ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9మంది మృతి | Massive Fire Accident In Delhi At Kirari Godown | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9మంది మృతి

Published Mon, Dec 23 2019 8:04 AM | Last Updated on Mon, Dec 23 2019 9:07 AM

Massive Fire Accident In Delhi At Kirari Godown - Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో ఉన్న వస్త్ర గోడౌన్‌లో జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు అంతస్తుల భవనంలో ఈ వస్త్ర గోడౌన్‌ మొదటి అంతస్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అర్ధరాత్రి 12. 30 సమయంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా ఫైర్‌ సిబ్బంది, అధికారులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement