ప్రభుకు ప్రధాని మోదీ అభినందన | narendra modi congratulates suresh prabhu | Sakshi
Sakshi News home page

ప్రభుకు ప్రధాని మోదీ అభినందన

Feb 25 2016 2:30 PM | Updated on Aug 15 2018 2:20 PM

ల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. రైల్వే మంత్రిని, రైల్వే శాఖ సిబ్బందిని మోదీ అభినందించారు.

'గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లను విమర్శించదలచుకోలేదు. ఈ బడ్జెట్ వ్యయం రెండున్నర రెట్లు పెరిగింది. దేశ పురోభివృద్ధికి దోహదపడుతుంది. దేశాభివృద్ధిలో దీర్ఘకాలం ప్రభావం చూపుతుంది. ఛార్జీలు పెంచకుండా ప్రయాణికులకు ఊరట కలిగించారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా పురోగతి కనిపించింది. ఈ బడ్జెట్ వల్ల మరింత అభివృద్ధి జరుగుతుంది. దేశాభివృద్ధిలో రైల్వే బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుంది' అని మోదీ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement