సమన్వయకర్త జస్టిన్ సిబిరెల్ తెలిపారు. గత ఏడాది 92 దేశాల్లో జరిగిన ఉగ్రదాడుల సమాచారాన్ని మేరీల్యాండ్ వర్సిటీ క్రోడీకరించి విశ్లేషించింది. ఈ సమాచారం ఆధారంగా జస్టిన్ సిబిరెల్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు దృష్టి కేంద్రీకరించారని..2014లో జరిగిన ఉగ్రదాడులతో పోలిస్తే 2015లో 13శాతం వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. 2012 నుంచి జరిగిన ఉగ్రదాడులతో పోలిస్తే 2015లో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టినట్లేనని ఆయన అన్నారు. -
పశ్చిమ సరిహద్దు ఇక దుర్భేద్యం
పాక్ సరిహద్దులో ఐదంచెల పటిష్ట భద్రత సీసీటీవీలు, రాడార్, లేజర్ కంచెలు.. న్యూఢిల్లీ: దేశ పశ్చిమ సరిహద్దు కంచుకోటగా మారనుంది. గుజరాత్ నుంచి జమ్మూకశ్మీర్ వరకు పాకిస్తాన్తో ఉన్న 2,900 కిలోమీటర్ల సరిహద్దులో పటిష్టమైన ఐదంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి, సరిహద్దు రాష్ట్రాల్లో చొరబాట్లు, స్మగ్లింగ్ తరహా దుశ్చర్యలను అడ్డుకోవడానికి దీన్ని ప్రతిపాదించారు. ‘కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (సీఐబీఎంఎస్) అని పేర్కొంటున్న ఈ వ్యవస్థ కింద నిరంతరం ఆధునిక సాంకేతిక నిఘా అమలు చేస్తారు. ఇది అత్యంత వ్యయంతో కూడకున్నదైనా చొరబాట్లు, ఉగ్రవాద దాడుల నియంత్రణకు మరో ప్రత్యామ్నాయం లేదని హోం శాఖ అధికారులు చెబుతున్నారు. స్వాతంత్య్రం తర్వాత పశ్చిమ సరిహద్దును పూర్తిగా మూసేయడం ఇదే తొలిసారి కానుంది. సీఐబీఎంఎస్ నిర్మాణం కోసం రెండు వారాల కిందట అంతర్జాతీయ టెండరు జారీ చేశారని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద పంజాబ్, కశ్మీర్(జమ్మూ)లో చెరోచోట 5 కి.మీ మేర పనులు మొదలయ్యాయన్నారు. పంజాబ్, గుజరాత్లలో 30 కి.మీ మేర సీఐబీఎంఎస్ ఏర్పాటుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు. ఏముంటాయి? ► సీసీటీవీ కెమెరాలు, నైట్ విజన్ పరికరాలు, నిఘా రాడార్, భూగర్భ నిఘా సెన్సర్లు, లేజర్ కంచెలను సరిహద్దు వెంబడి ఏర్పాటు చేస్తారు. చొరబాట్లు, దాడుల సమయంలో ఒక పరికరం పనిచేయకపోతే మరోపరికరం కంట్రోల్ రూమ్ను అప్రమత్తం చేస్తుంది. ► కంచెలు లేని కొండలు, నదీతీరాలు సహా 130 ప్రాంతాల్లో లేజర్ కంచెను ఏర్పాటు చేస్తారు. ► రాడార్ వ్యవస్థ 360 డిగ్రీల కోణంలో పనిచే స్తుంది. కెమెరాలు సరిహద్దుకు అటువైపు, ఇటువైపు రేయింబవళ్లు కన్నేస్తాయి. దీంతో చొరబాట్లను అడ్డుకోవడమే కాకుండా, వాటికి సాయపడే వ్యక్తులపైనా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ► ఒక కిలోమీటరుకు సీఐబీఎంఎస్ను ఏర్పాటుకు చేయడానికి కోటి రూపాయలు ఖర్చవుతుంది. -
ఇరాక్ లో ఆత్మాహుతి దాడులు: 87 మంది మృతి
వాషింగ్టన్: ఆత్మాహుతి దాడులతో ఇరాక్ అట్టుడుకుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆత్మాహుది దాడులు ఇరాక్ లో కలకలం సృస్టిస్తున్నాయి. ఆదివారం, సోమవారం ఐఎస్ గ్రూపు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో సుమారు 87 మంది మృత్యువాతపడగా, మరో 117 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఇరాక్ రాజధాని బాగ్ధాద్, ముగ్దాడియా పట్టణం పై జరిగిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రదాడులను ఐక్యరాజ్యసమితి ఖండించింది. రాజధాని బాగ్ధాద్ లో, ముగ్దాడియా పట్టణంపై ఆదివారం ఐఎస్ జరిపిన దాడిని యూఎన్ఓ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఖండించారు. దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ మిలిటెంట్లు నేటి వేకువజామున అంగీకరించారు. దీంతో ఐరాస ఈ ఘటనలపై తీవ్రంగా మండిపడుతోంది. ఏడుగురు షియా మిలిటెంట్లు ఈ ఉగ్ర ఘాతుకాలకు పాల్పడి ఉండొచ్చునని అధికారిక ప్రకటనలో ఐరాస పేర్కొంది. బాగ్ధాద్ ఘటనలో 53 మంది చనిపోగా, ముగ్దాడియా పట్టణంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 34 మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. 2014 నుంచి ఇప్పటివరకూ అక్కడ జరుగుతున్న ఐఎస్ దాడుల కారణంగా 22 వేల మందికి పైగా బలైపోయారు. -
‘భారత్లో మరిన్ని ఉగ్రదాడులు చేస్తాం’
ఇస్లామాబాద్: భారతదేశంలో మరిన్ని ఉగ్రవాద దాడులు చేస్తామని జమాత్ ఉద్ దావా(జేయూడీ) చీఫ్, ముంబై దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన ఒక ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘మీరు పఠాన్ కోట్ దాడినే చూశారు. మేము అత్యంత సులువుగా మరిన్ని దాడులను చేయగలం’ అని అన్నాడు. భారత సైన్యం కశ్మీర్ ప్రజలపై మారణ హోమం చేస్తోందని ఆరోపించాడు. మరోవైపు, సయీద్ను అదుపులో పెట్టాల్సిన బాధ్యత పాక్పై ఉందని భారత్ స్పష్టం చేసింది. పాక్లో సయీద్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి సయీద్ చేస్తోంది ఉగ్రవాద కార్యకలాపాలని, ఉగ్రవాదానికి ఆర్థిక ఊతం అందించే చర్యలేనని స్పష్టం చేసింది. పాక్లో సయీద్ లాంటి ఉగ్రవాదులు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహించుకోవడం ఆందోళనకరమని పేర్కొంది. -
ఊతమిచ్చే దేశాల్ని బహిష్కరించాలి
ఉగ్రవాదంపై ప్రణబ్ పిలుపు జైపూర్: ఉగ్రవాదాన్ని దేశ విధానంలో భాగంగా ప్రోత్సహించే లేదా మద్దతిచ్చే దేశాలను ప్రపంచం బహిష్కరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. తద్వారా పరోక్షంగా పాకిస్తాన్ను ప్రస్తావిస్తూ.. మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం ఉండవని.. ఉగ్రవాదం అనేది క్యాన్సర్ అని, బలమైన కత్తితో శస్త్రచికిత్స చేసి తొలగించాలన్నారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్నీ ప్రపంచం తిరస్కరించాలన్నారు. ఇండియా ఫౌండేషన్ సంస్థ రాజస్తాన్ ప్రభుత్వంతో కలసి మంగళవారం జైపూర్లో ఏర్పాటు చేసిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సును రాష్ట్రపతి ప్రారంభించి ప్రసంగించారు. అమెరికాపై 9/11 ఉగ్రవాద దాడులు కీలకమైన పరిణామంగా అభివర్ణిస్తూ.. అప్పటి నుంచీ అనుసరించిన ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాల గెలుపోటముల నుంఇచ పాఠాలు నేర్చుకోవాలని ప్రణబ్ సూచించారు. -
బాగ్దాదీ సన్నిహితుల నుంచి ఆదేశాలు
భారత్లో పేలుళ్ల కోసం సంప్రదింపులు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు కుట్రపన్నిన ఐసిస్ భారత విభాగం జనూద్ ఉల్ ఖలీఫా-ఏ-హింద్(భారత్ ఖలీఫా సైన్యం) వివరాలు మరిన్ని వెలుగు చూశాయి. ఈ మాడ్యూల్ నేరుగా ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతోందని భారత అధికార వర్గాలు తెలిపాయి. రిపబ్లిక్ డే నేపథ్యంలో భారత్లోని కీలక ప్రాంతాల్లో పేలుళ్ల కోసం వారి నుంచి మాడ్యూల్కు ఆదేశాలు అందుతున్నాయని వెల్లడించాయి. జనూద్కు చెందిన 14 మందిని దర్యాప్తు సంస్థలు శుక్ర, శనివారాల్లో అరెస్ట్ చేసి, వారి ఆటకట్టించడం తెలిసిందే. వీరిలో ముంబైలో అరెస్టయిన ముదాబిర్ ముస్తాక్ షేక్.. జనూద్కు ‘ఆమిర్’గా ప్రకటించుకున్నాడని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ వర్గాల తెలిపిన వివరాల ప్రకారం.. జనూద్ ఏర్పాటు వెనక షేక్ కీలకపాత్ర పోషించాడు. అతడు బాగ్దాదీ ఆదేశాలతో ఆమిర్ అని ప్రకటించుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్పోర్ట్స్ కంపెనీలో ప్రోడక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్న అతడు సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లలో చురుకుగా ఉన్నాడు. అతనిపై నిఘావర్గాలు కొన్ని నెలలుగా కన్నేసి ఉంచాయి. టర్కీ, సిరియాల నుంచి అతని డబ్బు అందాక వెంటాడాయి. ఈ మాడ్యూల్కు హైదరాబాద్లో అరెస్టయిన బిహార్ వాసి మొహమ్మద్ నఫీస్ ఖాన్ కోశాధికారిగా ఉన్నారు. కాగా, అరెస్టయిన హైదరాబాదీలు అబూ అనాస్, నఫీస్ ఖాన్లను ఆదివారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు13 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. రఫీక్పై హత్యాయత్నం కేసు సాక్షి, బెంగళూరు: బెంగళూరులో శనివారం పోలీసులు అదుపులోకి తీసుకునే సమంయలో చాకుతో దాడి చేసిన అనుమానిత ఉగ్రవాది రఫీక్ ఖాన్పై పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. దాడిలో గాయపడిన తెలంగాణ ఉగ్రవాద నిరోధక బృందానికి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ఫిర్యాదుపై దీన్ని నమోదు చేశారు. రఫీక్ను, అతని భార్య యాస్మిన్ బానులను స్థానిక కోర్టు 15 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇద్దరినీ ఢిల్లీకి తరలించినట్లు సమాచారం. -
‘డాక్టర్ మెడిసిన్ లీక్ కరేగా’ కోడ్తో..
♦ కర్ణాటకలో ఆరుగురి అరెస్ట్ ♦ ఏకే 47లు, పేలుడు పదార్థాలు స్వాధీనం సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అందులో బెంగళూరుకు చెందిన వారు నలుగురు, మంగళూరు, తుమకూరులకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఈనెల మొదటి వారంలో బెంగళూరుకు చెందిన మౌల్వీ ఖాస్మీని ఎన్ఐఏ బృందం అరెస్టు చేసింది. అతని నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం దాడులు నిర్వహించింది. బెంగళూరుకు చెందిన అహ్మద్ అఫ్జల్, మహమ్మద్ సోహైల్, హసీఫ్, అహ్మద్లతో పాటు తుమకూరుకు చెందిన సయ్యద్ ముజాహిద్దీన్, మంగళూరుకు చెందిన నజ్మల్ హుదాలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు ఏకే-47లను, భారీగా పేలుడు పదార్థాలు, మ్యాపులను స్వాధీనం చేసుకున్నారు. భారీ దాడులకు కుట్ర మంగళూరుకు చెందిన నజ్మల్ హుదా తప్ప మిగతా ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు విచారించగా... గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు కుట్రపన్నినట్లు తెలిసింది. వారంతా ‘డాక్టర్ మెడిసిన్ లీక్ కరేగా’ కోడ్తో సంప్రదింపులు, కార్యకలాపాలు సాగించేవారని తేలింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లు, ఫోన్లలో సమాచారాన్ని పరిశీలించగా... మైసూరులో సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రావడానికి ముందు మైసూరుకు దగ్గర్లోని మాండ్యా నుంచి పాకిస్తాన్కు ఓ ఫోన్కాల్ వెళ్లినట్లు తేలింది. అధికారులు అరెస్టు చేసినవారిలో బెంగళూరులోని సారాయిపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అఫ్జల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మహ్మద్ సోహైల్ ఇక్కడి కాటన్ పోలీస్స్టేషన్ పరిధిలోని మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆరు రాష్ట్రాల్లో 14 మంది అరెస్ట్: ఎన్ఐఏ ఉగ్రవాద దాడులకు కుట్ర జరుగుతోందన్న సమాచారంతో శుక్రవారం ఆరు రాష్ట్రాల్లోని 12 చోట్ల దాడులు చేశామని ఎన్ఐఏ ప్రకటించింది. హైదరాబాద్తోపాటు బెంగళూరు, తుమకూరు, మంగళూరు, ముంబై, లక్నోల్లో జరిపిన దాడుల్లో 14 మందిని అదుపులోకి తీసుకుని... ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. శుక్రవారం అరెస్టు చేసిన వారిలో ముంబైకి చెందిన ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్, హైదరాబాద్కు చెందిన మహ్మద్ నఫీస్ఖాన్, మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, మంగళూరుకు చెందిన హుడా, బెంగళూరుకు చెందిన అఫ్జల్ తదితరులు ఉన్నారు. -
భారత ఎంబసీ వద్ద బాంబు పేలుడు
జలాలాబాద్: అప్గానిస్తాన్లో భారతీయ సంస్థలపై ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జలాలాబాద్ నగరంలో ఉన్న భారత దౌత్య కార్యాలయం సమీపంలో మంగళవారం బాంబు పేలింది. కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్లు భారత దౌత్యాధికారి ఒకరు తెలిపారు. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని అప్గాన్ అధికారులు తెలిపారు. భారత కాన్సులేట్ సమీపంలోనే పాక్, ఇరాన్ దౌత్య కార్యాలయాలు ఉన్నాయని విదేశాంగ ప్రతినిధి వికాశ్ స్వరూప్ అన్నారు. దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ఇంతవరకు ప్రకటన చేయలేదు. -
భారత్పై దాడులు ప్రపంచానికి హెచ్చరికే..!
వాషింగ్టన్: భారత్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి దిగడంపట్ల అమెరికాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ప్రపంచానికి ఉగ్రవాదం నుంచి భారీ ముంపు పొంచి ఉందనడానికి ఇదొక హెచ్చరికలాంటిదని అన్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపైనా, మరోపక్క, అఫ్గానిస్థాన్లోని భారత దౌత్య కార్యాలయంపైన ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులపై అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీలో కాంగ్రెస్ నేత బ్రాడ్ షెర్మాన్(61) ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్లో పర్యటించిన మూలంగానే ఈ దాడి జరిగిందని ఊహాగానాలు వెలువడుతున్నాయని, అయినా, ఆ రెండు దేశాల నేతల ఏ మాత్రం వీటికి వెరువకుండా పరిష్కార మార్గాలకోసం ముందుకు వెళ్లాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంకోసం చిన్న మూలాన్ని కూడా వదిలిపెట్టవద్దని, దాన్ని రూపుమాపి ఇరు దేశాలకు న్యాయం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో భారత్, పాకిస్థాన్ కు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహకారం అందించాలని కోరారు. ఈ దాడులు ప్రపంచ దేశాలకు మరో హెచ్చరిక అనే విషయం ఏ మాత్రం మర్చిపోకూడదని చెప్పారు. -
ఉష్ణోగ్రత తగ్గింపే లక్ష్యం
2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీల కంటే తక్కువే ఉండాలి: పారిస్ సదస్సులో తీర్మానం పదమూడు అన్న అంకె పాశ్చాత్య దేశాల్లో అశుభ సూచకం. అయితే నవంబరు 30న పారిస్లో మొదలైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21వ సమావేశం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఘన విజయం సాధించింది. పదమూడు రోజల తీవ్ర చర్చోపచర్చల తరువాత... భూమిపై మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేసే భూతాపోన్నతిని రెండు డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పరిమి తం చేస్తామని దాదాపు 196 దేశాలు అంగీకరించడం మానవ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం గా పేర్కొనడం ఏమాత్రం అతిశయోక్తి కాబోదు. చేతి చమురు వదులుతుందన్న భయంతో అమెరికా వంటి అగ్రరాజ్యాలు కొంత బెట్టుచూపినా... కాలుష్యం మోతాదు ఆధారంగా దేశాలు తగ్గింపు విషయంలో బాధ్యతలు పంచుకోవాలన్న భారత్, చైనాలు పట్టుబట్టినా... వాతావరణం మారిపోతే అందరికంటే ముందుగా బలయ్యేది తామే కాబట్టి... మా గోడు పట్టించుకోమన్న చిన్న, ద్వీప సముదాయ దేశాలు బతిమలాడినా... చివరకు స్పష్టమైన విషయం ఒక్కటే. భూమి పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే చేయి చేయి కలపాల్సిందేనని.. అందుకే పారిస్ సదస్సు చివరి క్షణాల్లో ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్ కీ మూన్ ‘‘మనల్ని కాపాడుతున్న ఈ భూమిని రక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’’ అని స్పష్టంగా ప్రకటించారు. పారిస్: పారిస్పై ఉగ్రవాద దాడులు జరిగిన కొన్ని రో జులకే... నవంబరు 30న మొదలైన ప్యారిస్ సదస్సు నిజానికి శుక్రవారమే ముగియాల్సి ఉంది. అయితే కొన్ని కీలక అంశాల విషయంపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు రాత్రి పొద్దుపోయేంత వరకూ కొనసాగాయి. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు పేద దేశాలకు అందించాల్సిన ఆర్థిక సాయం, కాలుష్య కారకులకు ఎక్కువ బాధ్యత తదితర అంశాలపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను తొలగించేందుకు సమావేశాల పొడిగింపు తప్పలేదు. చివరకు శనివారం మధ్యాహ్నం సమయానికి 196 సభ్యదేశాల కరతాళ ధ్వనుల మధ్య ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి లారెంట్ ఫాబియస్ తుది ముసాయిదాను సమావేశం ముందు ఉంచారు. ఈ తుది చర్చల్లో పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మాట్లాడుతూ ‘‘భూమి భవితను నిర్ణయించే ఒప్పందం మన ముందుంది. ఈ తొలి వాతావారణ ఒప్పందాన్ని ప్రపంచదేశాలన్నీ ఆమోదించాలి’’ అని అభ్యర్థించారు. అనంతరం ఈ ఒప్పందానికి సమావేశం ఆమోద ముద్ర వేసింది. స్వాగతించిన భారత్ పారిస్ సదస్సు తుది ముసాయిదా ఒప్పందాన్ని భారత్ బలపరిచింది. సదస్సు ప్రారంభమైన నాటి నుంచి చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవ్దేకర్ ఒప్పందం ముసాయిదాపై పొగడ్తలు కురిపించారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు బాధ్యతల బరువు వేర్వేరుగా ఉండాలన్న భారత్ వాదనకు ఒప్పందంలో చోటు దక్కడం ఎంతైనా హర్షణీయమైన విషయమని, ఒప్పందంలోని అన్ని అంశాల్లోనూ దీని ప్రస్తావన ఉందని తెలిపారు. భారత్కు సంబంధించినంత వరకూ ఇది కీలక విజయమని స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని పెంచని సుస్థిర జీవనశైలుల అంశాన్ని కూడా భారత్ ప్రపంచం ముందుకు తెచ్చిందని, 31 పేజీల తుది ఒప్పంద ముసాయిదాలో దీనికీ చోటు దక్కిందని తెలిపారు. ‘‘ఈ ఒప్పంద ప్రతిని స్థూలంగా పరిశీలిస్తే భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలు అన్నింటికీ సమాధానాలు ఉన్నట్టుగానే అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. శనివారం తుది ముసాయిదాను ప్రవేశపెట్టిన తరువాత వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సభ్యదేశాలకు కొంత గడువు ఇచ్చారు. ఈ సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి ఒప్పందానికి మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థించినట్లు వార్తలు వచ్చాయి. నరేంద్రమోదీ ఒప్పంద సారాంశంపై హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతరాలు తగ్గాయి వాతావరణ మార్పులకు సంబంధించి ఇప్పటివరకూ జరిగిన సదస్సులకు ప్యారిస్ సదస్సుకు ఉన్న ముఖ్యమైన తేడా అంతర్జాతీయంగా చట్టబద్ధమైన ఒప్పందం కుదరడం. ఈ కొత్త ఒప్పందంలోని ముఖ్యాంశాలు... ► 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల కంటే గణనీయంగా తక్కువ ఉండేలా చూడాలి. అదే సమయంలో 1.5 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు పరిమితం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలి. ► వాతావరణ మార్పులకు తట్టుకునేందుకు, ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020 నాటి నుంచి ఏటా పదివేల కోట్ల డాలర్ల (రూ.6.5 లక్షల కోట్లు) కనీస మొత్తం అందించాలి. 2025లో ఈ మొత్తాన్ని మరోసారి సమీక్షిస్తారు. హా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను ఐదేళ్లకు ఒకసారి సమీక్షించాలి. ఇవీ గత ఒప్పందాలు... భూ తాపోన్నతి, వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రపంచదేశాలు చర్యలు మొదలుపెట్టింది రియో డి జెనీరోలో (1992) జరిగిన ఎర్త్ సమ్మిట్తోనే. ఈ సమావేశం ఫలితంగా 1997లో క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందానికి 82 దేశాలు మాత్రమే అంగీకారం తెలిపాయి. అమెరికా సహా కొన్ని పారిశ్రామిక దేశాలు ఒప్పందంపై సంతకాలు చేయలే దు. దీని ప్రకారం పా రిశ్రామిక దేశాలు త మ కర్బన ఉద్గారాల ను 1990 నాటి స్థాయి కంటే కనీసం 5 శాతం తక్కువ చేయాలి. ఈ ఒప్పందం అమల్లో కొన్ని దేశాలు విఫలమైనా మొత్తమ్మీద ఉద్గారాలు లక్ష్యం కంటే రెండు రెట్లు ఎక్కువ మోతాదులో తగ్గడం విశేషం. అయితే ఇదే సమయంలో 36 దేశాలు తగ్గించుకున్న ఉద్గారాల కంటే ఎక్కువ మోతాదులో చైనా వంటి దేశాలు ఉద్గారాలను విపరీతంగా పెంచేయడంతో మొత్తమ్మీద క్యోటో ప్రోటోకాల్ తాలూకూ ఫలితం కనిపించకుండా పోయింది. ► 2009 కోపెన్హెగెన్ సదస్సులో తొలిసారి అన్ని దేశాలు తమ తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలన్న ఉమ్మడి నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మాత్రం కుదరలేదు. ► 2012లో దోహాలో జరిగిన సమావేశంలో క్యోటో ప్రోటోకాల్ ఒప్పంద కాలాన్ని 2020 వరకూ పొడిగించారు. ప్యారిస్ సదస్సులో కుదిరే ఒప్పందం 2020 నుంచి 2030 వరకూ అమల్లో ఉంటుంది. ఎందుకు..? ఏమిటి..? ఎలా..? సమస్య ఏమిటి? భూమి వెచ్చబడుతోంది. గత వందేళ్ల కాలంలో భూమి సగటు ఉష్ణోగ్రత 0.85 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగింది. 2000 సంవత్సరం మొదలుకొని ఇప్పటివరకూ దాదాపు 13 ఏళ్లు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది కూడా దీనికి భిన్నమేమీ కాదు! ఎందుకు ఇలా... వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువులు మరీ ముఖ్యంగా కార్బన్డ యాక్సైడ్ మోతాదు పెరిగిపోవడం. పెరిగిపోతున్న పరిశ్రమలు, వ్యవసా యం కారణంగా కార్బన్డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలో ఎక్కువ గా పేరుకుపోతున్నాయి. ఫలితంగా భూమి అంతరిక్షంలోకి ప్రతిఫలించే సూర్యరశ్మి తాలూకూ వేడి వాతావరణంలో ఎక్కువ కాలంపాటు ఉండిపోతోంది. కార్బన్డయాక్సైడ్ను పీల్చుకుని నిక్షిప్తం చేసుకోగల అడవుల విస్తీర్ణం తగ్గిపోతూండటం అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. ఈ ఏడాది మే నెలకు వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ మోతాదు 400 పార్ట్స్ పర్ మిలియన్కు చేరుకుంది. గడచిన 8 లక్షల సంవత్సరాల్లో ఈ వాయువు ఇంత మోతాదులో ఉండటం ఇదే తొలిసారి. దుష్పరిణామాలు ఏమిటి? ఏటికేడాదీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో పడుతున్న ఇబ్బందులు మనకు తెలియనివి కావు. అయితే భూతాపోన్నతి దుష్పరిణామాల్లో వేసవి ఉష్ణోగ్రతల పెరుగుదల ఒక చిన్న అంశం మాత్రమే. భూతాపోన్నతి కారణంగా అకాల వర్షాలు, వరదలు (చెన్నై, ఉత్తరాఖండ్ కుంభవృష్టుల మాదిరిగా), సముద్రమట్టాల పెరుగుదల, పంట దిగుబడులు తగ్గిపోవడం, అంటువ్యాధులు ప్రబలుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1900తో పోలిస్తే సముద్రమట్టాలు ఇప్పటికే దాదాపు 19 సెంటీమీటర్లు పెరిగినట్లు గుర్తించారు. అంతేకాకుండా ధ్రువప్రాంతాల్లోని మంచు, హిమాలయాలతోపాటు ఇతర హిమనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. మరి భవిష్యత్తులో ఎలా....? ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే భూమిపై మనిషి మనుగడ మరింత కష్టమవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. తరచూ పలకరించే కరువులు, వడగాడ్పులు, ఆకస్మిక కుంభవృష్టులతో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతాయి. నీటి కొరత, వాతావరణ మార్పుల ప్రభావంతో వరి, గోధుమ వంటి పంటల దిగుబడులు దాదాపు 30 శాతం వరకూ తగ్గవచ్చునని అంచనా. ఎవరెవరు ఎంతెంత? వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ మోతాదు పెరిగిపోవడం భూతాపోన్నతికి కారణమని తెలుసుకున్నాం కాదా... మరి ఈ విషవాయువులు ఎవరు ఎంత మోతాదులో విడుదల చేస్తున్నారో తెలుసా? పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు చైనా, అమెరికాలు దాదాపు 36 శాతం ఉద్గారాలకు కారణమవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ మరో 9 శాతం, భారత్, బ్రెజిల్లు మరో ఆరు శాతం చొప్పున గ్రీన్హౌస్ వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. రష్యా(5), జపాన్(3), కెనెడా (2), ఇండొనేషియా (1.5), కాంగో (1.5) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పెరుగుదల ఎంత ఉండొచ్చు? ఈ శతాబ్దం చివరి నాటికి భూమి ఉష్ణోగ్రతలు ఎంత మేరకు పెరగవచ్చు అన్న అంశం కర్బన ఉద్గారాల తగ్గింపునకు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ ఏ చర్య తీసుకోకుండా ఉద్గారాలను ఇలాగే కొనసాగిస్తే... పెరుగుదల 4.6 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉండవచ్చు. ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను ఇలాగే కొనసాగిస్తే ఇది 3.6 డిగ్రీ సెల్సియస్కు, పారిస్ సదస్సులో తీసుకున్న విధాన నిర్ణయాలకు కట్టుబడితే 2.7 డిగ్రీ సెల్సియస్కు పరిమితమవుతుందని అంచనా. - జి. గోపాలకృష్ణ మయ్యా, సాక్షి ఒప్పందంలో..భారత అభిప్రాయాలకు చోటు పారిస్: వాతావరణ మార్పుపై కాప్-21 సదస్సు ఆమోదం తెలిపిన ఒప్పందంలో భారత్ వెల్లడించిన అభిప్రాయాలకు చోటు దక్కిందని పరిశీలకులు వెల్లడించారు. సుస్థిర జీవన, వినియోగ విధానాలు, వాతావరణ న్యాయం అంశాలను ఒప్పంద పీఠికలో పొందుపరిచారు. వాతావరణ మార్పుపై పోరాటంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల బాధ్యత ఎవరెవరిది ఎంత అనేది... అన్ని అంశాల్లోనూ తప్పక పాటించాలనే భారత్ అభిప్రాయాన్ని ఇందులో పొందుపరిచారు. వాతావరణ మార్పుకు సంబంధించి అన్ని అంశాలపై దృష్టిసారించి తయారుచేసిన ఈ ఒప్పందం.. సమతుల్యమైనదని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫేబియస్ పారిస్లో అన్నారు. సభ్యత్వ దేశాల మధ్య మరింత విశ్వాసాన్ని పెంచేదిలా ఒప్పందం తయారుచేశామన్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న వ్యవస్థలను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమమైన, సమర్థవంతమైన, పారదర్శకమైన విధివిధానాలను రూపొందించామన్నారు. కాగా, భారత్, చైనా, సౌదీ అరేబియా సహా సభ్యత్వ దేశాల్లోని 134 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒప్పందాన్ని స్వాగతించాయి. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉందని డజనుకుపైగా దేశాలు ఉన్న లైక్-మైండెడ్ డెవలపిం గ్ కంట్రీస్(ఎల్ఎండీసీ) గ్రూప్ అధికార ప్రతినిధి గురుదయాళ్ సింగ్ నజార్ ప్రకటించారు. మనకు కావాల్సింది..* 650,00,00,00,00,000 వాతావరణ మార్పులను తట్టుకోవ డం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాదాపు అన్ని రంగాల్లోనూ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. కొత్త టెక్నాలజీలతోపాటు మానవ వనరుల అభివృద్ధి పరిశోధనల కోసం కొత్తకొత్త సంస్థల ఏర్పాటు తదితర చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్క భారతదేశానికి మాత్రమే ఎంత మొత్తం అవసరమవుతుందో తెలుసా? దాదాపు లక్ష కోట్ల డాలర్లు! రూపాయల్లో చెప్పాలంటే.. 65 లక్షల కోట్లు! దేశంలోనే పేరెన్నికగన్న మూడు సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘క్లైమెట్ ఛేంజ్ అండ్ ఇండియా అడాప్టేషన్ గ్యాప్ (2015).. ఏ ప్రిలిమినరీ అసెస్మెంట్’ పేరుతో ఐఐటీ, ఐఐఎం(గాంధీనగర్, అహ్మదాబాద్)లతోపాటు కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్లు ఈ నివేదికను సిద్ధం చేశాయి. గత 14 ఏళ్లలో దేశంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల (వరదలు, తుపానులు, వడగాడ్పులు, చలిగాలులు, కరువు కాటకాలు) వల్ల జరిగిన నష్టం ఆధారంగా ఈ మొత్తాన్ని లెక్కించారు. ఈ కాలంలో 131 సందర్భాల్లో వరదలు, 51 తుపానులు సంభవించగా, 26 సార్లు చలిగాలులు, వడగాడ్పులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వీటన్నింటి వల్ల జరిగిన నష్టం దాదాపు రూ. 3 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భవిష్యత్తులోనూ ఇలాంటివి మరిన్ని ఎక్కువ చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీస్థాయిలో నష్టాలు నమోదవుతాయి. అందుకే వీటిని తట్టుకునేందుకు, ఆస్తి ప్రాణ నష్టాలను తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే అది దాదాపు 65 లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. కార్బన్ బడ్జెట్ అంటే ఏమిటి? పారిస్ సదస్సు సందర్భంగా తరచూ ఒక మాట వినిపిస్తోంది... అది కార్బన్ బడ్జెట్. ఏమిటిది? అన్న సందేహం మీకూ వచ్చే ఉంటుంది. సమాధానం ఇదిగో... 2100 నాటికి భూమి ఉష్ణోగ్రతలను నిర్దిష్ట స్థాయికి పరిమితం చేసేందుకు ఎంత మేరకు గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేసే అవకాశం ఉందో దాన్ని కార్బన్ బడ్జెట్ అని పిలుస్తున్నారు. ఒక అంచనా ప్రకారం... పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి 2100 వరకూ దాదాపు లక్ష కోట్ల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ను విడుదల చేసినా భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్కు మించి పెరగదు. అయితే ఈ లక్ష కోట్ల టన్నుల కార్బన్ బడ్జెట్లో 2011 నాటికల్లా మనం 52 శాతం వాడేశాము. అంటే ఇప్పటికే దాదాపు 52 వేల కోట్ల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ వాతావరణంలోకి చేర్చేశామన్నమాట. ఫలితంగా ఉష్ణోగ్రత దాదాపు 0.85 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. మిగిలిన 85 ఏళ్లలో కేవలం 48 వేల కోట్ల టన్నులు మాత్రమే విడుదల చేసేందుకు అవకాశముంది. -
ఫ్రెంచ్ పతాకం రంగుల్లో ఈడెన్ గార్డెన్స్
కోల్కతా: ఉగ్రవాదుల దాడులతో నష్టపోయిన ఫ్రాన్స్కు సంఘీభావంగా ఈడెన్ గార్డెన్స్ ఆ దేశ త్రివర్ణ పతాక రంగులద్దుకుంది. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన లైట్స్ను ఈడెన్ ముఖద్వారంపై ప్రదర్శించారు. ఇది ఈ నెలంతా కొనసాగుతుందని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా తెలిపారు. ‘దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి తెలిపేందుకు మా ప్రయత్నమిది. ప్రతీ రోజు రాత్రి 10 గంటల వరకు మూడు రంగుల విద్యుత్ వెలుగులు ప్రకాశిస్తాయి’ అని దాల్మియా చెప్పారు. -
ఐఎస్కు వ్యతిరేకంగా సంకీర్ణ సేన !
వాషింగ్టన్: పారిస్పై ఉగ్రవాద దాడులు ఐఎస్కు వ్యతిరేకంగా మిలిటరీ సంకీర్ణ సేన ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని సృష్టించాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీని గురించి తక్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అయితే హింసాత్మక ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి ఇప్పటికిప్పుడే అమెరికా లేదా అంతర్జాతీయ సేన వైమానిక దాడులు చేయడం సరికాదని వారు భావిస్తున్నారు. పాతకాలంలోలాగ ఐఎస్ఐఎస్పై తిరిగి బాంబు దాడి చే యలేమని విశ్లేషకుడు ఆంథోని కార్డెస్మన్ అభిప్రాయపడ్డారు. మరోపక్క.. పారిస్పై ఉగ్ర దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా తమ జాతీయ భత్రతామండలి(ఎన్ఎస్సీ) సిబ్బందితో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. -
‘డస్ట్ లేడీ’ వెళ్లిపోయింది...
-
‘డస్ట్ లేడీ’ వెళ్లిపోయింది...
న్యూయార్క్: అమెరికాలోని ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’పై 2001, సెప్టెంబర్ 11వ తేదీన హైజాక్ చేసిన విమానాలతో టెర్రరిస్టులు జరిపిన భయానక దాడికి ప్రత్యక్ష సాక్షి, బాధితురాలు మార్సి బోర్డర్స్. ఆ దాడికి చేదు జ్ఞాపకంగా ‘డస్ట్ లేడీ’గా, ఓ ఐకాన్గా ప్రపంచానికి పరిచయమైన మార్సి బోర్డర్స్ సోమవారం కేన్సర్ వ్యాధితో చనిపోయారు. తన 28వ ఏటనే జరిగిన ఊహించని దారుణ అనుభవాన్ని మరిచిపోలేక భయం నీడల మధ్య, మద్యం మత్తులో బతుకుతూ చిక్కి శల్యమైన బోర్డర్స్ చివరకు తన 42వ ఏట తనువు చాలించారు. ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన ‘ది బలాడ్ ఆఫ్ మార్సి బోర్డర్స్’ పాటను మనకు మిగిల్చి వెళ్లి పోయారు. బోర్డర్స్ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మైఖేల్ బోర్డర్స్ సామాజిక వెబ్సైట్ ‘ఫేస్బుక్’లో తెలియజేశారు. తన సోదరి మరణించిన విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ వ్యాఖ్యానించారు. ఆనాడు జరిగిన టైస్టు దాడి గురించి ఆమె అనేక అంతర్జాతీయ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్న మార్సి బోర్డర్స్ టెర్రరిస్టులు విమానాలతో దాడి చేసినప్పుడు ఆమె ఆఫీసులోనే ఉన్నారు. దాడి అనంతరం ఆమె మెట్ల మార్గం గుండా కిందకు తప్పించుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె శరీరం నిండా ధూళి, దుమ్ము, బూడిద కమ్ముకున్నాయి. అదే సమయంలో ఆనాటి దాడిని ప్రత్యక్షంగా కవర్ చేస్తున్న ఏఎఫ్పీ ఫొటోగ్రాఫర్ స్టాన్ హోండా ఆమె ఫొటో తీశారు. ఆఫొటో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆనాటి సంఘటనకు ఒక ఐకాన్గా మిగిలింది. దశాబ్దకాలంలోని అత్యుత్తమ ఫొటోలంటూ ‘టైమ్ మేగజైన్’ ప్రచురించిన పాతిక ఫొటోల్లో ఈ ఫొటోకు స్థానం లభించింది. ఆనాటి భయానక అనుభవాన్ని ఆమె ఎప్పుడూ మరచిపోలేక పోయింది. ఆకాశమార్గాన ఏ విమానం కనిపించినా ఆమె వణికిపోయేది. ఏ భవనంపై ఎవరు కనిపించినా తననే కాలుస్తున్నాడేమోనని ఇంట్లోకి పరిగెత్తేది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు రావడమే మానేసింది. మద్యానికి బానిసైంది. కొకైన్కూ అలవాటయింది. 2014, ఆగస్టులో ఆమెలో కేన్సర్ బయటపడింది. ఎలాంటి జబ్బులులేని తనకు కేన్సర్ వచ్చిందంటే కారణం ఆ నాడు టెర్రరిస్టు దాడి కారణంగా తనపై పడిన దుమ్మూ దూళియే కారణమని భావిస్తూ వచ్చింది. ఆమె తీపి గుర్తులుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
దేశంకంటే క్రికెట్ ఎక్కువేమీ కాదు!
- భారత్, పాక్ సిరీస్పై గంగూలీ - రవిశాస్త్రి సమర్థంగా పని చేస్తున్నారు - కుర్రాళ్లు రాటుదేలారన్న మాజీ కెప్టెన్ న్యూఢిల్లీ: ఒకవైపు ఉగ్రవాద దాడులు జరుగుతుండగా... మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనకు అతను మద్దతు పలికాడు. ‘భారత్, పాక్ సిరీస్ జరగాలని, ఎక్కువ వినోదం దక్కుతుందని చాలా మంది ఆశించడం సహజమే. అయితే సరిహద్దులో భయాందోళనతో జీవిస్తున్న మన ప్రజల మనోభావాలు ఎంతో ముఖ్యం. ఆట జరిగే ముందు తీవ్రవాదం పూర్తిగా ఆగిపోవాలని బీసీసీఐ చెప్పడం సరైన నిర్ణయం. సాధారణ ప్రజలు కోరుకునేది కూడా అదే. క్రికెట్ కంటే దేశం ముఖ్యం’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఢిల్లీ కోర్టు తీర్పుతో బీసీసీఐ సంతృప్తి చెందితే శ్రీశాంత్ తిరిగి రావడం సమస్య కాదని, ఈ విషయంలో తన వివరణ ఇచ్చుకునేందుకు ఆటగాడికి బోర్డు అవకాశం ఇస్తుందని భావిస్తున్నానన్నాడు. లోధా కమిటీ తీర్పుపై ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న గంగూలీ, తాము శిక్షలు ఖరారు చేయమని, ఐపీఎల్ను బాగా నిర్వహించేందుకు కావాల్సిన సూచనలు మాత్రమే ఇస్తామని వెల్లడించాడు. అయితే గతంలో స్పాన్సర్లు, ప్రసారకర్తలతో చేసుకున్న ఒప్పందాల మేరకు కనీసం ఎనిమిది జట్లతోనే లీగ్ జరుగుతుందని గంగూలీ చెప్పాడు. కోచ్కు డెరైక్టర్కు తేడా లేదు! శ్రీలంక పర్యటన ముగిసేవరకు టీమిండియాకు రవిశాస్త్రినే డెరైక్టర్గా కొనసాగుతారని బీసీసీఐ సలహా కమిటీ సభ్యుడైన గంగూలీ స్పష్టం చేశాడు. మరీ అవసరమనిపిస్తే ఆ తర్వాత కొత్త కోచ్ ఎంపికపై ఆలోచిస్తామన్నాడు. ‘రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్గా బాగా పని చేస్తున్నారు. నా దృష్టిలో కోచ్కు, డెరైక్టర్గా తేడా ఏమీ లేదు. పైగా ఆయనకు అండగా సమర్థులైన సహాయక సిబ్బంది ఉన్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇదే బృందాన్ని కొనసాగించడంలో తప్పేముంది’ అని ఈ మాజీ కెప్టెన్ విశ్లేషించాడు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టులోని యువ ఆటగాళ్లను రాటుదేల్చిందని, ఆ అనుభవం శ్రీలంకలో ఉపయోగపడుతుందని సౌరవ్ అన్నాడు. లంక పటిష్టమైన ప్రత్యర్థే అయినా భారత్కు మంచి విజయావకాశాలు ఉన్నాయన్నాడు. ప్రధాన ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న జింబాబ్వే పర్యటన ఫలితం గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. రహానే తదితరులు దానిని మరచి రాబోయే లంక సిరీస్పై దృష్టి పెట్టాలని సూచించాడు. గెలిస్తే అంతా బాగుంటుంది! టెస్టు, వన్డే జట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించడం గతంలో అనేక జట్లు చేశాయని, భారత్కు మాత్రం ఇది కొత్త అని ఈ మాజీ కెప్టెన్ అన్నాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ వల్లే ఇది జరిగిందని అతను గుర్తు చేశాడు. ‘టీమ్ గెలిస్తే ఈ ప్రయోగం పని చేసినట్లు, ఓడితే విఫలమైనట్లు’ అని గంగూలీ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాడు. -
దాడులకు తెగబడితే క్రికెట్ ఆడేది లేదు
పీసీబీని హెచ్చరించిన బీసీసీఐ న్యూఢిల్లీ: భారత్లో ఉగ్రవాద దాడులకు దిగబడితే పాకిస్తాన్తో క్రికెట్ ఆడేది లేదని బీసీసీఐ కారద్యర్శి అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు. భారతీయుల భద్రత విషయంలో రాజీపడేది లేదని ఆయన పీసీబీకి స్పష్టం చేశారు. ‘భారత్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పాకిస్తాన్తో క్రికెట్ ఆడేది లేదనే విషయాన్ని పీసీబీ ముందుగా తెలుసుకోవాలి. క్రీడలకు రాజకీయాలకు సంబంధం లేదనే విషయం తెలుసు. కానీ మా అంతర్గత భద్రత అన్నింటికన్నా ముఖ్యం. రెండు బోర్డుల మధ్యే కాకుండా ఇరు దేశాల మధ్య కూడా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి’ అని ఠాకూర్ తెలిపారు. ఐసీసీ ఎఫ్టీపీ ప్రకారం ఇరు జట్లు తటస్థ వేదికపై రెండు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాల్సి ఉంది. యూఏ ఈలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఈ సిరీస్.. తాజాగా పంజాబ్లో పాక్ టైస్టులు దాడులకు తెగబడడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. భారత్, పాక్ల మధ్య చివరి టెస్టు 2007లో జరిగింది. -
'బల్జిత్ సింగ్ చనిపోవడం దురదృష్టకరం'
విశాఖపట్టణం: ఉగ్రదాడిలో పంజాబ్ ఎస్పీ బల్జిత్ సింగ్ చనిపోవడం దురదృష్టకరమని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ అన్నారు. బల్జిత్ సింగ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోమవారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించామన్నారు. అదే విధంగా నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖకు వచ్చే ప్రముఖులకు భద్రతా ఏర్పాట్లపై పరిశీలిస్తున్నామని చెప్పారు. -
నైజీరియాకు యూఎన్ మద్దతు ఉంటుంది
ఐక్యరాజ్యసమితి: నైజీరియాలో తీవ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ శనివారం ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో నైజీరియాకు ఐక్యరాజ్య సమితి సంపూర్ణ మద్దతుగా ఇస్తుందని తెలిపారు. గత వారం రోజులుగా తీవ్రవాదులు జరుపుతున్న దాడుల్లో నైజీరియాలో దాదాపు 60 మంది మరణించారు. శుక్రవారం ఒక్కరోజే ఈద్ పండగ సందర్భం ప్రార్థనలు చేస్తున్న వారిపై తీవ్రవాదల చేసిన దాడిలో 50 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
ఉగ్రవాదులను కట్టడి చేయండి
పాకిస్తాన్ను కోరిన కశ్మీర్ సీఎం సయీద్ జమ్మూ: కశ్మీర్లో వెంటవెంటనే జరిగిన రెండు ఉగ్రవాద దాడులను జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఖండించారు. ఉగ్రవాదులను కట్టడిచేయాలని పాకిస్తాన్ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. శుక్ర, శనివారాల్లో ఉగ్రవాదులు ఓ పోలీస్స్టేషన్, ఓ సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. రెండు దేశాలమధ్య శాంతికి విఘాతం కలిగించేలా హింసకు పాల్పడుతున్న ఉగ్రవాదులను కట్టడి చేయాల్సిందిగా పాక్కు సూచించాలని ఈ తీర్మానం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రజలు ఇటువంటి ఉగ్రవాద చర్యలకు బెదిరిపోరని సయీద్ అన్నారు. భారత్తో శాంతి సంబంధాలను కోరుకుంటున్నట్లయితే హింసా శక్తులను అదుపులో పెట్టాలని పాక్కు సూచించారు. పాక్ ప్రమేయాన్ని ఎత్తి చూపకుండా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను అరికట్టడానికి సరిహద్దుల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దాడులను ఖండి స్తూ తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీక ర్ తిరస్కరించడంపై నిరసన వ్యక్తంచేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ వాకౌట్ చేసింది. ఈ అంశంపై చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఉభయ సభల్లో పట్టుబట్టింది. ఉగ్రవాదులు సొంతంగానే దాడులు చేస్తున్నారని సీఎం చెబుతుంటే, ఉపముఖ్యమంత్రి మాత్రం పాక్ సర్కారు, ఐఎస్ఐ హస్తం ఉందంటున్నారని పేర్కొంది. ‘ఉగ్ర’ వాతావరణం వద్దు: రాజ్నాథ్ సరిహద్దు వెంట ‘ఉగ్ర’ వాతావరణంలేకుండా చూడాలని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ను కోరారు. అట్టారీ సరిహద్దులో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాసిత్తో మీర్వాయిజ్ భేటీ హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ భారత్లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ను ఢిల్లీలో కలిశారు. కశ్మీర్ తీవ్రవాదంపై శ్వేతపత్రం జమ్మూకశ్మీర్లో తీవ్రవాదంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. ప్రజలకు సమాచారం కోసం రాష్ట్రంలోని తీవ్రవాదం, దాని చుట్టూ ఉన్న అనేక అంశాలతో కూడిన శ్వేతపత్రాన్ని వెలువరించాలని హోం మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంట్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
ఉగ్రమూకలు రెచ్చిపోవచ్చు!.
జమ్మూ, ముంబైలో అప్రమత్తంగా ఉండండి: నిఘా వర్గాలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు సూచించాయి. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలతోపాటు ముంబై పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్కు వచ్చిన సమయంలో లష్కరే తోయిబా ముష్కరులు కశ్మీర్లోని చిత్తిసింగ్పురా గ్రామంలో 36 మందిని ఊచకోత కోశారు. ఇప్పుడు కూడా అలా దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ముంబైలో సిద్ధివినాయక ఆలయం, తాజ్ ప్యాలెస్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు నిఘా వర్గాలు సూచించాయి. ఇక ఢిల్లీని భద్రతా బలగాలు శత్రు దుర్భేద్యంగా మార్చేస్తున్నాయి. అమెరికా నిఘా వర్గాలతో కలసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ఒబామా ప్రయాణించే మార్గాల్లో అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించాయి. -
ఉగ్రవాదులపై బెల్జియం దాడులు
ముగ్గురు ముష్కరులు హతం యూరప్లో ఉగ్రవాదుల కోసం గాలింపులు, దాడులు బ్రస్సెల్స్/పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగిన ఉగ్రవాద దాడులు ప్రపంచదేశాలను కుదిపేస్తున్నాయి. దీనిపై యూరప్వ్యాప్తంగా అన్ని దేశాలూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బెల్జియం తమ దేశంలో ఉగ్రవాద వ్యతిరేక దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించినట్లు సమాచారం. ఇక ఫ్రాన్స్, జర్మనీ గత రెండు రోజుల్లో 12 మంది అనుమానితులను అరెస్టు చేశాయి. ఫ్రాన్స్లోని వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డో పత్రికపై ఉగ్రవాదులు దాడి చేసి 17 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. దీంతో జర్మనీ తదితర దేశాలు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశాయి. బెల్జియం తమ దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దాడులను చేపట్టింది. శుక్రవారం ఆ దేశ రాజధాని బ్రస్సెల్స్కు 125 కిలోమీటర్ల దూరంలోని వెర్వయర్స్ పట్టణంలో ముగ్గురు టైస్టులను హతమార్చినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు పత్రికలు తెలిపాయి. సిరియా నుంచి వచ్చిన ఆ ఉగ్రవాదులు బెల్జియంలో దాడులకు కుట్రపన్నినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయని వెల్లడించాయి. ఇక ఉగ్రవాద దాడులు జరిగిన ఫ్రాన్స్తో పాటు జర్మనీ పోలీసులు గత రెండు రోజులుగా 12 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఫ్రాన్స్లో సైబర్ దాడులు.. ఫ్రాన్స్ ప్రభుత్వం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. చార్లీ హెబ్డ్పో దాడి జరిగిన తర్వాత గత తొమ్మిది రోజుల్లోనే ఫ్రాన్స్కు చెందిన 19 వేల వెబ్సైట్లపై హ్యాకర్లు సైబర్ దాడులు జరిగాయి. అందులో చాలా వరకు ఇస్లామిక్ హ్యాకర్ల గ్రూపులే చేశాయని, అయితే పెద్దగా నష్టమేమీ జరగలేదని ఫ్రాన్స్ సైబర్ భద్రత అధికారులు వెల్లడించారు. పారిస్ శివార్లలో కొలంబెస్ పట్టణంలోని ఒక పోస్టాఫీసులో సాయుధ దుండగుడు ఒకరు చొరబడి, ఇద్దరిని బంధించాడు. అతని దగ్గర గ్రెనేడ్లు, కలష్నికోవ్ తుపాకులతో పాటు భారీగా మందుగుండు ఉన్నట్లుగా ఆ పోస్టాఫీసు నుంచి తప్పించుకున్నవారు చెప్పారు. అయితే ఈ దుండగుడు ఉగ్రవాది కాకపోవచ్చని భావిస్తున్నారు. -
40 దేశాధినేతలతోపాటు 10 లక్షల మంది ఐక్యతా ర్యాలీ
పారిస్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 40 మందికిపైగా దేశాధినేతలు గొంతెత్తారు. వారితోపాటు పది లక్షల మంది ఈరోజు ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. అందరి గుండె చప్పుడు ఒకటే. ఉగ్రవాదం నశించాలి అన్నదే వారి నినాదం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది లక్షల మంది ప్యారిస్ వీధుల్లోకి వచ్చారు. వివిధ దేశాల జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నలభై దేశాధినేతలు ఉగ్రవాద దాడులను ఖండిస్తూ ప్యారిస్ ప్రజలకు సంఘీభావంగా ర్యాలీ చేపట్టారు. వ్యంగ్య వార్తా పత్రిక ఎడిటర్ చార్లీ హెబ్డే సహా దారుణంగా 17 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఘటనను ప్యారిస్ వాసులు మరిచిపోలేకున్నారు. వారికి సంఘీభావంగా లక్షలాది మంది ''మీకు మేమున్నాం'' అంటూ ప్యారిస్ వీధుల్లో నడిచారు. -
పారిస్లో ఉగ్రదాడి : 11 మంది మృతి
-
లష్కరే లఖ్వీ నిర్బంధం కొట్టివేత
ఇస్లామాబాద్: ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి ప్రజా భద్రతా రక్షణ చట్టం కింద పాకిస్తాన్ ప్రభుత్వం విధించిన నిర్భందాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఈ కేసుపై జనవరి 15లోగా పాక్ ప్రభుత్వం సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. దీనితో ఈ కేసులో లఖ్వీ విడుదలకు మార్గం సుగమమైంది. అయితే, లఖ్వీని మరో కేసులో ప్రభుత్వం నిర్బంధించే అవకాశం ఉందని పాక్ హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాద దాడుల కేసులో లఖ్వీకి బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల 18నే ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పు చెప్పింది. అయితే, అడియాలా జైలులో లఖ్వీ నిర్బంధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని లఖ్వీ హైకోర్టులో సవాల్ చేశాడు. తన క్లయింట్ బెయిల్ దరఖాస్తును కోర్టు ఇదివరకే ఆమోదించిందని, అలాంటి పరిస్థితుల్లో పరిపాలనా యంత్రాంగమే లఖ్వీని నిర్బంధించడం చట్టవ్యతిరేకమని అతని న్యాయవాది వాదించారు. పాక్ ప్రభుత్వం తరఫున విచారణకు ఎవరూ హాజరుకాలేదు. భారత్ తీవ్ర ప్రతిస్పందన.. లఖ్వీ నిర్బంధం రద్దుపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. పేరుమోసిన ఉగ్రవాద సంస్థలకు పాక్ సురక్షిత కేంద్రమని మరోసారి తేలిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్కు విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ సమన్లు జారీ చేశారు. ఈ అంశాన్ని ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ కార్యాలయం పాక్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. -
తుప్పు పట్టిన ‘భద్రత’..!
సాక్షి, ముంబై: నగర భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన 26/11 ఘటన నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోనట్లుగానే ప్రవర్తిస్తోంది. నగరంలో నేరాల సంఖ్య పెరుగుతోంది.. ఉగ్రవాదుల దాడుల భయమూ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నగర రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న భద్రతా సిబ్బందికి తగిన ఆయుధ సంపత్తిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఉగ్రవాదుల దాడులను సమర్ధవంతంగా తిప్పి కొట్టేందుకు కొన్ని కీలక సంస్థల వద్ద నియమించిన భద్రతా సిబ్బంది వద్ద ఇప్పటికీ పాత కాలం నాటి ఆయుధాలే ఉన్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి మావోలు, ఉగ్రవాద సంస్థలు సైతం ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ప్రత్యేకంగా స్థాపించిన మహారాష్ట్ర భద్రత దళానికి చెందిన జవాన్లవద్ద ఇప్పటికీ 1948 కాలం నాటి ఆయుధాలు ఉండడం గమనార్హం. 26/11 ఘటన తర్వాత తేరుకున్న ప్రభుత్వం నగర భద్రత నిమిత్తం అనేక కీలక సంస్థల వద్ద ప్రత్యేకంగా బలగాలను నియమించింది. ఇందులో మెట్రో, మోనో, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, మహాలక్ష్మి మందిరం, ఓఎన్జీసీ, జేఎన్పీటీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఐఐటీ, ఐటీఐ తదితర 20 అత్యంత కీలక ప్రాంతాల్లో బందోబస్తును పటిష్టం చేశారు. అయితే ఆయా ప్రాంతాలు ఇప్పటికీ సురక్షితంగా లేవనే ఆశ్చర్యకరమైన విషయం ఓ దిన పత్రిక నిర్వహించిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు, ప్రార్థన స్థలాలు, విద్యా, వైద్య సంస్థల భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్ఎఫ్) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘మహారాష్ట్ర భద్రత దళం’ ను 2011లో స్థాపించింది. ఈ దళంలో పనిచేసే జవాన్లకు పోలీసు అధికారులకు ఉన్న హోదా కల్పించింది. కాని ఈ దళం కోసం తీసుకున్న సుమారు 15 వందల జవాన్లలో కేవలం 577 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇందులో కేవలం 388 మందికి శిక్షణ ఇచ్చి ఆయుధాలు, 189 మందికి లాఠీలు ఇచ్చారు. మిగతావారిని వెయిటింగ్లో పెట్టింది. ముంబై పోలీసు శాఖ చెత్త సామాగ్రి కింద జమకట్టిన మస్కెట్-410 మోడల్ బందూకులనే ఈ దళానికి ఇవ్వడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఒక్కోక్క జవానుకు ఒక తుపాకీ, ఐదు బులెట్లు ఇచ్చారు. ఇవి 1948 కాలం నాటివి కావడంతో పాడైపోయాయి. వాటి కి మేకులు కొట్టి సరిచేసి సెలోటేప్ అతికించి ఇచ్చారు. అవి భయపెట్టడానికి తప్ప ఇంక దేనికీ పనికిరావని తెలుస్తోంది. కాగా ఏకే-47, ఏకే-56 లాంటి అత్యాధునిక ఆయుధాలతో దాడులకు దిగే ఉగ్రవాదులను ఈ జవాన్లు ఎంతవరకు అడ్డుకుంటారనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. -
బీజేపీ సర్కారు వచ్చాకే దాడులు: రాహుల్
రామ్గఢ్ (జార్ఖండ్): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే జమ్మూకశ్మీర్లో ఉగ్ర దాడులు తిరిగి ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపీఏ పదేళ్ల పాలనలో కశ్మీర్లో శాంతి నెలకొందని, పర్యాటకులు వచ్చేవారని...కానీ మోదీ ప్రభుత్వం రాగానే ఉగ్ర కార్యకలాపాలు మొదలయ్యాయని జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రామ్గఢ్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ విమర్శించారు. కాగా, జమ్మూకశ్మీర్లో పోలింగ్ శాతం అధికంగా ఉండటంపట్ల పొరుగు దేశంతోపాటు దేశంలోని కొందరు అసంతృప్తికి లోనవుతున్నారని, ఇది దురదృష్టకరమని కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. మరోవైపు కశ్మీర్లో ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలసి పనిచేస్తూనే ఉంటామని చెప్పింది. -
ఉగ్ర కన్ను !
గుల్బర్గాలో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులకు ‘సిమి’తో సంబంధం! ధార్వాడలో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం {Mిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో విధ్వంసానికి కుట్ర! బెంగళూరు : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడనున్నారనే సమాచారం నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఉగ్రవాదులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను గుల్బర్గాలో పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకోవడంతో కర్ణాటకపై కూడా ‘ఉగ్ర’ కన్ను పడినట్లు రాష్ట్ర హోం శాఖ భావిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిమి’తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన సందర్భంలో వీరు ముగ్గురు అరవింద్, ఆనంద్, కిషన్ అనే పేర్లతో ధార్వాడ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు ఆరు నెలల పాటు ఈ ముగ్గురు అనుమానితులు నివాసమున్నట్లు తెలిసింది. తాము వస్త్రాల వ్యాపారులమని చెప్పుకొని ధార్వాడ నగరంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వీరు రెక్కీ నిర్వహించారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు సైతం వీరు ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించారని సమాచారం. ధార్వాడ ప్రాంతం లో ఆరు నెలలు గడిపిన అనంతరం వ్యాపారాన్ని మరో చోటికి మారుస్తున్నామని చెప్పుకొని ఈ ముగ్గురు అనుమానితులు గుల్బర్గాకు తమ నివాసాన్ని మార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ధార్వాడ పట్టణంలో అనుమానిత ఉగ్రవాదులు నివసించిన ప్రాంతాన్ని సైతం పోలీసులు తనిఖీ చేసి అక్కడి వారి నుంచి మరికొంత సమాచారాన్ని రాబట్టారు. రాష్ట్రంలో హై అలర్ట్... ఇక రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం రాష్ట్ర హోం శాఖకు సమాచారం అందజేయడంతో రాష్ట్ర హోం శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇక గుల్బర్గాలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసు లు వారిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారి స్తున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొంత మంది రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఉన్నారని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సందర్భంలో రాష్ట్రం లో విధ్వంసాన్ని సృష్టించేందుకు వీరు వ్యూహరచన చేస్తున్నట్లు తెలియడంతో రాష్ట్ర హోం శాఖ ఉలిక్కిపడింది. దీంతో తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ను ప్రకటించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్తో పాటు డీజీపీ లాల్రుఖుమ్ పచావో ఇతర సీనియర్ పోలీసు అధికారులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొం దించనున్నట్లు సమాచారం. -
ఢిల్లీలో దాడులకు ఐఎం కుట్ర!
న్యూఢిల్లీ: రానున్న పండుగ రోజుల్లో ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ప్రణాళికలు వేస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సహారన్పూర్లో అరెస్టయిన ఐఎం ఉగ్రవాది అజీజ్ షేక్ వెల్లడించిన సమాచారం మేరకు ఆ అభిప్రాయానికి వచ్చారు. గత ఏడాది ఐఎం నేత యాసిన్భత్కల్ అరెస్ట్ అనంతరం అజీజ్ నేపాల్ పారిపోయాడు. ఇటీవల రియాజ్భత్కల్, మొహ్సిన్ల నుంచి ఢిల్లీ వెళ్లాలని షేక్కు ఆదేశాలందాయి. నేరుగా కాకుండా, లక్నో, మొరాదాబాద్, సహారన్పూర్ల మీదుగా వెళ్లాలని షేక్కు చెప్పారు. ఆ మార్గంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో దాడుల కోసం స్లీపర్ సెల్ ఉగ్రవాదులకు డబ్బులు సమకూర్చేందుకే షేక్ ఢిల్లీ వెళ్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
సీలింక్పై ఆత్మహత్యలను నివారించాలి
ముంబై: బాంద్రా-వరోలి రాజీవ్గాంధీ సీలింక్పై ఆత్మహత్యల నివారణకు, ఉగ్రవాద దాడుల నుంచి రక్షణ కల్పించాలని దాఖలైన పిటిషన్పై, వెంటనే స్పందించాలని బాంబే హైకోర్టు రాష్ర్ట హోంశాఖతోపాటు, అధికారులకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా సీలింక్పై టోల్ వసూలు చేస్తున్న ఎంఈపీఐడీ, కేబుల్ బ్రిడ్జిపై కమీషన్ తీసుకొంటున్న ఎమ్ఎస్ఆర్డీసీకి కూడా నోటీసులను జారీ చేసింది. మూడు వారాల్లో ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని జస్టిస్ పీవీ హర్దాస్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.మాజీ జర్నలిస్టు కేతన్ తిరోడ్కర్ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. 4.8 కి లోమీటర్ల పొడవైన ఈ వంతెనపై ఎంఈపీఐడీ, ఎంఎస్ఆర్డీసీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని పేర్కొన్నాడు. అదేవిధంగా ఇప్పటికే ఐదు ఆత్మహత్యల కేసులు ఈ సీలింక్పై నమోదయ్యాయని పేర్కొన్నాడు. కేవలం ఆరు సీసీ టీవీలు మాత్రమే ఉన్నాయని, మొత్తం 80 సీసీటీవీల నిఘా అవసరం ఉందన్నారు. వంతెనపై నెట్ ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, ముంబై: సీలింక్ ఆత్మహత్యలకు వేదికగా మారిన సీలింక్ వంతెన మొత్తం వల ‘నెట్’ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మహరాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ) అధికారులతోపాటు జోన్-3 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.జయ కుమార్ తదితరులు సమావేశమై వంతెనపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించి నెట్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ వంతెనపై మరోసారి ఆత్మహత్యల సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎమ్మెస్సార్డీసీ అధికారి తెలిపారు. వంతెనపై ఉన్న రేలింగ్ ఎత్తును మరింత పెంచాలని సూచించారు. ఇక్కడ ఈ బ్రిడ్జిపై ఎక్కడ ఆత్మహత్యలకు ఎక్కువ పాల్పడుతున్నారో ఆ స్థలంలో సీసీ టీవీలను కూడా అమర్చాలన్నారు. ఈ సీసీటీవీ కెమెరాలను తమ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. తాము ఈ బ్రిడ్జి మొత్తంగా నిఘా ఉంచవచ్చని అన్నారు. సీసీ టీవీ కెమెరాల సహాయంతో బ్రిడ్జిపై వాహనాలను నిలిపిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచవచ్చని మరో అధికారి పేర్కొన్నారు. వంతెనపై భద్రతా సిబ్బందిని మోహరించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందిస్తారని చెప్పారు. ఎమ్మెస్సార్డీసీ చీఫ్ ఇంజినీర్ అరుణ్ దేవ్ధర్ మాట్లాడుతూ.. ఈ వంతెన రేలింగ్ ఎత్తును పెంచేందుకు పర్యావరణ నిపుణుల సలహాను కూడా కోరామని చెప్పారు. ఈ వంతెనపై తరచూ పెట్రోలింగ్ నిర్వాహించాలని ట్రాఫిక్ పోలీస్ చీఫ్ బి.కె.ఉపాధ్యాయ సిబ్బందికి ఆదేశించారు. ఎవరైతే ఈ వంతెనపై వాహనాలను నిలుపుతారో వారిపై జరిమానాతోపాటు కేసులు నమోదు చేయనున్నట్లు నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా వీరిపై కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఉపాధ్యాయ తెలిపారు. -
నగర పోలీసులకు అమెరికా ఆయుధాలు
సాక్షి, ముంబై: ఉగ్రవాదుల దాడులను సమర్థంగా తిప్పికొట్టడంలో ముంబై పోలీసుశాఖకు సహకరించడనికి అమెరికా అంగీకరించింది. ఇందుకు అవసరమైన అత్యధునిక ఆయుధాలు అందజేస్తామని ప్రకటించారు. ఇందులో 250కిపైగా రకాల ఆయుధాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఆయుధాలు ముంబై పోలీసుశాఖకు ఉచితంగానే అందజేయనుంది. 2008 నవంబరు 26న 10 మంది ఉగ్రవాదులు నగరంలోని ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), కామా ఆస్పత్రి, నారిమన్ హౌస్ ప్రాంతాల్లో దాడులు చేసి 250కిపైగా అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనల్లో వందలాది మంది గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అజ్మల్ కసబ్ మినహా మిగతా తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమర్చారు. తామంతా పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు ప్రాణాలతో పట్టుబడ్డ కసబ్ వెల్లడించాడు. ఉగ్రవాదదాడులను ప్రోత్సహిస్తోందం టూ పాక్పై గతంలో వచ్చిన ఆరోపణలు కసబ్ వెల్లడించిన విషయాలతో రుజువయ్యాయి. కసబ్కు చివరికి ఉరిశిక్ష విధించడం తెలి సిందే. ఈ దాడుల కేసుల దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులకు అమెరికా సాయం చేసింది. వీటి వెనుక పాకిస్థాన్ హస్తముందని రుజువు చేయడానికి సాక్ష్యాధారాలను సేకరించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ అధికారులు ఈ మేరకు ముంబై కోర్టులో సాక్ష్యమిచారు. ఉగ్రవాదదాడులను తిప్పికొట్టేందుకు భారత్కు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చిన అమెరికా ఈ మేరకు మనదేశ పోలీసులు, దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చిం ది. భారత పారామిలిటరీ దళాల అధికారులు, సిబ్బంది కూడా ఈ శిక్షణకు హాజరయ్యారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు, ఇతర సామాగ్రిని ఎలా ఉపయోగించడంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముంబై సీనియర్ పోలీసు అధికారి కూడా హాజరయ్యారు. ఆయుధాల అప్పగింతపై భారత్కు చెందిన ‘బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’ను అమెరికా సంప్రదించింది. ఉగ్రవాద దాడుల నిరోధంపై శిక్షణ సమయంలో తీసుకొచ్చిన అత్యధునిక ఆయుధాలు, ఇతర పరికరాలను ప్రముఖ నగరాలలోని పోలీసు దళాల కు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ముంబై పోలీసు శాఖకు కూడా ఉచితంగా ఆయుధాలు అందనున్నాయి. బాం బును గుర్తించడం, నిర్వీర్యం చేసే పరికరాలు, పోర్టబుల్ బాంబు స్కానర్, డుయర్ బ్లాస్టర్, క్విక్ రెస్పాన్ టీం కోసం అసెండర్, డిసెండర్, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ఉపయోగించే పరికరాలు అమెరికా అందజేసే వాటిలో ఉన్నాయి. -
నష్టపరిహారం భారీగా పెంపు
హైదరాబాద్: మావోయిస్టులు, ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందినవారి కుటుంబాలకిచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ దాడుల్లో ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్లు చనిపోతే వారి కుటుంబాలకు ఇక నుంచి 35 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తారు. తీవ్రంగా గాయపడితే 10 లక్షల రూపాయలు ఇస్తారు. మండలాధ్యక్షుడు, జడ్పిటిసి, డిసిసి బ్యాంక్ చైర్మన్, మునిసిపల్ చైర్మన్, సర్పంచ్, ఎంపిటిసి, వార్డు మెంబర్ చనిపోతే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తారు. కానిస్టేబుల్, ఎస్ఐ చనిపోయినా 25 లక్షల రూపాయలు ఇస్తారు. సీఐ నుంచి ఆ పైస్థాయివారు చనిపోతే 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకూ అదేస్థాయిలో ఎక్స్ గ్రేషియా ఇస్తారు. సాధరణ పౌరులు చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తారు. -
మంగళూరులో మూలాలు
దిల్సుఖ్నగర్ పేలుళ్లపై కీలక ఆధారాలు సంపాదించిన ఎన్ఐఏ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు కర్ణాటకలోని మంగళూరులో ఆశ్రయం పొందినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయటపడింది. ఆ పేలుళ్లకు ముందు అక్తర్ అలియాస్ తబ్రేజ్ మరో ఉగ్రవాది వకాస్ అలియాస్ అహ్మద్ మంగళూరు నుంచి పలుమార్లు హైదరాబాద్కు వచ్చివెళ్లినట్లు తేలింది. వారు ఆశ్రయం పొందిన మంగళూరు పట్టణం జఫర్ హైట్స్లోని ఫ్లాటును ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. తమ కస్టడీలో ఉన్న తబ్రేజ్ను ఆ ఫ్లాట్కు తీసుకువెళ్లి సోదాలు చేశారు. ఆ ఫ్లాటులో బాంబుల్లో టైమర్లుగా ఉపయోగించే 50 డిజిటల్ వాచీలు, కొన్ని సెల్ఫోన్లు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, కొంత అమ్మోనియం నైట్రేట్, మండే స్వభావం కలిగిన ఆయిల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ పేలుళ్ల అనంతరం మంగళూరుకు వెళ్లిన తబ్రేజ్, వకాస్ మార్చి నెల వరకు కూడా అదే ఫ్లాట్లో ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఆ తరువాతే దేశం వదిలివెళ్లినట్లు పోలీసుల విచారణలో తబ్రేజ్ వెల్లడించినట్లు సమాచారం. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద తబ్రేజ్ సైకిల్ బాంబు పెట్టాడు. మరో ఉగ్రవాది వకాస్ ఆయనకు సహాయంగా ఆ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న బస్టాప్లో యాసిన్ భత్కల్ బాంబు పెట్టగా.. అతనికి సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ ఉన్నట్లు విచారణలో తేలింది. కర్ణాటకలో యాసిన్ భత్కల్ను గుర్తించే అవకాశం ఎక్కువగా ఉండటంతో అతను మాత్రం హైదరాబాద్లోనే ఆశ్రయం పొంది నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. యాసిన్ భత్కల్, హసన్ హైదరాబాద్లోనే మకాం వేసి పేలుళ్లకు అవసరమైన బాంబులను తయారుచేసినట్లు గుర్తించారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు వారం ముందు నుంచే నగరంలో మకాం వేసిన భత్కల్, హసన్ పేలుళ్లు జరిగిన మరుసటి రోజు ఇక్కడి నుంచి వెళ్లినట్లు బయటపడింది. అయితే, యాసిన్భత్కల్ ఎక్కడ ఆశ్ర యం పొందాడు? పేలుళ్లకు ఉపయోగించిన సైకిళ్లను ఎక్కడి నుంచి సేకరించాడు? స్థానికంగా సహకరించిన మాడ్యూల్ ఏమిటి? అనే అంశాలను ఎన్ఐఏ అధికారులు శోధిస్తున్నారు. దేశవ్యాప్తంగా వంద పేలుళ్లకు కుట్ర! కరాచీ ఆపరేషన్ పేరుతో దేశవ్యాప్తంగా వంద భారీ పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ విచారణలో యాసిన్ భత్కల్ వెల్లడించినట్లు సమాచారం. పాకిస్థాన్ సహకారంతో 2008 నుంచి ఇప్పటివరకు 44 పేలుళ్లకు పాల్పడ్డామని, మిగతా పేలుళ్లు కూడా ఎక్కడెక్కడ జరపాలనేదానిపై ఒక ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఆ పేలుళ్ల కోసం పేలుడు పదార్థాలను కూడా సమీకరించామని భత్కల్ చెప్పాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల తర్వాత మరిన్ని పేలుళ్ల కోసం మంగళూరులోని అపార్ట్మెంట్లో పేలుడు పదార్థాలను సమకూర్చుకున్నట్లు వెల్లడించాడు. అయితే, హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో వరుస పేలుళ్లకు కుట్ర చేసిన విషయాలన్నీ యాసిన్ భత్కల్ నుంచి ఒక్కొక్కటిగా దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు. -
తీవ్రవాదుల జాబితాను విడుదల చేసిన యెమెన్
ప్రముఖ తీవ్రవాద సంస్థ అల్ఖైదా యెమెన్ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు సమాయత్తమైంది. అందుకు దేశంలోని విదేశీ కార్యాలయాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకుందని ఆ దేశ హోంమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన 25 మంది తీవ్రవాదుల పేర్ల జాబితాను సోమవారం సాయంత్రం యెమెన్ రాజధాని సనాలో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఆ తీవ్రవాదుల సమాచారం అందజేసిన లేదా ఆచూకీ తెలిపిన వారికి భద్రతా దళాలు రూ.23 వేల అమెరికన్ డాలర్లు పారితోషకంగా అందజేయనున్నాయని తెలిపింది. అయితే యెమెన్ ఆ ప్రకటన విడుదల చేయడంతో ముస్లిం దేశాల్లోని తమ దేశానికి చెందిన 20 దౌత్యకార్యాలయాలను అమెరికా వారం రోజులపాటు మూసివేసింది. యెమెన్లోని అల్ఖైదా శాఖ అత్యంత ప్రమాదకరమైనదని ఇటీవలే వాషింగ్టన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.