
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు మే 21న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో ప్రవేశించడానికి మార్గం సుగమమైంది. ఏప్రిల్ 3న జరగాల్సిన ఈ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. గత ఏడాది నవంబర్ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఠాక్రే, మే 27లోపు విధాన మండలికి ఎన్నిక కావాల్సి ఉంది. లేని పక్షంలో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment