అమెరికాతో భారత్ భారీ ఒప్పందం | India signs $1 billion deal to buy four Poseidon-8I aircraft | Sakshi
Sakshi News home page

అమెరికాతో భారత్ భారీ ఒప్పందం

Jul 28 2016 1:35 PM | Updated on Sep 4 2017 6:46 AM

అమెరికాతో భారత్ భారీ ఒప్పందం

అమెరికాతో భారత్ భారీ ఒప్పందం

నాలుగు నిఘా విమానాల కొనుగోలు కోసం అమెరికాతో భారత్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6,700 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది.

న్యూఢిల్లీ: నాలుగు నిఘా విమానాల కొనుగోలు కోసం అమెరికాతో భారత్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 6,700 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాలు ‘పోసిడాన్-8ఐ’(పీ-8ఐ)లను కొనేందుకు అమెరికా రక్షణ శాఖ, విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో దీన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే ఎనిమిది పీ-8ఐలను భారత్ కొన్నదని.  ఇప్పుడు మరో నాల్గింటిని కొంటోందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

మరో 145 తేలికపాటి ‘ఎం777’ శతఘ్నులను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది 22 ఆపాచి, 15 చినూక్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం 3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రక్షణ రంగానికి సంబంధించి తాజా ఒప్పందంతో కలిపి గత పదేళ్లలో మొత్తం 15 బిలియన్ డాలర్ల ఒప్పందాలను అమెరికాతో భారత్ కుదుర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement