మోదీకి ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ | Narendra Modi, Emmanuel Macron selected for UN's highest environmental award | Sakshi

మోదీకి ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’

Sep 27 2018 4:21 AM | Updated on Sep 27 2018 4:21 AM

Narendra Modi, Emmanuel Macron selected for UN's highest environmental award - Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మాక్రన్‌లకు ఐక్యరాజ్య సమితి ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ అవార్డు లభించింది. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో ఇద్దరు నేతలు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం పొందారు. పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరీ కింద ప్రకటిస్తున్న ఈ అవార్డును ఐరాస ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారంగా భావిస్తారు. పారిస్‌ ఒప్పందం కుదరడంలో మాక్రన్‌ పాత్ర, 2022 నాటికి భారత్‌లో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న మోదీ వాగ్దానాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. పర్యావరణ పరిరక్షణకు విశేష కృషిచేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. సౌరశక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి విమానాశ్రయానికి కూడా చాంపియన్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ అవార్డు దక్కింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement