UNO
-
జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022–2025’ ఇంట్రస్టింగ్ సంగతులు
జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022–2025‘జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022–2025’ (Gender Equality Strategy 2022-2025 ) పేరుతో ఐక్యరాజ్యసమితి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో ది గ్లోబల్ కాంటెక్ట్స్–క్రైసిస్ అండ్ ఆపర్చునిటీ, వాట్ వుయ్ హ్యావ్ లెర్న్డ్, అవర్ పార్ట్నర్షిప్స్, డైరెక్షన్స్ ఆఫ్ చేంజ్, అవర్ ప్రయార్టీస్, త్రీ ఎనేబ్లర్స్, ఇన్స్టిట్యూషనల్ ట్రాన్స్ఫర్మేషన్... అనే అధ్యాయాలు ఉన్నాయి.‘మనం ముఖ్యంగా రెండు విషయాల గురించి ఆలోచించాలి. లింగ సమానత్వం దిశగా పురోగతి ఎందుకు నెమ్మదిగా, చెల్లాచెదురుగా ఉంది. దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి? అయితే ఎంత జటిలమైన సవాలు అయినా కొత్త అవకాశాలను అందిస్తుంది. కొత్త వ్యూహాలు రూపొందించుకునేలా చేస్తుంది’ అంటూ కార్యాచరణ ప్రణాళికకు ముందు మాట రాశాడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యుఎన్ డిపి) అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టెయినర్. ‘సమ’ దారిలో ‘సగం’ దూరంలక్ష్యం కూడా విత్తనంలాంటిదే. విత్తే ముందు దాని విలువ అంతగా తెలియకపోవచ్చు. ‘అది ఎప్పుడు మొలకెత్తాలి? ఎప్పుడు చెట్టు కావాలి?’ అనే నిరాశ కూడా ఎదురు కావచ్చు. అయితే విత్తనం ఎప్పుడూ ఫలాన్ని వాగ్దానం చేస్తుంది. విత్తనంలాగే లక్ష్యం కూడా ఫలితాన్ని వాగ్దానం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ‘విమెన్స్ ఈక్వాలిటీ 2030’ లక్ష్యం ఎంతో ఆశను రేకెత్తించడంతో పాటు ఎప్పటికప్పుడూ చర్చనీయాంశంగా ఉంటూ వస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే ముందు సవాళ్లు, సమస్యలపై అవగాహన ఉండాలి. విమెన్ అండ్ యూనైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్ రి΄ోర్ట్ జెండర్ ఈక్వాలిటీకి ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించింది..నాయకత్వంలో మహిళల కొరత : పార్లమెంటరీ సీట్లలో 27 శాతం, స్థానిక సీట్లలో 36 శాతం, మేనేజ్మెంట్ పదవుల్లో 28 శాతం మహిళలు మాత్రమే ఉండడంతో సమగ్ర విధాన రూపకల్పనకు ఆటంకం కలుగుతోంది. భిన్న అభిప్రాయాల కొరత కనిపిస్తోంది.పేదరికం : 2030 నాటికి 34 కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలో మగ్గిపోతారని అంచనా. ప్రపంచ మహిళా జనాభాలో 8 శాతం మంది రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తున్నారు.పని ప్రాంతంలో వివక్ష–అసమానతలు: పురుషులలో 91 శాతం మందితోపోల్చితే మహిళల్లో 61 శాతం మంది మాత్రమే శ్రామిక శక్తి(లేబర్ ఫోర్స్)లో ఉన్నారు. ఇది ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి రెండిటినీ ప్రభావితం చేస్తుంది. పురుషులతో పోలిస్తే శ్రమ ద్వారా మహిళలు తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు.అసమతుల్యత: పనిచేసే వయసులో ఉన్న సుమారు 2.4 బిలియన్ల మహిళలకు సమాన ఆర్థిక అవకాశాలు లభించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మహిళలకు పురుషులతో సమానమైన ఆర్థిక హక్కులు లేవు. వేతనం లేని సంరక్షణ(అన్పేయిడ్ కేర్ వర్క్)లో మహిళలు, పురుషులు గడిపే సమయం మధ్య అంతరం కొద్దిగా తగ్గుతుంది. కానీ 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషుల కంటే 9.5 శాతం ఎక్కువ సమయం(రోజుకు 2.3గంటలు) వేతనం లేని సంరక్షణ పనిలో గడుపుతారు. ఈ నిరంతర అంతరం విద్య, ఉపాధి, ఇతర అవకాశాలలో మహిళల భాగస్వామ్యాన్ని పరిమితం చేస్తుంది.సామాజిక కట్టుబాట్లు – సాంస్కృతిక ఆచారాలు: ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురు యువతులలో ఒకరికి పద్దెనిమిది ఏళ్లు నిండక ముందే పెళ్లి జరుగుతుంది.విద్య-ఆరోగ్యం: 2030 నాటికి 110 మిలియన్ల మంది బాలికలు, యువతులు స్కూల్కు దూరంగా ఉంటారని అంచనా.ఆహార అభద్రత: 2030 నాటికి దాదాపు 24 శాతం మంది మహిళలు, బాలికలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కోనున్నారని అంచనా.హింస: ప్రతి సంవత్సరం 245 మిలియన్ల మంది మహిళలు, బాలికలు భర్త, సన్నిహితుల ద్వారా శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు. వృద్ధ పురుషులతో పోల్చితే వృద్ధ మహిళలు ఎదుర్కొంటున్న పేదరికం, హింస ఎక్కువ.నిదుల కొరత: లింగ సమానత్వం గురించి అవగాహన కలిగించే కార్యక్రమాల నిర్వహణకు తగినంత నిధులు లేవు. కేవలం నాలుగు శాతం మాత్రమే లింగ సమానత్వం, మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై కేటాయిస్తున్నారు. 2030 నాటికి లింగ సమానత్వాన్ని సాధించడానికి అవసరమైన అదనపు పెట్టుబడి సంవత్సరానికి 360 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.అమలు చేయని చట్టాలు: కనీసం 28 దేశాలలో వివాహం, విడాకులకు సంబంధించి మహిళలకు సమాన హక్కులు కల్పించే చట్టాలు లేవు. 67 దేశాలలో మహిళలపై ప్రత్యక్ష, పరోక్ష వివక్షను నిషేధించే చట్టాలు లేవు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి చట్టాలు ఉన్న చోట సమర్థవంతమైన అమలు సవాలుగా ఉంది........‘సవాళ్లు, సమస్యల సంగతి సరే, ఇప్పటి వరకు మనం ఏర్పర్చుకున్న లక్ష్యాల వల్ల ఏ మేరకు పురోగతి సాధించాం?’ అనే ప్రశ్న వేసుకుంటే జవాబు కొంత ఆశాజనకంగా ఉంటుంది. అంతర్జాతీయ నియమాల (ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్) వల్ల కొన్ని రంగాలలో మెరుగుదల కనిపిస్తుంది. బాల్య వివాహాలు కొంత మేరకు తగ్గిపోయాయి. ఇది చిన్న ఆశా రేఖ మాత్రమే.‘కోవిడ్లాంటి విపత్తుల వల్ల 2030 లక్ష్యం మనుపటి కంటే మరింత దూరంలో ఉంది’ అనే మాట వినబడుతుంది. 2030 లక్ష్యాలకు సంబంధించి చాలా రంగాల్లో పురోగతి మందకొడిగా సాగుతుందని, బాల్యవివాహాలు పూర్తిగా కనిపించకుండా చేయడానికి, చట్టపరమైన రక్షణ (లీగల్ ప్రొటెక్షన్)లో అంతరాలను పూడ్చడానికి, వివక్ష పూరిత చట్టాలను తొలగించడానికి, పని ప్రాంతంలో అధికారం, నాయకత్వ స్థానాల్లో మహిళలకు సమాన ప్నిధ్యం కల్పించడానికి, పార్లమెంట్లో సమాన ప్రాతినిధ్యం సాధించడానికి పట్టే కాలం... సుదీర్ఘ కాలం అంటున్నారు. ‘2030 లక్ష్యాలను చేరుకోవడానికి సమిష్టి కృషి, నిధుల పెంపుదల అవసరం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు కీలకమైనదే’ అంటుంది యూఎన్ రిపోర్ట్. -
పుతిన్కు అండగా ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్ వైఖరి ఇదే..
ఐక్యరాజ్యసమితి: బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం గత మూడేళ్లుగా యుద్ధంలో ఉక్రెయిన్కు అన్నిరకాల సాయం చేస్తే తాజాగా ట్రంప్ సర్కార్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న ఉదంతం ఐక్యరాజ్యసమితి సాక్షిగా తొలిసారిగా బహిర్గతమైంది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో రష్యాను దురాక్రమణదారుగా పేర్కొంటూ యూరప్ దేశాలు చేసిన ఒక తీర్మానానికి ఎన్నో దేశాలు మద్దతు పలికితే అమెరికా వ్యతిరేకంగా ఓటేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇక, యుద్ధం మొదలుకావడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొండివైఖరే కారణమని పదేపదే ప్రస్తావిస్తున్న ట్రంప్ సర్కార్ వైఖరి సోమవారం ఐరాస వేదికగా తేటతెల్లమైంది. యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని, రష్యా సేనలు వెంటనే ఆక్రమణ భూభాగాల నుంచి వెనుతిరగాలని, పలు డిమాండ్లతో ఐరాసలో సోమవారం మూడు తీర్మానాలను పలు సభ్యదేశాలు ప్రతిపాదించాయి. ఒక బిల్లులో రష్యాను ఆక్రమణదారుగా పేర్కొన్నారు. అయితే రష్యాను ఆక్రమణదారుగా పేర్కొనడాన్ని సమర్థించబోనని అమెరికా తెగేసి చెప్పింది.రష్యా తప్పేంలేదన్నట్లు ప్రవర్తిస్తూ ఓటింగ్ వేళ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది. యూరప్ మిత్రదేశాలను కాదని ట్రంప్ సర్కార్ రష్యా అనుకూల వైఖరితో ముందుకెళ్లడం ఇప్పుడు యూరప్ దేశాల్లో చర్చనీయాంశమైంది. రష్యా సైన్యం తమ ప్రాదేశిక స్థలాల నుంచి వైదొలగాలని ఉక్రెయిన్ చేసిన ఒక తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా అమెరికా ఒత్తిడిచేసినట్లు తెలుస్తోంది. యూరప్ దేశాలు చేసిన మరో తీర్మానంలో ఓటేయకుండా అమెరికా దూరంగా ఉండిపోయింది. అమెరికా, యూరప్ దేశాల మధ్య సత్సంబంధాలు సన్నగిల్లుతు న్నాయనేది ఐరాస వేదికగా బహిర్గతమైంది.దూరంగా ఉండిపోయిన భారత్చర్చలు, సంప్రదింపుల ద్వారానే యు ద్ధాన్ని ముగించాలని మొదట్నుంచీ కోరుకుంటున్న భారత్ సైతం ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది. సర్వ ప్రతినిధి సభలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మా నంపై ఓటింగ్లో 176 దేశాలు పాల్గొనగా 93 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, ఉత్తరకొరియా సహా 18 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్, చైనా, ఇరాన్, ఇరాక్, బంగ్లాదేశ్, ఖతార్, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 65 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి. ‘‘యుద్ధం కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇరుదేశాల మధ్య శాంతికి ప్రయత్నాలు చేద్దాం’’ అంటూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి ఫ్రాన్స్ మూడు సవరణలు సూచించింది. రష్యా కారణంగానే యుద్ధం మొదలైందని పేర్కొంది. దీనిపై రష్యా స్పందించింది. అసలు ఈ ఉద్రిక్తతలకు మూలకారణాలను ప్రస్తావించాలని రష్యా డిమాండ్ చేసింది. అయితే ఈ సవరణలను 93 దేశాలు సమర్థించగా 8 దేశాలువ్యతిరేకించాయి. 73 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి. -
Bangladesh: ‘అవన్నీ ప్రభుత్వ హత్యలే’.. దడపుట్టిస్తున్న ఐక్యరాజ్యసమితి రిపోర్టు
బంగ్లాదేశ్లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఎగసిపడింది. అనంతరం జరిగిన పరిణామాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఒక నివేదికను వెలువరించింది. నాడు చెలరేగిన హింసలో 1,400 మంది హతమయ్యారని ఆ నివేదిక బయటపెట్టింది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని పరోక్షంగా పేర్కొంది. నాడు బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనల ఉదంతాలను కూడా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆ నివేదికలో తెలియజేసింది.బంగ్లాదేశ్లో 2024లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. నాటి షేక్ హసీనా ప్రభుత్వం.. నేటి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాల కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను ఈ నివేదికలో వివరంగా పొందుపరిచారు.2024 విద్యార్థి ఉద్యమంలో సుమారు 1,400 మంది హతమయ్యారని నివేదిక పేర్కొంది. భద్రతా దళాలు చిన్నారులతో సహా పలువురు నిరసనకారులను కాల్చిచంపాయని తెలిపింది.తిరుగుబాటు తొలి రోజుల్లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం 150 మంది మరణాలను మాత్రమే నిర్ధారించింది. అయితే ఈ నివేదికలోని వివరాల ప్రకారం వందలాదిగా సాగిన చట్టవిరుద్ధ హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు మొదలైనవన్నీ షేక్ హసీనా ప్రభుత్వంతో పాటు భద్రతా అధికారుల సహకారంతోనే జరిగాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఈ నివేదికలో పేర్కొంది.ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా మతపరమైన మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తున్నదని ఆ నివేదిక ఆరోపించింది. మహిళలు వారి నిరసనను వ్యక్తం చేయకుండా నిరోధించేందుకు వారిపై శారీరక దాడి, అత్యాచారం చేస్తామని పోలీసులు బెదిరించారని కూడా నివేదిక పేర్కొంది. నిరసనలను అణిచివేసే నెపంతో రాజకీయ నేతలు, భద్రతా అధికారులు ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు. విద్యార్థి నేత, అమరవీరుడు అబూ సయీద్ హత్య కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆ నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
International Day of Education 2025 దీని ప్రాముఖ్యత, ఏడాది థీమ్ ఇదే!
International Day of Education 2025 : ప్రతీ ఏడాది జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. జనవరి 24ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 2018 డిసెంబర్ 3, 2018న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, సమానత్వాన్ని తీసుకురావడంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించడం, అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.నైజీరియాతో సహా 58 సభ్య దేశాల మద్దతుతో వచ్చిన ఈ చారిత్రాత్మక తీర్మానం, విద్య ప్రాప్యత , ప్రతి వ్యక్తికి దాని లోతైన ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన అవసరం అని నొక్కి చెబుతుంది.International Day of Education.To grow is to become wise, and the foundation of wisdom is learning.#UGC #Education #InternationalDayofEducation@PMOIndia @EduMinOfIndia @PIB_India pic.twitter.com/Eam5G2Jiq6— UGC INDIA (@ugc_india) January 24, 2025మానవ అభివృద్ధిలో విద్య పాత్రను గుర్తించడంతోపాటు, సమానమైన నాణ్యమైన విద్యను ప్రాథమిక మానవ హక్కుగా ప్రోత్సహించేలా జనవరి 24, 2019న తొలి సారి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు.అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025, థీమ్ఈ సంవత్సరం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం థీమ్ "ఏఐ అండ్ ఎడ్యుకేషన్గా నిర్ణయించారు. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ విలువను పరిరక్షించడం". అంటే ఆటోమేషన్ యుగంలో రోజు రోజుకి అభివృద్ది చెందుతున్న సాంకేతిక తీరుతెన్నులు, పురోగతులు అర్థం చేసుకోవడం, అటువంటి వ్యవస్థలు మానవ నిర్ణయాలు, విద్యా కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రశ్నించడం, విద్యలో కృత్రిమ మేధస్సును పెంచడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.విద్య ప్రాముఖ్యతపేదరికం,లింగ సమానత్వంతో సహా అనేక సమస్యలను పరిష్కరించడంలో విద్య చాలా అవసరం. వ్యక్తిగత అభివృద్ధి, సామూహిక పురోగతిని పెంపొందిస్తుంది. శాంతిని నిర్మించడానికి విద్య ప్రాథమికమైనదని యూఎన్జీఏ పేర్కొంది. సమానమైన నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ జీవితాంతం అవకాశాలను ప్రోత్సహించడంతోపాటు, ఆయా వ్యక్తులు సమాజాలు విద్యకు ప్రాధాన్యతనిచ్చి పెట్టుబడి పెట్టడానికి ఇది పిలుపు.విద్యమనిషిని మనస్సును శక్తివంతం చేస్తుంది. భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నేర్చుకోవడంలోని శక్తిని గుర్తిద్దాం. సెలబ్రేట్ చేసుకుందాం. అది అందరికీ చేరేలా చూసుకుందాం. ఇదీ చదవండి : National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..! -
‘ఐక్యరాజ్య సమితి’లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సందర్శించారు. అంతకు ముందు.. జనరల్ అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ ప్రవచించిన శాంతి, అహింస, ఐక్యత ప్రపంచానికి ఆదర్శమైందని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ కు భారత ప్రతినిధి బృందంలో విజయసాయిరెడ్డి సభ్యులుగా వెళ్లిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ అవకాశంపై ఆయన స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. This week, I am in New York as part of India’s Non-Official Delegation to the 79th Session of the UNGA. Engaging with global stakeholders on critical issues of peace and conflict, we have had the opportunity to interact with UN organizations and representatives from the Permanent… pic.twitter.com/2pMdbTiTvX— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024శాంతి, అంతర్యుద్ధాలు.. లాంటి ఎన్నో అంశాలపై భారత్, ఇతర దేశాల ప్రతినిధులు సాధారణ అసెంబ్లీలో మాట్లాడతారు. నవంబర్ 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది.Offered floral tributes at the Mahatma Gandhi Bust on the United Nations Lawn during the 79th Session of the UNGA. A moment to honor the ideals of peace, nonviolence, and unity that continue to inspire the world. #UNGA79 #MahatmaGandhi #PeaceForAll #GlobalUnity pic.twitter.com/elppFhiAun— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024 -
హెజ్బొల్లాను అంతమే మా లక్ష్యం: నెతన్యాహు
లెబనాన్ సరిహద్దుల్లో పని చేస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందిని టార్గెట్గా ఇజ్రయెల్ సైన్యం దాడులు చేస్తుందని వస్తున్న ఆరోపణలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అసత్యాలని స్పష్టం చేశారు. ప్రధాని నెతన్యాహు మీడియతో మాట్లాడుతూ.. లెబనాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య నెలకొన్న క్రమంలో ఐక్యరాజ్యసమితి శాంతిపరిక్షణ సైనికుల సిబ్బందిని ఆ ప్రాంతంలో తాత్కాలికంగా విధులు ఉపసంహరించుకోవాలని మరోసారి కోరారు.‘‘హెజ్బొల్లా లక్ష్యాలపై దాడి చేస్తున్న సమయంలో లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ(UNIFIL) సిబ్బందికి హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ సైన్యం కృషి చేస్తోంది. అయితే ఉద్రిక్తతలు కొనసాగుతున్న లెబనాన్ సరిహద్దు ప్రాంతాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాలని యూఎన్ఎఫ్ఐఎల్ను ఇజ్రాయెల్ పదేపదే కోరుతోంది. హెజ్బొల్లా టెర్రరిస్టులను నిర్మూలించేందుకు లెబనాన్లోకి దాడులో ప్రారంభించిన రోజున ఈ విషయాన్ని యూఎన్ఎఫ్ఐఎల్ సభ్యులకు తాను విజ్ఞప్తి చేశాను... మా పోరాటం యూఎన్ఎఫ్ఐఎల్, లెబనాన్ ప్రజలతో కాదు. ఇజ్రాయెల్పై దాడి చేయడానికి లెబనాన్ భూభాగాన్ని ఉపయోగించుకునే.. ఇరాన్ అనుబంధ హెజ్బొల్లా గ్రూప్తో మా సైన్యం పోరాటం చేస్తుంది. మా హమాస్ మారణకాండ జరిగిన తర్వాత నుంచి దాడులు చేస్తూనే ఉంది. అయితే లెబనాన్లో హెజ్బొల్లా గ్రూప్ను అంతం చేయటమె ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లక్ష్యం’’ అని అన్నారు.చదవండి: కెనడా ప్రధాని ట్రూడో నోట మళ్లీ పాత పాటే.. -
లెబనాన్ సరిహద్దులో 600 మంది సైనికులు.. భారత్ ఆందోళన
దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్గా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న కాల్పుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లెబనాన్లో ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ మిషన్లో 600 మంది భారతీయ సైనికులు ఉన్నారు. వీరంతా ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో 120 కిలో మీటర్ల బ్లూ లైన్ వెంబడి ఉన్నారు. దీంతో అక్కడి ఉన్న భారత్ సైనిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత్ ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘ బ్లూ లైన్ వెంబడి భద్రతా పరిస్థిలు వేగంగా క్షీణించటంపై మేం ఆందోళన చెందుతున్నాం. అక్కడ నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రాంతాల్లో దాడుల ఉల్లంఘనకు పాల్పడవద్దు. యూఎన్ శాంతి పరిరక్షకుల భద్రత కోసం అక్కడ తగిన చర్యలు తీసుకోవాలి’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం యూఎన్ఐఎఫ్ఐఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న అబ్జర్వేషన్ టవర్పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు యూఎన్ శాంతి పరిరక్షకులు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో పేర్కొంది.‘‘ అదృష్టవశాత్తూ ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. వారు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్నారని తెలిపింది.హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితి పెరిగింది. ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతంలో దాడులు చేయటతో అక్కడే ఉన్న యూఎన్ శాంతి పరిరక్షకులకు ప్రమాదకరంగా మారింది.అయితే.. యూఎన్ఐఎఫ్ఐఎల్ సైనికుల పోస్టులకు సమీపంలో హెజ్బొల్లా బలగాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆరోపణలు చేస్తోంది.చదవండి: ట్రంప్పై ఒబామా విమర్శలు.. అమెరికాకు కమలా హారిస్ కావాలి -
ఇరాన్ దాడులు.. ఐరాస చీఫ్పై ఇజ్రాయెల్ నిషేధం
టెల్ అవివ్: తమ దేశంపై ఇరాన్ భారీ మిసైల్స్తో దాడి చేస్తే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్రంగా ఖండించటంలో విఫలమయ్యారని ఇజ్రాయెల్ మండిపడింది. ఆంటోనియో గుటెర్రెస్ను ‘పర్సనా నాన్ గ్రేటా’గా ప్రకటించింది. ఆయన తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తున్నామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పోషల్ మీడియాలో ఓ పోస్ట్లో పేర్కొంది.‘‘ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన హేయమైన దాడిని నిస్సందేహంగా ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదు. హమాస్, హెజ్బొల్లా, హౌతీలు ఇప్పుడు ఇరాన్ నుంచి ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు ఐరాస సెక్రటరీ జనరల్ మద్దతు ఇస్తున్నారు. ఐక్యరాజ్యసమితి చరిత్రలో ఆంటోనియో గుటెర్స్ ఒక మాయని మచ్చగా మిగిలిపోతారు. ఆంటోనియో గుటెర్స్ ఉన్నా.. లేకపోయినా.. ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుంది. అదేవింధంగా దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది’’ అని ఇజ్రాయెల్ పేర్కొంది.మంగళవారం ఇజ్రాయెల్పై ఇరాన్ సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్.. తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్ను అడ్డుకున్నట్లు ప్రకటించింది.చదవండి: ఇరాన్ దాడులు.. బంకర్లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా? -
పాక్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది: జైశంకర్
న్యూయార్క్: జమ్ము కశ్మీర్పై పాకిస్తాన్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈక్రమంలో భారత్.. పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తగిన ఫలితం తప్పకుండా అనుభవిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. సరిహద్దు ఉగ్రవాదమే పాకిస్తాన్ విధానం అంటూ ఎద్దేవా చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ..‘కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని షరీఫ్ విచిత్రమైన వాదనలు చేశారు. పాక్ తీరుపై భారత్ వైఖరిని నేను స్పష్టం చేస్తున్నా. సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ విధానం ఎప్పటికీ సఫలం కాదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం తగిన ఫలితం అనుభవించక తప్పదు. అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయడం ఒక్కటే రెండు దేశాల మధ్య ఉన్న ఈ సమస్యకు పరిష్కారం. పాకిస్తాన్ దేశ ఆవిర్భావం నుంచి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇందుకు ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం కూడా ఒక కారణం. రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరిపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం, దాని ఎగుమతుల పరంగానే జీడీపీ కొలవాలి అని స్పష్టం చేశారు.ఇక, అంతకుముందు.. ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. కశ్మీర్ అంశంలో అక్కసు వెళ్లగక్కారు. కశ్మీర్లో పరిస్థితిని పాలస్తీనాతో పోల్చారు. ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు సైతం స్వేచ్ఛ, నిర్ణయాధికారం పోరాటం చేస్తున్నారు. భారత్ చట్ట విరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ హెచ్చరిక.. ఇరాన్ కీలక నిర్ణయం -
‘నెలసరి’ సెలవులకూ వేతనం: గళమెత్తిన ప్రియదర్శిని
నెలసరి లేదా పీరియడ్, ఈ సమయంలో మహాళలు అనుభవించే బాధ, వేదన వారికే మాత్రమే తెలుసు. ఇన్ని రోజులూ అదేదో పాపంలాగా, దేవుడిచ్చిన శాపంలాగా అనుకుంటూ ఆడవాళ్లు పంటి బిగువున ఆ బాధనంతా భరిస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్ పెయిడ్ లీవ. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని (Ranjeeta Priyadarshini) ఐక్యరాజ్యసమితి (UN) సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు.రంజీతా ప్రియదర్శిని, న్యూయార్క్లోని 79వ యుఎన్జిఎలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో మహిళలకు చెల్లింపు రుతుస్రావ సెలవుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్టు ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్బంగా తన అనుభవాన్ని పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినపుడు తనపై అధికారినుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం, మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది.. మార్పునకు పునాది పడింది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళలను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచేందుక బాటలు వేసింది. మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్లో ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్ -
ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి!
పర్యాటకులు ప్రతి ఒక్కరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అది అభిరుచి. అలాగే ప్రకృతిని ప్రేమించాలి. అది బాధ్యత. ఎకో టూరిజమ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే నియమావళి స్పష్టంగా ఉంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం, పర్యావరణానికి హాని కలిగించే ప్లాలాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడి పారేసే పాలిథిన్ కవర్లను తీసుకెళ్లరాదు.పిల్లలు, డయాబెటిస్ పేషెంట్లు, పెద్దవాళ్లతో వెళ్లేటప్పుడు బ్రెడ్, బిస్కట్, చాక్లెట్ల వంటివి దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు తమతో తీసుకువెళ్లిన నాన్ డీ గ్రేడబుల్ వస్తువులను పర్యాటక ప్రదేశంలో పడవేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన మున్సిపాలిటటీ డస్ట్బిన్లలో వేయాలి. పవిత్రస్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు ప్రార్థనామందిరాలు ఇతర ధార్మిక ప్రదేశాలలో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలి.నేచర్ ప్లేస్లకు వెళ్లినప్పుడు శబ్దకాలుష్యాన్ని నివారించాలి. రేడియో, టేప్రికార్డర్, డీజే, మైక్లు పెద్ద సౌండ్తో పెట్టకూడదు. మలమూత్ర విసర్జన కోసం గుడారాల వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేటప్పుడు వాటర్బాడీలకు కనీసం వంద అడుగుల దూరాన్ని ΄ాటించాలి. అలాగే విసర్జన తర్వాత మట్టి లేదా ఇసుకతో కప్పేయాలి.పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు తీసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. వారితో కలిసి ఫొటో తీసుకోవాలనుకుంటే వారి అనుమతితో మాత్రమే తీసుకోవాలి. వారికి తెలియకుండా వారిని ఫ్రేమ్లోకి తీసుకునే ప్రయత్నం చేయరాదు.చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు, పూలను కోయరాదు. ఇది నేరం కూడా. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవవైవిధ్యత సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నది, కాలువ, సరస్సు, తటాకాల్లో సబ్బులతో స్నానం చేయడం, దుస్తులు ఉతకడం నిషిద్ధం.నిప్పు రవ్వలు ఎగిరిపడితే అడవులు కాలిపోతాయి. కాబట్టి అడవులలో వంట కోసం కట్టెలతో మంట వేయరాదు. అలాగే సిగరెట్ పీకలను కూడా నేలమీద వేయకూడదు.అడవుల్లో ఆల్కహాల్, డ్రగ్స్ సేవనం, మత్తు కలిగించేవన్నీ నిషేధం. స్థానికులకు చాక్లెట్లు, స్వీట్స్, ఆహారపదార్థాల ఆశ చూపించి వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు. అలాగే ఆయా ప్రదేశాల్లో నెలకొన్న సంప్రదాయ విశ్వాసాలను గౌరవించాలి. వారి అలవాట్లను హేళన చేయరాదు. -
మెరబ్కు సీఎం రేవంత్ అభినందన
మొయినాబాద్: ఐక్యరాజ్య సమితి యూత్ కాన్ఫరెన్స్కు ఎంపికై న మెరల్ మెరబ్ను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ నుంచి పది మందికి అవకాశం రాగా.. తెలంగాణ నుంచి మెరబ్ సెలక్ట్ అయ్యారు. ఈమె తండ్రి వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన కృపావరం.. కొన్నేళ్లుగా మొయినాబాద్లోని చర్చిలో పాస్టర్గా పనిచేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. మెరబ్ ఘట్కేసర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలలో గతేడాది డిగ్రీ పూర్తి చేసింది. 2023లో నిర్వహించిన పరీక్షకు హాజరై.. ప్రస్తుతం జరిగే ఐరాస యూత్ కాన్ఫరెన్స్కు ఎంపికై ంది. ఆగస్టు 2 నుంచి 5 వరకు మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగే కాన్ఫరెన్స్కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.సీఎం సభ ఏర్పాట్ల పరిశీలనకందుకూరు: మీర్ఖాన్పేటలో గురువారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నెట్ జీరో సిటీలో కొనసాగుతున్న సభ ఏర్పాట్లను బుధవారం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహరెడ్డి, ముదిరాజ్ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఆర్డీఓ సూరజ్కుమార్, తహసీల్దార్ గోపాల్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.ప్రభాకర్రెడ్డి, ఎండీ అప్జల్బేగ్, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, ఎస్.పాండు, కె.విష్ణువర్ధన్రెడ్డి, కె.మదన్పాల్రెడ్డి, కె.వెంకటేశ్, ఢిల్లీ కృష్ణ, జి.దర్శన్, ఈ.శ్రీకాంత్రెడ్డి, ఎ.జగదీశ్, జి.యదయ్య, దేవేందర్, ప్రశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.డిజిటల్ నంబర్.. క్యూఆర్ కోడ్సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్కు జీఐఎస్ మ్యాపింగ్ సర్వేతో పాటు దానికి అనుబంధంగా డిజిటల్ డోర్ నంబర్ల ప్రక్రియ కూడా జరుగుతున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. జీఐఎస్ సర్వే ద్వారా అన్ని ఆస్తుల జియో ట్యాగింగ్ పూర్తయ్యాక అన్ని ఇళ్లకూ ప్రత్యేక క్రమసంఖ్యతో డిజిటల్ డోర్ నంబర్ జారీ అవుతుందని తెలిపారు. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ప్లేట్లను ఇళ్ల బయట తలుపులకు బిగించనున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికత ఆధారంగా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా వాటిని తయారు చేయించనున్నట్లు తెలిపారు. తద్వారా ఈ–గవర్నెన్స్కు యాక్సెస్ సులభం కావడంతోపాటు అత్యవసర సమయాల్లో ప్రజలకు తగిన సహాయం అందించేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అన్ని పబ్లిక్ యుటిలిటీస్ను ఒక ఐడీకి కనెక్ట్ చేయడం ద్వారా అన్ని విభాగాల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుందని తెలిపారు. మెరుగైన పట్టణ నిర్వహణ, ప్రజా సదుపాయాల కోసం జరుగుతున్న జీఐఎస్ సర్వేకు ప్రజలు సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది సేకరించరు అని పేర్కొన్నారు. ప్రజల గోప్యత, భద్రతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. -
World Elder Abuse Awareness Day : మెయింటెనెన్స్ హక్కులు, ఆసక్తికర సంగతులు
ఈ రోజు (జూన్ 15) ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం (WEAAD, world elder abuse awareness day) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (INPEA) జూన్ 2006లో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డేని స్థాపించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని డిసెంబర్ 2011లో అధికారికంగా గుర్తించింది. వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఎదుర్కొనే వేధింపులు దోపిడీ గురించి అవగాహన పెంచడమే ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం లక్ష్యం.ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నారు. సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. కుటుంబం సంక్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వారికి జీవిత చరమాంకంలో సముచిత స్థానం లభించడం లేదు సరికదా, వృద్ధులపై జరుగుతున్న పలురకాల హింస,దాడులు బాధాకరం. భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులను ఎదుర్కొంటున్నారు.ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్పూర్, కాన్పూర్ , మదురై సహా అనేక నగరాలను ఈ సర్వేలో చేర్చారు. అందిన నివేదిక ప్రకారం, 73శాతం మంది యువకులు వృద్ధుల పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మందిలో ఒకరు ఈ వేధింపులకు గురవుతున్నారు.కన్నబిడ్డల్నితల్లిదండ్రులు ఎంత అప్యాయంగా, ప్రేమగా పెంచి, ఆసరాగా ఉన్నట్లే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి బిడ్డ విధి. కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తోంది. ఆస్తి కోసం, శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. సామాన్య మానవుల నుంచి కార్పొరేట్ కుటుంబాల దాకా ఇలాంటి సంఘటనలను ప్రతీనిత్యం చూస్తూనే ఉన్నాంWEAAD 2024 థీమ్: అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులపై ప్రత్యేక దృష్టి అనేది ఈ ఏడాది థీమ్. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు , కోవిడ్ -19 లాంటి సంక్షోభ పరిస్థితుల్లో వృద్ధులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను ఇది నొక్కి చెబుతుంది. అత్యవసర సమయాల్లో వృద్ధుల నిర్దిష్ట అవసరాలు పరిష్కరించడం చాలా కీలకమనే విషయాన్ని తెలియజేస్తుంది.వృద్ధులు లేదా సీనియర్ సిటిజన్ల హక్కులను, కుటుంబ సభ్యులతోపాటు, సమాజం కూడా గుర్తించాలి. వృద్ధులకు విలువనిచ్చి, వారిని గౌరవించే సమాజాన్ని సృష్టించేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం, సాంఘిక సంఘాలు ఐక్యంగా ఉంటూ, వృద్ధులు శారీరకంగా, భావోద్వేగంగా, ఆర్థికంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని నిర్మించాలి.చట్టాలుసీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల చట్టపరమైన హక్కులు సీనియర్ సిటిజన్ను ఎక్కడైనా వదిలిపెట్టడం చట్టరీత్యా నేరం. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలని, అలాగే సీనియర్ సిటిజన్లకు తగిన వైద్య సంరక్షణను అందించాలని కూడా ఈ చట్టం చెబుతుంది.ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రతి హిందువు తన/ఆమె జీవితకాలంలో తన/ఆమె వృద్ధులైన లేదా బలహీనమైన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యతను విధిస్తుంది. కాబట్టి, వృద్ధులు లేదా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులను కాపాడుకోవడం కొడుకులు, కుమార్తెలు ఇద్దరి బాధ్యత ఉంటుంది.తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007 కింద, వారు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో దరఖాస్తును ఫైల్ చేయవచ్చు. పిల్లలు లేదా బంధువులు వీరిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు గుర్తిస్తే, వారికి నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎంత మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటుందో అనేది కూడా కోర్టు విచారణ చేసిన నిర్ణయిస్తుంది దరఖాస్తు తేదీ నుండి మెయింటెనెన్స్ మొత్తంపై వడ్డీ (5-8 శాతం) తో కలిపి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు ఆర్డర్ తర్వాత కూడా మెయింటెనెన్స్ అందకపోతే ఏదైనా ఇలాంటి కోర్టు (మెయింటెనెన్స్ ట్రిబ్యునల్)కి వెళ్లి, ఆర్డర్ను అమలు చేయడంలో సహాయం కోసం అడగవచ్చు. -
UNSC: బైడెన్ తీర్మానాన్ని స్వాగతించిన హమాస్
న్యూయార్క్: గాజా యుద్ధంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమతి భద్రతామండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రష్యా మినహా మిగతా 14 భద్రతా మండలి సభ్య దేశాలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని హమాస్ స్వాగతించింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు అమలు చేసే ప్రణాళికకు మద్దుతుగా ఉంటామని, అది కూడా పాలస్తీనా ప్రజలకు డిమాండ్లకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నామని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.మే 31న ఇజ్రాయెల్ చొరవతో మూడు దశల కాల్పుల విరమణ ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ‘ఈ రోజు మేము శాంతి కోసం ఓటు వేశాం’ అని ఐరాసలో యూఎస్ అంబాసిడర్ లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ అన్నారు. ఇక ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. హమాస్ కూడా ఈ తీర్మానాన్ని అంగీకరించాలని కోరింది. హమాస్, పాలస్తీనా మధ్య అంతర్జాతీయంగా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలు అంగీకరించనట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి శాంతి ఒప్పదం కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలతో సమావేశం అయిన అనంతరం ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఇక.. ఈ తీర్మాణంపై రష్యా విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ నుంచి వివరణాత్మక ఒప్పందాలు లేకపోవడాన్ని రష్యా ఎత్తిచూపింది. తీర్మానం ప్రకారం.. కాల్పుల విరణమ ప్రణాళిక మూడు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడితో కూడిన కాల్పుల విరమణ ఉంటుంది. రెండో దశలో ఇరుపక్షాలు శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలకాలి. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. మూడో దశలో గాజా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టే ప్రణాళికను అమలు చేయటం జరుగుతుంది. -
Israel-Hamas war: గాజాపై ఇజ్రాయెల్ దాడులు... 18 మంది దుర్మరణం
డెయిర్ అల్ బలాహ్(గాజా): సెంట్రల్ గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. నుసెయిరత్లో ఐరాస శరణార్థి శిబిరం నడుస్తున్న స్కూలుపై గురువారం జరిపిన దాడిలో 33 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఇజ్రాయెల్ సైన్యం డెయిర్ అల్ బలాహ్, జవాయిడా పట్టణాల్లోనిసెయిరత్, మఘాజి శరణార్థి శిబిరాలపై శుక్రవారం రాత్రి జరిపిన దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నట్లు అల్–హక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, గురువారం నుసెయిరత్లోని స్కూల్పై జరిపిన దాడిని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. స్కూల్ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో జరిగిన లక్షిత దాడుల్లో మృతి చెందిన వారిలో 9 మంది మిలిటెంట్లు ఉన్నట్లు వివరించింది. రెండు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మిలిటెంట్ల సొరంగాలను, మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు ఆర్మీ తెలిపింది. -
గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఓ భారతీయ వ్యక్తి మృతి చెందినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ హాస్పటల్కు వెళ్తుతున్న క్రమంలో ఒక్కసారిగా జరిగిన దాడిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుతో ఉన్న మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇక.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐక్యరాజ్య సమితికి చెందిన తొలి వ్యక్తి మరణంగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.మరణించిన వ్యక్తి ఐక్యరాజ్య సమితిలోని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగానికి( DSS) చెందిన భారతీయ వ్యక్తిగా తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి భారత దేశానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడని సమాచారం.Today a @UN vehicle was struck in Gaza, killing one of our colleagues & injuring another. More than 190 UN staff have been killed in Gaza.Humanitarian workers must be protected.I condemn all attacks on UN personnel and reiterate my urgent appeal for an immediate humanitarian…— António Guterres (@antonioguterres) May 13, 2024‘‘ఐక్యరాజ్య సమితి చెందిన డీఎస్ఎస్ విభాగంలోని సభ్యుడు మరణించటం చాలా బాధాకరం. ఈ ఘటనలో మరో సభ్యుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రఫాలోని యూరోపియన్ ఆస్పత్రికి తమ వాహనంలో వెళ్తున్న క్రమంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది’’ అని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెర్రెస్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.ఈ దాడి ఘటనను యూఎన్ఓ జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ తీవ్రంగా ఖండించారు. యూఎన్ఓ సిబ్బందిపై జరిగిన అన్ని దాడులపై దర్యాప్తు చేస్తామని అన్నారు. అదేవిధంగా డిఎస్ఎస్ విభాగానికి చెందని సభ్యుడి మరణం పట్ల యూఎన్ఓ జనరల్ సెక్రటరీ గుట్రెస్ సంతాపం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. -
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
టెల్ అవీవ్: ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపితే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడుల్ని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్ను ఆక్రమించాయి. గాజా పోరులో ఈ ఆక్రమణ కీలక ఘట్టమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ రఫా క్రాసింగ్ నుంచే ఆదివారం రాత్రి హమాస్ దళాలు దక్షిణ ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందడంతో ఐడీఎఫ్ తన ఆపరేషన్ను ప్రారంభించింది. రఫా క్రాసింగ్ ఆక్రమణ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అంతకు ముందు..రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. హమాస్ సంస్థ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విరమణ ఒప్పందం.. తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం కైరోలో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్ యథావిధిగా పాల్గొంటోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆ చర్చలు కొనసాగుతున్న వేళలోనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై రఫాపై మిలిటరీ ఆపరేషన్కు పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమణతో రఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్టు నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ చర్యను పరిమితమైన ఆక్రమణగానే పేర్కొంటోంది. -
పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వ తీర్మానం.. వీటో పవర్ వాడిన అమెరికా
ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానంపై ఓటింగ్ సమయంలో అగ్రరాజ్యం అమెరికా వీటో పవర్ను వినియోగించింది. 193 దేశాలు సభ్యతం గల ఐరాసలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ సందర్భంగా 12 కౌన్సిల్ సభ్యదేశాలు పాలస్తీనా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇక.. బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అమెరికా వీటో ఉపయోగించటంతో ఈ తీర్మానం వీగిపోయింది. ‘రెండు దేశాల సమస్య పరిష్కారానికి అమెరికా ఎప్పుడూ మద్దుతు ఇస్తుంది. ఈ ఓటు పాలస్తీనా ప్రత్యేక దేశానికి వ్యతిరేకమైంది కాదు. అయితే ఇరు దేశాల మధ్య పత్యక్ష చర్చల ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని యూఎన్లో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ భద్రతామండలికి తెలిపారు. తీర్మానాన్ని అమెరికా వీటో చేయటంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. ‘పాలస్తీనా శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయటం చాలా అనైతికం, అన్యాయం’ అని అన్నారు. ‘ఈ తీర్మానంపై ఆమోదం పొందలేదనే విషయం పాలస్తీనా ప్రయత్నాన్ని తగ్గించదు. అదే విధంగా పాలస్తీనా సంకల్పాన్ని ఓడించదు. మా ప్రయత్నం ఆగదు’ అని యూఎన్లో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ ఒకింత భావోద్వేగంతో అన్నారు. -
ఐరాసలో సంస్కరణలకు మద్దతు ఇస్తాం: అమెరికా
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా వెల్లడించింది. ఐరాస, ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేయడాని అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్య విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. బుధవారం మీడియాతో వేదాంత్ పటేల్ మాట్లాడారు. ఇటీవల ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రస్తావనకు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానం ఇచ్చారు. ‘ఇప్పటికే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అమెరికా అధ్యక్షడు ఈ విషయం గురించి మాట్లాడారు. అదేవిధంగా ఐరాస కార్యదర్శి సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. మనం ప్రస్తుతం 21 శతాబ్దంలో ఉన్నాం. దానిని ప్రతిబింబించేలా ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో తప్పకుండా మార్పులు అవసరం. ఐరాస సంస్కరణలకు తాము(అమెరికా) కచ్చితంగా మద్దతు ఇస్తాం. అయితే ఎలాంటి సంస్కరణలు చేయాలో అనే ప్రత్యేకమైన సూచనల తమ వద్ద లేవు. కానీ, ఐరాసలో మార్పులు అవసరమని మేం కూడా గుర్తించాం’ అని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు. ఇక... జనవరిలో ఐక్యరాజ్యసమితి పనితీరుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న విషయం తెలిసిందే. భద్రతా మండలిలో భారత్ వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. అదీకాక.. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అని ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక.. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి స్థాపించారు. ఐరాసకు అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో ఎటువంటి మార్పులూ చోటుచేసుకోకపోవటం గమనార్హం. అయితే శక్తివంతమైన వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్లే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా పట్టుబడుతున్నా దక్కటం లేదు. ఐదింట నాలుగు దేశాలు భారత్కు అనుకూలంగానే ఉన్నప్పటికీ పొరుగుదేశం చైనా అడ్దుకుంటోంది. -
‘ఐఎస్ఐఎస్’కి అడ్డాగా ఆఫ్రికా దేశాలు?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా అల్లకల్లోలంగా మారిన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఇప్పుడు ‘ఐఎస్ఐఎస్’కి అనువైన గమ్యస్థానాలుగా మారుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పేదరికం,ఆకలితో పాటు పశ్చిమ ఆఫ్రికా దేశాలు అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్నాయి. నైజర్, మాలి, బుర్కినా ఫాసో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ దేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు అక్కడి తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలు ముప్పుగా పరిణమించాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ఐఎస్ఐఎస్’ విదేశాల్లో దాడులు చేయాలనుకుంటోందనే సమాచారం తమకు నిఘా వర్గాల ద్వారా అందిందని, అలాగే ఆ సంస్థ ఉగ్రవాదులు ఆఫ్రికన్ దేశాలను తమ కొత్త స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి
లష్కరే తోయిబా(LeT) వ్యవస్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి(UNO)ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్కు డిప్యూటీగా వ్యవహరించిన సలాం భుట్టావి మరణించినట్లు యూఎన్ఓ భద్రతా మండలి నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించింది. 2008 ముంబై 26/11 దాడుల కుట్రదారుల్లో ఒకరైన సలాం భుట్టావి గుండెపోటుతో 2023 మేలో మృతి చెందినట్లు పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడిలో ఉన్న భుట్టావి పంజాబ్ ప్రావిన్స్లోని మురిధేలో మరణించారు. లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో 166 మంది మృతి చెందగా.. సుమారు 300 మంది గాయపడ్డారు. ఐఖ్య రాజ్య సమితి నిషేధించిన మహమ్మద్హఫీజ్ సయీద్ను ముంబై దాడుల ఘటనకు సంబంధించి విచారించడం కోసం తమకు అప్పగించాలని పాకిస్థాన్ను భారత్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. చదవండి: అమెరికా, బ్రిటన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే.. హెచ్చరించిన హౌతీలు -
డిసెంబరులో కరోనాతో 10 వేలమంది మృతి!
కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయి ప్రత్యేకించి కరోనా జెఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సింగపూర్, అమెరికాలో కరోనా వేవ్ అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశంలో కూడా గడచిన 50 రోజుల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలోనే పెరిగాయి. ఇటీవలి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో జనం జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ మరింతగా విస్తరించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అధనామ్ తెలిపారు. గత డిసెంబర్లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది మరణించారని పేర్కొన్నారు. 50 దేశాల నుంచి అందిన డేటా ప్రకారం ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య కూడా 42 శాతం మేరకు పెరిగిందన్నారు. భారతదేశంలో కూడా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రతిరోజూ సగటున 600 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 514 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,422. దీనికిముందు అంటే బుధవారం కొత్తగా 605 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కారణంగా రోజుకు సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం.. ఐరాసలో భారత్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ అంశంతో మరోసారి ఆచితూచి వ్యవహరించింది. తాజాగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటువేసింది. ఇక, తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. వివరాల ప్రకారం.. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలెం, సిరియాకు చెందిన గోలాన్ హైట్స్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా.. 18 దేశాలు తటస్థంగా ఓటు వేశాయి. మరోవైపు.. కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్, మార్షల్ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, అమెరికా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరోవైపు, ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ యద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరైంది. దీనిలో హమాస్ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్ వ్యతిరేకించింది. అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్కు భారత్ సహా 45 దేశాలు గైర్హాజరయ్యాయి. 120 దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేశాయి. 🔥🔥BIG UPDATE 🔥🔥 India Supports UN Resolution Condemning Israeli Settlements In Palestine This comes weeks after India abstained from a vote on a UN resolution calling for "immediate, durable and sustained humanitarian truce" in Gaza Strip. India has voted in favour of a… pic.twitter.com/fttSp5xiWq — Resonant News🌍 (@Resonant_News) November 12, 2023 గాజాలో దారుణ పరిస్థితులు.. ఇదిలా ఉండగా.. గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సందర్భంగా పాలస్తీనా అధికారులు శుక్రవారం మాట్లాడుతూ.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 11,078 మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. వారిలో దాదాపు 40శాతం మంది చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. గాజాపై నిరంతరం వైమానిక, శతఘ్ని దాడులు నిర్వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన వైద్యసేవలు.. కరెంటు సరఫరా లేకపోవడంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. ఇది కూడా చదవండి: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్ -
2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? భారత్, చైనా పరిస్థితి ఏమిటి?
పెరుగుతున్న జనాభాపై ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారితీస్తుందని వాపోతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి అందించిన ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలోని వివరాలు మన ఊహలకు భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్లో ప్రపంచ జనాభాలో తగ్గుదల కనిపించనున్నదని ఈ నివేదిక వెల్లడించింది. దీనికి వెనుకనున్న కారణాలేమిటో కూడా తెలియజేసింది. ప్రపంచంలో 2100 నాటికి మొత్తం జనాభా ఎంత ఉంటుందనే దానిపై ఈ నివేదికలో అంచనా అందించారు. దీనిలో భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్, అమెరికా, యూరోపియన్ దేశాల జనాభాకు సంబంధించి అంచనాలున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2021లో భారతదేశ జనాభా 153 కోట్లు. ప్రస్తుత జనాభా దాదాపు 140 కోట్లు. అంటే 2021కి.. ఇప్పటికి(2023) జనాభాలో తగ్గుదల కనిపించింది. దీని ప్రకారం చూస్తే వచ్చే 77 ఏళ్లలో అంటే 2100 నాటికి భారతదేశ జనాభా 13 కోట్ల మేరకు మాత్రమే పెరగనుంది. 2100వ సంవత్సరంలో ప్రపంచ జనాభాలో గణనీయమైన పెరుగుదల ఉండకపోవచ్చంటూ ఈ అంచనాలలో పేర్కొన్నారు. ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం చైనాతో ముడిపడివుంది. 2100 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుంచి దాదాపు 77 కోట్లకు తగ్గిపోనుంది. యూఎన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐఐఏఎస్ఏ)లు అందించిన డేటాలలోని అంశాలను క్రోడీకరించి 2100నాటి జనాభా అంచనాలను రూపొందించారు. ప్రపంచ జనాభా 2086 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేట్లు 2050కి ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని ఈ అంచనాలలో వెల్లడయ్యింది. 2100కి వీటి స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు జనన రేటు తగ్గుతుంది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం, గర్భనిరోధకాల లభ్యత, కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం, అధిక సంతాన ఖర్చులు మొదలైనవి సంతానోత్పత్తి తగ్గుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి. 2100 నాటికి వివిధ దేశాల జనాభా ఎంత ఉండవచ్చనే అంచనాలను ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలో అందించారు. 2100 నాటికి ఏ దేశంలో ఎంత జనాభా(అంచనా)? భారతదేశం: 153 కోట్లు చైనా: 77 కోట్ల 10 లక్షలు నైజీరియా: 54 కోట్ల 60 లక్షలు పాకిస్తాన్: 48 కోట్ల 70 లక్షలు కాంగో: 43 కోట్ల 10 లక్షలు అమెరికా: 39 కోట్ల 40 లక్షలు ఇథియోపియా: 32 కోట్ల 30 లక్షలు ఇండోనేషియా: 29 కోట్ల 70 లక్షలు టాంజానియా: 24 కోట్ల 40 లక్షలు ఈజిప్ట్: 20 కోట్ల 50 లక్షలు బ్రెజిల్: 18 కోట్ల 50 లక్షలు ఫిలిప్పీన్స్: 18 కోట్లు బంగ్లాదేశ్: 17 కోట్ల 70 లక్షలు సూడాన్: 14 కోట్ల 20 లక్షలు అంగోలా: 13 కోట్ల 30 లక్షలు ఉగాండా: 13 కోట్ల 20 లక్షలు మెక్సికో: 11 కోట్ల 60 లక్షలు కెన్యా: 11 కోట్ల 30 లక్షలు రష్యా: 11 కోట్ల 20 లక్షలు ఇరాక్: 11 కోట్ల 10 లక్షలు ఆఫ్ఘనిస్తాన్: 11 కోట్లు మొజాంబిక్: 10 కోట్ల 60 లక్షలు వియత్నాం: 9 కోట్ల 10 లక్షలు కామెరూన్: 8 కోట్ల 70 లక్షలు మాలి: 8 కోట్ల 70 లక్షలు మడగాస్కర్: 8 కోట్ల 30 లక్షలు టర్కీ: 8 కోట్ల 20 లక్షలు ఇరాన్: 7 కోట్ల 90 లక్షలు దక్షిణాఫ్రికా: 7 కోట్ల 40 లక్షలు యెమెన్: 7 కోట్ల 40 లక్షలు జపాన్: 7 కోట్ల 40 లక్షలు ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు! -
గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందన
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్ స్పందించింది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ప్రకటించారు. కాల్పుల విరమణ పాటిస్తేనే.. మానవతా సాయం గాజాకు అందుతుందని, లేకుంటే అక్కడి పరిస్థితులు మానవతా సంక్షోభానికి దారి తీస్తాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నెతన్యాహూ స్పందించారు. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో కాల్పలు విరమణ ఉండదు. ఎందుకంటే అది హమాస్కు లొంగిపోవడమే అవుతుంది గనుక అని అన్నారాయన. ‘‘కాల్పుల విరమణ కోసం ఇస్తున్న పిలుపు.. ఇజ్రాయెల్ హమాస్కు లొంగిపోవాలని, ఉగ్రవాదానికి లొంగిపోవాలని పిలుపు ఇవ్వడమే అవుతుంది. కాబట్టి అది జరగదు. యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుంది అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సోమవారం ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా కూడా కాల్పుల విరమణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.‘‘ప్రస్తుత ఉద్రిక్తతలకు కాల్పుల విరమణ సరైన సమాధానం అని మేము భావించం అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. అయితే గాజాలో సాయం అందాలంటే.. యుద్ధ విరమణల సమయం కేటాయిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
భారత జాతీయతకే తీరని అవమానం..సిగ్గుగా ఉంది: ప్రియాంక గాంధీ ధ్వజం
ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనే ధర్మాలకు ప్రతీక అయిన భారత దేశం దీనికి దూరంగా ఉండటం సిగ్గు చేటు అంటూ మోదీ సర్కార్పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విటర్ ద్వారా ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. అహింస, సత్యం అనే సిద్దాంతాల పునాదుల మీదే మన దేశం ఆవిష్కృతమైంది. ఈ సిద్ధాంతాల కోసమే స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశానికి స్వేచ్ఛని ప్రసాదించారు. మన జాతీయతకు నిదర్శనమైన ఈ సూత్రాలకోసం జీవితమంతా నిలబడిన దేశానికి భిన్నంగా మోదీ సర్కార్ వ్యవహరించిందంటూ ట్వీట్ చేశారు. పాలస్తీనాలో వేలాది మంది పురుషులు మహిళలు, పిల్లలను హత మార్చడాన్ని మౌనంగా చూస్తూ ఉండటం భారత దేశ మూల సూత్రాలకే విరుద్ధమని మండిపడ్డారు. కంటికి కన్ను అనే విధానం మొత్తం ప్రపంచాన్ని అంధత్వంలోని నెట్టేస్తుందన్న గాంధీజీ కోట్ను తన ప్రకటనకు ప్రియాంక జోడించారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. గాజా స్ట్రిప్కు సహాయం అందించాలని ,పౌరులకు రక్షణ కల్పించాలని కూడా తీర్మానం డిమాండ్ చేసింది. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు. భారత్తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. “An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza. Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023 -
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్పై ఇజ్రాయెల్ ఆగ్రహం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే 19 రోజులు దాటింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య ఏడువేలు దాటింది. ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని గమనిస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)లో కూడా ఈ యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయి. వీటినడుమ ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై హమాస్ సాగిస్తున్న దారుణాలపై ఆంటోనియో గుటెర్రెస్ ఉపేక్ష వహిస్తున్నట్టు కనిపిస్తున్నారని, అందుకే ఆయన ఐక్యరాజ్యసమితికి నాయకత్వం వహించడానికి తగినవారు కాదని ఎర్డాన్ ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇజ్రాయెల్, యూదు ప్రజలపై దురాగతాలకు తెగబడుతున్న వారిపై సానుభూతి తెలిపేవారితో తాను మాట్లాడటంలో అర్థం లేదని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, హమాస్ ఎటువంటి కారణం లేకుండా దాడులు చేసి ఉండదని తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని అన్నారు. పాలస్తీనా ప్రజలు 56 ఏళ్లుగా దురాక్రమణలను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ హమాస్ దాడులను సమర్థించలేమని కూడా ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: భారత్ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు! -
ఇంటర్నేషనల్ ఫుడ్ డే: ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతోందో తెలుసా?
World Food Day 2023: ప్రపంచ ఆహార దినోత్సవం 2023: సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు సరైన పోషకాహారంలేక, పరిశుభ్రమైననీరు అందుబాటులో లేక నానా కష్టాలుపడుతున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ భూమ్మీద ప్రతి వ్యక్తికి సరైన పోషకాహారం, సరైన ఆహారం లభించేలా అవగాహన పెంచడం, సంబంధిత చర్యలు తీసుకోవడంపై ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు మీకోసం.. 1979లో, FAO సమావేశంలో, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచ సెలవుదినంగా ఆమోదించారు. ఆ తర్వాత, 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి. 2023 వరల్డ్ ఫుడ్ డే ధీమ్ ఏంటంటే ‘‘నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’ భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం, మన శరీరాల్లో 50శాతం పైగా నీరే ఉంటుంది. అసలు ఈ ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా సాధ్య పడుతుందా? అలాంటి అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రపంచ జనాభాలో ఎంతమందికి కడుపునిండా భోజనం దొరుకుతోంది? అసలు ఎంత ఆహారం వృథా అవుతోంది మీకు తెలుసా? మీకు తెలుసా... ►ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 16వ తేదీని ఇంటర్నేషనల్ ఫుడ్ డేను ఆచరిస్తున్నాం. ► ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా... ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత కూడా లేదు. ►ఇజ్రాయెల్ - పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్ల మాదిరిగా యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత తగ్గిపోతోంది. ►అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది. ► కోవిడ్-19 పుణ్యమా అని పేదల ఆర్థిక స్తోమత మరింత దిగజారిపోయింది. ఫలితంగా చాలామందికి ప్రతి రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టమవుతోంది. Water is not an infinite resource. We need to stop taking it for granted. What we eat and how that food is produced all affect water. On #WorldFoodDay @FAO calls on countries to take greater #WaterAction for food.https://t.co/DKBqAUky9y pic.twitter.com/I3TYWf4LrL — UN Environment Programme (@UNEP) October 16, 2023 ► ఆకలి మనిషి శరీరాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వాటిల్లో ఒకటి మాత్రమే. భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మంది వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు. ►ఆకలి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. రక్తహీనత, విటమిన్ లోపాలు వాటిల్లో కొన్ని మాత్రమే. ►మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కూడా ఆకలి కారణమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. మనోవ్యాకులత (డిప్రెషన్) యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతారు. ఇవీ చదవండి: ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు ఆకలి సూచీలో అధోగతి -
మన విద్యార్థులు యూఎన్ఓకు వెళ్లడం రాష్ట్రనికే గర్వకారణం
సాక్షి, అమరావతి: పదో తరగతిలో అత్యుత్తమ ఫలి తాలతో టాపర్స్గా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనే ఐక్యరాజ్య సమితికి పంపించామని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన శనివారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు, మీడియా ఉద్దేశపూర్వకంగా వీరిపై తప్పుడు కథనాలు ఇస్తున్నాయని, విద్యార్థులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరిస్తే వారితో పాటు తల్లిదండ్రుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని, మన విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం 8, 9, 10 తరగతుల మేథమెటిక్స్, సైన్స్ పాఠ్యాంశాల మార్పుపై ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్కు అనుగుణంగా నియామకాలు చేపడతామని అన్నా రు. టీచర్ పోస్టుల భర్తీపై కూడా త్వరలోనే నిర్ణ యం తీసుకుంటామని చెప్పారు. సీపీఎస్ విధానంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతున్నందున కేంద్రం కూడా ఒప్పుకోవడంలేదని, అందుకే జీపీఎస్ను తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యోగులు దీనిపై సహృదయంతో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. -
పటిష్ట విద్యా వ్యవస్థతో యువత ప్రగతి
సాక్షి, అమరావతి: ఒక దేశం ఆర్థికంగా, శక్తివంతంగా ఎదగాలంటే ఉన్నత విలువలు గల యువత పాత్ర ఎంతో కీలకమని ఐక్యరాజ్య సమితి సదస్సులో ఏపీ విద్యార్థులు తెలిపారు. యువత ప్రగతికి పటిష్టమైన విద్యా వ్యవస్థ అవసరమని, ఇది భారతదేశంలోను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను బలంగా ఉందని చాటిచెప్పారు. ఏపీ నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఎస్డీజీ సమ్మిట్కు వెళ్లిన విషయం తెలిసిందే. వీరు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ విభాగంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్కు వీరు హాజరయ్యారు. యూఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్కుమార్ నేతృత్వంలో సదస్సుకు హాజరైన విద్యార్థినులు రాజేశ్వరి, షేక్ అమ్మాజాన్ తమ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆర్థిక ప్రగతిలో యువత పాత్ర, భారతదేశంలో సుస్థిరాభివృద్ధి, ప్రజావైద్యం అంశాలపైన, రాష్ట్రంలో ప్రజా వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్పై వారు ప్రసంగించారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు సుస్థిరాభివృది్ధకి ఏ విధంగా తోడ్పడుతున్నాయో, ఏపీ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన స మూల మార్పులు పేద కుటుంబాలకు చెందిన తమను అంతర్జాతీయ వేదికలపై ఎలా నిలి పాయో అంతర్జాతీయ ప్రతినిధులు, మేధావుల ముందు వారు వివరించారు. ఏఐ టెక్నాలజీ వినియోగించుకోవాలి.. ఇక ఐక్యరాజ్య సమితి భాగస్వామ్య సంస్థలైన యూఎన్ హాబిటాట్, యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్, సివిల్ సొసైటీ యూనిట్, యునిసెఫ్, ఏఎస్ఎఫ్, యూత్ అసెంబ్లీ ఆధ్యర్యంలో రెండ్రోజులుగా యూత్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న రాజేశ్వరి, అమ్మాజాన్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఉన్నతంగా మార్చడంలో యువత చురుౖకైన పాత్ర పోషించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, శాంతిస్థాపన, రాజకీయాలు, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగించుకోవాలన్నారు. ఏపీలో పాఠశాల విద్యలో ఈ తరహా పరి జ్ఞానం అమలు చేస్తున్నారని వివరించారు. అలాగే, పాలనలోనూ, విధానపరమైన నిర్ణయాల్లోనూ యువత అభిప్రాయాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్–పేరెంట్ కమిటీలు వేసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు రాజేశ్వరి వివరించింది. ఏపీలో విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారని అమ్మాజాన్ తెలిపింది. షకిన్కుమార్ మాట్లాడుతూ.. భారత్లో యువతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ వారికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇందుకు 10 మంది విద్యార్థులను ఐరాస సదస్సుకు పంపడమే నిదర్శనమన్నారు. -
UNO సదస్సుకు ఎంపికైన ఏపీ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు
-
ఇండియా పేరు మార్పుపై ఐరాస స్పందన
న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం.. ఇండియా అనే పేరును భారత్గా మారబోతోందన్న ఊహాగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి స్పందించింది. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది. దేశాలు తమ తమ పేర్లను మార్చుకునే క్రమంలో.. ప్రపంచ దేశాల సమాఖ్య ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తులు పంపుతుంటాయి కూడా. ఐరాస గనుక ఆ విజ్ఞప్తిని అధికారికంగా అంగీకరిస్తే.. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని కొత్త పేరుతోనే పిలుస్తుంటారు. ఇదే విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఉపప్రతినిధి ఫర్హాన్ హక్ ప్రస్తావించారు. ‘‘ చివరిసారిగా.. టర్కీ దేశం కూడా తుర్కీయేగా తమ పేరును మార్చాలని ఐరాసకు విజ్ఞప్తి పెట్టుకుంది. అలా ఇండియా కూడా అలాంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తే.. తప్పక పరిశీలిస్తాం. ఇండియా మాత్రమే కాదు ఏ దేశం అలా రిక్వెస్ట్ పంపినా పరిశీలిస్తాం’’ అని తెలిపారు. కిందటి ఏడాది టర్కీ తుర్కీయేగా తమ దేశం పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో పేరు మార్పు అంశం రాజకీయదుమారానికి తెర తీసింది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ President of Bharat అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతోంది. బీజేపీ ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తోంది. అయితే.. విపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు భారత్ అనే పేరు మార్పుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరోవైపు ప్రధాని మోదీ ఈ విషయంలో కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పేరు మార్పు విషయంలో వివాదాలకు దూరంగా ఉండాలని మంత్రులను కోరారాయన. -
ఏపీలో విద్యా విధానాలపై UNO అభినందనలు
-
మా నిర్ణయంలో తప్పులేదు.. ఉక్రెయిన్కు సాయంపై బైడెన్
వాషింగ్టన్: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆయుధ నిల్వలుతరిగిపోయిన కారణంగా ఉక్రెయిన్ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంతో వారు ఉక్రెయిన్ దేశానికి క్లస్టర్ బాంబులను పంపించనున్నట్లు ప్రకటించింది. క్లస్టర్ బాంబులు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం చేకూరుస్తాయని తెలిసి కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఒకటిన్నర సంవత్సరం పూర్తి కావస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే అగ్రరాజ్యాన్ని సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ జో బైడెన్ పై ఒత్తిడి చేశారు. దీంతో చాలాకాలంగా వారి ఆయుధ కర్మాగారంలో నిల్వ ఉండిపోయిన క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్కు పంపించాలన్న నిర్ణయానికి వచ్చింది అగ్ర రాజ్యం. ఈ నిర్ణయాన్ని పలు మానవ హక్కుల సంఘాలు, డెమొక్రాట్లు తప్పుబట్టిన కూడా జో బైడెన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. క్లస్టర్ బాంబుల తీవ్రత గురించి తెలుసు.. అందుకే ఇన్నాళ్లు వాటిని ఉక్రెయిన్కు పంపలేదు. కానీ ఇప్పుడు వారి వద్ద ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఈ సమయంలో వారిని అలా వదిలేయలేము. నాటో మిత్రదేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సాధారాణ ఆయుధాలతో పోలిస్తే ఈ క్లస్టర్ బాంబులు పెను విధ్వాంసాన్ని సృష్టిస్తాయి. వీటి కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే వీటిని ఉక్రెయిన్కు పంపే విషయమై తీవ్ర జాప్యం చేశామని అన్నారు. ఆయుధాలు కొరవడిన సమయంలో మిత్రదేశాన్ని అలా వదిలేయకూడదని బాగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. క్లస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి? ఒక క్లస్టర్ బాంబు అంటే అది అనేక బాంబుల సముదాయం. దాన్ని ఒక రాకెట్ ద్వారా గానీ ఫిరంగుల ద్వారా గానీ ఈ క్లస్టర్ బాంబును సంధిస్తే సుమారు 24-32 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని కూడా తునాతునకలు చేయవచ్చు. ఒక్కటే బాంబుగా రిలీజైన ఈ క్లస్టర్ గాల్లో చిన్న చిన్న బాంబులుగా విడిపోయి అక్కడక్కడా చెదురుముదురుగా పడి పేలతాయి. కాబట్టే వీటివలన భారీగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. పైగా ఇవి నేల మీద పడిన వెంటనే విస్ఫోటం చెందవు. కొన్ని అప్పుడే పేలగా కొన్ని మాత్రం ఎప్పుడో పేలుతుంటాయి. అందుకే ఐక్యరాజ్యసమితి 2008లో ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్ సహా 120 దేశాలు వీటి వినియోగాన్ని నిషేధిస్తూ సంతకాలు కూడా చేశాయి. 2003లో ఇరాక్ పై చేసిన యుద్ధంలో అమెరికా ఈ క్లస్టర్ బాంబులనే అధికంగా ప్రయోగించింది. అటు తర్వాత అమెరికా వాటిని మళ్ళీ ఎక్కడా ఉపయోగించలేదు. అందుకే వారి వద్ద లక్షల సంఖ్యలో క్లస్టర్ బాంబుల నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్కు సాయం చేస్తూ నిల్వలను తగ్గించుకుంటోందని అమెరికా చెబుతుంటే.. అందులో రష్యాపై గెలవాలన్న వారి కాంక్షే కనిపిస్తోందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి -
తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో..
మాండాస్, సిత్రాంగ్, అసానీ, గులాబ్, బిపర్ జోయ్. పేరు ఏదైనా కానివ్వండి ఆ తుపాను ఎంత తీవ్రమైనదైనా కానివ్వండి మనం తట్టుకొని నిలబడుతున్నాం. 1990,–2000నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు తుపాన్లు, వరదలంటే భారీగా ప్రాణ నష్టాలే జరిగేవి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ముందస్తుగా తుపాన్లను గుర్తించి పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాల్ని ఇస్తోంది. గుజరాత్లో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించడంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. తుపాన్ల సన్నద్ధతలో ఒడిశా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర చర్యలకు ఐక్యరాజ్య సమితి కూడా శభాష్ అనడం విశేషం. అది 1999 సంవత్సరం అక్టోబర్ 29. ఒడిశా ప్రజలకు అదో కాళరాత్రి. పారాదీప్ సూపర్ సైక్లోన్ రాష్ట్రంపై విరుచుకుపడింది. సముద్రం అలల ధాటికి 14 జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. జగత్సింగ్పూర్ జిల్లాకి జిల్లాయే తుడిచిపెట్టుకుపోయింది. తుపాను దెబ్బకి 10 వేల మంది జలసమాధి అయ్యారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 30 వేల మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారని ఒక అంచనా. అప్పట్లో భారత వాతావరణ కేంద్రం దగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. దీంతో తుపాను ముంచుకొస్తోందని కేవలం 48 గంటల ముందు మాత్రమే తెలిసింది. వాతావరణ శాఖ అధికారులు ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ సన్నద్ధత లేని కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 వేలు నుంచి 30 వేల మంది మరణిస్తే, 3.5 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే నీళ్లలో కొట్టుకుపోయాయి. 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల జంతువులు మరణించాయి. గంటకి 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమైంది. ఒడిశాతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ పెను విధ్వంసంతో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తుపాన్లు ఎదుర్కోవడంలో నవీన పంథా సూపర్ సైక్లోన్ ముంచెత్తిన తర్వాత సంవత్సరం 2000లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నవీన్ పట్నాయక్ తుపాన్లు ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. సూపర్ సైక్లోన్ తుపాను బీభత్సం నుంచి అప్పటికి ఇంకా రాష్టం కోలుకోలేదు. భౌగోళికంగా ఒడిశా తుపాన్ల తాకిడిని తప్పించుకోవడం అసాధ్యం. 1891 నుంచి 100కి పైగా తుపాన్లు ఒడిశాను వణికించాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు ► రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా ఒక రాష్ట్రం విపత్తు నిర్వహణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయడం అదే మొదటి సారి. జిల్లాలు, బ్లాక్ స్థాయిలో కూడా విపత్తు కమిటీలు ఏర్పాటు చేశారు. 22 వేల గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక యువకుల్ని సభ్యులుగా నియమించారు. తుపాను హెచ్చరికలు అందిన వెంటనే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే వీరు చేయాల్సిన పని ► రాష్ట్రంలోని 480 కి.మీ. పొడవైన తీర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లపై ప్రజల్ని అప్రమత్తం చేయడానికి 2018లో ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ డిస్సెమినేషన్ సిస్టమ్ (ఈడబ్ల్యూడీఎస్) ఏర్పాటు చేసింది. తుపాన్లు ముంచుకొస్తే లోతట్టు ప్రాంత ప్రజలకి కనీసం అయిదారు రోజుల ముందే హెచ్చరికలు అందుతాయి. ► తీర ప్రాంతాల్లో నివసించే వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది ► ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో బాగా విస్తరించి సుశిక్షితులైన సిబ్బందిని 20 రెట్లు పెంచింది. వారి దగ్గర 66 రకాల ఆధునిక పరికరాలు అంటే జనరేటర్లు, చెట్లను కట్ చేసే, రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు, పడవలు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వంటివి ఎప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంది. ► 1999 సూపర్ సైక్లోన్ సమయం నాటికి ఒడిశాలో కేవలం ఆరు జిల్లాల్లో కేవలం 23 శాశ్వత తుపాను శిబిరాలు ఉండేవి. తీర ప్రాంతాల్లో అడుగడుక్కీ బహువిధాలుగా ఉపయోగపడే శిబిరాలు నిర్మించారు. ఇప్పుడు వాటి సంఖ్య 870కి చేరుకుంది. ఒక్కో శిబిరంలో వెయ్యి మంది వరకు తలదాచుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రశంసలు 2013 సంవత్సరంలో ఫాలిని అత్యంత తీవ్రమైన తుపానుగా ఒడిశాను ముంచెత్తింది. అప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తుపాను సమయంలో లక్షలా ది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఒడిశా ప్రభుత్వ సహాయక చర్యలకు ఐక్యరాజ్యసమితి ఫిదా అయింది. ఒడిశా ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని అభినందించింది. కేంద్రం మూడంచెల వ్యవస్థ బిపర్జోయ్ మహా తుపాను గుజరాత్లో విధ్వంసం సృష్టించినా ప్రాణ నష్టం జరగలేదు. దీనికి తుపాన్లపై ముందస్తు సన్నద్ధతే కారణం. తుపాను ముప్పుని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ పనితీరుతో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. తుపాన్లు ఎప్పుడు ఏర్పడతాయి? ఏ దిశగా ప్రయాణిస్తాయి, ఎక్కడ తీరం దాటుతాయన్న అంశాలను వారం రోజులు ముందుగానే గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో తుపాన్లపై అవగాహన పెరుగుతుంది. ఇక రెండో అంచెగా శిబిరాల నిర్మాణం, ప్రజల్ని తరలించడం ఒక యుద్ధంలా చేస్తారు. ఇక మూడో దశలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్లో విద్యుత్ లైన్లు, మంచినీటి పైపుల నిర్మాణం, రైల్వే, విమానాశ్రయాల్లో రాకపోకలు సాగేలా ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఫలితాలు ఇలా..! ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించలేకపోయినా ప్రాణలైతే కాపాడగలుగుతున్నాం. గత కొద్ది ఏళ్లలో ఒడిశాను అల్లకల్లోలం చేసిన తుపాన్లలో ప్రాణనష్టం తగ్గుతూ వస్తోంది. -
G7 Summit: ఐరాసను సంస్కరించాల్సిందే
హిరోషిమా: ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను నేటి వాస్తవాలకు అద్దం పట్టేలా, అవసరాలను తీర్చేలా తక్షణం సంస్కరించుకోవాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. లేదంటే ఐరాస, భద్రతా మండలి వంటివి కేవలం నామమాత్రపు చర్చా వేదికలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం జపాన్లోని హిరోషిమాలో జీ–7 సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ శాంతే ప్రధాన లక్ష్యంగా స్థాపించుకున్న ఐరాస యుద్ధాలు, సంక్షోభాలను ఎందుకు నివారించలేకపోతోంది? శాంతి గురించి పలు ఇతర వేదికలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు తలెత్తుతోంది? ఉగ్రవాదపు నిర్వచనాన్ని కూడా ఐరాస ఎందుకు అంగీకరించడం లేదు? ఆలోచిస్తే తేలేదొక్కటే. ఐరాస ప్రస్తుత ప్రపంచపు వాస్తవాలకు అనుగుణంగా లేదు. గత శతాబ్దానికి చెందిన ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇవన్నీ చాలా సీరియస్గా దృష్టి సారించాల్సిన విషయాలు’’ అని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం మానవతకు సంబంధించిన సంక్షోభమని మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలని రష్యా, చైనాలను ఉనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ఏకపక్ష ప్రయత్నాలపై దేశాలన్నీ ఉమ్మడిగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడం, లద్దాఖ్ దురాక్రమణకు కొన్నేళ్లుగా చైనా చేస్తున్న యత్నాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు భారత్ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తుందని హామీ ఇచ్చారు. దీనికి చర్చలు, రాయబారమే ఏకైక పరిష్కారమని తాము ముందునుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ బుద్ధుని బోధల్లో చక్కని పరిష్కారాలున్నాయన్నారు. హిరోషిమా పార్కులోని స్మారక మ్యూజియాన్ని దేశాధినేతలతో కలిసి మోదీ సందర్శించారు. అణుబాంబు దాడి మృతులకు నివాళులర్పించారు. మీకు మహా డిమాండ్! మోదీతో బైడెన్, ఆల్బనీస్ వ్యాఖ్యలు మీ ఆటోగ్రాఫ్ అడగాలేమో: బైడెన్ జీ–7 సదస్సులో భాగంగా జరిగిన క్వాడ్ దేశాధినేతల భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ దగ్గరికి వచ్చి మరీ ఆత్మీయంగా ఆలింగనంచేసుకుని ముచ్చటించడం తెలిసిందే. మోదీ విషయమై తమకెదురవుతున్న గమ్మత్తైన ఇబ్బందిని ఈ సందర్భంగా బైడెన్ ఆయన దృష్టికి తెచ్చారట. వచ్చే నెల మోదీ వాషింగ్టన్లో పర్యటించనుండటం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఎలాగైనా ఆయనతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా అమెరికా ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ‘రిక్వెస్టులు’ వచ్చిపడుతున్నాయట! వాటిని తట్టుకోవడం తమవల్ల కావడం లేదని బైడెన్ చెప్పుకొచ్చారు. భేటీలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా తామూ అచ్చం అలాంటి ‘సమస్యే’ ఎదుర్కొంటున్నామంటూ వాపో యారు! మోదీ మంగళవారం ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో 20 వేల మంది సామర్థ్యమున్న స్టేడియంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దానికి టికెట్లు కావాలని లెక్కకు మించిన డిమాండ్లు, రిక్వెస్టులు వచ్చి పడుతున్నాయని ఆల్బనీస్ చెప్పుకొచ్చారు. ఇటీవలి భారత్ పర్యటన సందర్భంగా గుజరాత్లో 90 వేల మంది సామర్థ్యంతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ఎలా ప్రజలకు అభివాదం చేసిందీ గుర్తు చేసుకున్నారు. దాంతో బైడెన్ స్పందిస్తూ బహుశా తాను మోదీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలేమో అంటూ చమత్కరించారు! గత మార్చిలో భారత్–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ను మోదీ, ఆల్బనీస్ ప్రారంభించడం తెలిసిందే. -
Sudan Crisis: 72 గంటలపాటు కాల్పుల విరమణ!
ఖార్తోమ్: సూడాన్లో సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్.. మూడు రోజుల పాటు కాల్పుల విమరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గత పదిరోజులుగా సూడాన్ ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కు నడుమ అక్కడ పోరు జరుగుతోంది. నడుమ 400 మందికి పైగా సాధారణ పౌరులు మరణించగా.. దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. భారీ ఎత్తున్న విదేశీయులు తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే.. 48 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సుడానీస్ సాయుధ దళాలు (SAF) - ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని బ్లింకెన్ వెల్లడించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయని తెలుస్తోంది. సంధి అమలు కావడానికి రెండు గంటల ముందే బ్లింకెన్ ప్రకటన వెలువడడం విశేషం. ఈ మూడు రోజుల్లో పౌరుల తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది. శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ తరుణంలో ఎటు పోవాలో పాలుపోని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అగాధంలోకి సూడాన్.. సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరును.. ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పేద దేశమైన సూడాన్ ఈ పోరుతో అగాధంలోకి కూరుకుపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. అంతేకాదు కాల్పుల విరమణకు ఆయన పిలుపు ఇచ్చారు. ఐరాస తరపున పలు విభాగాలు సూడాన్ పౌరులను సరిహద్దులకు దేశాలకు సురక్షితంగా తరలించే యత్నంలో ఉన్నాయి. మరోవైపు సూడాన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి బ్రిటన్ విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ కావేరీ.. మనోళ్ల కోసమే! -
భారత్పై బిలావల్ ఆక్రోశం
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్ను పాలస్తీనాతో పోలుస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘రెండుచోట్లా పరిస్థితులు ఒక్కటే. రెండు సమస్యలనూ ఐరాస ఇప్పటికీ పరిష్కరించలేదు. కశ్మీర్ను ఐరాస ప్రధాన ఎజెండాలోకి తీసుకురాకుండా భారత్ పదేపదే అడ్డుపడుతోంది’’ అంటూ వాపోయారు. భారత్ను గురించి మాట్లాడే క్రమంలో ఒకసారి మిత్రదేశం, మరోసారి పొరుగుదేశం అంటూ ఆయన తడబాటుకు గురయ్యారు. -
జన ధన భారత్! 2023లో రికార్డు దిశగా.. 1950లో మన జనాభా ఎంతో తెలుసా?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఈ ఏడాదే భారత్ అవతరించబోతోంది. 2011 తర్వాత మన దేశంలో జనాభా వివరాల సేకరణ జరగలేదు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) జనాభా లెక్కల కోసం పాటించే సూత్రాన్ని అనుసరించి ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి భారత జనాభా చైనాను అధిగమించనుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి 1950లో ప్రపంచ జనగణన మొదలు పెట్టినప్పటి నుంచీ అధిక జనాభాగల దేశంగా పేరుపడిన చైనా ఇంకో రెండు నెలల్లో ఆ హోదాను కోల్పోబోతోందని ప్యూ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. –దొడ్డ శ్రీనివాస్రెడ్డి 72 ఏళ్లలో 100 కోట్లు.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనగణన చేసిన తొలి సంవత్సరం 1950లో భారత జనాభా 35.3 కోట్లు. ఇప్పుడది 140 కోట్లకు చేరినట్లు ‘ప్యూ’అంచనా. అంటే గత 72 ఏళ్లలో దేశ జనాభా 100 కోట్లకుపైగా పెరిగింది. ఇది మొత్తం యూరప్ దేశాల జనాభా (74.4 కోట్లు) కంటే అధికం. ఉత్తర, దక్షిణ, అమెరికా ఖండాల కంటే (100 కోట్లు) కూడా ఎక్కువే. చైనాలో ప్రస్తుత జనాభా 140 కోట్లుగా ఉన్నా.. అక్కడ కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల మందగించింది. కానీ భారత్లో మాత్రం ఎప్పటి మాదిరిగానే పెరుగుతోంది. యూఎన్వో అంచనా ప్రకారం.. భారత దేశ జనాభా ఈ దశాబ్ధం చివరికి 150 కోట్లకు, 2064 నాటికి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జనాభా పెరుగుదల మందగిస్తుంది. యంగ్ ఇండియా ►భారత జనాభాలో 25 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారు 40 శాతంపైగా ఉన్నారు. జనాభా సగటు వయసు 28 ఏళ్లు. అదే అమెరికాలో 38, చైనాలో 39 ఏళ్లు. అంటే ఇండియాలో ప్రతి పది మందిలో నలుగురికిపైగా పాతిక సంవత్సరాలలోపు వయసువారే. ►మరోవైపు అధిక జనాభా ఉన్న చైనా, అమెరికా దేశాల్లో వయసుపై బడిన వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. 65 ఏళ్లు దాటిన వారు భారత జనాభాలో కేవలం 7.1 శాతం మాత్రమే. వీరి సంఖ్య భారత జనాభాలో 2063 నాటికి 20 శాతం, 2100 నాటికి 30 శాతానికి మాత్రమే పెరుగుతుంది. అంటే ఈ శతాబ్దం చివరి వరకు భారత్ యువ భారతంగానే ఉంటుందన్న మాట. ఇంకా భారతదేశంలో పాతికేళ్లలోపు వారి సంఖ్య 2078 నాటికి కానీ 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్యను దాటే అవకాశం లేదన్నది యూఎన్ అంచనా. జననాల్లోనూ వేగమే.. చైనా, అమెరికాలతో పోలిస్తే భారత్లో జననాల రేటు కూడా అధికమే. ప్రస్తుతం సగటున భారత మహిళ తన జీవితకాలంలో 2.0 పిల్లలకు జన్మనిస్తోంది. అదే చైనాలో 1.2, అమెరికాలో 1.6గా ఉంది. అయితే గతంతో పోలిస్తే భారత దేశంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 1992లో జననాల రేటు 3.4, 1950లో ఏకంగా 5.9 ఉండేది. భారత్లో అన్ని మతస్తుల్లోనూ జననాల రేటు తగ్గుతూనే ఉంది. ముస్లింలలో జననాల రేటు 1992లో 4.4గా ఉంటే.. 2019 కల్లా అది 2.4కి తగ్గింది. హిందువుల్లో 3.3 నుంచి 1.9కు, క్రిస్టియన్లలో 2.9 నుంచి 1.9కు, సిక్కుల్లో 2.4 నుంచి 1.6కు తగ్గింది. అయితే పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో శిశు జననాల రేటులో తేడాలు ఉన్నాయి. పట్టణాల్లో ప్రతి మహిళకు సగటున 1.6 శిశువులు జన్మిస్తే.. గ్రామాల్లో 2.1 మంది జన్మిస్తున్నారు. అదే 20 ఏళ్ల క్రితం సగటు పట్టణాల్లో 2.7, గ్రామాల్లో 3.7 మందిగా ఉండేది. ఇక జనాభా పెరుగుదల విషయంలోనూ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉంది. 2001–2011 మధ్య మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్లలో జనాభా పెరుగుదల 25 శాతం ఉంటే.. గోవా, కేరళలో 10 శాతం మాత్రమే ఉందని భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు చెప్తున్నాయి. అదే నాగాలాండ్లో అయితే 0.6 శాతం జనాభా తగ్గింది. తగ్గుతున్న లింగభేదం 70వ దశకంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చిన తరువాత బాల బాలికల సంఖ్యలో వ్యత్యాసం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 111 మంది బాలురకి 100 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లు తేలింది. తర్వాత వ్యత్యాసం తగ్గుతూ వస్తోంది. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015 నాటికి బాల బాలికల వ్యత్యాసం 109–100కి తగ్గింది. 2019 నాటికి 108 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలు ఉన్నట్టు వెల్లడైంది. లింగభేదంతో పాటు శిశు మరణాలు కూడా బాగా తగ్గుతూ వస్తున్నాయి. 1990లో ప్రతి వెయ్యిమంది శిశువులకు 89 మంది మరణించేవారు. అదే 2020 వచ్చే నాటికి 27 మందికి తగ్గింది. ఐరాస ఆధ్యర్యంలో పనిచేస్తున్న గ్రూప్ యూఎన్ఐజీ 1960 నుంచి ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే శిశుమరణాల విషయంలో భారత్ పొరుగు దేశాలతో పోలిస్తే వెనుకబడే ఉంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది శిశువులకు 24 మంది, నేపాల్లో 24, భూటాన్లో 23, శ్రీలంకలో ఆరుగురు మరణిస్తున్నారు. చైనాలో 6, అమెరికాలో ఐదుగురు శిశువులు పుట్టుక సమయంలోనే అసువులుబాస్తున్నారు. వెళ్లేవారే ఎక్కువ.. వలసలు కూడా దేశ జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాను పెంచుకోవడం కోసం అనేక దేశాలు వలసదారుల్ని, శరణార్థులను ఆహ్వానిస్తున్నాయి. జనాభాను సంపదగా భావిస్తున్నాయి. పనిచేయగల సత్తా ఉన్న వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే భారతదేశానికి ఇతర దేశాల నుంచి వలస వస్తున్న వారి కంటే ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఒక్క 2021లోనే భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు మూడు లక్షల మంది ఉన్నారు. అనేక సందర్భాల్లో భారత్కు వలస వచ్చిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. 2016లో దాదాపు 68,000 మంది భారత్కు శరణుకోరి వచ్చారు. వీరిలో అధిక శాతం మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలే. ఏదేమైనా ఈ శతాబ్దం చివరి వరకు భారత్ నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి జనాభా వివరాల విభాగం అంచనా వేసింది. -
విద్యావిధానం అమలులో ఏపీ భేష్
స్విట్జర్లాండ్లోని జెనీవా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, విద్యా విధానం బాగున్నాయని కొనియాడారు. మంచి ప్రాథమిక విద్య, శిక్షణ, స్థిరమైన అభివృద్ధికి కీలకం అనే అంశంపై స్విట్జర్లాండ్ దేశం జెనీవా లో ఉన్న ఐక్యరాజ్య సమితి కార్యాలాయంలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియా నుంచి ఐక్యరాజ్య సమితి పర్మినెంట్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ (united nations special consultative status member) పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్ధుల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న విద్య గురించి ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రస్తావించారు. కరోనా తర్వాత దేశాల్లో ఉన్నటువంటి గడ్డు పరిస్ధితులను మీటింగ్లో పలువురు ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పధకాల స్టాల్ను సందర్శించిన స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ ప్రభుత్వ పధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో విద్య కోసం నాడు-నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలు జరుగుతున్న విద్యాప్రమాణాలను తెలుసుకుని అభినందించారు. నాడు-నేడులో భాగంగా డిజిటల్ లెర్నింగ్, నాణ్యతమైన విద్యలో భాగంగా విద్యార్ధులకు ప్రభుత్వం అందజేస్తున్నటువంటి కంప్యూటర్ ట్యాబ్లు పంపిణీ, శిధిలావస్ధలో ఉన్నటువంటి పాఠశాలలను ఆధునీకరించడం, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతుల్లో నూతన విద్యావిధాన బోధన వంటివి పేదవిద్యార్ధులకు ఎంతో మేలు చేస్తుందని వారన్నారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారన్నారు. విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో న్యూట్రీషన్ ఫుడ్ అందించడం వంటివి బాగున్నాయన్నారు. లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ఎస్పెషల్లీ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ అనేది చాలా నచ్చిందన్నారు పాట్రిసియా దన్జీ. యూఎన్ఓలో ఆంధ్రప్రదేశ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాల్ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. లింగ అసమానతలను పోగెట్టేలా ఆడపిల్లకు అందిస్తున్న గర్ల్స్ ఎడ్యుకేషన్ విధానాన్ని అభినందించారు. దీని ద్వారా అమ్మాయిలకు విద్య అనేది చాలా ముఖ్యమనదన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ బెస్ట్ గా ఉందన్నారు. బైజ్యూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో విద్యా విధానం అనేది బాగుందన్నారు. -
మా ‘విడాకులు’ తెగుతున్నాయి
విశాఖ ప్రాంతానికి చెందిన దంపతులు 30 ఏళ్లు కుటుంబ బాధ్యతల్లో ఎంతో గొప్పగా మెలిగారు. భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా.. ఆయన భార్య కొడుకు స్థిరపడ్డాక సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. ఇదే వీరిద్దరి మధ్య మూడు దశాబ్దాల బంధాన్ని విచ్ఛిన్నం చేసింది. తనకు విడాకులు ఇప్పించాలంటూ అతడి భార్య కోర్టుకెళ్లారు. విజయవాడ ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల ప్రియాంక తన 31 ఏళ్ల వైవాహిక బంధం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబంలో కలతలు ఉన్నా పిల్లల పెంపకం కోసం సర్దుకుపోయానని.. అయినా భర్త తనను అర్థం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు పాశ్చాత్య దేశాలకే పరిమితం. ఇప్పుడు మన దేశంలోని పట్టణాలకూ ఇది పాకింది. నడివయసు దాటిన వారు.. వైవాహిక జీవితంలో కొందరు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతుంటే.. చాలామంది విడిగా ఉంటున్నారు. సాక్షి, అమరావతి: పాతికేళ్ల వైవాహిక జీవితం గడిపినవారు విడిపోవడాన్ని ‘సిల్వర్ డైవర్సీ’ లేదా ‘గ్రే డైవర్సీ’గా చెబుతారు. రాష్ట్రంలోని ఒక్క విశాఖ జిల్లాలోనే కుటుంబ న్యాయస్థానానికి ఏటా 3 వేలకు పైగా విడాకుల కేసులు వస్తుండగా.. వాటిలో కనీసం 15 నుంచి 20 శాతం వరకు 25 ఏళ్లకు మించి వైవాహిక జీవితం గడిపిన జంటలు ఉంటున్నాయి. వివాహ బంధాన్ని ఎంతో పవిత్రంగా భావించే మన దేశంలో నడివయసు దాటినవారు విడిపోవాలని కోరుకుంటున్న తీరుపై ఐక్యరాజ్య సమితి (యూఎన్వో) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. యూఎన్వో ‘ప్రోగ్రెస్ ఆఫ్ ది వరల్డ్స్ ఉమెన్ రిపోర్టు–2010’ ప్రకారం భారతదేశంలో 45–49 ఏళ్ల వయసు మహిళల్లో విడాకులు తీసుకుంటున్న వారు 1.1 శాతం ఉండగా.. 2019–20 నాటికి రెండింతలైనట్టు అంచనా వేసింది. అపోహలు.. అనర్థాలతో తెగదెంపులు మన దేశంలోనూ విడాకులు కోరుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరిలో వృద్ధాప్యానికి చేరువైన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ‘భర్తను, ఇద్దరు బిడ్డలను మెప్పించేందుకు ఎంతో శ్రమించాను. భర్త, పిల్లలు సహా నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. ఇన్నేళ్ల నా సంసార జీవితంలో నాకంటూ ఏమీ లేదు. బాగా అలసిపోయాను. అందుకే విడాకులు తీసుకుంటున్నాను’ అంటున్న వారు ఎక్కువ మందే కనిపిస్తున్నారు. ‘ఉద్యోగరీత్యా ఇన్నేళ్లూ ఊళ్లు పట్టుకు తిరుగుతూ భార్యాబిడ్డల్ని పుట్టింట్లోనే ఉంచేశారు. ఏ అవసరం వచి్చనా మీరు నా పక్కన లేరు. ఇప్పుడు రిటైరై తిరిగొచ్చాక మీ అవసరం నాకు ఏముంటుంది’ అంటూ ఓ భార్య వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరిగే మాటల యుద్ధం, బంధువులు, సన్నిహితులు ఇచ్చే ఉచిత సలహాలు బంధాలను విచి్ఛన్నం చేస్తున్నాయంటున్నారు సైకాలజిస్టులు. ఇటీవల 50 ఏళ్లు దాటిన వారిలో ఇది ఎక్కువ కనిపిస్తోందంటున్నారు. స్త్రీ, పురుషుల్లో ఆర్థిక స్వేచ్ఛ, ప్రపంచ సంస్కృతులు ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. విడాకుల కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానం, గుజరాత్ రెండు, పశి్చ మ బెంగాల్ మూడు, ఉత్తర ప్రదేశ్ నాలుగు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఒకరి ఉనికిని మరొకరు గౌరవించుకోవాలి గతంలో పురుషులు సంపాదించాలి.. స్త్రీ ఇల్లు చక్కదిద్దాలని ఉండేది. మన సమాజంలో సంపాదించే స్థాయిలో ఉన్నవారు ఇల్లు చూసుకునే వారికి విలువ ఇవ్వరు. అక్కడే సమస్య మొదలవుతుంది. ఏళ్ల తరబడి మనసులో ఉన్న అసహనం పెల్లుబుకుతుంది. అప్పటికీ పిల్లల భవిష్యత్ కోసం మానసిక క్షోభను భరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఒకరి ఉనికిని మరొకరు గౌరవించుకుంటే ఇబ్బంది రాదు. కానీ జరుగుతున్నది వేరు. అందువల్ల పిల్లలు స్థిరపడ్డాక విడిపోయేందుకు భార్యాభర్తలు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తే విడిపోయే ప్రసక్తి ఉండదు. – డాక్టర్ జి.పద్మజ, విభాగాధిపతి, సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ హెచ్ఓడీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విడాకులు బాగా పెరిగాయి గతంతో పోలిస్తే పట్టణాల్లో ఆరి్థక స్వేచ్ఛ పెరిగింది. సంపాదనలో ఆడ, మగా సమానంగా ఉంటున్నారు. కుటుంబంలో సమస్య వచి్చనప్పుడు సర్దుబాటు చేసుకోవడం లేదు. తక్కువ వయసులో వివాహం చేసుకున్న వారిలో ఎక్కువ మంది విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అదే 35 ఏళ్లు తర్వాత పెళ్లి చేసుకున్న వారిలో ఈ సమస్య కనిపించడం లేదు. రెండో పెళ్లిళ్లు కుదిర్చేందుకు 1997లో మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశాం. అప్పట్లో తక్కువ వయసు వారే రెండో వివాహ సంబంధానికి వచ్చేవారు. ఇప్పుడు నెలకు 10–12 మంది సంప్రదిస్తుంటే వారిలో కనీసం నలుగురు 50–55 ఏళ్లు పైబడి, విడాకులు తీస్తున్నవారు ఉంటున్నారు. ఇటీవల మహిళలు కూడా ఎక్కువగా వస్తున్నారు. – పి.వెంకట్రెడ్డి, తోడు–నీడ మ్యారేజ్ బ్యూరో -
ఉగ్ర అడ్డాగా పాక్
ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదానికి పాకిస్తాన్ను కేంద్ర స్థానంగా ప్రపంచ దేశాలన్నీ పరిగణిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ‘‘పాక్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఉగ్రభూతాన్ని పెంచి పోషించడం మానుకోవాలి’’ అంటూ హితవు పలికారు. ‘‘ఉగ్రవాదం ఎక్కడ పురుడు పోసుకుందో ప్రపంచమంతటికీ తెలుసు. పామును ఇంట్లో పెంచుకుంటే ఎప్పటిౖMðనా కాటేయడం ఖాయమని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అప్పట్లో పాక్ను హెచ్చరించారు’’ అని గుర్తుచేశారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదం, సవాళ్లు, పరిష్కార మార్గాలు’ అంశంపై భేటీకి మంత్రి నేతృత్వం వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసియాలో, ఇతర ప్రాంతాల్లో ఉగ్ర దాడుల వెనుక ఉన్నదెవరో అందరికీ తెలుసన్నారు. దక్షిణాసియాలో ఉగ్రవాదం ఎప్పుడు అంతమవుతుందని పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా ‘మీ దేశ మంత్రులనే అడగండి’ అని బదులిచ్చారు. -
భారత్ సూచనతో చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం
రోమ్: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023 మంగళవారం అధికారికంగా ప్రారంభమైంది. ఇటలీలోని రోమ్లో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభతో పాటు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వలిన్ హ్యుగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొని పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను కలిగించే శక్తి చిరుధాన్యాలకు ఉందని.. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో వినియోగదారులు, రైతులు, పాలకులను చైతన్యపరిచి కార్యోన్ముఖుల్ని చేయటమే తమ లక్ష్యమని ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు ఈ సందర్భంగా అన్నారు. చిరుధాన్యాలు తరతరాలుగా భారతీయ సమాజానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మోదీ సందేశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ చదివి వినిపించారు. ఇదీ చదవండి: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే: ఐక్యరాజ్యసమితి -
షాకింగ్! మంచి తిండికి దూరంగా 300,00,00,000 మంది
- కంచర్ల యాదగిరిరెడ్డి తిండి కలిగితే కండగలదోయ్... కండ కలవాడేను మనిషోయ్.. అని మహాకవి ఎప్పుడో చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొద్దోగొప్పో అందరూ తిండి తినడమైతే తింటున్నారు కానీ, ఈ భూమి మీద సుమారు 300 కోట్ల మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారానికి దూరంగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 138 దేశాల సమాచారాన్ని ఈ సంస్థ విశ్లేషించింది. తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికల్లా భూమ్మీద ఆకలన్నది లేకుండా చేయాలని ఎఫ్ఏఓ తీర్మానం చేసుకుంది. అయితే ఏటేటా ఆరోగ్యకరమైన తిండికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాదిలో11.2 కోట్ల పెరుగుదల తిండి లేని పేదల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి కానీ, తిన్న తిండితో ఆరోగ్యంగా ఉండలేని వారి గురించి తెలిసింది తక్కువే. ఈ క్రమంలోనే ఎఫ్ఏఓ ప్రతి దేశంలో ఆరోగ్యకరమైన తిండి తినగలిగిన వాళ్లు ఎంతమంది? అసలు ఆరోగ్యకరమైన తిండి అంటే ఏమిటన్నది తెలుసుకుని వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం 2020లో ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని వారి సంఖ్య 300 కోట్లు. 2019 గణాంకాలతో పోలిస్తే 11.2 కోట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఆహారపు ధరలు పెరగడమేనని సంస్థ చెపుతోంది. ఈ మేరకు ఆదాయం పెరగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం ధనిక దేశాలపై కాకుండా, ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పడం ద్వారా పేద దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని తేల్చి చెప్పింది. శక్తి అవసరాలను తీర్చగలగాలి ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని ఎఫ్ఏఓ నిర్వచిస్తోంది. అలాగే ఆయా దేశాల్లో నిర్వచించుకున్న పౌష్టికాహార మార్గదర్శకాలనూ సంతృప్తి పరచాలి. ఉదాహరణకు భారత్లో ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తినడం అవసరమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంటోంది. చాలామంది ఈ స్థాయిలో వీటిని తీసుకోవడం లేదు. పైగా ఈ మోతాదుల్లో కాయగూరలు, పండ్లు తీసుకునే స్థోమత కూడా కొందరికి ఉండదు. ఒక కుటుంబం రోజువారీ ఆదాయంలో 52% లేదా అంతకంటే ఎక్కువను ఆహారానికి వెచి్చంచాల్సిన పరి స్థితి ఉంటే, దాన్ని స్థోమతకు మించిందిగా ఎఫ్ఏఓ చెపుతోంది. ఆఫ్రికాలోనే సగం దేశాలు సర్వే చేసిన 138 దేశాల్లో కనీసం 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేదని ఎఫ్ఏఓ సర్వే వెల్లడించింది. ఇందులో అత్యధికం ఆఫ్రికా ఖండంలో ఉండగా మిగిలినవి ఆసియా, ఓషియానా, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. ఆహార కొరత అన్నది ఆఫ్రికా ఖండంలో ఎప్పుడూ సమస్యే కానీ, సహారా ఎడారి పరిసర దేశాల్లోని జనాభాలో 90 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కరువు ప్రాంతాల్లో మూడింట ఒక వంతు ఇక్కడే ఉండటం, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ఆహార ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురవుతుండటం ఈ పరిస్థితికి కారణమని ఎఫ్ఏఓ విశ్లేషించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు గోధుమ దిగుమతులు సగం కంటే ఎక్కువ పడిపోయాయి. ఫలితంగా చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం అధికమైంది. సమస్యను మరింత జటిలం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేని వారు ఒక్క భారత దేశంలోనే 97.3 కోట్ల మంది ఉన్నట్లు ఎఫ్ఏఓ దగ్గర ఉన్న సమాచారం చెపుతోంది. ఆసియా మొత్తం మీద 189 కోట్లు, ఆఫ్రికాలో సుమారు 100 కోట్ల మంది ఉన్నారు. అమెరికా, ఓషియానాల్లో సుమారు 15.1 కోట్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆజర్బైజాన్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మాత్రమే జనాభా మొత్తం పుష్టికరమైన ఆహారాన్ని కొనుక్కోగల స్థితిలో ఉన్నట్లు ఆ సర్వే నివేదిక తెలిపింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో 95 శాతం ప్రజలు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. పెరుగుతున్న జనాభా కూడా కారణమే ఆరోగ్యకరమైన ఆహారం అందుకునే స్థోమత లేకపోవడానికి పెరుగుతున్న జనాభా కూడా ఒక కారణం. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనుంది. 2050 నాటికి ఇది ఇంకో 35 శాతం పెరగనుంది. అంటే సుమారు 250 కోట్ల మందికి అదనంగా ఆహారం అవసరం. ఈ డిమాండ్ను తట్టుకోవాలంటే పంట దిగుబడులు ఇప్పుడున్న స్థాయికి రెట్టింపు కావాలి’అని యునైటెడ్ నేషన్స్ తరఫున అధ్యయనంలో పాల్గొన్న స్టాన్ఫర్డ్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగం హెడ్ అబ్రమిస్కీ అన్నారు. పెరిగిపోతున్న జనాభాకు తగినంత ఆహారం పండించాలన్నా, పండించిన ఆహారం ప్రజల కడుపులు నింపడం మాత్రమే కాకుండా తగిన పుష్టిని ఇవ్వాలన్నా పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు అవసరమని పేర్కొంటూ యూఎన్కు ఆయన ఓ నివేదిక కూడా అందజేశారు. ‘ఆహార వృథాను తగ్గించాలి’ ఆహార వృథాను వీలైనంత వరకూ తగ్గించడం. పండిన పంట వినియోగదారుడి చేతికి చేరేలోపు జరుగుతున్న వృథాను గణనీయంగా తగ్గించడం ద్వారా ఉన్న ఆహారాన్ని ఎక్కువమందికి చేరేలా చేయవచ్చునని ఐరాస ఇటీవల తన సభ్యదేశాలకు సూచించింది. వాతావరణ మార్పులను తట్టుకోగల రీతిలో కొత్త కొత్త వంగడాల సృష్టి, ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే భవిష్యత్తు ఆహార సవాళ్లను ఎదుర్కోగలమని నిపుణులు అంటున్నారు. పరిస్థితిని దిగజార్చిన కోవిడ్ ఆకలి కారణంగా 2018లో ఐదేళ్లు నిండకుండానే మరణించిన పిల్లల సంఖ్య 53 లక్షలు. 2020లో విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ విషయం చెపుతోంది. ► ఐక్యరాజ్య సమితి నిర్దేశించినసుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది‘జీరో హంగర్’. 2030 నాటికి ఆకలిని చెరిపేసేందుకు చేసుకున్న తీర్మానం ఇది. ► కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ప్రపంచమిప్పుడు ‘జీరో హంగర్’లక్ష్యాన్ని అందుకోలేని స్థితిలో ఉంది. ఒకపక్క వాతావరణ సమస్యలు సవాళ్లు విసురుతుండగా, కోవిడ్ పరిస్థితిని మరింత దిగజార్చింది. సమాజంలోని అసమానతలను ఎక్కువ చేయడం ద్వారా మరింత మంది ఆకలి కోరల్లో చిక్కుకునేలా చేసింది. ►ప్రపంచం మొత్తమ్మీద ఏటా 400 కోట్ల టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 33 శాతం వృథా అవుతోంది. దీని విలువ ఏకంగా 60 లక్షల కోట్ల రూపాయలు. అభివృద్ధి చెందిన దేశాల్లో తినే ఆహారం ఎక్కువగా వృథా అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పంటనష్టాలు ఎక్కువ. డిమాండ్కు తగ్గ ఆహారం కోసం.. ఆకలిని ఎదుర్కొనేందుకు మన దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అనేక పథకాలు ఆచరణలో ఉన్నాయి. వాటిలో కొన్ని.. 1.నేషనల్ న్యూట్రిషన్ మిషన్: పోషణ్ అభియాన్ అని పిలిచే ఈ పథకాన్ని 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాలను తగ్గించడం, రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడాన్ని నివారించడం ఈ పథకం ఉద్దేశం 2. జాతీయ ఆహార భద్రత పథకం: 2007లో నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ ప్రారంభించిన పథకం ఇది. 11వ పంచవర్ష ప్రణాళిక ముగిసే సమయానికి దేశంలో వరి ఉత్పత్తి రెండు కోట్ల టన్నులు అధిమించగా, గోధుమల ఉత్పత్తి 80 లక్షల టన్నులకు చేరుకుంది. కాయధాన్యాల దిగుబడి 20 లక్షల టన్నుల పైచిలుకుకు చేరుకుంది. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ లక్ష్యానికి మించి దిగుబడులు సాధించాం. భవిష్యత్తులోనూ డిమాండ్కు తగ్గ ఆహారాన్ని పండించేందుకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పలు వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తోంది. 3. రెండేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలను తగ్గించేందుకు, ఏడాది పొడవునా మంచి ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రభుత్వం జీరో హంగర్ పేరుతో ఇంకో పథకాన్ని అమలు చేస్తోంది. పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఆహారానికి పోషకాలు జోడించడం కూడా ప్రభుత్వ ప్రయత్నాల్లో ఒకటి. -
జీవనదులు విలవిల
అమెరికాతో సహా యూరప్, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. పారిశ్రామిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది. 230 కోట్ల మందికి నీటి కొరత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, అమెరికా, ఇరాక్ వంటి దేశాల్లో నిత్యం నిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి. ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా దేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరత కాస్తా ఈ కరువు దెబ్బకు రెట్టింపైంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటి కొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదికచెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్లో 47 శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకున్నాయని గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది. బయట పడుతున్న చారిత్రక అవశేషాలు మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొలరాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్లో బార్సెలోనా సమీపంలోని రిజర్వాయర్లో నీరు ఆవిరవడంతో 9వ శతాబ్దానికి చెందిన చర్చి బయట పడింది. మాడ్రిడ్లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్లోనే కాసెరస్ ప్రావిన్స్లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్లో టైగ్రిస్ నది ఎండిన చోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్, నాటి నగరం బయట పడ్డాయి. నదులన్నింటా కన్నీళ్లే... ► జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది. ► 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్లసముద్రంలోకలిసే ఈ నది ఎన్నోచోట్ల ఎండిపోయింది. ► రెయిన్, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా 8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల) విలువైన సరుకు రవాణా జరుగుతుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంతకాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు. ► ఆల్ఫ్స్ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది. ► ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడింది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు. ► ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ వైన్ తయారీకి ఆధారమైన లోయెర్ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు. ► యూరప్లో 10 దేశాల గుండా పారే అతి పొడవైన నది డాన్యూబ్ కూడా చిక్కిపోతోంది. ► అమెరికాలో డెన్వర్ నుంచి లాస్ఏంజెలెస్ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి! ► 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది. ► నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సి చువాన్ ప్రావిన్స్కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడ చూసినా నీరు అడుగంటి నదీగర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీగర్లపై చైనా పంజా
చైనా వాయవ్యప్రాంతం షింజియాంగ్లో సర్కారీ దౌష్ట్యానికి లోనవుతున్న మైనారిటీ వీగర్ ముస్లింల విషయంలో ఐక్యరాజ్యసమితి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని కొంతకాలంగా హక్కుల సంస్థలు చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. అక్కడ చైనా ప్రభుత్వం తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని గురువారం విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(యూఎన్హెచ్ఆర్సీ) నివేదిక నిర్ధారించింది. ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. దీన్ని పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలనీ, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలం వాయిదాపడేలా చూడాలనీ చైనా అనేక ఎత్తులు వేసింది. ఇప్పుడిక నివేదికను ఖండించే పనిలోపడింది. 48 పేజీల యూఎన్హెచ్ఆర్సీ నివేదికకు 122 పేజీల్లో బదులిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవటం లేదన్నది దాని సారాంశం. నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడిపడవు. వాటికి రాజకీయ కారణాలతోపాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో, శాపమో వీగర్ ముస్లింలు అత్యధికంగా ఉండే షింజియాంగ్ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటిమధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనా వాసప్రాంతాలు విసిరేసినట్టు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇరుగుపొరుగున రష్యాతోపాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు... గతంలో పాలించినవారూ ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంది. పైగా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా, వాటిపై తన ప్రభా వాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది. భౌగోళికంగా చిన్నదే అయినా షింజి యాంగ్ ఎప్పుడూ బేలగా లేదు. చరిత్రలోకి తొంగిచూస్తే అనేక రాజరిక వ్యవస్థలకు అది కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయంప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. 1949లో చైనా విప్లవ విజయానికి కాస్త ముందు ఆ ప్రాంతం స్వయంపాలనను రుచిచూసింది కూడా. కానీ జాతుల సమస్య విషయంలో కమ్యూనిస్టులకున్న అవగాహనను గౌరవించి కావొచ్చు... తొలిసారి వారికి తలవంచింది. ఆధిపత్య హాన్ జాతి పెత్తనమే ఇక్కడా కనబడటం, 1966–76 మధ్య సాగిన సాంస్కృతిక విప్లవకాలంలో అది మరింత బాహాటం కావడంతో మళ్లీ ఆ ప్రాంతం పోరుబాట పట్టింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాలనుంచి హాన్ జనాభాను ఇక్కడికి తరలించడం, క్రమేపీ వారి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో వీగర్లు రగిలిపోయారు. 90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైన ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్పింగ్ పూర్తిస్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటినుంచీ నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు లక్షలాదిమంది వీగర్లను తరలించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నా యని వార్తలొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈమధ్యవరకూ చైనా ఎవరినీ అనుమతించక పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సమితిలో కదలికలు రావడం మొదలయ్యాక శిబిరాల్లో పరిస్థితులు కొంత మారాయంటున్నారు. నిర్బంధితుల విడుదల కూడా చోటుచేసుకున్నదని కథనాలు వచ్చాయి. కానీ జరగాల్సినదాంతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఒక దేశ ఆంతరంగిక సమస్యగానో, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానీకం ఈ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈమధ్యే యూఎన్హెచ్ఆర్సీ హైకమిషనర్గా రిటైరైన మిషెల్ బాష్లెట్ చిలీలో పినోచెట్ పాలనాకాలంలో స్వయంగా నిర్బంధాన్ని అనుభవించినవారు. అందుకే ఆమె హైకమిషనర్గా వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టు చైనా ఎంత మొండికేసినా దాన్ని ఒప్పించడానికి ఆమె ఓపిగ్గా ప్రయత్నించారు. పరిమిత సంఖ్యలోనైనా పాత్రికేయులను అక్కడి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడటం బాష్లెట్ విజయమే. కానీ ఏళ్లతరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేథంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది. బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు బలమైన దేశాలు కళ్లెదుటే దురాగ తాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్ దేశాలు వీగర్ ముస్లింలకు ఏదో ఒరగబెడ తాయనుకోవడం దండగ. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గుతేల్చడానికి మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక తెలిపింది. యూఎన్హెచ్ఆర్సీ సభ్య దేశాలు అంగీకరిస్తేనే అది సాధ్యం. చైనా దీన్నెలాగైనా అడ్డుకుంటుంది. మొత్తానికి ఈ నివేదిక చైనా నేర వైఖరిని బయటపెట్టింది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్ ముస్లింలకు నైతిక మద్దతునీయడం దేశదేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యం. -
అణు వినాశనం ముంగిట ప్రపంచం: గుటెర్రస్
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్లో యుద్ధం, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అణు వినాశనం వైపుగా నడిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క అపోహ, పొరపాటు అంచనాతో మానవాళి మొత్తాన్ని అణ్వస్త్రాలు కబళించి వేస్తాయని హెచ్చరించారు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) అమలుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఆయన మాట్లాడారు. వివిధ దేశాల వద్ద ప్రస్తుతం 13 వేల అణ్వాయుధాలు పోగుపడ్డాయని చెప్పారు. -
చైనా కాదు త్వరలో భారత్ నెం.1: యూఎన్ నివేదిక
వచ్చే ఏడాది నాటికి చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుందట. ఈ మేరకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసింది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఏమంటోందంటే.. ప్రపంచ జనాభా నవంబర్ మధ్య నాటికి ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని, దీంతో పాటు 2030లో దాదాపు 8.5 బిలియన్లుగా, 2050లో 9.7 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా తక్కువ సంఖ్యలో జనాభా పెరుగుతున్నట్లు నివేదికలో వెల్లడించింది. నివేదికలోని కొన్ని కీలకమైన విషయాలు: ►2023నాటికి చైనాను భారత్ అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారునుందని అంచనా వేసింది. ►2050 వరకు అంచనా ప్రకారం.. ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనాభా కేవలం ఎనిమిది దేశాలలో ఉండనున్నట్లు తెలిపింది. (అందులో భారత్ కూడా ఒకటి) ►ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, ఓషియానియాలోని జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి పెరుగుదల నెమ్మదిగా ఉండనున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొంది. ►2010-2021 నుంచి వలసదారుల నికర ప్రవాహం 1 మిలియన్ దాటిన 10 దేశాలలో ఉన్నాయని తెలపగా, అందులో భారతదేశం కూడా ఉంది. ►సిరియా, వెనిజులా, మయన్మార్ వంటి దేశాలు అభద్రత, సంఘర్షణ కారణాల వల్ల అక్కడ నుంచి వలసలు పెరుగుతున్నట్లు వెల్లడించింది. ►ఎక్కువగా కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా ప్రపంచ ఆయుర్దాయం 2019లో 72.8 నుంచి 2021లో 71.0 సంవత్సరాలకు పడిపోయిందని తెలిపింది. ►తక్కువ అభివృద్ధి చెందిన 46 దేశాలు జనాభా పరంగా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నట్లు పేర్కొన్నారు. 2022 నుంచి 2050 మధ్య చాలా వరకు జనాభా రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
శతమానం భారతి.. ఆహార భద్రత
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2023ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం. ఈ పంటల జీవవైవిధ్యంలోనూ మనదే అగ్రస్థానం. కాబట్టి, 2022–23 కేంద్ర బడ్జెట్లో చిరుధాన్య పంటలకు అదనపు విలువ జోడిస్తున్నట్లు ప్రకటించారు. చిరుధాన్యాల్లో మూడు కీలక పంటలు (జొన్నలు, సజ్జలు, రాగులు); ఆరు మైనర్ పంటలు (ఊదలు, వరిగలు, కొర్రలు, అరికెలు, అండు కొర్రలు, చిన్న అండు కొర్రలు) ఉంటాయి. గోధుమ, వరిలో కంటే పోషకపదార్థాలు, మినరల్స్, విటమిన్స్ ్స మూడు నుంచి 5 రెట్లు ఎక్కువగా ఈ చిరుధాన్యాల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా కోటి 14 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలను పండిస్తున్నారని అంచనా. అంటే సంవత్సరానికి దాదాపు కోటి 60 లక్షల టన్నుల పంట పండుతోంది. ఆసియా చిరుధాన్యాల ఉత్పత్తిలో 80 శాతం, ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 20 శాతాన్ని భారతదేశంలోనే పండిస్తున్నారు. భారతీయ చిరుధాన్య ఎగుమతులు 2020 సంవత్సరంలో 2 కోట్ల 60 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాల ఉత్పత్తి, పంపిణీ, క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, శిక్షణలు, ప్రాథమిక ప్రాసెసింగ్ క్లస్టర్లు, పరిశోధనా మద్దతుతో రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి... భారత ప్రభుత్వం, జాతీయ ఆహార భద్రతా లక్ష్యసాధనా నిర్వాహక మార్గదర్శకాల్లో మార్పులు తీసుకొచ్చింది. వచ్చే పాతిక సంవత్సరాలో అవసరమైన ఆహార భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే చిరుధాన్య దిగుబడి ప్రణాళికలను కార్యాచరణలో పెట్టింది. -
శతమానం భారతి... విద్యారంగం-లక్ష్యం 2047
డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం విద్యారంగంలో గణనీయమైన అభివృద్ధినే సాధించింది. రాధాకృష్ణ కమిషన్ , మొదలియార్ కమిటీ, కొఠారి కమిటీ, జాతీయ విద్యా విధానం – 1968, నూతన విద్యా విధానం–1986, స్వర్ణ సింగ్ కమిటీ, రామ్మూర్తి కమిటీ, యశ్పాల్, జనార్దన్ కమిటీల సిఫారసులను అనుసరించి అనేక సంస్కణలను చేపట్టింది. ఫలితంగా 1951లో 18 శాతంగా ఉన్న అక్షరాస్యత 75 ఏళ్లలో 74 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ‘2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్య’ అనే ఐక్యరాజ్య సమితి లక్ష్యం వైపు దేశం ముందుకు సాగుతోంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు భారత ప్రభుత్వం బదలాయించింది. 45వ అధికరణలో అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నూతన విద్యా విధానం–1986లో భాగంగా పాఠశాల స్థాయి విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు పెంపొందించేలా మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. పాఠశాల స్థాయి విద్యావ్యవస్థలో ప్రమాణాల మెరుగుదలకు ఆ వ్యవస్థ నాంది పలికింది. ‘యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2019–20’ గణాంకాల ప్రకారం, ప్రాథమిక విద్యలో సగటు విద్యార్థి నమోదు నిష్పత్తి 97.8శాతం గా ఉంది. వచ్చే 25 ఏళ్లలో విద్యారంగంలో మరింత మెరుగైన çఫలితాలను సాధించే దిశగా భారత్ కృషి చేస్తోంది. (చదవండి: దాదాపు 20% ఉక్రెయిన్ భూభాగం రష్యా హస్తగతం!) -
Turkey To Turkiye: టర్కీ పేరు మార్చుకోవడానికి కారణం ఇదే!
అంకారా: మిడిల్ ఈస్ట్ కంట్రీ టర్కీ.. అధికారికంగా తన పేరు మార్చుకుంది. టర్కీ కాస్త ఇక నుంచి ‘తుర్కియె’గా మారనుంది. ఇక నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పంపారు. ఆ వెంటనే ఐరాస అంగీకారం చెబుతూ.. ఈ విషయాన్ని ప్రకటించింది. దేశం గుర్తింపులో మార్పులుచేసే ‘‘రీబ్రాండింగ్’’ను.. కిందటి ఏడాది అధ్యక్షుడు రెచప్ టయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దేశం పేరును మార్చాలంటూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను అక్కడి ప్రభుత్వ అధికారులు ఆశ్రయిస్తున్నారు. ఎర్దోగాన్ సైతం తమ దేశం పేరును తుర్కియె (Türkiye)గా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియా అనే పదం చక్కగా నప్పుతుందని ఎర్దోవాన్ చెబుతూ వస్తున్నారు. గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్టీలో వెంటనే మార్పులు చేశారు. టర్కీ (turkey)గా ఉన్న దేశం పేరును తుర్కియె(Türkiye)గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు. కొత్త పేరును అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు టర్కీ విదేశాంగ మంత్రి. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది. దీంతో టర్కీ అనే పేరు ఇక చరిత్ర కానుంది. కారణం ఇదే.. టర్కీ అనేది ఒక పక్షి పేరు. అంతేకాదు.. ఫెయిల్యూర్, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లిష్ అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పేరు మార్చాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని టీఆర్టీ చెబుతోంది. గత జనవరిలో ‘హలో తుర్కియా’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా.. ఇక నుంచి ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రాడక్టులపై ‘మేడ్ ఇన్ తుర్కియె’ మారుస్తారు. దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మిశ్రమ స్పందన దేశం పేరును మార్చడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవాన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జనాలు కూడా తమ పరిస్థితి పట్టించుకోకుండా.. ఇలా పేర్లు మారుస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో డచ్ ప్రభుత్వం హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్, ఐరాసకు తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా గ్రీస్తో ఉన్న గొడవల నేపథ్యంలో.. నార్త్ మాసిడోనియాగా పేరు మార్చుకుంది. గతంలో పర్షియా ఇరాన్ అయ్యింది. అలాగే.. సియామ్ కాస్త థాయ్లాండ్ అయ్యింది. ఇలా ఎన్నో దేశాలు పేర్లు మార్చుకున్నాయి. -
Russia War: శాంతి చర్చల కోసం రంగంలోకి కీలక వ్యక్తి.. పుతిన్ రెస్పాన్స్..?
వాషింగ్టన్: ఉక్రెయిన్లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటన ఖరారైంది. ఈ నెల 26న రష్యాలో, 28న ఉక్రెయిన్లో గుటెరస్ పర్యటించనున్నారు. ఈ పర్యటన విషయంపై రెండు దేశాలకు ఆయన లేఖలు రాశారు. కాగా, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. అటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్తో, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతోనూ ఆయన భేటీ కానున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ కోసం వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా రష్యా యుద్ధానికి విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్లో 1.2 కోట్ల మందికి మానవతా సాయం అవసరం ఉందన్నారు. డొనెట్స్క్, లుహాన్స్క్, మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లోనే చాలా మంది ఉక్రేనియన్లు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చావు బతుకుల మధ్య ఉన్న ప్రజల కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాలు తుపాకులు వదిలాలని పిలుపునిస్తున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: రక్షణ విషయంలో రష్యాపై భారత్ ఆధారపడొద్దు -
రష్యా నరమేధం.. బుచా వీధుల వెంట చెల్లాచెదురుగా శవాలు
Bucha Massacre Ukraine: యుద్ధ నేరానికి దిగిన రష్యా.. నర మేధానికి పాల్పడింది!. కాళ్లు చేతులు కట్టేసి.. తలలో బుల్లెట్లు దింపిన పౌరుల ఫొటోలు, వీడియోలు ఉక్రెయిన్లో జరిగిన మారణహోమం తాలుకా పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రాజధాని కీవ్కు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిన బుచా పట్టణంలో.. శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. మరోవైపు మహిళలపై నడిరోడ్డుపైనే అఘాయిత్యాలు జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్, అమెరికాలు రష్యాపై తీవ్రస్థాయిలో ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. కీవ్కు ఈశాన్యంగా 37 కిలోమీటర్ల దూరంలో ఉంది బుచా పట్టణం. నెలరోజుల పాటు జరిగిన రష్యా దురాక్రమణలో సుమారు 300 మంది పౌరులు మరణించినట్లు బుచా మేయర్ ఫెడోరుక్ ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో.. రష్యా బలగాలు తిరుగుముఖం పట్టిన టైంలో మరో 400 మందికి పైగా పొట్టనపెట్టుకుందని చెప్పారాయన. వీధుల వెంట బుల్లెట్ గాయాలతో, కాళ్లు చేతులు కట్టేసి ఉన్న శవాలే దర్శనమిస్తున్నాయి ఎటు చూసినా. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేషీలోని ఒలెక్సీ అరెస్టోవీచ్ బుచా ఊచకోతకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. Butcha లో మహిళలపై రష్యా బలగాలు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డాయని, ఆపై వాళ్లను కట్టేసి నిప్పటించి సజీవ దహనం చేశారని ఆరోపించారు. అంతేకాదు స్థానిక అధికారులు, పిల్లల మృతదేహాలు రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకే చోట 300 మందికి నైరుతి భాగంలో ఉన్న ఓ చర్చి దగ్గర అంత్యక్రియలు నిర్వహించగా.. ఇది రష్యా జరిపిన ఉద్దేశపూర్వక మారణకాండగా ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. మృతుల్లో ఓ పసికందు, 14 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇండిపెండెంట్ దర్యాప్తునకు ఆదేశించింది ఐక్యరాజ్య సమితి. I am deeply shocked by the images of civilians killed in Bucha, Ukraine. It is essential that an independent investigation leads to effective accountability. — António Guterres (@antonioguterres) April 3, 2022 రష్యా కౌంటర్ ఈ ఆరోపణలపై రష్యా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అదంతా కీవ్ నుంచి జరుగుతున్న కుట్రే అని పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బుచాలో శవాల ఫొటోలు, వీడియోలు కీవ్ నుంచి వెలువడుతున్న రెచ్చగొట్టుడు సంకేతాలే అని పేర్కొంది. ఇదంతా కీవ్వర్గాలు ఆడుతున్న నాటకం. పాశ్చాత్య దేశాల మీడియా కోసమే ఇదంతా చూపిస్తున్నారు. రష్యా బలగాలు అక్కడ ఉన్న టైంలో ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలేదు. ఎలాంటి హింసకు, అఘాయిత్యాలకు కూడా మా సైన్యం పాల్పడలేదు. శాంతి స్థాపనలో భాగంగానే మా దళాలు ఎలా వెళ్లాయో.. అలాగే వెనక్కి వచ్చేశాయి. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించింది రష్యా రక్షణ శాఖ. -
భారత్ను నిండా ముంచేస్తున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం! ఐక్యరాజ్యసమితి వార్నింగ్!
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రభావం 2022లో భారత్పై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్సీటీఏడీ) గురువారంనాటి తన తాజా నివేదికలో పేర్కొంది. 2022పై ఇంతక్రితం 6.7 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను తాజాగా 4.6 శాతానికి (2 శాతానికి పైగా) తగ్గించింది. ఇంధన సరఫరాలపై సమస్యలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానాలు, వెరసి ఆర్థిక అనిస్థితిని దేశం ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. ఇక యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు అంచనాను ఒక శాతం అంటే 3.6 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ►ఈ ఏడాది రష్యా తీవ్ర మాంద్యాన్ని చవిచూసే పరిస్థితి ఉండగా, పశ్చిమ ఐరోపా అలాగే మధ్య, దక్షిణ, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో వృద్ధిలో గణనీయమైన మందగమనం ఉంటుంది. ► రష్యా వృద్ధి 2.3 శాతం నుండి మైనస్ 7.3 శాతానికి క్షీణించింది. ► దక్షిణ, పశ్చిమ ఆసియాలోని కొన్ని ఇతర ఆర్థిక వ్యవస్థలు ఇంధన ధరల వేగవంతమైన పెరుగుదల నుండి కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆయా దేశాలు ప్రాథమిక వస్తువుల మార్కెట్లలో ప్రతికూలతలు, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం తత్సబంధ ఫైనాన్షియల్ అస్థిరతలు ఎదుర్కొనే వీలుంది. ► అమెరికా వృద్ధి అంచనా మూడు శాతం నుండి 2.4 శాతానికి, చైనా వృద్ధి 5.7 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గిస్తున్నాం. ► రష్యా క్రూడ్, గ్యాస్ను ఎగుమతి చేస్తున్నప్పటికీ దేశంలో ఇతర వస్తువలు అధిక ధరల కారణంగా ఆదాయాల భర్తీలోపురోగతి కనిపించని పరిస్థితి ఉంది. దిగుమతులు లేదా రుణ సేవల కోసం విదేశీ మారక ఆదాయాన్ని ఉపయోగించే పరిస్థితి లేకపోవడం ప్రతికూలాంశం. ► ఫారెక్స్ మార్కెట్లలో రోజువారీ టర్నోవర్ 6.6 ట్రిలియన్ డాలర్లు. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా కరెన్సీలు వాటా 3.5% కంటే ఎక్కువ కాదు. యునైటెడ్ స్టేట్స్ డాలర్ టర్నోవర్ ఒక్కటే 44 శాతంగా ఉండడం గమనార్హం. ► ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా పలు అభివృద్ధి చెందిన దేశాలు ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేసే వీలుంది. ఆయా అంశాలు బడ్జెట్ వ్యయాల కోతలకూ దారితీయవచ్చు. ► బలహీనపడుతున్న ప్రపంచ డిమాండ్, అంతర్జాతీయ స్థాయిలో తగినంత విధాన సమన్వయం లేకపోవడం, మహమ్మారి వల్ల పెరిగిన రుణాలు వంటి అంశాలు పలు దేశాలకు ఆర్థిక కష్టాలను సృష్టిస్తాయి. ఇది కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలను దివాలా, మాంద్యం అగాధాలకు నెట్టవచ్చు. ► కోవిడ్–19తో అసలే తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ప్రపంచ ఎకానమీకి ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితి నెలకొంది. ► పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యంత పేదలపై దుర్బలమైన తక్షణ ప్రభావం చూపుతాయి. ఫలితంగా తమ ఆదాయంలో అత్యధిక వాటాను ఆహారంపై ఖర్చు చేసే కుటుంబాలు తీవ్ర సమస్యలకు గురయ్యే వీలుంది. వీరి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయే వీలుంది. ► ఆహారం, ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. తాజా పరిస్థితులు అధిక ధరలు జీవనోపాధిని తగ్గించడంతోపాటు, పెట్టుబడులను నిరుత్సాహపరుస్తాయి. దీనికితోడు పలు దేశాల వాణిజ్య లోటు భారీగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. -
ఫిన్లాండ్.. అంత సంతోషంగా ఎలా ఉంటుందో తెలుసా?
ఫిన్లాండ్.. మరోసారి హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలిచింది. వరుసగా ఐదవ ఏడాది ఈ ఘనత సొంతం చేసుకుంది ఈ యూరోపియన్ కంట్రీ. ఐక్యరాజ్య సమితి వార్షిక సూచీ వివరాల ప్రకారం.. ఈ భూమ్మీద ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానంలో ఉంది. వరుసగా ఐదో ఏడాది World's Happiest Nation సూచీలో తొలిస్థానం సంపాదించుకుంది. సెర్బియా, బల్గేరియా, రొమేనియా సైతం ఈ లిస్ట్లో పుంజుకుని ముందుకు ఎగబాకాయి. ► ఇక ఈ సూచీలో ఘోరంగా పతనం అయ్యింది లెబనాన్, వెనిజులా, అఫ్గనిస్థాన్ దేశాలు. లెబనాన్.. ఆర్థిక సంక్షోభం కారణంగా జాబితాలో చివరి నుంచి రెండో ప్లేస్లో నిలిచింది. ► ఇక చివరిస్థానంలో ఉంది అఫ్గనిస్థాన్. గత ఆగష్టులో తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక మానవ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ► వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్.. 2022లో వరుసగా పదవ ఏడాది రిలీజ్ అయ్యింది. ఆర్థిక, సోషల్ డేటా, ప్రజల ఆనందం యొక్క స్వంత అంచనా ఆధారంగా ఈ సూచీలో స్థానం కల్పిస్తారు. సూచీ స్కేల్ సున్నా నుంచి పది మధ్యగా ఉంటుంది. సగటున మూడేళ్ల కాలానికి గణిస్తారు. ఇదిలా ఉంటే.. తాజా నివేదిక ఉక్రెయిన్-రష్యా యుద్దం కంటే ముందుగానే రూపొందించారు. ► ఉత్తర యూరప్ దేశాల డామినేషన్ ఈ సూచీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ స్విట్జార్లాండ్, ఐస్ల్యాండ్, నెదర్లాండ్స్(హాల్యాండ్), నార్వే, స్వీడన్ ఉన్నాయి. ప్రత్యేక గౌరవం భూటాన్కు దక్కింది. భారత్ 136వ స్థానంలో నిలిచింది. ► ఫిన్లాండ్ జనాభా.. దాదాపు 5.5 మిలియన్. ఇక్కడి ప్రజల లైఫ్స్టయిల్ డిఫరెంట్గా ఉంటుంది. ఫిన్లాండ్ ప్రజలు సంతోషం వచ్చినా.. దుఖం వచ్చినా గోల చేయరు. ఒక డిగ్నిటీతో సాగిపోతుంటుంది వాళ్ల లైఫ్. ► ముఖ్యంగా కరోనా టైంలో ఫిన్లాండ్ ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది. బహిరంగ వేడుకలను పరిమితంగా చేసుకోవాలన్న ప్రభుత్వ పిలుపును తూచా తప్పకుండా పాటించి క్రమశిక్షణలో తమకు తామే సాటని ప్రపంచానికి చాటి చెప్పారు. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ► విస్తారమైన అడవులు, సరస్సుల దేశం అది. బాగా పనిచేసే ప్రజా సేవలు, అధికారంపై విస్తృత విశ్వాసం ఉంటుంది అక్కడి ప్రజలకు. అలాగే నేరాలు తక్కువ. పైగా అసమానతలకు తావు ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తుంటారు అక్కడి ప్రజలు. ► నాణ్యత విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం, స్వచ్ఛమైన స్వభావం, అధిక వ్యక్తిగత స్వేచ్ఛ, బాగా పనిచేసే సమాజం.. Finland ప్రజల సంతోషానికి కారణాలు. ► కరోనా టైంలో ప్రపంచంలో చాలా దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిపోయాయి. ప్రజలు మానసికంగా కుంగిపోయారు. అయితే ఫిన్లాండ్లో మాత్రం కరోనా ప్రభావం.. వాళ్ల సంతోషాన్ని దూరం చేయలేకపోయింది. -
Sakshi Cartoon: ఉక్రెయిన్ వలసలు 5 లక్షలు: ఐక్యరాజ్యసమితి
ఉక్రెయిన్ వలసలు 5 లక్షలు: ఐక్యరాజ్యసమితి -
నగరాల్లో హోరాహోరీ..ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాలు
కీవ్: ఉక్రెయిన్పై దాడిలో రష్యా సేనలు కీలక పట్టణాల్లోకి చొచ్చుకువస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో రష్యా బలగాలకు, ఉక్రెయిన్ మిలటరీకి మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎయిర్ఫీల్డ్స్, ఇంధన నిల్వాగారాలపై దాడులు చేసిన రష్యా బలగాలు ఆదివారం నాటికి ఉక్రెయిన్లోని కీలక నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు చర్చలకోసం బెలారస్కు బృందాన్ని పంపినట్లు రష్యా ప్రకటించింది. కానీ తమ దేశం నుంచి దాడులకు కేంద్రమైన బెలారస్లో చర్చలకు వెళ్లమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. మరే దేశంలోనైనా చర్చలకు సిద్ధమని తొలుత చెప్పారు, కానీ బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు సిద్ధమని తాజాగా ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఆదివారం రష్యాలోని ఖార్కివ్ నగరం సమీపంలోకి రష్యా సేనలు చొచ్చుకువచ్చాయి. వీరిని ఉక్రెయిన్ బలగాలు ఎదుర్కొంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నగరం తూర్పున ఉన్న గ్యాస్ లైన్ను రష్యా సేనలు పేల్చివేశాయి. రష్యా నుంచి కాపాడేందుకు అందరూ ఆయుధాలు ధరించాలన్న అధ్యక్షుడి పిలుపుతో పలువురు ఉక్రేనియన్లు కదనరంగంలో పోరాడుతున్నారు. దీంతో రష్యన్ బలగాలకు చాలాచోట్ల ప్రతిఘటన ఎదురవుతోంది. పోరాడుతాం...: ‘‘మేం మా దేశం కోసం పోరాడుతున్నాం, మా స్వతంత్రం కోసం పోరాడుతున్నాం, ఎందుకంటే దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడే హక్కు మాకుంది.’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ప్రకటించారు. దేశమంతా బాంబులతో దద్దరిల్లుతోందని, పౌర నివాసాలను కూడా విడిచిపెట్టడం లేదని ఆయన వాపోయారు. కీవ్ సమీపంలో భారీ పేలుళ్లతో పాటు మంటలు కనిపించాయి. దీంతో ప్రజలంతా భయంతో బంకర్లలో, సబ్వేల్లో దాక్కుంటున్నారు. నగరంలో 39 గంటల కర్ఫ్యూ విధించారు. కీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా పేలుళ్లు వినిపించాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. రష్యాది ఉగ్రవాదమని జెలెన్స్కీ దుయ్యబట్టారు. తమ నగరాలపై రష్యా దాడులకు సంబంధించి అంతర్జాతీయ యుద్ధనేరాల ట్రిబ్యునల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రష్యాను ఐరాస భద్రతా మండలి నుంచి తొలగించాలన్నారు. తీరప్రాంత స్వాధీనం ఉక్రెయిన్ దక్షిణాన ఉన్న కీలక నౌకాశ్రయ నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో ఉక్రెయిన్ తీరప్రాంతం రష్యా అదుపులోకి వచ్చినట్లయింది. నల్ల సముద్రంలోని ఖెర్సన్, అజోవ్ సముద్రంలోని బెర్డిన్స్క్ పోర్టులను స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ప్రకటించారు. పలు నగరాల్లో విమానాశ్రయాలు కూడా తమ అదుపులోకి వచ్చాయన్నారు. అయితే ఒడెసా, మైకోలైవ్ తదితర ప్రాంతాల్లో పోరు కొనసాగిస్తున్నామని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. పోర్టులు చేజారడం ఉక్రెయిన్కు ఎదురుదెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు. పొంతన లేని గణాంకాలు యుద్ధంలో ఇరుపక్షాల్లో ఎంతమంది మరణించారు, గాయపడ్డారు అన్న విషయమై సరైన గణాంకాలు తెలియడంలేదు. రష్యాదాడిలో 198 మంది పౌరులు చనిపోయారని, వెయ్యికిపైగా గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ఆరోగ్యమంత్రి చెప్పారు. రష్యాసేనల్లో 3,500మంది చనిపోయారని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. దాడులు ఆరంభమైన తర్వాత సుమారు 3.68 లక్షలమంది ఉక్రేనియన్లు పొరుగుదేశాలకు వలసపోయారని ఐరాస తెలిపింది. ఒకపక్క రష్యా సేనలు ఉక్రెయిన్లోకి చొచ్చుకుపోతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు పలురకాల ఆయుధాలు, మందుగుండు సమాగ్రిని సమకూరుస్తున్నాయి. అదే సమయంలో రష్యాపై భారీ ఆంక్షలను విధిస్తున్నాయి. ఉక్రెయిన్కు 35 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని అమెరికా ప్రకటించింది. 500 మిస్సైళ్లు, 1000 యాంటీ టాంక్ ఆయుధాలను పంపుతామని జర్మనీ తెలిపింది. బెల్జియం, చెక్, డచ్ ప్రభుత్వాలు కూడా ఆయుధాలు పంపుతున్నాయి. ఎంపిక చేసిన రష్యా బ్యాంకులను స్విఫ్ట్ (అంతర్జాతీయ బ్యాంకు అనుసంధానిత వ్యవస్థ) నెట్వర్క్లో బ్లాక్ చేసేందుకు యూఎస్, యూకే, ఈయూ అంగీకరించాయి. ఉక్రెయిన్లో తమ స్టార్లింగ్ ఇంటర్నెట్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తున్నట్లు బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించారు. ఐరాస అత్యవసర భేటీ! ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణపై చర్చకు 193 మంది సభ్యులతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భేటీ కోసం భద్రతా మండలిలో ఓటింగ్ జరగనుంది. భద్రతామండలి పూర్తి సమావేశంలో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలు లేదు. దాడిపై భద్రతా మండలి తీర్మానాన్ని శుక్రవారం రష్యా వీటో చేయడం తెలిసిందే. రష్యా విమానాలపై ఈయూ నిషేధం రష్యా విమానాలను తమ గగనతలంపై నిషేధించాలని 27 దేశాల యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఉక్రెయిన్కు ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చాలని నిర్ణయించామని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా చెప్పారు. ఈయూ చరిత్రలో దాడికి గురవుతున్న దేశానికి ఆయుధ సాయం కోసం నిధులందించడం ఇదే తొలిసారన్నారు. -
తెల్లవారుతూనే నిప్పుల వాన.. ఏ సమయానికి ఏం జరిగింది..
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలు. వెలుగు రేఖలు పుడమిని పలుకరించే సమయం ఆసన్నమైంది. జనమంతా అప్పుడే నిద్ర నుంచి మేల్కొంటున్నారు. ఇంతలోనే రష్యా సైన్యం దండయాత్ర ప్రారంభించింది. ప్రభాత కిరణాలకు బదులు ఆకాశం నుంచి నిప్పుల వాన మొదలయ్యింది. గ్రీన్విచ్ మీన్ టైమ్(జీఎంటీ) ప్రకారం.. ఉదయం 3 గంటలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి యుద్ధ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత వరుసగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడేం జరిగిందంటే... ఉదయం 03: ఉక్రెయిన్లోని డాన్బాస్పై దాడి ప్రారంభించినట్లు పుతిన్ ప్రకటన. ఆయుధాలు వదిలేసి ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఉక్రెయిన్ సైన్యానికి సూచన. జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నిస్తే ఎన్నడూ చూడని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇతర దేశాలకు హెచ్చరిక. ఉదయం 3.35: ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ముందస్తు హెచ్చరిక లేకుండా దాడికి దిగడం అన్యాయమని వెల్లడి. ఈ అవాంఛనీయ పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని స్పష్టీకరణ. రష్యా దుందుడుకు చర్యను ఖండించిన ‘నాటో’ సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్. రష్యా సైనిక బలగాలను, ఆయుధాలను ఉక్రెయిన్ నుంచి వెనక్కి మళ్లించాలని పుతిన్కు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వినతి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన జో బైడెన్. ఉక్రెయిన్ ప్రజలకు అండగా ఉంటామని హామీ. ఉదయం 3.46: తూర్పు ఉక్రెయిన్లోని మారియూపోల్లో తీవ్రస్థాయిలో వినిపించిన పేలుళ్ల శబ్దాలు. ఉదయం 04.00: కీవ్ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణికులను, సిబ్బంది ఖాళీ చేసినట్లు ఉక్రెయిన్ మౌలిక సదుపాయాల శాఖ ప్రకటన. ఉదయం 4.15: రాజధాని కీవ్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వినిపించిన బాంబు పేలుళ్ల శబ్దాలు. కీవ్లో ఏడుసార్లు భీకర శబ్దాలు వినిపించినట్లు అల్ జజీరా ప్రతినిధి ఆండ్రూ సైమన్స్ వెల్లడి. రష్యా అనుకూల తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డొనెట్క్స్, ఖార్వివ్లోనూ పేలుళ్ల శబ్దాలు. ఉదయం 4.30: తమ దేశంపై రష్యా పూర్తిస్థాయి యుద్ధం ఆరంభించిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్పష్టీకరణ. కీలక నగరాలపై క్షిపణి దాడులు చేస్తోందని వెల్లడి. ఉదయం 4.30: ఉక్రెయిన్ కంప్యూటర్లపై సైబర్ దాడులు చేసిన రష్యా ఉదయం 4.41: పేలుళ్ల దృష్టా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కీవ్ నగర మేయర్ సూచన. ఉదయం 4.45: డాన్బాస్లో రష్యా సైనిక చర్యలకు ప్రతిస్పందనగా తమ గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన ఉక్రెయిన్. ఉదయం 05: కీవ్లోని జుంటా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యా మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర భేటీలో తెలియజేసిన ఐరాసలోని రష్యా రాయబారి. ఉక్రెయిన్ ప్రజలకు తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని ఉద్ఘాటన. లుహాన్స్క్ ప్రావిన్స్లో ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న ష్కాస్టియా పట్టణంపై దాడి చేసినట్లు రష్యా అనుకూల వేర్పాటువాదుల ప్రకటన. అలాగే డొనెట్క్స్లోని లైన్ ఆఫ్ కాంటాక్టు వద్ద ఉక్రెయిన్ దళాలపై విరుచుకుపడ్డామని వెల్లడి. ఉదయం 5.25: అత్యంత కచ్చితత్వంతో కూడిన ఆయుధాలతో ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటన. ఉదయం 5.30: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దేశీయ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసిన రష్యా. ఉదయం 5.45: తమ దేశ తూర్పు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్షిపణి దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఆందోళన. ఉదయం 06.00: రష్యాతోపాటు బెలారస్ భూభాగం నుంచి సైతం రష్యా సైన్యం దాడులు చేస్తోందని ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్ సర్వీస్ వెల్లడి. రష్యా సంయమనం పాటించాలని చైనా విజ్ఞప్తి. ఉదయం 6.05: ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అధ్యక్షుడు వ్లాదిమిర్ జేలెన్స్కీ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచన. దేశవ్యాప్తంగా మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటన. ఉదయం 6.20: ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై దాడులు చేశామని, గగనతల రక్షణ వ్యవస్థలను బలహీనపర్చామని రష్యా రక్షణ శాఖ ప్రకటన. తమ యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ నేలకూల్చినట్లు వస్తున్న వార్తలను ఖండించిన రష్యా. ఉదయం 6.48: లుహాన్స్క్ ప్రావిన్స్లోని ష్కాస్టియా, స్టానిస్టియా పట్టణాలను స్వాధీనం చేసుకున్నామని తేల్చిచెప్పిన రష్యా అనుకూల వేర్పాటువాదులు. ఉదయం 07: లుహాన్స్క్లో ఐదు రష్యా యుద్ధ విమానాలను, ఒక హెలికాప్టర్ను నేలకూల్చామ ని ఉక్రెయిన్ సైన్యం ప్రకటన. ఉదయం 7.15: క్రిమియా నుంచి రష్యా ఆయుధాలను, సైనిక సామగ్రిని తమ భూభాగంలోకి చేరవేస్తోందని ఉక్రెయిన్ వెల్లడి. పశ్చిమ ఉక్రెయిన్లోని లెవివ్ ప్రాంతంపై గురిపెట్టిన రష్యా సైన్యం. రష్యా దాడుల్లో తమ దేశంలో కనీసం 8 మంది మరణించారని, మరో 9 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలహాదారు వెల్లడి. చెర్నీహివ్, ఖార్కివ్, లుహాన్స్క్ నుంచి సరిహద్దులు దాటి ఉక్రెయిన్లోకి ప్రవేశిస్తున్న రష్యా సైన్యం. ఉదయం 7.46: తీరు మార్చుకోకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని ఈయూ హెచ్చరిక ఉదయం 8.22: ఉక్రెయిన్పై దాడులు ఆపాలని పుతిన్కు ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి ఉదయం 9.10: తమ సైనిక సాయం అందజేయాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్స్కీ వినతి ఉదయం 9.51: రష్యాతో దౌత్యపరమైన సంబం ధాలు తెంచుకుంటున్నట్లు జేలెన్స్కీ ప్రకటన ఉదయం 10.02: రష్యా దాడుల్లో తమ దేశంలో ఇప్పటిదాకా 40 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వెల్లడి -
దూకుడు పెంచిన రష్యా.. పుతిన్ తీరుపై ఫుల్ ఫైర్
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా దూకుడు క్రమంగా ప్రత్యక్ష సైనిక ఆక్రమణగా మారుతోంది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా అతిక్రమిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై, రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. రష్యా చర్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. తూర్పు ఉక్రెయిన్లోని ఈ సమస్యను మిన్స్క్ ఒప్పందానికి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యాకు సూచించారు. తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ చేసే అన్ని ప్రయత్నాలకూ ఐరాస పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. బలప్రయోగం ద్వారా ఏమైనా చేయొచ్చని పుతిన్ భావిస్తున్నారని, తన దుందుడుకు చర్యల ద్వారా అంతర్జాతీయ వ్యవస్థలనే సవాలు చేస్తున్నారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ విమర్శించారు. ఆయనకు గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాలన్నీ రష్యా చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉక్రెయిన్ సంక్షోభంపై భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. కాగా, రష్యాకు దగ్గరవుతున్న చైనా మాత్రం, సంక్షోభ నివారణకు మరిన్ని చర్చలు మేలంటూ ఆచితూచి స్పందించింది. (ఇది చదవండి: రష్యాకు షాకిచ్చిన అమెరికా.. బైడెన్ కీలక నిర్ణయం) -
తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలీసు అధికారులు..
కొంత కాలం క్రితం... దక్షిణ సూడాన్లోని జుబా నగరంలో జరుగుతున్న యూఎన్ (ఐక్యరాజ్యసమితి) మెడల్ పరేడ్ అది. పతకం స్వీకరించడానికి ఆ ఐదుగురు మహిళా పోలిసు అధికారులు నడిచొస్తుంటే నలుదిక్కుల నుంచి చప్పట్లు మారుమోగాయి. వారి నడకలో సాహస ధ్వని వినిపించింది. దక్షిణ సుడాన్లో ఏ ప్రమాదం ఏ మూల నుంచి మృత్యువును మోసుకొస్తుందో తెలియని కల్లోల ప్రాంతాల్లో పనిచేశారు వారు. పోలిస్ ఇన్స్పెక్టర్ రీనా యాదవ్... చండీగఢ్ డీఎస్పీ భారతి స్వామినాథన్... మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రజనీకుమారి... మహారాష్ట్ర డీఎస్పీ గోపిక జహగిర్దార్.... మహారాష్ట్ర ఏ ఎస్పీ కమలా షెకావత్... రాజస్థాన్ దక్షిణ సుడాన్లో అంతర్యుద్ధ పరిస్థితులను నివారించడంలో తమవంతు పాత్ర పోషించి ‘శభాష్’ అనిపించుకున్నారు. ఐక్యరాజ్యసమితికి మన మహిళా పోలిస్ అధికారుల సాహస ప్రవృత్తి, త్యాగం... సుపరిచితం. (చదవండి: 6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!) తాజాగా... ఆంధ్ర, తెలంగాణ, దిల్లీ, హరియాణ, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్... మొదలైన రాష్ట్రాలు, రకరకాల సెంట్రల్ పోలిస్ ఆర్గనైజేషన్స్ నుంచి 69 మంది పోలిసు అధికారులు ‘యునైటెడ్ నేషన్స్ మిషన్ సర్వీసెస్: 2022–2024’లో భాగం అయ్యారు. వెహికిల్, వెపన్ హ్యాండ్లింగ్, కంప్యూటర్ స్కిల్స్... మొదలైన వాటికి సంబంధించిన పరీక్షలలో వీరు విజయం సాధించారు. ఈసారి విశేషం ఏమిటంటే ప్యానల్లో తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలిసు అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూఎన్లో పనిచేయడానికి వృత్తినిబద్ధత, భిన్నసంస్కృతుల పట్ల గౌరవభావం... ప్రధాన లక్షణాలు అంటారు. అవి మన మహిళాపోలిసు అధికారులలో పుష్కలంగా ఉన్నాయని గత చరిత్ర సగర్వంగా చెప్పకనే చెబుతుంది. (చదవండి: ‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా..) -
ఎలాన్ మస్క్ భారీ విరాళం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రపంచ కుబేరుడు..!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని గతంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే ఇచ్చిన పిలుపు మేరకు.. సుమారు 5 మిలియన్ టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్లో దాఖలు చేసిన వివరాల ప్రకారం.. నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన వాటాలో నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన 5 మిలియన్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మస్క్ ఇచ్చిన ఈ విరాళం విలువ సుమారు 5.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 43 వేల కోట్లు) ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల్లో ఈ విరాళం ఒకటిగా నిలవనుంది. అయితే విరాళంగా ఇచ్చిన ఈ మొత్తాన్ని ఏ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. నియంత్రణా సంస్థలకు ఇచ్చిన సమాచారంలో కూడా ఆ ట్రస్ట్ వివరాలు పొందుపరచలేదు. మస్క్ వంటి బిలియనీర్లు "ఒక్కసారి తలచుకుంటే" కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలు తీర్చేయొచ్చని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే గతంలో అన్నారు. ప్రపంచంలో సుమారు 4.2 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45,000 కోట్లు) అవసరమని గతంలో ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన మస్క్ నిరుపేదల ఆకలి బాధల నిర్మూలనపై మీ ప్రణాళికేంటో చెబితే, నిధులు ఎలా సద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే.. 6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఇప్పటికిప్పుడు విక్రయించి, ఐక్యరాజ్యసమితి ఫుడ్ ఏజెన్సీకి ఇచ్చేందుకు తాను సిద్ధమేనని గతంలో అన్నారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు మస్క్ తన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చారు. (చదవండి: 10 నిమిషాల్లో రూ.186 కోట్లు సంపాదించిన బిగ్ బుల్) -
Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు..
Warning! Terminator like robots could wipe out humanity from Earth వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్ను తయారు చేసేందుకు అగ్రరాజ్యాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ కిల్లర్ రోబో టార్గెట్ విక్టిమ్ బతికున్నాడా లేదా అనే విషయాన్ని స్వయంగా తెలుసుకోగలవు కూడా. అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్ను రూపొందించే రేసులో దేశాలు నేనంటే నేనని పరుగులు తీస్తున్నాయి. ఐతే ఈ రోబోల వంటి టెర్మినేటర్లు భూమిపై మానవాళిని తుడిచిపెట్టగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇలాంటి డ్రోన్లను అభివృద్ధి చేయడానికి చైనా, రష్యా, అమెరికా పూర్తి మద్ధతును తెలిపాయి. సాంకేతికతతో ఊచకోత కోసేందుకు యత్నం కిల్లర్ రోబోల ముప్పుపెరుగుతున్న దృష్ట్యా ఈ నెలలో జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాణాంతక స్వయం ప్రతిపత్తి గల ఆయుధాల సాంకేతికతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ రోబోలు పూర్తిగా మెషిన్ కంట్రోల్తో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను తీయగలవు. వీటిలో కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతికత పొందుపరచి ఉంటాయి. ఇప్పటికే మొదటి కిల్లర్ రోబో తయారీ పూర్తిచేసిన లిబియా కిల్లర్ రోబోల్లో ఉన్న సాంకేతికత సహాయంతో ఎరను వేటాడి చంపగలవు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేసేలా ఈ రోబోలను రూపొందించబడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ఒక వ్యక్తిని చంపాలా వద్దా అనే విషయాన్ని కూడా స్వయంగా నిర్ణయించుకోగలవు. సాంకేతికత సహాయంతో మనుషులు పెద్ద సంఖ్యలో ఊచకోత కోసే అవకాశం ఉందని మకాలెస్టర్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ డావ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి మొత్తం మావనవాళి అంతం చేస్తాయి. లిబియాలో మొదటి స్వీయ నిర్ణయాత్మక దాడి చేయగల డ్రోన్ను విజయవంతంగా తయారు చేసిందని మార్చిలో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అణ్వాయుధ పోటీలో తప్పిదాలకు చోటివ్వకూడదని, ఇటువంటి డ్రోన్లను వెంటనే నియంత్రించాలని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తోంది. చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
Afghan Crisis: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు
అనుకున్నదానికంటే వేగంగా అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది. మూడు నెలల పాలనలో తాలిబన్లకు పెద్దగా చేయడానికి ఏం లేకుండా పోయింది. దీంతో అఫ్గన్ నేలకు తగిలిన ‘ఆర్థిక’ గాయం మానకపోగా.. పుండు మరింత పెద్దది అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత దయనీయమైన సంక్షోభం చూడబోతున్నామన్న ఐరాస, కొన్ని ప్రపంచ దేశాల అంచనాలే నిజం కావడానికి ఎంతో టైం పట్టేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన మిలియన్ డాలర్ల సహాయం పత్తా లేకుండా పోయింది. అఫ్గనిస్తాన్కు చెందిన బిలియన్ల ఆస్తులు నిలిచిపోయాయి. ఆర్థిక ఆంక్షలు కొత్త ప్రభుత్వానికి గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏర్పడ్డ నగదు కొరత.. వ్యాపారాలు, బ్యాంకుల నిర్వహణకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఇక కరెన్సీ కొరత అఫ్గన్ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అకౌంట్లలో డబ్బులున్నా.. నిల్వలు నిండుకోవడంతో బ్యాంకులకు క్లోజ్డ్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరెన్సీ కోసం వందల కిలోమీటర్లు వెళ్లినా లాభం లేకపోవడంతో దొరికిన వస్తువునల్లా తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి డబ్బును తెచ్చుకుంటున్నారు కొందరు. బ్యాంకుల ముందు నగదు కోసం బారులు తీరిన జనం ఉత్పత్తుల కొరతతో ఆహార, ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు అఫ్గన్ అంతటా ఇదే పరిస్థితి. వీటికి తోడు ఆకలి కేకలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా 30 లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులకు గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి పది లక్షల చిన్నారులు మరణించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫర్నీచర్ అమ్ముకుని మరీ.. ఆర్థికంగా చితికిపోయిన వందల కుటుంబాలు రాజధాని కాబూల్ రోడ్ల మీదకు చేరి ఇంట్లోని సామాన్లు అమ్మేసుకుంటున్నారు. ఆకలి తీర్చుకునేందుకు వస్తు మార్పిడికి పాల్పడుతున్నారు. ఇక ప్రధాన నగరాల ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఉద్యోగాలకు గుడ్బై చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు చిన్నపిల్లలతో నిండిపోతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేని తల్లిదండ్రులు.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో చేర్పిస్తున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఆధారపడడం వల్లే! అఫ్గనిస్తాన్ ఎన్నో ఏండ్లుగా దిగుమతి ఆహారం, నిత్యావసరాలు, ఇంధనాల మీదే ఆధారపడి ఉంటోంది. సొంతంగా ఎలాంటి వనరులను వృద్ధి చేసుకోలేదు. ప్రతీదానికి పొరుగు దేశాల వైపు చూస్తుండేది. తాలిబన్ ఆక్రమణ తర్వాత సరిహద్దులు కూడా మూసుకుపోవడంతో ఆహారం, మందులతో సహా అన్నింటి కొరత ఏర్పడింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసేది. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేసేది ప్రభుత్వం. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక బైడెన్ ప్రభుత్వం ఏకంగా 9.5 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేసింది. అంతేకాదు అఫ్గన్ కేంద్రీయ బ్యాంక్కు అవసరమైన డాలర్ల పంపడం ఆపేసింది. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ఓ దేశం త్వరగతిన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ప్రపంచ సమాజం చూడబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తాలిబన్ ప్రభుత్వానిది. గతంలో లక్షల మందికి ఉపాధి కల్పించిన ప్రైవేట్ సెక్టార్.. ఇప్పుడు మూగబోయింది. వచ్చే ఏడాది జూన్ కల్లా 97 శాతం అఫ్గనిస్తాన్ జనాభా దారిద్ర్యరేఖ దిగువకు మునిగిపోనుందని యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విశ్లేషించింది. దీనికితోడు ఉపాధి కరువు, అవినీతి, పేదరికం, కరువు.. తాలిబన్ పాలనలో అఫ్గన్ నేలను ఆర్తనాదాలు పెట్టిస్తోంది. కరెన్సీ కొరతను అధిగమించేందుకు విత్డ్రా కరెన్సీపై పరిమితులు విధించిన అఫ్గన్ ప్రభుత్వం.. చైనా, పాకిస్థాన్, ఖతర్, టర్కీ దేశాలకు ఆ లోటును పూడ్చేందుకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు వీలైనంత మేర సాయం ద్వారా ఉపశమనం అందించాలని, లేదంటే యూరప్ దేశాలకు వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సెప్టెంబర్లో బైడెన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే.. మానవతా ధృక్పథంతో కొన్ని మినహాయింపులతో సాయం అందించేందుకు ఒప్పుకుంది. కానీ, ఆ మినహాయింపుల ద్వారా ఒరిగింది ఏంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ ఆంక్షలు ఇలాగే కొనసాగితే అఫ్గన్ పౌరుల జీవితాలు తలకిందులు అవుతాయి. ఈ పరిణామాలు ఊహించలేనంత ఘోరంగా ఉంటాయనేది నిపుణుల హెచ్చరిక. అయితే బిలియన్నర డాలర్ల సాయాన్ని తాజాగా ప్రకటించిన అమెరికా, యూరప్ యూనియన్లు.. అఫ్గన్ అంతర్గత వ్యవస్థ బలపడనంత వరకు మానవతా కోణంలో బయటి దేశాల నుంచి సాయం ఎంత అందినా లాభం ఉండదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం..
International Day for the Elimination of Violence against Women: ఒకరోజు వెనక్కి వెళితే... కేరళలోని ఎర్నాకుళంలో పర్వీన్ అనే లా స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. తన చేతిరాతతో కూడిన ఒక సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో దొరికింది. భర్త, అత్తమామలు పెట్టే హింసను తట్టుకోలేక చనిపోతున్నానని రాసింది. రెండు రోజులు వెనక్కి వెళితే... కెన్యాలో అకియో అనే పేరుగల స్త్రీ హత్యకు గురైంది. చంపింది ఎవరో కాదు... భర్తే. అనుమాన పీడితుడైన భర్త అకియోను తరచు హింసించేవాడు. ఒకరోజు బాగా తాగి వచ్చి అందరూ చూస్తుండగానే భార్యను హత్య చేశాడు. కేరళ నుంచి కెన్యా వరకు, అమెరికా నుంచి చైనా వరకు...దేశాల మధ్య భౌగోళిక దూరాలు ఉండొచ్చుగానీ, స్త్రీలపై జరిగే హింస విషయంలో మాత్రం ఎలాంటి దూరాలు లేవు. ఇక్కడెంతో అక్కడంతే! అక్కడెంతో ఇక్కడ అంతే!! బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, వర్ణవివక్షతతో కూడిన హింస, లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, పరువు హత్యలు... ఇలా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం స్త్రీ హింసా వ్యతిరేక దినం (నవంబర్ 25) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది, ఈ సంవత్సరం ‘ఆరేంజ్ ది వరల్డ్: ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్’ గ్లోబల్ థీమ్తో నేటి నుంచి డిసెంబర్ 10 (మానవ హక్కుల దినోత్సవం) వరకు 16 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో ప్రపంచవ్యాప్తంగా 6000కు పైగా ఉమెన్ ఆర్గనైజేషన్స్, 180 దేశాల ప్రతినిధులు, మరెంతో మంది స్త్రీ ఉద్యమ కార్యకర్తలు పాల్గొంటారు. చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! కన్నీటిని కన్నీటితోనే తుడవలేం...కార్యాచరణ కావాలి...ప్రణాళిక కావాలి. ఆచరణ వైపు వడివడిగా అడుగులు పడాలి. ఈ సమావేశాలు అలాంటి పనే చేస్తున్నాయి. లోకల్, కంట్రీ, గ్లోబల్ నేపథ్యంలో ఆలోచనలు, ఆచరణలను సమన్వయం చేస్తున్నాయి. ‘ఇదిగో మా దగ్గర ఇలా చేశాం. మీ దగ్గర మాత్రం ఎందుకు చేయరు’ అని ఒక సూచన ఇస్తాయి. హింసకు వ్యతిరేకంగా పోరాడే స్త్రీ యోధురాళ్ల ఉపన్యాసాలు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తాయి. ‘ఎక్కడో మహిళలపై జరిగే హింస గురించి మాట్లాడడానికి ముందు, మీ ఇంట్లో అలాంటి హింస జరగకుండా చర్యలు తీసుకోండి’ అని దేశ దేశాలకు ఉపదేశం ఇస్తాయి. కాలంతో పాటు హింసా రూపాలు మారుతున్నాయి. కొత్తగా ‘డిజిటల్ వయొలెన్స్’ వచ్చింది... ఇలాంటి ఎన్నో వికృతరూపాల గురించి ఈ సమావేశాలు లోతుగా చర్చిస్తాయి. నిర్మాణాత్మకమైన పరిష్కార మార్గాలు ఆలోచిస్తాయి. ‘ఎండ్ వయొలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ నౌ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదం ఇచ్చేలా చేస్తాయి. చదవండి: Octopus Unknown Facts: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! -
మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక
తాలిబన్ల ఆక్రమణ, అల్లకల్లోల పరిస్థితులు, బయటి దేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిచిపోవడం.. తదితర కారణాలతో అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు లోనైంది. ఈ తరుణంలో అఫ్గనిస్తాన్ పై మరో పిడుగు పడనుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక సంక్షోభం అఫ్గన్ను ముంచెత్తే అవకాశాలున్నాయంటూ హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. యూఎన్ డెవలప్మెంట్ ప్రొగ్రాం(UNDP) సోమవారం మూడు పేజీలతో కూడిన ఒక నివేదికను రిలీజ్ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా ఆర్థిక తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రతికూల ప్రభావం సొసైటీపై ఊహించని స్థాయిలో చూపించ్చొచ్చని అభిప్రాయపడింది ఐరాస. కిందటి ఏడాది 7 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్, ఉత్పత్తులను, సేవలను అందించింది అఫ్గనిస్తాన్. ఎలాంటి అవాంతరాలు లేకుండా లావాదేవీలు జరగడానికి కారణం.. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే. అయితే చాలామంది లోన్లు తిరిగి చెల్లించకపోవడం, తాలిబన్ల ఆక్రమణ తర్వాత నగదు విత్డ్రా, అదే సమయంలో డిపాజిట్లు తక్కువగా వస్తుండడం, అవసరాలకు సరిపడా కరెన్సీ నిల్వలు లేకపోవడంతో.. కొద్దినెలల్లోపే ఈ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస యూఎన్డీపీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికైనా తేరుకుని బ్యాంకింగ్ వ్యవస్థను బలపర్చాలని తాలిబన్ ప్రభుత్వానికి సూచించింది ఐక్యరాజ్య సమితి. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సైతం సహకరించాలని యూఎన్డీపీ అభిప్రాయపడింది. మరోవైపు కఠిన ఆంక్షల విధింపు, విదేశీ నిధులు నిలిచిపోవడం, తాలిబన్ల ఆక్రమణ టైంలో వర్తకవాణిజ్యాలు ఆగిపోవడంతో పాటు అఫ్గన్కు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. ఈ తరుణంలో బ్యాంకింగ్, డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వ్యవస్థలు సైతం దెబ్బతింటే గనుక.. ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ఎలక్ట్రిక్ శకంలో ‘ఈ’ చెత్తకు తుది ఏది? ఇవీ దుష్ఫ్రభావాలు..!
భూతాపం సెగలకు అంతర్జాతీయ వేదికలు వేడెక్కుతున్నాయి. శిలాజ ఇంధనాలకు వీలైనంత తొందరగా తిలోదకలాచ్చేసి, శరవేగంగా ఎలక్ట్రిక్ శకాన్ని ప్రారంభించడానికి ప్రపంచ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. భూతాపం దూకుడును కట్టడి చేయడానికి కలసికట్టుగా నడుంబిగిస్తున్నామని బల్లలుగుద్ది మరీ బలంగా చెబుతున్నారు. ఇవన్నీ సరే, టీవీలూ మొబైల్ ఫోన్లూ ఇంటింటి వస్తువులుగా మారిన హైటెక్కుటమారాల యుగంలో రోజూ పోగుపడుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు– అదేనండీ– ఈ–చెత్త! దీనికి సరైన విరుగుడు ఎప్పటికి దొరుకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. భూతాపం పెరుగుదలలో ఈ–చెత్త ఇతోధిక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ–చెత్త ఎక్కడెక్కడ ఎంతెంతగా తయారవుతోందో, ఎక్కడెక్కడ ఎంతెంతగా పోగుపడుతోందో, ఇది పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఏ స్థాయిలో చేటు కలిగిస్తోందో ఆ కథా కమామిషూ తెలుసుకుందాం. తాజా అంచనాల ప్రకారం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పోగుపడిన ఈ–చెత్త 53.6 మిలియన్ టన్నులు. ఏడాదికేడాది ఈ–చెత్త కొండలా పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అంటే, ప్రపంచంలో ప్రతి మనిషి సగటున దాదాపు ఏడు కిలోల ఈ–చెత్త పోగు చేస్తున్నట్లు లెక్క! అభివృద్ధి చెందిన దేశాలు ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు పనికిరాని స్థితికి చేరుకున్నాక, ఇవి తుక్కు తుక్కుగా చెత్త చెత్తగా మిగులుతున్నాయి. ఈ–చెత్త విలువలేనిదేమీ కాదు, ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.75 వేల కోట్లు) విలువ చేసే ప్లాటినమ్, బంగారం, వెండి, రాగి వంటి లోహాలు ఈ–చెత్తతో పాటే డంపింగ్ యార్డులకు చేరుతున్నాయి. మన భారత్ నుంచి ఏటా 3 మిలియన్ టన్నులకు పైగా ఈ–చెత్త పోగవుతోంది. ఎడాపెడా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడి పడేసే అభివృద్ధి చెందిన దేశాలు, తమ దేశాల్లో పోగుపడిన ఈ–చెత్తను పారబోయడానికి నిరుపేద దేశాలను డంపింగ్ యార్డుల్లా వాడుకుంటున్నాయి. మరో నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ–చెత్త ఏటా 33 శాతం మేరకు పెరుగుతుందని, ఈ పరిమాణం ఎనిమిది గ్రేట్ ఈజిప్షియన్ పిరమిడ్ల కంటే ఎక్కువని ఐక్యరాజ్య సమితి ‘స్టెప్ ఇనీషియేటివ్’ (సాల్వింగ్ ఈ–వేస్ట్ ప్రాబ్లెమ్ ఇనీషియేటివ్) హెచ్చరిస్తోందంటే, ఈ–చెత్త సమస్య ప్రపంచానికి ఏ స్థాయిలో ముప్పుగా పరిణమిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త సమస్యగా పరిణమించిన ఈ–చెత్త సమస్య పరిష్కారం కోసమే ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం 2007లో ‘స్టెప్ ఇనీషియేటివ్’ను ప్రారంభించింది. మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, డెస్క్టాప్లు, ట్యాబ్లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రానిక్ ఆటబొమ్మలు తదితర వస్తువులు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాలు ప్రతిఏటా పెద్దసంఖ్యలో తయారవుతున్నాయి. కొత్తగా ఎన్ని తయారవుతున్నాయో, అందుకు తగ్గట్లే పాతబడినవి, పనికిరాకుండా పోయినవి చెత్తగుట్టలకు చేరుకుంటున్నాయి. ఇళ్లలో పేరుకునే రోజువారీ తడిచెత్త, పొడిచెత్తలతో పోల్చి చూస్తే, ఈ–చెత్త పర్యావరణానికి మరింతగా హాని కలిగిస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్లాటినమ్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు మాత్రమే కాదు, సీసం, తగరం, పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం, లిథియం, బేరియం వంటి ప్రమాదకరమైన భారలోహాలు కూడా ఉంటాయి. ఒక సాదాసీదా మొబైల్ లేదా లాప్టాప్ సర్క్యూట్బోర్డులో పదహారు వేర్వేరు లోహాలు ఉంటాయి. ఇవి నేలలోకి చేరుకుంటే, భూసారం క్షీణిస్తుంది. జలాశయాల్లోకి చేరుకుంటే, తాగునీటి కాలుష్యం తప్పదు. చివరకు సముద్రాల్లోకి చేరినా, సముద్రాల్లో జీవించే జలచరాల మనుగడకు ముప్పు. ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం ప్లాస్టిక్. చెత్తకుప్పల్లోకి చేరిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను వేరుచేసి, సేకరించేందుకు వీటిని ఇష్టానుసారం తగులబెడుతుండటం మామూలే. ఫలితంగా ఈ–చెత్త వల్ల వాయుకాలుష్యం కూడా ఏర్పడుతోంది. ‘సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఎప్పటికప్పుడు అధునాతనమైన ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా, కొనుగోలు చేసిన కొద్దికాలానికే మొబైల్ ఫోన్లు, టీవీలు, లాప్టాప్లు వంటివి మూలపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల జీవితకాలం బొత్తిగా తక్కువవుతోంది. ఫలితంగా ఈ–చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది’ అని స్టెప్ ఇనీషియేటివ్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ర్యూడిగర్ క్వెహర్ చెబుతున్నారు. ‘ఈ–చెత్త వల్ల కలిగే అనర్థాలను కొన్నిదేశాలు మాత్రమే అర్థం చేసుకుని, చర్యలు ప్రారంభించాయి. చాలా దేశాల్లో ఏటా పోగుపడే ఈ–చెత్తపై కచ్చితమైన లెక్కలు సేకరించే పరిస్థితి కూడా లేదు’ అని యూరోపియన్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ దేశాల నుంచి ఏటా దాదాపు 1.3 మిలియన్ టన్నుల ఈ–చెత్త వెనుకబడిన ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఓడల్లో తరలుతోందని కూడా ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ–చెత్తకు డంపింగ్ యార్డులుగా మారిన ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఏటా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు ఇరవై శాతానికి పైగా మరణాలు ఈ–చెత్త కాలుష్యం కారణంగా సంభవిస్తున్నవేనని, ఇక దీని ఫలితంగా రకరకాల వ్యాధులకు లోనవుతున్న వారి సంఖ్య ఊహించుకోవాల్సిందేనని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ–చెత్తలో మనది మూడోస్థానం మన దేశంలో ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 మిలియన్ టన్నుల ఈ–చెత్త పేరుకోవచ్చని ‘స్టెప్ ఇనీషియేటివ్’ అంచనా. ఈ–చెత్త పరిమాణంలో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. చైనాలో అత్యధికంగా 10.1 టన్నులు, అమెరికాలో 6.9 మిలియన్ టన్నులు, భారత్లో 3.2 మిలియన్ టన్నులు ఈ–చెత్త పోగుపడినట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ దేశంలో పోగుపడిన ఈ–చెత్తను తమ దేశంలోనే రీసైకిల్ చేసే ప్రయత్నాలు చేయకుండా, నిరుపేద దేశాలకు తరలిస్తున్నాయి. ఈ పరిస్థితికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, నిరుపేద ఆఫ్రికా దేశమైన ఘనాలో అగ్రరాజ్యాలు పోగేస్తున్న ఈ–చెత్తపై 2018లో ‘వెల్కమ్ టు సోడోమ్’ అనే డాక్యుమెంటరీ విడుదలైంది. విషపూరితమైన ఈ–చెత్తకుప్పల మధ్యే అక్కడి పిల్లలు కాలం గడుపుతున్న దృశ్యాలు కలచివేస్తాయి. ఈ–చెత్త నుంచి విలువైన లోహాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యే కార్మికులు తలనొప్పి, శ్వాసకోశ వ్యాధులు, ఛాతీనొప్పి, నీరసం, మగత, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతున్నారు. ఈ–చెత్త కుప్పల మధ్యే ఎక్కువకాలం గడిపేవారిలో డీఎన్ఏ సైతం దెబ్బతింటున్నట్లు వైద్యపరిశోధకులు గుర్తించారు. ఏటా పోగవుతున్న ఈ–చెత్తను రీసైక్లింగ్ కోసం సేకరించే శ్రద్ధ కూడా మన దేశంలో బొత్తిగా కొరవడుతోంది. ఈ ఏడాది విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం, 2018–19లో పోగైన ఈ–చెత్తలో 3.5 శాతం, 2019–20లో 10 శాతం మాత్రమే రీసైక్లింగ్ కోసం సేకరించారు. మిగిలిన ఈ–చెత్తంతా పర్యావరణంలోకే చేరుతోంది. మన దేశంలో స్థానిక సంస్థలు ఈ–చెత్త సేకరణ జరుపుతున్న దాఖలాలు దాదాపు కనిపించవు. దేశవ్యాప్తంగా కేవలం 312 అధికారిక కేంద్రాలు మాత్రమే ఈ–చెత్త సేకరణ అరకొరగా జరుపుతున్నాయి. ఇవికాకుండా, ఢిల్లీలోని సీలమ్పూర్, ముంబైలోని ధారవి, మీరట్, మొరాదాబాద్ వంటి చోట్ల అనధికారిక ఈ–చెత్త రీసైక్లింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇలాంటి అనధికారిక ఈ–చెత్త సేకర్తలను స్థానికంగా ‘కబాడీవాలా’లుగా పిలుచుకుంటారు. ఎలాంటి శిక్షణ లేని కార్మికులు, కనీసమైన వసతులు, జాగ్రత్తలు సైతం లేని ఈ కర్మాగారాల్లో ఈ–చెత్త రీసైక్లింగ్ వల్ల పర్యావరణానికి ఒరిగే మేలు కంటే జరిగే కీడే ఎక్కువగా ఉంటోంది. సేకరించిన ఈ–చెత్తకు వీరు చేసే రీసైక్లింగ్ అంతా, పాడైన పరికరాల నుంచి విలువైన లోహాలను వేరుచేసి, సేకరించడమే! ఈ పనికోసం వారు సైనైడ్ కలిసిన యాసిడ్లను వాడుతుంటారు. ఈ ప్రక్రియలో వెలువడే విషపూరితమైన పొగవల్ల ఆ కేంద్రాల్లో పనిచేసే కార్మికులతో పాటు చుట్టుపక్కల ప్రజలకు కూడా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటి ద్వారా వెలువడే నీరు కొంత వీధుల్లోకి, కొంత మురుగు కాలువల్లోకి, వాటి ద్వారా సమీపంలోని జలాశయాల్లోకి, నదుల్లోకి చేరుతుండటంతో నీటి కాలుష్యం కూడా ఏర్పడుతోంది. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! చట్టాలూ నిబంధనలూ ఉన్నా... మన దేశంలో కాలుష్య నివారణ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 1974లో జల చట్టం కింద కాలుష్య నియంత్రణ మండలిని జాతీయస్థాయి సంస్థగా ఏర్పాటు చేసింది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటైన కాలానికి ఈ–చెత్త బెడద అంతగా ఉండేది కాదు. కంప్యూటర్ల శకం మొదలైన తర్వాత ఈ–చెత్త తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇది ప్రపంచ సమస్యగా మారిన నేపథ్యంలో వివిధ అంతర్జాతీయ వేదికల్లో జరిగిన చర్చల్లో దీనికోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించుకోవడానికి వివిధ దేశాలు సిద్ధపడ్డాయి. ఇందులో భాగంగానే కేంద్రప్రభుత్వం ‘ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్’ను 2016లో రూపొందించగా, ఈ నిబంధనలు 2017 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన సంస్థలు మాత్రమే ఈ–చెత్త రీసైక్లింగ్ చేయాలి. ఈ నిబంధనలు అమలులోకి వచ్చినా, దేశంలో అనుమతి పొందిన రీసైక్లింగ్ కేంద్రాల కంటే, కనీస సౌకర్యాలు లేని అనధికారిక రీసైక్లింగ్ కేంద్రాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా పేరుకుపోతున్న ఈ–చెత్తతో పోల్చి చూసుకుంటే, రీసైక్లింగ్ కేంద్రాలకు చేరుతున్నది చాలా తక్కువ. మిగిలినదంతా ఖాళీస్థలాల్లోకి, నదులు, సముద్రాల్లోకి చేరుతూ పర్యావరణానికీ, ప్రజల ఆరోగ్యానికీ భారీ స్థాయిలో చేటు కలిగిస్తోంది. ఇవీ ఆరోగ్య నష్టాలు ఈ–చెత్త పర్యావరణంలోకి చేరిన పరిసరాల్లో జీవించే వారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ–చెత్త కారణంగా గాలి, నీరు, నేల కాలుష్యానికి లోనవుతాయి. ఈ–చెత్త వల్ల ఏర్పడే కాలుష్యానికి బహిర్గతమైన వారిలో ఎదుగుదల లోపాలు, బుద్ధిమాంద్యం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, వంధ్యత్వం, హార్మోన్ల అసమతుల్యతలు, కిడ్నీ, లివర్, గుండె వంటి కీలక అవయవాల పనితీరు దెబ్బతినడం, డీఎన్ఏ మార్పులు, కండరాల బలహీనత, ఎముకల బలహీనత, ఊపిరితిత్తుల క్యాన్సర్ సహా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలు అకాల మరణాలకు కారణమవుతాయి. ప్రమాద ఘంటికలపై ప్రపంచం ఆందోళన భూతాపం పెరుగుదలపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టే లక్ష్యంతో ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పలుమార్లు ప్రపంచ దేశాల సమావేశాలను (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–సీఓపీ–26) నిర్వహించింది. ఇటీవల గ్లాస్గోలో జరిగిన సమావేశంలో సైతం పెరుగుతున్న భూతాపం కారణంగా పర్యావరణంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే మోగుతున్న ఈ ప్రమాద ఘంటికలను పట్టించుకోకుంటే, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చాయి. భూతాపాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రపంచ దేశాలు కూలంకషంగా చర్చలు సాగించి, పలు ప్రతిపాదనలను ముందుకు తెచ్చాయి. 2030 నాటికి కనీసం 30 శాతం నేలను, నీటిని పరిరక్షించుకోవాలని, ఈ మేరకు నేలపైనా, నీటిలోనూ జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ గడువులోగా దేశాలన్నీ అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టాలని, ఇందుకోసం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలని, 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలకు కారణమయ్యే శిలాజ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టే దిశగా నడుం బిగించుకోవాలని తీర్మానించుకున్నాయి. గ్లాస్గోలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పాశ్చాత్యదేశాల్లో ఒత్తిళ్లకు భారత్ తల ఒగ్గబోదని స్పష్టం చేస్తూనే, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. భూతాపాన్ని తగ్గించే దిశగా, పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు భూతాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను అరికట్టడానికి సత్వర చర్యలను ముమ్మరం చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని అరికట్టడంపైనే దృష్టిసారించారు. పర్యావరణానికి చేటు కలిగిస్తున్న ఈ–చెత్త అంశానికి సీఓపీ–26 అజెండాలో చోటివ్వకపోవడం శోచనీయం. పర్యావరణ మార్పులపై చేపట్టే అంతర్జాతీయ సమావేశాల్లో ఈ–చెత్త అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, భూతాపాన్ని తగ్గించే లక్ష్యాలను చేరుకోవడం దుస్సాధ్యం. ఈ–చెత్తలో చేరుతున్నవివే! ఈ–చెత్తలో చేరుతున్న వస్తువులను యూరోపియన్ యూనియన్ పది రకాలుగా విభజించింది. అవి: ►భారీ గృహపరికరాలు (ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటివి) ►చిన్న గృహపరికరాలు (ఎలక్ట్రిక్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లు, డిజిటల్ వాచీలు వంటివి) ►ఐటీ–టెలికం పరికరాలు (లాప్టాప్లు, డెస్క్టాప్లు, మొబైల్ ఫోన్లు తదితరమైనవి) ►వినియోగదారుల వస్తువులు (డిజిటల్ కెమెరాలు, పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్స్ వంటివి) ►లైటింగ్ పరికరాలు (ట్యూబ్లైట్లు, ఎల్ఈడీ లైట్లు, వాటి హోల్డర్లు వంటివి) ►ఎలక్ట్రికల్–ఎలక్ట్రానిక్ పనిముట్లు ►ఎలక్ట్రానిక్ ఆటబొమ్మలు, క్రీడా పరికరాలు ►వైద్య పరికరాలు (బీపీ యంత్రాలు, సుగర్ యంత్రాలు వంటివి) ►మానిటరింగ్ పరికరాలు (సీసీ కెమెరాలు వంటివి) ►ఆటోమేటిక్ డిస్పెన్సర్స్ (వెండింగ్ మెషిన్లు, వెయింగ్ మెషిన్లు తదితరమైనవి) కబాడీవాలాల కథ ‘కబాడీవాలాలకు ఈ–చెత్తను ఇవ్వడం ఏమీ ఎరుగని పసిపిల్లవాడి చేతికి కత్తిని ఇవ్వడం ఒకటే! కబాడీవాలాలకు ఈ–చెత్తను ఇస్తే తమకు తాము ప్రమాదంలో చిక్కుకోవడమే కాకుండా, ఇతరులనూ ప్రమాదంలోకి నెట్టేస్తారు’ అని గోవాకు చెందిన ఈ–చెత్త సేకరణ సంస్థ ‘గ్రూప్ టెన్ప్లస్’ వ్యవస్థాపకుడు ఆష్లే డెలానే వ్యాఖ్యానించారు. ‘గ్రూప్ టెన్ప్లస్’ ఈ–చెత్త సేకరణ కోసం ప్రారంభించిన లైసెన్స్డ్ సంస్థ. కబాడీవాలాలు నడిపే కేంద్రాల్లో ఈ–చెత్త నుంచి విలువైన లోహాలను మాత్రమే వేరు చేసి, మిగిలిన వాటిని యథేచ్ఛగా పర్యావరణంలోకి వదిలేస్తుంటారని, దీనివల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని డెలానే చెబుతున్నారు. ఉదాహరణకు ట్యూబ్లైట్, సీఎఫ్ఎల్ బల్బులు, కాలంచెల్లిన బ్యాటరీలు వంటివాటిని మట్టిలో పడేస్తే, వాటిలోని పాదరసం, సీసం వంటి ప్రమాదకర భారలోహాలు మట్టిలోకి చేరి, వాటి ఫలితంగా ఆ ప్రదేశంలోని మట్టి ఎందుకూ పనికిరానంతగా నాశనమవుతుందని, అక్కడ భూసారం శాశ్వతంగా దెబ్బతింటుందని ఆయన వివరించారు. ఇష్టానుసారంగా ఈ–చెత్త వ్యవసాయ భూముల్లోకి చేరితే, భవిష్యత్తులో ప్రజల ఆహారభద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. చదవండి: The New York Earth Room: ‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!! -
తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..
న్యూఢిల్లీ: తెలంగాణలోని పోచంపల్లి (యాదాద్రి భువనగిరి జిల్లా) గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 2న స్పెయిన్లోని మాడ్రిడ్లో అవార్డుల ప్రధానం జరగనుంది. కాగా, పోచంపల్లి గ్రామానికి గుర్తింపుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రావడానికి కృషి చేసిన మంత్రిత్వశాఖ అధికారులను కిషన్ రెడ్డి ప్రశంసించారు. చదవండి: (బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్రెడ్డి) -
అక్కడా... బడా కంపెనీల లాబీయింగ్?
వ్యవసాయం, పంట ఉత్పత్తుల శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ – ఈ గొలుసు మొత్తం కలిస్తే అది ‘ఆహార వ్యవస్థ’ (ఫుడ్ సిస్టం). ప్రతి ఒక్కరి మనుగడా ఆహార వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. పది వేల ఏళ్ల సంప్రదాయ సేద్య జ్ఞానానికి ప్రతి రూపమై ఔషధంగా విరాజిల్లిన ఆహారం.. రసాయనాలు రంగంలోకొచ్చిన వందేళ్లలోనే – భూగోళానికి, మనుషులకు, పశు పక్ష్యాదులకు – హానికరంగా మారిపోవటం విషాదకరమైన వాస్తవం. దశాబ్దాల తరబడి పారిశ్రామిక / రసాయనిక పద్ధతుల్లో ఆహార వ్యవస్థలను నిర్వహించడం వల్లనే ఈ ముప్పు వచ్చి పడింది. ‘ఇలా రసాయనిక పద్ధతుల్లో పండించిన/శుద్ధి చేస్తున్న, సుదూర ప్రాంతాలకు తరలించి పంపిణీ చేస్తున్న ఆహారం భూతాపోన్నతికి 34% కారణమవుతోంది. పోషకాల లోపంతో, రసాయనిక అవశేషాలతో కూడిన ఈ పారిశ్రామిక ఆహారం ప్రకృతి వనరులకు, వినియోగదారుల ఆరోగ్యానికి ‘నష్టదాయ కంగా’ తయారైంది. ఆహార వ్యవస్థల దుర్గతి వల్ల 70% మంచి నీరు ఖర్చవుతోంది. అంతేకాదు... జీవవైవిధ్యం తరిగి పోవడానికి 80% ఇవే కారణమ’ని ఐరాస తాజా నివేదిక విస్పష్టంగా ప్రకటించింది. ఐరాస శిఖరాగ్రసభ ఆహార వ్యవస్థలను పర్యావరణానికి, ఆరోగ్యానికి నష్టదాయకం కాని తీరులోకి ఇప్పటికైనా మార్చుకుంటే ఈ దుస్థితి నుంచి మానవాళిని, భూగోళాన్ని రక్షించుకోగలమని ఐరాస గుర్తించింది. ఇందుకు దోహదపడే అనుభవాలు, ఆవిష్కరణలను క్రోడీకరించి ప్రపంచ దేశాలకు అందించడానికి ‘ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభ’ను 18 నెలల కసరత్తు చేసి మరీ గత నెల 23న ఐరాస నిర్వ హించింది. 193 దేశాలకు చెందిన 51 వేల మంది పాల్గొన్నారు. ఆహార వ్యవస్థలలో సమూలంగా, గుణాత్మక మార్పు తేవడానికి 2 వేలకు పైగా సూచనలు, అనుభవాలను పంచుకున్నారని ఐరాస ప్రకటించింది. అయితే, ఉత్తమ సంప్రదాయాలకు ఐరాస తిలోదకాలివ్వటంతో అంతర్జాతీయంగా పెద్ద దుమారమే రేగింది. బహుళజాతి కంపెనీల కొమ్ము కాచే అంతర్జాతీయ వితరణ సంస్థల కనుసన్నల్లోనే ఆద్యంతం ఈ తంతు సాగిందంటూ పలు అంతర్జాతీయ పౌర, స్వచ్ఛంద, రైతు సంస్థలు భగ్గుమన్నాయి. ఏమిటీ పౌర సంస్థల అభ్యంతరం? ఆహారం గురించి, పౌష్టికత గురించి ప్రజాస్వామికంగా చర్చించి సభ్య దేశాలకు విధానపరమైన సూచనలు అందించే అధికారం ఐక్యరాజ్యసమితిలోని ఆహార భద్రతా కమిటీ (సి.ఎఫ్.ఎస్.)కి ఉంది. ఇందులో సభ్య దేశాలతో పాటు రైతులు, ఆదివాసులు, పౌర, స్వచ్ఛంద సంస్థలకు కూడా పూర్వం నుంచి సముచిత ప్రాతినిధ్యం ఉంది. విధాన నిర్ణయాలపై ఆయా దేశాలకు సూచనలు పంపడానికి ముందే పౌర సంస్థలు తమకున్న అభ్యంతరాలను తెలియజెప్పడానికి, ఆయా దేశాలతో చర్చించడా నికి అవకాశం ఉంటుంది. అయితే, ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభ విషయంలో ఐరాస సెక్రటరీ జనరల్ భిన్నంగా వ్యవహరిం చారు. సి.ఎఫ్.ఎస్.ను పక్కనపెట్టి.. కార్పొరేట్ సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిని ప్రత్యేక ప్రతినిధిగా నియమించి శిఖరాగ్ర సభను జరిపించటం ఏమిటని స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆహార హక్కుపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి మైఖేల్ ఫక్రి కూడా నిరసించటం విశేషం. కొద్ది కంపెనీలదే రాజ్యం ప్రపంచ ఆహార, వినిమయ వస్తువుల వాణిజ్యం అతికొద్ది బహుళ జాతి కంపెనీల చేతుల్లో కేంద్రీ కృతం కావడమే ముఖ్య సమస్య. ప్రపంచ విత్తనాల మార్కెట్లో 53% వాటా 2 కంపెనీలదే. వ్యవసాయ రసాయనాల ఉత్పత్తి, వాణిజ్యంలో 70% వాటా 3 కంపెనీలదే. పశువులకు సంబంధించిన బ్రీడింగ్, ఔషధాలు, వ్యవసాయ యంత్రాల తయారీ, సరుకు వాణిజ్యంలోనూ రెండు, మూడు కంపెనీలదే సింహభాగం. బడా కంపెనీలు తమకు లాభాలు తెచ్చిపెట్టే ఆధునిక టెక్నాలజీలను, జన్యుమార్పిడి పంటలను సరికొత్త మాటల గారడీతో ఐరాస సభ్య దేశాలపై రుద్దే ప్రమాదం పొంచి ఉంది. మన రైతుల విజయాలు చాలవూ? అనేక ఖండాల్లో చిన్న, సన్నకారు రైతులు సంప్రదాయ విజ్ఞా నంతో ఆవిష్కర్తలుగా మారి ఆహార వ్యవస్థలను ప్రకృతికి, ఆరోగ్యానికి నష్టదాయకం కాని సాగు పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మన దేశం ముందుంది. పెద్ద వ్యవ సాయ రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోకెల్లా పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం చేస్తూ సాధారణ రైతులు అసాధారణ విజయాలు సాధిస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ గణాం కాల ప్రకారం.. 1,30,000 మంది రైతులు 3–4 ఏళ్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. మరో 3.5 లక్షల మంది రైతులు కొద్దిమేర పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2.7 లక్షల మంది భూమి లేని గ్రామీణ పేదలు ఇళ్ల దగ్గర ఖాళీ స్థలాల్లో ప్రకృతి సేద్య పద్ధతుల్లో పెరటి తోటలు సాగు చేస్తున్నారు. ‘సెస్’, ఐ.డి.ఎస్.ల ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ ఎసెస్ మెంట్ మూడేళ్లుగా జరుగుతోంది. ‘ప్రకృతి వ్యవసాయం వల్ల ఏపీలో ఖర్చు తగ్గుతోంది, దిగుబడులు పెరుగుతున్నాయి, రైతుల నికరాదాయం పెరుగుతోంది..’ అని ఈ సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఐరాస శిఖరాగ్ర సభలో ఉత్పత్తిదారుల విభాగంలో ఏపీ ప్రకృతి వ్యవసాయ విభాగం అధిపతి టి. విజయకుమార్ మన రైతుల ప్రకృతి సేద్య అనుభవాలను సాకల్యంగా వివరిం చారు. గుత్తాధిపత్యానికి దారితీసే బడా బహుళజాతి కంపెనీల అత్యాధునిక సాంకేతికతల అవసరం లేకుండానే, ఆహార వ్యవస్థ లను శాశ్వతంగా పునరుజ్జీవింపజేసుకునేందుకు దోహదపడే సుసంపన్న అనుభవాలు ఇవి. అయితే, అత్యంత ఆశ్చర్యకరం ఏమిటంటే.. ఐరాస ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభలో భారత ప్రభుత్వ ప్రతినిధి సమర్పించిన అధికార పత్రంలో ఏపీ ప్రకృతి రైతుల అపురూప అనుభవాలను మచ్చుకు కూడా ప్రస్తావించలేదు. బడా కార్పొరేట్ సంస్థల లాబీ యింగ్ ప్రభావానికి ఇదొక మచ్చుతునకేమో మరి! – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
హంగర్ ఇండెక్స్లో దిగజారిన ఇండియా: ముంచుకొస్తున్న ఆకలి భూతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రతీ ఏడాది లాగానే ‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం" అనే థీమ్ను నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది లక్ష్యం. తద్వారా భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది ప్రధానోద్దేశం. వరల్డ్ ఫుడ్ డే : చరిత్ర, ప్రాధాన్యత ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 1945లో స్థాపితమైంది. దీనికి గుర్తుగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1979 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ డేను జరుపుకుంటాయి. దాదాపు 821 మిలియన్ల ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో ఉన్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తుండటం గమనార్హం. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60శాతం మంది మహిళలు. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారు. ఇందులో కూడా 96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నారు. అది కూడా ప్రతి ఐదు జననాలలో ఒకటి సరైన వైద్య సదుపాయం లేనందు వల్ల చనిపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో మరణాలలో దాదాపు 50శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధి కారణగా సంభవిస్తున్న మరణాలకంటే ఆకలి కారణంగా ప్రపంచవ్యాప్తంగాఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులు ముఖ్యంగా సహజ వనరులను ఉపయోగించాలినేది లక్ష్యం. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యల తో అనేక కార్యక్రమాల ద్వారా తుది వినియోగానికి ముందు ఆహార నష్టాలను తగ్గించాలని నిర్ణయించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మరోవైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా మరింత దిగజారింది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానానికి పడి పోయింది. తాజా నివేదిక ప్రకారం 94వ స్థానం 101కి దిగజారింది. తద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది. బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్ఐ స్కోరు తొలి అయిదు టాప్ ర్యాంక్లో నిలిచాయని ఆకలి, పోషకాహారలోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్సైట్ గురువారం తెలిపింది. అంతేకాదు ఇండియాలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి, సంబంధిత ఆంక్షల ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారనీ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే అని నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. -
మరణాలు లెక్కలేనంత.. నష్టం ఊహించలేనంత!!
International Day for Disaster Risk Reduction 2021: విపత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం మీద విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇవి వాటిల్లినప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నివర్గాల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విపత్తుల కోట్ల మంది చనిపోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా.. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టేదిగా ఉంటుంది కూడా. సాధారణంగా విపత్తులు రెండు రకాలు. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు, భారీ వర్షాలు, వరదలు, తుపాన్, సునామీ, భూకంపాలు ప్రకృతి విపత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్), కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈ రెండు రకాల విపత్తులు ప్రాణ, ఆస్తి, పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి. కరోనా లాంటి మహమ్మారులను సైతం విపత్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009, డిసెంబర్ 21న ఒక ప్రతిపాదన చేసింది. ప్రతియేటా అక్టోబర్ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని International Day for Disaster Risk Reduction అధికారికంగా పాటించాలని నిర్ణయించింది. కానీ, 1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు. విపత్తులను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు, రిస్క్ అవేర్నెస్ గురించి ప్రమోట్ చేస్తుంది ఈ దినోత్సవం. మొదట్లో నేచురల్ డిజాస్టర్ రెడక్షన్ డేగా ఉండేది. 2002లో ఓ రెజల్యూషన్ పాస్ చేసింది ఐరాస. ఆపై 2009లో అధికారికంగా ప్రకటించడంతో పాటు International Day for Natural Disaster Reduction పేరును International Day for Disaster Reductionగా మార్చేసింది. విపత్తు నిర్వహణ విపత్తులు సంభవించాకే సహాయక చర్యలు మొదలుపెట్టాలి. ‘విపత్తు నిర్వహణ అంటే ఇంతే’.. అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. గతంలో మన దేశంలో విపత్తులుచాలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే. అయితే విపత్తును ముందే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోలేమా?. ఈ దిశగా ఐక్యరాజ్య సమితి 1990లో ఒక తీర్మానం చేసింది. ఆ దశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటించింది. ‘విపత్తు నిర్వహణ అంటే.. ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు. రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి. ముందస్తు చర్యలు చేపట్టాలి. లోపాలను అధిగమించాలి. ఒకవేళ విపత్తులు వస్తే త్వరగతిన సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంతో పాటు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు’.. ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే. 2017 World Conference on Disaster Risk Reductionలో సెండాయ్(జపాన్) సెవెన్ క్యాంపెయిన్ను ప్రతిపాదించారు. 2030కల్లా విపత్తులతో ప్రభావితం అయ్యే ప్రజల సంఖ్యను తగ్గించాలనేది ఈ క్యాంపెయిన్ ఉద్దేశం మన దగ్గర.. భారత్లో విపత్తు నిర్వహణ ప్రయత్నాలు 1990లో ఊపందుకున్నాయి. కానీ, చట్టం వచ్చింది మాత్రం 2005లో. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయా విభాగాలకు చైర్మన్లు. ఇవి ఏర్పడ్డాక విపత్తులను ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహం, సహాయక చర్యల్లో చాలా మార్పు వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్(సైన్యం) తక్షణం రంగంలోకి దిగుతుంది. మరోవైపు విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ లోటుపాట్లతో నష్టం జరుగుతూనే ఉంది. థీమ్ Disaster Risk Governance.. 2021 ఏడాది కోసం ఇచ్చిన థీమ్ పిలుపు. కరోనాతో లక్షల మంది(కోట్ల మంది!) చనిపోయారు. ఈ నేపథ్యంలో విపత్తుల ప్రభావం తగ్గించే పరిపాలన మీద దృష్టిసారించాలని ప్రభుత్వాలకు చెబుతోంది ఈ థీమ్. లోపాలు ఇండియాలో 2001–21 మధ్య కాలంలో విపత్తుల మూలంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహించని రీతిలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఐదేళ్ల క్రితం ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ అనుకున్నప్పటికీ.. అది విఫలమైంది. అంతెందుకు మూడేళ్ల క్రితం వచ్చిన కేరళ వరదలనే చూసుకుంటే.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి కేరళకు ముందస్తు హెచ్చరికలేవీ చెయ్యలేదన్న విమర్శలు వినిపించాయి. అదే సమయంలో వర్షాలు, వరదలను కేరళ ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని, డ్యాముల నుంచి నీటిని ఆలస్యంగా విడుదల చేసిందని ప్రతివిమర్శలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందని వేసుకుని చేతులు దులుపుకున్నారు. ఇక్కడ కామన్ పాయింట్ మాత్రం నిర్వహణ లోపమే. జాతీయ విపత్తు విపత్తు నిర్వహణ చట్టంలో లొసుగులూ ఉన్నాయి. ఇవి చూపిస్తూ కేంద్ర ప్రభుత్వాలు.. రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిస్తుంటాయి. ఉదాహరణకు.. కేరళ వరదలను ‘జాతీయ విపత్తి’గా కేంద్ర ప్రకటించకపోవడానికి కారణం కూడా ఇదే. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. మహా విపత్తు, మానవ తప్పిదాల వల్ల భారీ తప్పిదాలు జరిగాలి. ఆ పరిస్థితిని అంచనా వేసి కేంద్రం ‘జాతీయ విపత్తు’గా ప్రకటిస్తుంది. కానీ, సహజ విపత్తులను ఖచ్ఛితంగా జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రూలేం చట్టంలో లేదు. అసలు సహజ విపత్తులు అంటే ఏంటో తేల్చేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆనాటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని కమిటీ ఎలాంటి సూచనలు చెయకుండానే డిజాల్వ్ అయ్యింది. రాష్ట్రాలకు ఇదే మైనస్గా మారింది. అయితే విమర్శలు వచ్చినప్పుడల్లా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దింపి, ఏదో మొక్కుబడి ఆర్థిక సాయం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది కేంద్రం. విపత్తులు/ఆపదలు చెప్పి రావు. ఆకస్మాత్తుగా వస్తాయి. మానవ తప్పిదాలతో జరిగే విపత్తులను అరికట్టొచ్చు. కానీ, ప్రకృతి విపత్తులను పూర్తిగా జయించే శక్తి మనకు లేదు. ఎదుర్కొవటానికి.. తీవ్రతను తగ్గించడానికి మాత్రమే సిద్ధంగా ఉండాలి!. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణను ఉమ్మడి బాధ్యతగా స్వీకరించాలి. అత్యున్నత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మున్ముందు కూడా అంతులేని నష్టం జరుగుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. - సాక్షి, వెబ్స్పెషల్ చదవండి: చిట్టితల్లి భయపడకు.. అలా ఎవరైనా టచ్ చేస్తే చెప్పేయ్ -
తాగి కారు నడిపితే నేరం.. మరీ కారే వైన్ తాగి రోడ్ల మీదకి వస్తే!?
డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం, అంటే మద్యం సేవించి కారు నడిపితే చట్ట ప్రకారం శిక్షార్హులు. కానీ కారే మద్యం సేవించి రోడ్లపై పరుగులు తీస్తే అది నేరమా? దానికేమైనా శిక్షలు ఉంటాయా? అసలు అది సాధ్యమా ? అంటే అవుననే అంటున్నారు యువరాజా వారు. అనడమే కాదు నిజం చేసి చూపించారు కూడాను. అసలు కారేంటి, అది వైన్ తాగడమేంటీ అనే సందేహాలు వస్తున్నాయా? అయితే ఈ వివరాలేంటో మీరే చూడండి. అది అలాంటి ఇలాంటి కారు కాదు. రాజుగారు వాడే కారు. ఆయనేమో సామాన్యమైన రాజు కాదు, ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటీష్ రాజవంశపు కాబోయే చక్రవర్తి. అందుకే ఈ కారు నడిచేందుకు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్లు ఉపయోగించడం లేదు. అంతకు మించి మనమెవరం ఊహించలేని ఇంధనాన్ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వివరించారు. కొత్త ఐడియా కార్లను కనిపెట్టినప్పటి నుంచి నిన్నా మొన్నటి వరకు అవి నడిచేందుకు ఫ్యూయల్గా వాడేది డీజిల్ లేదా పెట్రోల్లను ఉపయోగించారు. ఆ తర్వాత కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్జీ గ్యాస్. అయితే వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్ రాజుగారు మరో అడుగు ముందుకు వేసి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్రోలు , డీజిల్ బదులు వైన్తో నడిపిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారు. వెంటనే తన సిబ్బందిని పిలిపించి ఆదేశాలు జారీ చేశారు. అస్టోన్ మార్టిన్ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్కి 21వ ఏటా ఆస్టోన్మార్టిన్ కారుని బహుమతిగా అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈ యువరాజు గ్యారేజీలో మరెన్నో కార్లు వచ్చి చేరినా సరే ఆ పాత ఆస్టోన్ మార్టిన్ కారు వన్నె తగ్గలేదు. రాజుగారికి దానిపై మోజు పోలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఆ కారులో చక్కర్లు కొడుతూనే ఉంటారు. తన మనసులో మాట చెప్పేందుకు ఈ కారునే రాజుగారు ఎంచుకున్నారు. వైన్ ఉంటే చాలు యువరాజు ఆజ్ఞలకు తగ్గట్టుగా కారుని రీ డిజైన్ చేశారు ఇంజనీర్లు. వారి కృషి ఫలించి ప్రస్తుతం రాజుగారి కారు వైన్తో నడుస్తోంది. బకింగ్హామ్ ప్యాలేస్లో మిగిలిపోయిన వైన్ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. కొన్ని సార్లు జున్ను తయారు చేస్తుండగా విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఫ్యూయల్గా వాడుతున్నారు. ఈ విషయాలను స్వయంగా ప్రిన్స్ ఛార్లెస్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అక్టోబరు 31న వాతావరణ మార్పులపై సమావేశం జరగనుంది. కర్బణ ఉద్ఘారాలు తగ్గించేందుకు ప్రపంచ నాయకులు చేస్తున్న కృషికి నా వంతు సహాకారం అందించేందుకు పెట్రోలు, డీజిల్ బదులు వైన్ను ఉపయోగిస్తున్నాను’ అంటూ ఆయన తెలిపారు. కాలుష్యమే కారణం ఇటీవల వాతావరణ కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. కర్బణ ఉద్ఘారాలను తగ్గించాలంటూ ప్రపంచ దేశాలన్నీ నిర్ణయిస్తున్నాయి. వాతావరణ కాలుష్యంపై ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతున్నా.. బ్రిటీష్ యువరాజు ఇప్పటి వరకు స్పందించలేదు,. దీంతో ఆయనపై చాలా విమర్శలు లోగడ వచ్చాయి. దీంతో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరిలా ఎలక్ట్రిక్ కార్లంటే రాయల్ రేంజ్ ఏముంటుంది అనుకున్నారో ఏమో? ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రచారానికి ఊతం ఇచ్చేందుకు కర్బన ఉద్ఘారాలను వెదజల్లని వైన్ కారు ఫార్ములాను యువరాజు ఎంచుకున్నారు. అయితే రాజుగారి నిర్ణయంపై గ్లోబల్ లీడర్ల నుంచి పెద్దగా స్పందన లేకున్నా సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. చదవండి :ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్! -
భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా వృద్ధి చెందుతుంది: మోదీ
-
US ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
-
వరల్డ్ రోజ్ డే: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి
క్యాన్సర్తో పోరాడుతూ ఏటా వేలాదిమంది చనిపోతున్న సంగతి మనకు తెలియంది కాదు. ప్రముఖులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో!. గతంతో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ సాయంతో క్యాన్సర్ని మొదటి దశలో గుర్తించి బయట పడే మార్గాలు ఉన్నాయి. రోగులు కూడా త్వరితగతిన కోలుకోగలుగుతున్నారు. కానీ ఈ వ్యాధిని జయించాలంటే కావల్సింది మెరుగైన వైద్యమే కాక మనోధైర్యం అత్యంత ముఖ్యం. క్యాన్సర్ అనగానే జీవితం మీద ఆశ వదులుసుకునేంతగా అందర్నీ భయబ్రాంతులకు గురు చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ప్రపంచ దేశాలన్ని ముందుకు వచ్చి క్యాన్సర్ని జయించే విధంగా ప్రజలకు మనోధైర్యంతో పాటు చైత్యవంతులను చేసే విధంగా అడుగులు వేయాలని సంకల్పించాయి. దానిలో భాగంగానే ఐక్యరాజ్యసమితి వరల్డ్ రోజ్ డే అనే ప్రతిపాదన తీసుకువచ్చింది. దీంతో ప్రతి ఏడాది సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం (వరల్డ్ రోజ్ డే)ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. (చదవండి: జీ7 పన్నుల ఒప్పందం అమలుతో పురోగతి సాధించగలం: బోరిస్ జాన్సన్) దీని వెనుక ఉన్న చరిత్ర: కెనడియన్ అమ్మాయి మెలిండా రోజ్ గౌరవార్థం క్యాన్సర్ రోగుల కోసం ప్రపంచ గులాబీ దినోత్సవం జరుపుకుంటారు. ఆమె కేవలం 12 సంవత్సరాల వయసులో అరుదైన బ్లడ్ క్యాన్సర్(రక్త క్యాన్సర్) అయిన అస్కిన్స్ ట్యూమర్తో బాధపడింది. ఆమె కొన్ని వారాలు మాత్రమే జీవించగలదు అని వైద్యులు చెప్పారు. కానీ ఆమె తన అచంచలమైన మనోధైర్యంతో ఆరేళ్లు జీవించగలిగింది. అంతే కాదు తనలా క్యాన్సర్తో బాధపడుతున్నవారిని తన కవితలతో, సందేశాత్మకమైన ఉత్సాహపూరిత మాటలతో, సందేశాలతో ప్రోత్సాహించింది. వారిలో ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడగలిగే మనోశక్తిని, ధైర్యాన్ని నింపడమే కాక చనిపోయేంత వరకు సంతోషంగా ఎలా ఉండాలో చేసి చూపించింది. తాను అంత చిన్న వయసులో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మరోవైపు తనలా బాధపడుతున్న వారి పట్ల ఆమె కనబర్చిన గుండె నిబ్బరానికి గుర్తుగా ప్రతి ఏటా ఆమె పేరుతో వరల్డ్ రోజ్ డే(ప్రపంచ గూలాబీ దినోత్సవం) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ రోగుల్లో ఆమె స్ఫూర్తిని నింపేలా ప్రతి ఏడాది ఒక సరికొత్త థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది థీమ్: "జీవించే సమయం తగ్గిపోవచ్చు.. ప్రతి రోజు ఉదయించే సూర్యుడిని చూసినప్పుడల్లా.. మీరు ఈ రోజు గెలిచాను జీవిస్తున్నాను అనే అనుభూతిని పొందండి. అలా ఆ రోజుని ఆనందంగా గడపండి, ఆస్వాదించండి." ఈ వ్యాధి బారినపడిని కొందరి ప్రముఖుల మనోభావాలు... మీరు ఏదో కోల్పోతున్నాను అనుకునే కంటే మీరు చనిపోతున్నారు అనే విషయాన్ని గుర్తించుకోవటమే ఉత్తమమైన మార్గం. ఈ సమయం మీ మనస్సుకు దగ్గరగా ఉండి నచ్చినవి చేసి ఆనందంగా గడిపే క్షణాలుగా భావించండి. - స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీరు ద్వేషించిన వాళ్లను, ప్రేమించిన వాళ్ల పట్ల కనబర్చిన ప్రతీది మీకు గుర్తుకు రావడమే కాక ఏం చేసుంటే బాగుండేది అనేది కూడా తెలుస్తుంది. అంతేకాదు సమయాన్ని వృధా చేయరు. మీకు ఇష్టమైన వ్యక్తులతో ప్రేమిస్తున్నానే విషయాన్ని చెప్పడానికి కూడా వెనుకడుగు వేయరు. -జోయెల్ సీగెల్ మీకు ఏదైనా నచ్చకపోతే దాన్ని మార్చండి. ఒకవేళ దానిని మార్చలేనిదైత మీరే మీ వైఖరిని మార్చుకోండి. - మాయ ఏంజెలో క్రికెటే నాజీవితం. క్యాన్సర్కు ముందు నేను సంతోషంగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి భారినపడ్డానో అప్పుడే నాలో ఆందోళన, భయం మొదలైయ్యాయి. నాలా బాధపడుతున్న వాళ్లని చూసినప్పుడు దీన్ని ఏ విధంగానైనా ఎదిరించి జీవిచడమే కాక తనలా బాధపడేవాళ్లకు తన వంతు సాయం చేయాలనే తపన మొదలైంది. మళ్లీ నా జీవితం నాకు తిరిగి లభించినందుకు సంతోషంగా ఉంది. - క్రికెటర్ యువరాజ్ సింగ్ (చదవండి: పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో తొలి హిందూ మహిళగా సనా) -
ఐక్యరాజ్య సమితికి సైబర్ సెగ, కీలక సమాచారం హ్యాక్!
ఐక్యరాజ్య సమితిపై సైబర్ ఎటాక్ జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సర్వర్లకు ఉండే రక్షణ వ్యవస్థలను హ్యకర్లు చేధించారు. పలు దేశాల మధ్య జరిగిన చర్చలు, లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. అవును నిజమే గుర్తు తెలియని హ్యాకర్లు ఐక్యరాజ్య సమితికి సంబంధించి పలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యక్ చేశారని యూఎన సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టిఫెన్ డుజారిక్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో హ్యకింగ్ జరిగినట్టు గుర్తించామని, దీనికిపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. హ్యకింగ్ ఇలా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను హ్యకర్లు ఎలా ఛేధించారనే దానిపై విచారణ కొనసాగుతోంది. యూన్కి సంబంధించిన ప్రొప్రైటరీ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఉద్యోగికి చెందిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆధారంగా హ్యకర్లు యూఎన్ సిస్టమ్స్తో అనుసంధానమైనట్టు గుర్తించారు. ఆగస్టు వరకు యూఎన్కి సంబంధించిన సిస్టమ్స్తో యాక్సెస్ సాధించిన హ్యకర్లు ఏప్రిల్ 5 నుంచి ఆగస్టు 7 వరకు వరుసగా చొరబడినట్టు గుర్తించారు. అయితే వారు ఏ సమాచారం తస్కరించారు. అందులో భద్రతాపరంగా కీలకమైనవి ఏమైనా ఉన్నాయా ? అనే అంశాలను గుర్తించే పనిలో యూఎన్ భద్రతా సిబ్బంది ఉన్నారు. చదవండి: అశ్లీల వీడియోలకు పరోక్ష కారణం?.. ఎఫ్బీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు -
ఢిల్లీ : ఐరాస కార్యాలయం వద్ద ఆఫ్ఘనిస్తాన్ శరణార్ధుల ధర్నా
-
వీరే... ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ !
వెబ్డెస్క్: జగడ జగడ జగడం చేసేస్తాం.. రగడ రగడ రగడం దున్నేస్తాం... ఎగుడుదిగుడు గగనం మేమేరా పిడుగులం అంటూ యూత్ని వర్ణించాడు ఓ సినీ కవి. నిజమే ! ఆ యుత్లో ఉన్న ఎనర్జీకి స్కిల్ను జోడించి వారి భవిష్యత్తుతో పాటు మానవాళి మనుగడకు కొత్త బాటలు వేయడం లక్క్ష్యంగా ప్రతీ ఏడు జులై 15న వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. వరల్డ్ యూత్ స్కిల్ డే ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబరు 18న తీర్మాణించింది. దీని ప్రకారం మొదటిసారి 2015లో జులై 15న తొలిసారి ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య ఉద్దేశం యువతకు సరైన శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యం పెంచడం ద్వారా భవిష్యతత్తులో వారు ఎంట్రప్యూనర్లుగా, ఉద్యోగస్తులుగా రూపొందించడం వరల్డ్ యూత్ స్కిల్ డే ముఖ్య ఉద్దేశం. ఈ విషయానికి సంబంధించి ప్రజా ప్రతినిథులు, యాజమాన్యాలు, ఉద్యోగస్తులు, నైపుణ్యం కలిగిన యువత అందరినీ ఒకతాటిపైకి తెచ్చి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయడం ప్రధానంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా తర్వాత యువతలో మిగిలి ఉన్న నైపుణ్యాలు అనే థీమ్తో ఈసారి వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. కోవిడ్ ఇబ్బందులు ఎదుర్కొవడంలో యువత చూపించిన నైపుణ్యాలు అనే అంశం ప్రధానంగా ఈసారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తీవ్ర ఒత్తిడి కరోనా రక్కసి దాడికి తీవ్రంగా గురయ్యారు యువత. సమాజంలో అన్ని వర్గాలపైన కరోనా ప్రభావం ఉన్నా.. 15 నుంచి 24 ఏళ్లలోపు వారు చాలా ప్రభావానికి లోనయ్యారు. మానసికంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఇటు చిన్న వాళ్లలా ఉండలేక అటు పెద్ద వాళ్లతో పోటీ పడలేక నలిగిపోయారు. ఐక్యరాజ్య సమితి గణాంకాలు సైతం ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. కరోనా కల్లోలం కరోనా కారణంగా గడిచిన ఇంచు మించు ఏడాదిగా పాఠశాలలు పాక్షికంగా లేదా పూర్తిగా మూత పడి ఉన్నాయి. 2021 జూన్ వరకు 19 దేశాల్లో ఏడాదిగా పాఠశాలలు తెరుచుకోలేదు. పాఠశాలలు మూత పడటం వల్ల 15.7 కోట్ల మంది యువత నష్టపోతుండగా పాక్షింగా మూతపడటం వల్ల 76.8 కోట్ల మంది నష్టపోతున్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలియజేస్తున్నాయి. - 15 నుంచి 24 ఏళ్లలోపు వయస్సు వారు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులకు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు - 2020లో కరోనా సంక్షోభం కారణంగా 8.7 శాతం యూత్ ఉద్యోగాలు కోల్పోయారు. ఇదే సమయంలో 25 ప్లస్ వయస్సు వారు 3.7 శాతమే ఉద్యోగాలు కోల్పోయారు. - యువతలో మగవారితో పోల్చినప్పుడు అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
2050 నాటికి ఇండియా జనాభా ఎంతో తెలుసా ?
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. కానీ మనుషులు అన్ని దేశాల్లో ఒకేలా లేరు. ఒక చోట వనరులకు మించి జనాభా ఉంటే .. మరో చోట వనరులున్నా జనాభా తగ్గిపోతుంది. నాగరికత మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా ఎలా ఉంది. ఇక ముందు ఎలా ఉండబోతుందనే అంశాలపై ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి వెబ్ ప్రత్యేక కథనం 1989లో ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. అంతకు ముందు 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. జనాభా విస్ఫోటనం జరుగుతుందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి జనాభా పెరుగుదలపై ఫోకస్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచీ జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పుడు మరణాలే నాగరికత నేర్చింది మొదలు రెండో ప్రపంచ యుద్ధం వరకు మనిషి మనుగడ అంత సులువుగా లేదు. ఎప్పుడో ఏదో ఒక ఉపద్రవం రావడం, యుద్ధాల కారణంగా భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకునేవి. పైగా వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అంటు రోగాలు, వ్యాధులుల విజృంభించేవి. శిశు మరణాల రేటు ఎక్కువ. దీంతో జనాభా వృద్ధి ఓ మోస్తరుగా ఉండేంది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం, అంతకు ముందు వచ్చిన స్పానిష్ ఫ్లూ కారణంగా లక్షలాది మంది మరణించారు. బేబీ బూన్ 1950 నుంచి 1987 మధ్య కాలంలో ఒక్క సారిగా ప్రపంచ జనాభా విస్ఫోటనం జరిగింది. ప్రపంచ జనాభా 250 కోట్ల నుంచి 500 కోట్లకు చేరుకోవడానికి కేవలం 37 ఏళ్లు మాత్రమే పట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగవడం, భూస్వామ్య, రాచరిక వ్యవస్థ స్థానంలో ప్రజాస్వామ్యం రావడం, ఆధునిక వ్యవసాయం, తగ్గిపోయిన యుద్ధాలు తదితర కారణాలతో జనాభా ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. అందుకే ఈ 37 ఏళ్ల కాలాన్ని బేబీ బూన్గా వ్యవహరిస్తుంటారు జనాభా తగ్గిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా జనాభా రేటు పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంటే మరికొన్ని దేశాలు... తమ జనాభా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నాయి. ఉదాహరణకు 2020లో జపాన్ జనాభా 12.70 కోట్లు ఉండగా 2050 నాటికి ఈ సంఖ్య 10.60 కోట్లకు చేరుకోనుంది. అంటే జనాభాలో 16 శాతం తగ్గుదల నమోదు అవుతోంది. ఇక ఇటలీ విషయానికి వస్తే ఇదే కాలానికి 6.10 కోట్ల జనాభా కాస్త 5.40 కోట్లకు చేరుకోనుంది. గ్రీస్, క్యూబా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనవచ్చని అంచనా. ఇండియా పరిస్థితి జపాన్, ఇటలీ స్థాయిలో కాకపోయినా ఇండియాలో కూడా జనాభా వృద్ధి రేటు తగ్గనుంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. 1991-2001 పదేళ్ల కాలానికి 2001-2011తో పోత్చితే జనాభా వృద్ధి రేటు 3.9 శాతం తగ్గింది. జనాభా పెరుగుదల విషయంలో భారతీయులు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు. 1950లో భారతీయ మహిళలు సగటున ఒక్కొక్కరు ఆరుగురు పిల్లలకు జన్మనిస్తే.. ప్రస్తుతం అది 2.1గా ఉంది. మరో 25 ఏళ్లు సాధారణంగా ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే జనాభా భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే ఆ దేశ లేదా ప్రాంత లేదా తెగకు చెందిన మహిళలకు 2.1 మంది పిల్లలకు జన్మనివ్వాలి. ప్రస్తుతం ఇండియాలో జననాలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అందువల్ల మరో 25 ఏళ్ల పాటు ఇదే స్థాయిలో భారత జనాభా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అందులో హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళా, కర్నాటక రాష్ట్రాల్లో మహిళలు జన్మనిచ్చే రేటు 2.1 కంటే దిగువకు చేరుకుంది. 2047లో గరిష్ట స్థాయికి 2018-19లో చేపట్టిన ఆర్థిక సర్వేలో 2030 నాటికి ఇండియాలో జననాల రేటు 2 కంటే దిగువకు చేరుకుంటుందని తేలింది. ఈ లెక్క ప్రకారం 2047 వరకు భారత దేశ జనాభా పెరుగుతూ పోయి గరిష్టంగా 161 కోట్లకు చేరుకుంటుందని.. ఆ తర్వాత తగ్గుదల నమోదు అవుతుందని అంచనా. మొత్తంగా 2100 నాటికి ఇండియా జనాభా 100 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. పెంచండి దాదాపు అర్థ దశాబ్ధం పాటు అత్యంత కఠిన జనాభా నియంత్రణ విధానాలు అమలు చేసిన చైనా ధోరణిలో ప్రస్తుతం మార్పు వచ్చింది. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కన్నా పర్వాలేదు అంటోంది. మరోవైపు పోలాండ్ దేశం అబార్షన్కు వ్యతిరేకంగా కఠిన చట్టాలను అమలు చేస్తోంది. ఒక్కో చిన్నారికి 100 యూరోల వంతున ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు ప్రతీ నెల ఆర్థిక సాయం అందిస్తోంది. దక్షిణ కోరియా పిల్లలు ఎక్కువగా ఉన్న దంపతులకు ఇన్సెంటీవ్లు, హోం లోన్లు అందిస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలకు ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తోంది. సువర్ణావకాశం జనాభా పెరిగిపోయిందని దేశంలో ఆందోళన నెలకొన్నా ఇప్పుడు ప్రపంచలోనే యువ జనాభా అధికంగా ఉన్న దేశంగా భారత్ నిలబడింది. ఇప్పుడు యువ జనాభాలో నైపుణ్యం పెంచి కొత్త అవకాశాలు సృష్టిస్తేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినవాళ్లం అవుతాం. అలా కానట్టయితే మరో ముప్పై ఏళ్లకు అత్యధిక వృద్ధ జనాభా ఉన్న దేశంగా ఇండియా మిగిలిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి, మౌలిక సదుపాయాలతో వృద్ధ జనాభాతో నెట్టుకురావడం కష్టంగా మారుతుంది. ఇద్దరు చాలు ఇండియాలో 24 కోట్ల ప్రజలతో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉత్తర్ ప్రదేశ్ నిలిచింది. అత్యధిక జనాభా కలిగిన టాప్ టెన్ దేశాల్లో ఉన్న బ్రెజిల్, నైజీరియా, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికోల కంటే ఉత్తర్ ప్రదేశ్ జనాభాయే ఎక్కువ. దీంతో జనాభా నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది యోగీ సర్కార్. దీని కోసం న్యూ పాపులేషన్ పాలసీ 2021-30ని అమల్లోకి తెచ్చారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారికి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సబ్సిడీలు అందవ్వమంటూ సీఎం యోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలన్ని కనండి జపాన్, పోలండ్ దేశాల తరహా పరిస్థితిని ఇండియాలో పార్సి మతస్తులు ఎదుర్కొంటున్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు పార్సీల జనాభా ఇండియాలో లక్షకు పైగా ఉండగా ఇప్పుడు కేవలం 55,000లకు పరిమితమైంది. గుజరాత్లోని గ్రామీణ ప్రాంతాల్లో మినహాయిస్తే నగరాల్లోనే అక్కడక్కడ పార్సీలు నివసిస్తున్నారు. హైదరాబాద్లో ఇంచుమించు వెయ్యి మంది పార్సీలు ఉండగా ఏపీలో అయితే రెండు అంకెలలోపే ఉండవచ్చని అంచనా. దీంతో పిల్లలు కనాలంటూ దంపతులను ప్రోత్సహించేందుకు ‘జియో పార్సీ’ అనే పథకాన్ని మైనార్టీ వెల్ఫేర్ మినిస్ట్రీ చేపట్టింది. ప్రభుత్వంలో పాటు పలు పార్సీ స్వచ్చంధ సంస్థలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. పార్సీల జనాభా తగ్గిపోవడానికి కారణం లేటు వయస్సులో పెళ్లిలు చేసుకోవడం, పెద్ద కుటుంబాల పట్ల అయిష్టత ఉండటం ముఖ్య కారణమని పార్సీ అంజుమాన్ ట్రస్టు బాధ్యులు జహంగీర్ తెలిపారు. జనాభా పెరుగుదల తీరుతెన్నులు భూమిపై మనిషి పుట్టుక మొదలైన తర్వాత వేల ఏళ్ల తర్వాత 1800లో మొదటి సారిగా జనాభా వంద కోట్లను దాటింది. - 1900 నాటికి జనాభా ఒకేసారిగా పెరిగి 200 కోట్లకు చేరుకుంది - 2000 వచ్చే సరికి జనాభా మూడింతలై 600 కోట్లకు చేరుకుంది - 2000 నుంచి 2012 అంటే పదేళ్లలో జనాభా 700 కోట్లు అయ్యింది - 2030 నాటికి రికార్డు స్థాయిలో 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చని అంచనా - 2100 నాటికి ప్రపంచ జనాభా 1000.90 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి లెక్కకట్టింది -
ఆ ‘వైరస్’ తో నిమిషానికి 11 మంది మృతి
వెబ్డెస్క్: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా. అయితే కరోనాను మించిన మరో మహమ్మారి చాప కింద నీరులా భూమ్మీద దేశాలను పట్టి పీడిస్తోంది. కరోనాను మించిన మరణాలు ఈ మహమ్మారి కాటుకు గురవుతున్నాయి. కరోనాను మించిన ఆ భయంకర వైరస్ పేరు ఆకలి. అవును ఆక్స్ ఫాం అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలు ఆకలి చావులు పెరిగినట్టు తేలింది. ఆకలిరాజ్యం పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ ఆకలి వైరస్ ఎక్కువైంది పేరిట విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ నివేదిక ప్రకారం ఈ భూమ్మిదీ నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారని తేలింది. కరోనాను మించి ఇవ్వాళ ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే.. ఆకలితో 11 మంది ఊపిరి వదులుతున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభంలో 15.5 కోట్ల మంది చిక్కుకున్నారని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2 కోట్ల మంది ఎక్కువగా ఆకలి బారిన పడ్డారని తెలిపింది. సైనిక సంక్షోభం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది. వీరికి తినడానికి బుక్కెడు బువ్వ దొరకట్లేదు. ఆకలి వారి ప్రాణాలను తోడేస్తోంది. రోజూ వందలాది మందిని కబళిస్తోంది. మరోవైపు కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద ప్రాంతాలకు అందుతోన్న సాయం కూడా తగ్గుతోంది. సైన్యంపైనే ఖర్చు కరోనా, లాక్ డౌన్ లతో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి యుద్ధ వాతావరణం తోడు కావడంతో సుమారు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్ ఫాం ఆవేదన వ్యక్తం చేసింది. చాలా దేశాలు కరోనా ఉన్నా యుద్ద పరిస్థితుల కారణంగా తమ ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ బలగాల పటిష్ఠత కోసం ఖర్చు చేయక తప్పలేదని వెల్లడించింది. ఈ ఖర్చు రూ. 5,100 కోట్ల డాలర్లు దాటిందని.... పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఇది ఆరు రెట్లు ఎక్కువని తేల్చి చెప్పింది. అంతర్ యుద్దాలతో ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి అంతర్ యుద్దాల్లో చిక్కుకున్న దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాబిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని సూత్రీకరించింది. ఈ దశాబ్దంలోనే ధరల పెరుగుదలలో ఇదే అత్యధికమని ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా నిరుపేదలు ఆకలి రాజ్యంలోకి నెట్టివేయబడుతున్నారని పేర్కొంది. -
అతి అణచివేతతో తిరుగుబాటు తీవ్రం
ఆదివాసీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్స్వామి (84) నిర్బంధంలో చనిపోవడం పలువుర్ని చలింపజేసింది. ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభివర్ణిస్తున్నారు. ఈ మర ణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అసమ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ‘ఉపా’ చట్టం ఒక అస్త్రం కావడం దారుణం, అమానుషం. విచారణే మొదలు కాని కేసులో, న్యాయ ప్రక్రియే మరణశిక్ష అయింది. ఆధారాల్లేని అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ హక్కుల కార్యకర్త... వృద్ధాప్యానికి, వ్యాధులకు, కడకు బెయిల్ నిరాకరణకు బలై నిర్బంధంలోనే అసహజ మరణం పొందారు. దీనికి బాధ్యులె వరు? నేరుగా జవాబు రాకపోగా... లోపభూయిష్టమైన మన నేర– న్యాయ నిర్వహణ (క్రిమినల్ జస్టిస్) ప్రక్రియపైనే ఇది సందేహాలను రేకెత్తిస్తోంది. నిర్హేతుక నిబంధనలున్న ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)’ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. రాజ్యం–పోలీసు అపవిత్ర బంధం ఎల్లలు దాటి, ‘అసమ్మతి’ని అణచివేస్తున్న దాష్టీ కాన్ని ఎత్తిచూపుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాదని వక్రగతిన సాగే చట్టం అమలును ఉపేక్షిస్తున్న న్యాయవ్యవస్థ దౌర్బల్యాన్ని తెరకెక్కి స్తోంది. ఇదిక్కడితో ఆగకూడదు. జరిగే దురాగతాలకు బాధ్యులెవరో తేలాలి. అందుకు, పౌరసమాజం చేతనతో, ఈ అరిష్టాలకు మూలాలు వెతికి పట్టుకోవాల్సిన, అడ్డుకోవాల్సిన సమయం వచ్చింది. ఆదివా సీల ఆత్మీయనేస్తం ఫాదర్ స్టాన్స్వామి (84) నిర్బంధంలో చని పోవడం పలువుర్ని చలింపజేసింది. వృద్ధాప్యం, పార్కిన్సన్ వ్యాధి, కోవిడ్ అనంతర సమస్యలు.... పలుమార్లు బెయిల్ కోరి నిరాకరణకు గురైన దురవస్థ! ఇది మామూలు మరణం కాదని, వ్యవస్థ చేసిన హత్యగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులంటున్నారు. ‘మిట్టమధ్యాహ్నమే కమ్మిన కారుచీకటి’గా న్యాయకోవిదులే అభి వర్ణిస్తున్నారు. ఈ మరణాన్ని, ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితి (యూఎన్) మానవహక్కుల విభాగం, ఐరోపా సమాజ (ఈయూ) ప్రతినిధి... ఇలా పలువురు ఖండించారు. దేశంలోని పది రాజకీయ (వి)పక్షాలు, బాధ్యులపై చర్య తీసుకోవాలని, భీమా–కోరేగావ్ నింది తులతో పాటు రాజకీయ కారణాలతో నిర్బంధంలో ఉన్న వారందరినీ బెయిల్పై విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరారు. ఇదే కేసు సహ నిందితులు జైళ్లోనే ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. ఇంతటి స్పంద నలు రేకెత్తించిన ఈ ఘటనను కేవలం ఒక హక్కుల కార్యకర్త మరణంగానే చూడకూడదు. ప్రజావిశ్వాసం కోల్పోతూ... రాజకీయ, పాలన, న్యాయ వ్యవస్థలు రోజురోజుకూ క్షయమవుతున్న దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా చూడాలి. సంబంధం లేని కేసులో.... కోరేగావ్ తానెప్పుడూ వెళ్లలేదని, తనకీ కేసుతో సంబంధమే లేదని రోమన్ కాథలిక్ పూజారి స్టాన్ స్వామీ మొదట్నుంచీ చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐజీ) పథకం ప్రకారం తనను ఇరికించిన తీరుకు ఆశ్చర్యపోలేదు. అరెస్టుకు ముందు విడుదల చేసిన వీడియో కథనం ప్రకారం, ఆయనకీ విషయంలో స్పష్టత ఉంది. ‘ప్రశ్నించిన వారి గొంతు దేశమంతటా నొక్కుతున్నారు. నాకొక్కడికే జరుగుతు న్నది కాదిది. సంతోషం, ఈ ప్రక్రియలో నేను భాగమయ్యాను. ఎందు కంటే, నేను మౌన ప్రేక్షకుడిని కాదు. ఈ ఆటలో భాగమైన వాణ్ణే! ... తగు మూల్యం చెల్లించడానికి నేను సిద్ధమే!’ అన్నారు ధీమాగా! కానీ, ప్రాణాలనే ఇచ్చి మూల్యం చెల్లించాల్సి రావడం దురదృష్టకరం. 2018 జనవరి 1 భీమా–కోరేగావ్ అల్లర్ల వెనుక మావోయిస్టులున్నారని, వారిని హింసకు ప్రేరేపించిన ప్రసంగాలు 2017 డిసెంబరు 31 ఎల్గార్ పరిషత్ సమావేశంలో జరిగాయనేది కేసు. మరికొందరు ఒకరితో ఒకరు మాటాడుకుంటూ కుట్రపన్నారనేది ఆరోపణ. విప్లవకవి, హక్కుల యోధుడు వరవరరావుతో పాటు మొత్తం 17 మంది కవులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, ఇతర మేధావుల్ని ఈ కేసులో అరెస్టు చేశారు. నిషేధిత మావోయిస్టులతో చేతులు కలిపి, ప్రభు త్వాన్ని కూల్చే విశాల కుట్ర పన్నారనేది ప్రధాన అభియోగం. ‘మావో యిస్టు సిద్దాంతాలను నేను ఒప్పుకోను, వ్యతిరేకిస్తాను’ అని బహి రంగంగా ప్రకటించే వ్యక్తికి, వారితో ‘కుట్ర’ సంబంధాలు అంట గట్టడంలోనే అభియోగమెంత బలహీనమో తేలిపోయింది. బెయిల్ వినతి వచ్చినపుడు, నమ్మదగ్గ సాక్ష్యాలను బట్టే న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ కేసులో ఇప్పటివరకు అభియోగ పత్రాన్ని ఖరారు చేసి విచారణ ప్రారంభించలేదు. ఇక స్వామిపై వచ్చిన అభియోగాలకు ఆధారమని, ఆయన ల్యాప్టాప్లోని పత్రా లను చూపిస్తున్నారు. మరో నిందితుడు సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్ రెండేళ్లుగా దురుపయోగమౌతోందని, ‘మాల్వేర్’ ద్వారా అందులోకి డాక్యుమెంట్లు పంపేందుకు గల ఆస్కారాన్ని అమెరికాకు చెందిన డిజి టల్ ఫోరెన్సిక్ సంస్థ నిరూపించింది. అదే, స్టాన్స్వామీ ల్యాప్టాప్ తోనూ జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే, అరెస్టుకు ముందు రెండు సార్లు ఆయన గదిలో సోదాలు జరిపి, ల్యాప్టాప్, మొబైల్ తది తరాల్ని దర్యాప్తు బృందం స్వాధీనపరచుకుంది. నిర్దిష్ట ఆరోపణ లున్నా, దీనిపై విచారణే జరుగలేదు, ఇది నమ్మదగ్గ సాక్ష్యం కాదు. ఇంతటి కాఠిన్యం యాధృచ్ఛికమా? న్యాయ కస్టడీలో, మొదట చికిత్సకు నిరాకరించినా, ‘వారిచ్చే చిన్న మాత్రల కన్నా, నా వ్యాధి తీవ్రతే హెచ్చుగా ఉంది, ఏమో నేను చచ్చి పోతానేమో?’ అని ఒక దశలో సందేహించిన స్వామీ, చివరకు ఆస్పత్రిలో చేరడానికి అంగీకరించారు. మూడు దశాబ్దాలకు పైగా జార్ఖండ్లోని ఆదివాసీల హక్కుల కోసం స్టాన్స్వామి పోరాడు తున్నారు. గిరిజనుల అటవీ–భూమి హక్కుల కోసం, యువత అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ‘బగీచా’ను స్థాపించారు. 3000 మంది యువకులను మావోయిస్టులుగా ముద్రవేసి, అక్ర మంగా జైళ్లలో కుక్కడాన్ని నిరసిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. అరెస్టయిన 97 శాతం మందికి మావోయిస్టులతో ఏ సంబంధం లేదని, 96 శాతం యువత కుటుంబ నెలసరి ఆధాయం రూ. 5 వేల లోపని నిర్ధారించారు. నిష్కారణంగా జైళ్లో మగ్గి, విలువైన జీవిత కాలాన్ని, కొన్నిసార్లు జీవితాల్ని కోల్పోతున్నారని స్వామి తరచూ బాధపడేవారు. ఈ సుదీర్ఘ పోరాట క్రమమే పాలకులకు, వారితో అంటకాగుతున్న కార్పొరేట్ శక్తులకు కంటగింపైంది. యథే చ్చగా సహజవనరుల్ని, ప్రకృతి సంపదను కొల్లగొట్టే తమకు... పోరా టాలు అవరోధంగా, స్వామీ ఒక అడ్డంకిగా కనిపించారు. కుంటి జిల్లా ‘ముండే’ ఆదివాసీల భూహక్కుల కోసం సాగిన ‘పథల్ గాడీ’ ఉద్య మాన్ని అణచివేసేందుకు, 20 మందిపై రాజద్రోహం కేసు పెట్టారు. అందులో స్టాన్స్వామీ ఒకరు. రాజ్యాంగ రక్షణకు, దానికి లోబడి శాంతియుతంగా పోరాడుతున్న వ్యక్తిని వ్యవస్థ హతమార్చింది. పరి వర్తన కేంద్రాలు, సంస్కరణాలయాలు అని చెప్పుకునే మన జైళ్లలో... ఇంతటి కాఠిన్యం బయటి వారూహించరు. 84 ఏళ్ల వయసులో, పార్కిన్సన్ వ్యాధివల్ల ‘గ్లాసు పట్టుకొని నీళ్లు తాగలేకపోతున్నాను స్ట్రానో, సిప్పరో ఇప్పించండి’ అంటే, మూడు వారాలు జాప్యం చేసిన కర్కశత్వం చరిత్రలో నిలుస్తుంది. ప్రత్యేక కోర్టు జడ్జి బెయిల్ నిరా కరిస్తూ, ‘స్వామి వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సమాజ ఉమ్మడి ప్రయోజనాలే ప్రాధాన్యమైనవి’ అన్నారు నిష్కర్షగా! ఈ నెల 6న ముంబాయి హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ విచారణ ఉన్నపుడు... ఒకరోజు ముందు, 5ననే స్టాన్, ఏ బెయిలూ అవసరం లేని లోకాలకు వెళ్లి పోయారు. 2016–19 నాలుగేళ్లలో 2.2 శాతం కేసుల్లోనే నేర నిరూపణ జరిగి శిక్షలు పడ్డాయి. అందుకే, ‘ఉపా’ చట్టం పాలకుల చేతిలో దురుప యోగమౌతోంది. ప్రశ్నించే గొంతుల్ని, నిరసించే బృందాలను, అస మ్మతి స్వరాలను సాక్ష్యం లేని అభియోగాలతో నిర్బంధించేందుకు ఇదొక అస్త్రం. అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడం, గిట్టని వారిని పాలకులు కోరుకున్నంత కాలం నిర్బంధంలోనే ఉంచడం రివాజ యింది. గొంతెత్తే ఇతరులకు, ఇది ముందస్తు హెచ్చరికగానూ పని కొస్తోంది. ఇదివరకటి నల్లచట్టాలు ‘టాడా’ ‘పోటా’ల దారిలోనే ‘ఉపా’ కూడా అటకెక్కాల్సిన సమయం వచ్చింది. అణచివేత ఎంత అధికంగా ఉంటే, అనులోమ నిష్పత్తిలోనే తిరుగుబాటు తీవ్రత ఉంటుందని రాజ్యం గ్రహించాలి. దిలీప్ రెడ్డి ఈమెయిల్ : dileepreddy@sakshi.com -
అధిక ఉష్ణోగ్రత! కారణం ఏంటంటే..
అధిక ఉష్ణోగ్రతలు.. అది కూడా మంచుమయమైన అంటార్కిటికాలో పెరుగుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఈ గడ్డపై అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఏడాదిలోనే నమోదు అయ్యిందని జులై 1న ఒక ప్రకటన విడుదల చేసింది యూఎన్వో. న్యూయార్క్: ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ (64.9 డిగ్రీల ఫారెన్హీట్) ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. దీనికి సంబంధించిన రిపోర్టును ఆయన గురువారం వెల్లడించారు. వేడికి కారణం మంచు కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక పీడనం కారణంగా ఫోహెన్ ప్రభావం ఏర్పడుతుంది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని UN డబ్ల్యూఎంవో(వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్) రిపోర్టు వెల్లడించింది. ఫోహెన్ ప్రభావం వల్ల.. మంచు కొండలకు ఒకవైపు నుంచి వీచే సాధారణ గాలులు.. కొండ అంచు నుంచి మరో వైపునకు వీచేటప్పుడు వేడెక్కుతాయి. ఈ ఫలితమే అత్యధిక వేడి, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ దిగువ గాలుల ఫలితంగా.. అంటార్కిటికాలోని ఎస్పెరంజా స్టేషన్, సేమౌర్ ద్వీపంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతంలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు నివేదికలో పొందుపరిచారు. ఇంతకు ముందు.. గతంలో 2015, మార్చి 24న అంటార్కిటికాలో అత్యధికంగా 17.5 డిగ్రీల సెల్సియస్ (63.5 డిగ్రీల ఫారెన్హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ఎస్పెరంజా పరిశోధనా కేంద్రంలో ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు డబ్ల్యూఎమ్ఓ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో నమోదైన 18.3 డిగ్రీల సెల్సియస్ కొత్త రికార్డు కూడా అర్జెంటీనాలోని అదే స్టేషన్లో నమోదైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు అంటార్కిటిక్ ట్రీటీ సిస్టంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రొఫెసర్ తాలాస్ చెప్పారు. చదవండి: తొలిసారి నీలి తిమింగలం పాట! -
గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్
న్యూఢిల్లీ: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్-200 టాప్-10 దేశాల్లో భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రూపొందించిన ఈ జాబితాలో భారత్ 10వ ర్యాంక్ను చేజిక్కించుకుంది. 37 స్థానాలు మెరుగుపడి ఈ ర్యాంక్ను దక్కించుకోవడం విశేషం. 2019లో 47వ స్థానానికి పరిమితమైన భారత్ ఈ అంశంలో తాజాగా తన ర్యాంకును మరింతగా మెరుగుపరుచుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంత పరంగా నాల్గవ ర్యాంక్ సాధించింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో చట్టపరమైన, సాంకేతిక, సంస్థాగత చర్యలు, సామర్థ్యం అభివృద్ధి, సహకారం ఆధారంగా ఇండెక్స్ రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ సైబర్ సెక్యూరిటీ ర్యాంకింగ్ పరంగా భారత్ టాప్ 10లో ఉంటే మన శత్రు దేశాలు చైనా 33వ స్థానంలో, పాకిస్తాన్ 79వ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటీయు), గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఎజెండా(జీసీఏ) జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. తరువాత స్థానంలో యుకె ఉంది. "ఇది గొప్ప వార్త సీఈఆర్టీ(సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్)తో పాటు మేము తీసుకున్న చర్యలకు ఇది నిదర్శనం' అని భారత జాతీయ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్(ఎన్ సీఎస్సీ) రాజేష్ పంత్ అన్నారు. చదవండి: సెప్టెంబర్ నుంచి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ డెలివరీలు -
సామాన్యుల సాధికారికత కోసమే కొత్త ఐటీ నిబంధనలు
భారతదేశం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబందనలపై ఐక్యరాజ్యసమితి లేవనెత్తిన భయాలను భారత్ నివృత్తి చేసింది. కొత్తగా తీసుకొచ్చిన "సోషల్ మీడియా నిబందనలను సాధారణ వినియోగదారుల సాధీకరికత కోసం" రూపొందించినట్లు భారత్ పేర్కొంది. వివిధ వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తర్వాతానే కొత్త నిబంధనలను ఖరారు చేసినట్లు తెలిపింది. "భారత రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ హక్కుకు హామీ ఉంది. స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన మీడియా భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగం" అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది. భారత దేశం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబందనలు అంతర్జాతీయ మానవ హక్కుల నియమావళిని పాటించలేదని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందంలో ఉన్న గోప్యత, అభిప్రాయ స్వేచ్ఛ, వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంతర్జాతీయ చట్టం & ప్రమాణాలను భారత్ పాటించలేదని ఆరోపిస్తూ ఐరాస జూన్ 11న కొత్త ఐటి నిబంధనల గురించి కేంద్రానికి ఒక లేఖ రాసింది. 1979 ఏప్రిల్ 10న భారతదేశం ఈ నిబందనలు ఆమోదించినట్లు పేర్కొంది. సోషల్ మీడియా వేదింపులు, ఉగ్రవాద కార్యకలపాల నివారణ, అశ్లీల కంటెంట్, ఆర్ధిక మోసలను, మత విద్వేషాలను రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే సమాచారాన్ని అరికట్టడానికి, సామాన్యుల సాధికారికత కోసమే కొత్త నిబందనలు తీసుకొచ్చినట్లు కేంద్రం ఐరాసకు తెలిపింది. చదవండి: ఆన్లైన్లో ఎంఐ 11 లైట్ ఫీచర్స్ వైరల్ -
World Day Against Child Labour: ఛిద్రమవుతున్న బాలల బతుకులు
వెబ్డెస్క్: కోవిడ్ మహమ్మారి బాల్యాన్ని కాటేస్తోంది. పిల్లలను పాఠశాలకు దూరం చేసి కర్మాగారాలకు దగ్గర చేస్తోంది. గడిచిన ఇరవై ఏళ్లుగా బాల కార్మికుల విషయంలో కనిపిస్తున్న వృద్ధి కరోనా దెబ్బకు కకావికలమైంది. మరోసారి రికార్డు స్థాయిలో బాల కార్మికుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడు జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. బాలలపై కోరలు చాచిన కరోనా కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు లాక్డౌన్ అనివార్యంగా మారింది. దీంతో పాఠశాలలు మూత పడ్డాయి. రోజువారి పని చేసుకునే కూలీలకు ఉపాధి కరువైంది. ఫలితంగా వర్థమాన, పేద దేశాల్లోని పిల్లలు భారీ ఎత్తున పాఠశాలకు దూరమవుతున్నారు. ఆర్థిక పరిస్థితి దిగజారిన కుటుంబాలకు అండగా ఉండేందుకు బాల కార్మిక వ్యవస్థలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్నారు. తాజా గణాంకాలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 20 ఏళ్ల తర్వాత తొలిసారి ఐక్యరాజ్య సమితి చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్లమంది బాల కార్మికులు ఉన్నట్లుగా తేల్చింది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన చర్యల కారణంగా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 20 ఏళ్ల పాటు తగ్గుముఖం పడుతూ వచ్చిన బాల కార్మికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) తెలిపింది. 2001 నుంచి 2016 వరకు అన్ని దేశాల్లో కలిపి 9.4 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మరింత మంది కేవలం కోవిడ్ కారణంగా 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మరో 90 లక్షల మంది పిల్లలకు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని యూఎన్వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో 46 లక్షల మంది బాలలు అనాథలుగా మారడమో లేదా సామాజిక భద్రతకు దూరమవుతారని తెలిపింది. పదివేల మందికి పైగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో 5 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న వారి సంఖ్య 25.6 కోట్లుగా ఉంది. ఇందులో నాలుగో వంతు మంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్నారు. సామాజిక భద్రత ఇక కరోనా కారణంగా 2021 మే 31 వరకు దేశ వ్యాప్తంగా పది వేల మంది పిల్లలు అనాథలుగా మారినట్ట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరందరికీ సామాజిక భద్రత ఇప్పుడు ఎంతో అవసరం. ఈ పిల్లలను ఆదుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొదటగా ముందుకు వచ్చారు. పిల్లల పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు సైతం ఇదే తరహా పథకాలను ప్రారంభించాయి. చదవండి: ఇంటర్నెట్ సౌకర్యం లేని వారికీ జీవించే హక్కుంది -
300 కోట్ల మందికి సముద్రమే ఆధారం
వెబ్డెస్క్: భూమిపై 29 శాతం నేల ఉంటే మిగిలిన 71 శాతం సముద్ర నీరే ఉంది. ఈ ధరణిపై నివసించే ప్రాణులన్నీ ప్రత్యక్షంగా , పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నాయి. కడలి బాగుంటేనే జీవరాశులన్నీ బాగుంటాయి. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతీ ఏడు జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సం నిర్వహిస్తున్నారు. బాగుండాలి బ్రెజిల్లోని రియో డిజనీరో నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచాలని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి... జీవులూ బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్గా ఎంపిక చేశారు. అరుదైన అవకాశం ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి జూన్ 8న కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన తాడి దీపిక పాల్గొంటున్నారు. గ్రీన్వార్మ్స్ ప్రాంతీయ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. సముద్రం....మరికొన్ని విశేషాలు - ప్రపంచ జనాభాలో సగం మంది సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. సముద్రం, తీరంలో దొరికే వనరులే వారికి జీవనాధారం. - భూమిపై ఉన్న జీవంలో 50 నుంచి 80 శాతం సముద్రంలోనే ఉంది. - సముద్ర జలాల్లో కేవలం 1 శాతం జలాల్లోనే సెక్యూరిటీ ఉంది. మిగిలిన జలాలు రక్షణ లేదు. అందువల్లే టెక్నాలజీ ఇంతగా పెరిగినా సముద్రపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇక అభివృద్ధి చెందిన దేశాలు గుట్టుచప్పుడు కాకుండా సముద్ర జలాల్లో అణు పరీక్షలు నిర్వహిస్తాయనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. - సముద్ర జలాల్లో క్రమంగా ఆల్గే నాచు పేరుకుపోతుంది. దీని వల్ల సముద్ర జలాలు కాలుష్యమవుతున్నాయి. దీంతో సముద్ర జీవుల రక్షణ, భద్రత ప్రమాదంలో పడుతోంది. - భారీ ఎత్తున కార్బన్ డై ఆక్సైడ్ను పీల్చుకోవడం ద్వారా సముద్రాలు పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయి. అయితే రోజురోజుకి కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగిపోవడంతో క్రమంగా సముద్ర జలాలు ఆమ్ల లక్షణాలను సంతరించుకుంటున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - మనం పీల్చే ఆక్సిజన్లో 70 శాతం సముద్రం నుంచే వాతావరణంలోకి వెలువడుతుంది. - పసిఫిక్ మహసముద్రంలో 2,600 కిలోమీటర్ల దూరం విస్తరించిన గ్రేట్ బారీయర్ రీఫ్ జీవవైవిధ్యానికి ప్రతీక. చంద్రుడి నుంచి చూసినా ఈ రీఫ్ కనిపిస్తుంది. - నాగరికత మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సముద్రంలో 5 శాతాన్నే మనం ఇప్పటి వరకు శోధించగలిగాం. ఇంకా సముద్రంలో తెలుసుకోవాల్సిన వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. - ఇప్పటి వరకు 2,36,878 సముద్ర జీవులను గుర్తించగలిగారు శాస్త్రవేత్తలు. - అగ్నిపర్వతాల్లో 90 శాతం సముద్రంలోనే ఉన్నాయి. -
India: ఆకలి రాజ్యం
జూన్ 7న ప్రపంచ ఫుడ్ సెఫ్టీ డేగా ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా నిర్వహిస్తోంది. 2019 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ , యూఎన్వో, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ డే ముఖ్య ఉద్దేశం. వెబ్డెస్క్: సపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అంటూ ఆకలి రాజ్యం సినిమాలో కమల్ పాడిన పాట ఒక ఊపు ఊపింది. నలభై ఏళ్లు గడిచినప్పటికీ దేశం సందుగొందుల్లో ఆకలి కేకలు వినపడుతూనే ఉన్నాయి. ఆహార భద్రత చట్టం అమల్లోకి తెచ్చినా.. పట్టెడన్నం దక్కక లక్షల కుటుంబాలు పస్తులుంటున్నాయి. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఇండియాలో పెరిగిపోతున్న ఆకలిపై తీరుతెన్నులపై కథనం... ఆకలి కేకలు 2020లో ప్రకటించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆహార భద్రతకు సంబంధించి 107 దేశాల నుంచి డేటాను సేకరించి విశ్లేషించగా ఇండియాకు 102 స్థానం దక్కింది. 1991 నుంచి 2014 వరకు ఉన్న వివరాల ఆధారంగా 2020లో ఈ వివరాలు ప్రకటించారు. తమ దేశ పౌరుల ఆకలి తీర్చడంలో పొరుగు దేశాలపైన నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లు మెరుగైన స్థితిలో ఉన్నాయి. మొత్తం ఆసియాలోనే ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే మన కంటే వెనుకబడి ఉంది. పౌష్టికాహారం అందక పోవడం వల్ల ఎంతో మంది భావి భారత పౌరులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. లాక్డౌన్ తిప్పలు పేదరికం కారణంగా ఆకలితో నిత్య పోరాటం చేస్తున్న పేదల బతుకులపై లాక్డౌన్ సమ్మెట పోటులా మారింది. దేశంలో రెండు సార్లు విధించిన లాక్డౌన్తో పేదల బతుకులు చిధ్రమయ్యాయి. ఉపాధి కోల్పోయి తినే నాలుగు మెతుకులు కూడా లభించిన దుస్థితి నెలకొంది. ఇక వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వలస కార్మికులకు ఆహారం అందించేందుకు ఏ వాహానం వచ్చినా.. వందల సంఖ్యలో ప్రజలు ఆ వెహికల్ వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు సర్వ సాధారణం అయ్యాయి. కల్తీ కంపు సరిపడ ఆదాయం లేక ఆకలితో ఆలమటిస్తున్న వారు కొందరైతే.. డబ్బులు ఉన్నా నాణ్యమైన తిండి దొరక్క అనారోగ్యం పాలై ప్రజలకు కొదవ లేదు. ముఖ్యంగా నాన్వెజ్ వంటకాల విషయంలో కొన్ని రెస్టారెంట్లు అనుసరిస్తున్న ధోరణి దారుణంగా ఉంటోంది. కుళ్లిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి సరఫరా చేస్తున్నారు. ఫుడ్సెఫ్టీ అధికారులు ఎన్ని సార్లు దాడులు చేసినా అక్రమార్కుల తీరులో మార్పు రావడం లేదు. రోడ్లపైనే కాళ్లకు వేసుకునే చెప్పులను అద్దాల షోరూమ్లో అమ్ముతుంటా కానీ కడుపుకు తినే కూరగాయలు మాత్రం రోడ్ల పక్కన, మోరీల వెంట అమ్మేస్తుంటాం అని అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్యాదవ్ చెప్పారు. ఇప్పటికీ ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. కనీసం మున్సిపాలిటీల్లో కూడా వెజ్, నాన్వెజ్కి సరైన మార్కెట్లు లేవు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఆహార భద్రత యూపీఏ ప్రభుత్వ హయంలో తెచ్చిన ఆహార భద్రత చట్టం ఆకలితో ఆలమటించే పేదలకు అండగా ఉంది. ఈ చట్టం క్రింద ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని రెండు రూపాయలకే అందిస్తుండటంతో ఎంతో మందికి లబ్ధి చేకూరుతోంది. లాక్డౌన్ సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం సరఫరా చేసి ప్రజలను ఆదుకున్నారు. -
World Cycling Day: సైకిల్ తొక్కగలవా ఓ నరహరి !
వెబ్డెస్క్: ఇప్పుడంటే కార్లు, బైకుల జమానా నడుస్తోంది కానీ, ఆర్థిక సంస్కరణలు అమలు కాకముందు 90వ దశకం వరకు సైకిల్ అనేది మనదేశంలో ఓ ప్రీమియం వస్తువు. ఇప్పుడు దేశంలో పెద్ద బ్యూరోక్రాట్లుగా, రాజకీయ నాయకులుగా పేరు తెచ్చుకున్న ఎందరో తమ జీవితంలో తొలి అభివృద్ధి పథాన్ని సైకిల్ తొక్కడంతోనే మొదలెట్టారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన సైకిల్ క్రమంగా సైడయి పోతోంది. మగమహరాజులకు ప్రత్యేకం 90వ దశకం వరకు పల్లె, పట్నం తేడా లేకుండా పెళ్లి సంబంధాలు మాట్లాడేప్పుడు సైకిల్ పెట్టడం అనేది ఘనతకు చిహ్నంగా ఉండేది. సైకిల్ విషయం తేలిన తర్వాతే మిగిలిన మాట ముచ్చట నడిచేవి. ఇక పిల్లలు స్కూల్కి వెళ్లడం దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్లు పొలం పనులకు వరకు అన్నింటా సైకిల్కి ప్రత్యేక స్థానం ఉండేది. పాలు, పేపర్ బాయ్లకు సైకిలే జీవనాధారం. అద్దెకు సైకిళ్లు ఇచ్చే సెంటర్లు ప్రతీ టౌనులో ఉండేవి. సినిమా థియేటర్లు, స్కూళ్లలో సైకిల్ స్టాండులే ఉండేవి.... ఎక్కడో ఒక చోట వెహికల్ పార్కింగ్లు ఉండేవి. ఆరోజుల్లో కుర్రకారు ప్రేమ సందేశాలు పంపేదుకు సైకిలెక్కి అమ్మాయిల చుట్టూ శాటిలైట్లలాగా చక్కర్లు కొట్టేవారు. అప్కమింగ్ స్టార్గా చిరంజీవి ‘నీ దారి పూల దారి’ అంటూ ఎనిమిది రోజుల పాటు నాన్ స్టాప్గా సైకిల్ తొక్కి మగ మహరాజుల వెండితెర బాక్సాఫీస్ని ఏలితే... అంతకంటే ముందే సైకిల్ ఎక్కిన ఎన్టీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనుడయ్యాడు. అంతటి ఘన చరిత్ర కలిగి సైకిల్కు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది ఐక్యరాజ్య సమితి. ప్రతీ ఏడు జూన్ 3వ తేదిన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుతోంది. ఇలా వచ్చింది ప్రతీ ఏటా జూన్ 3 ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా పాటిస్తున్నారు. పోలాండ్కి చెందిన లెస్జెక్ సిబిల్స్కి అనే సామాజికవేత్త చేసిన కృషి కారణంగా సైకిల్ డే ఆవిర్భవించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రకటించాలంటూ సైకిల్ వేసుకుని తిరుగుతూ 57 ఇతర దేశాల మద్దతు కూడగట్టారు. సైకిల్ పెడల్స్ అరిగేలా ఐక్యరాజ్యసమితి కార్యాలయం చుట్టూ సైకిల్పై తిరిగారు. చివరకు ఆయన శ్రమ ఫలించి 2018లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 03ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించారు. కాలుష్య రహితం కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న ఒకే ఒక్క అంశం గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ సమతుల్యత కాపాడటం. కాలుష్యం విడుదల చేయకుండా రవాణా సౌకర్యం కల్పించడం సైకిల్ ప్రత్యేకత. అంతేకాదు సైకిల్ తొక్కడం వల్ల శారీరక వ్యాయమం కూడా కలుగుతుంది. మెయింటనెన్స్ ఖర్చు అతి తక్కువ. ఇలా సైకిల్తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సూచనలతో కాలుష్యం తగ్గించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సైక్లింగ్ను ప్రోత్సహించాలంటూ సభ్య దేశాలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తోంది. అనేక దేశాలు ఈ సూచనలు పాటిస్తున్నాయి. మన దగ్గర రోడ్లపై సైక్లింగ్కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్లో సంజీవయ్య పార్కు, వరంగల్లో నిట్ దగ్గర ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. -
యుద్ధ నేరాలకు పాల్పడిన ఇజ్రాయెల్, హమాస్
జెనీవా: ఇటీవల ఇజ్రాయెల్కు, గాజాలోని హమాస్ మిలటరీకి మధ్య జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడినట్లు భావిస్తున్నామని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం చీఫ్ మిషెల్ బాచ్లెట్ చెప్పారు. దీన్ని బయటకు తేవాలంటే నిష్పక్షపాత విచారణ అవసరమని గురువారం అభిప్రాయపడ్డారు. అంతేగాక ఇజ్రాయెల్-పాలస్తీనా మూల సమస్యను పరిష్కరించపోతే శాంతి కేవలం కొంతకాలం మాత్రమే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఐరాసలోని మానవ హక్కుల విభాగం ఓ ప్రత్యేక సెషన్ ద్వారా గాజాలోని పరిస్థితులపై చర్చించింది. ఈ నేపథ్యంలో యుద్ధనేరాల ప్రస్తావన వచ్చింది. వేలాది రాకెట్లను ప్రయోగించిన హమాస్ సైతం యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆమె స్పష్టం చేశారు. 2014 తర్వాత జరిగిన అతి సంకట స్థితి ఇదేనని మానవ హక్కుల విభాగ హై కమిషనర్ కౌన్సిల్లో తెలిపారు. 11 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో గాజాలో 248 మంది మరణించగా, ఇజ్రాయెల్లో 12 మంది మరణించారు. ఈ వ్యవహారంలోని నిజానిజాలను తేల్చేందుకు నిష్పక్షపాత విచారణ జరగాలని, అందులో ఇజ్రాయెల్ లేదా గాజా వేలు పెట్టరాదని అప్పుడే నిజం బయటకు వస్తుందని మిషెల్ చెప్పారు. మిలటరీ పోస్టులను లక్ష్యంగా చేసుకొని ప్రజావాసాలపై దాడులు జరిపితే దాన్ని యుద్ధనేరంగా పరిగణిస్తారు. ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంపై పలు ముస్లి దేశాలు ఐరాసలో ఓ తీర్మానం ప్రవేశపెట్టాయి. అది ఆమోదం పొందితే, ఆ ప్రాంతంలోని మానవహక్కుల ఉల్లంఘనలపై విచారణకు ఓ శాశ్వత కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ సమావేశంలో ఇజ్రాయెల్, పాలస్తీనా రాయబారులు ప్రత్యారోపణలు చేసుకున్నారు. చదవండి: గాజాకు అండగా మేముంటాం: అమెరికా -
సముద్ర సదస్సుకు నైన్త్ క్లాస్ యష్మి..
యష్మి తొమ్మిదో తరగతి విద్యార్థిని. ఐక్యరాజ్యసమితి ‘సముద్ర సదస్సు’ కు ఎంపికైంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే అంశంపై కావేరీ నది మీద యష్మి తీసిన చిన్న డాక్యుమెంటరీ ఆమెకు ఈ అర్హతను కల్పించింది. త్వరలోనే హవాయిలో జరిగే సముద్ర సదస్సులో ప్రపంచంలోని ఆలోచనాపరులతో కలిసి యష్మి కూర్చోబోతోంది! కరోనా కారణంగా ఒకవేళ ఆ సదస్సు ఆన్లైన్లో జరిగినా తనేమీ నిరుత్సాహపడబోనని, యువతకు తన సందేశం వెళ్లింది అంతే చాలునని యష్మి సంతోషంగా చెబుతోంది. సముద్ర సదస్సుకు కావేరీ నదిని తీసుకెళుతున్న నావిక.. యష్మి. లాక్డౌన్లో తాగడానికి నీళ్లు లేక, ఊరికి బారెడు దూరంలో ఎక్కడో కొన్ని స్వచ్ఛమైన నీటి చుక్కలున్నా బయటికి వెళ్లే దారి లేక ఇంట్లోనే బావులు తవ్వుకున్నవాళ్లున్నారు! లాక్డౌన్ పర్యవసానాల విశ్వరూపానికి ఇదొక్క ఉదాహరణ చాలు. జీవికి గొంతు తడుపుకోడానికి నీళ్లు లేకపోవడం ఏమిటి! భూగోళమేమీ ఒట్టిపోలేదే?! నదులున్నాయి, చెరువులున్నాయి, ఊటలు, నీటి కుంటలూ ఉన్నాయి. ఉన్నాయి కానీ తాగేందుకు వీల్లేనంతగా కలుషితం అవుతున్నాయి! జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే సమీప భవిష్యత్తులో? ‘భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి’ అని ఐక్యరాజ్య సమితి స్కూల్ పిల్లలకు పోటీ పెట్టింది. ఆ ఊహ.. కథ చెప్పినట్లుగా ఉండాలి. ఊహ ‘వీడియో’ రూపంలో ఉండాలి. అదీ నిబంధన. 13–17 మధ్య వయసు గల పిల్లల కోసం జరిగిన ఈ పోటీలో అనేక కేటగిరీలు ఉన్నాయి. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనేది వాటిల్లో ఒకటి. నీరు పవిత్రమైనదని అర్థం. ఆ కేటగిరీలో కొడగు విద్యార్థిని యష్మి విజేతగా నిలిచింది. యష్మి మైసూరులోని ఆచార్య విద్యాకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొడగులోని నెలజి ఆమె స్వగ్రామం. లాక్డౌన్లో తన ఊరు ఎలా ఉందో కళ్లారా చూసింది యష్మి. నీరు ఎంత విలువైందో కూడా అప్పుడే ఆమెకు తెలిసింది. తమ ఊరొక్కటే కాదు, రాష్ట్రంలోని అన్ని ఊళ్లూ అలానే ఉన్నాయని పత్రికల్లో చూసింది. నీటి చుక్కకు కరువేమీ లేదు. కలుషితం కాని నీరే.. ఎక్కడా లేదు! అసలే కరోనా. కలుషితమైన నీరు తాగడం వల్ల, గాలిలోని కాలుష్యాలను పీల్చడం వల్ల జబ్బున పడితే, అది కరోనా ఏమోనన్న భయం. ఈ పరిస్థితిని మార్చేందుకు తనేమీ చేయలేదు. ఏం చేయాలో కొంత చెప్పగలదు. కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. రోజులు గడిచాయి. లాక్డౌన్ ముగిసింది. యష్మి ఎనిమిది నుంచి తొమ్మిదికి వచ్చింది. ఈ సమయంలో క్లాస్ టీచర్ ఓరోజు యు.ఎన్. హెచ్2ఒ 21 వాటర్ సమ్మిట్ గురించి చెప్పారు. హెచ్2ఒ 21 సమ్మిట్ పేరుతో ఐక్యరాజ్య సమితి టీనేజ్ విద్యార్థులకు భవిష్యత్తులో నీరు అనే టాపిక్ మీద ‘స్టోరీ టెల్లింగ్’ పోటీ పెడుతోంది. అందులో విజేతగా నిలిస్తే, ఆ తర్వాత యూఎస్లోని హవాయి రాష్ట్రంలో జరిగే ‘యు.ఎస్. ఓషన్ డికేడ్ సమ్మిట్’లో పాల్గొనేందుకు ఆహ్వానం లభిస్తుంది. అదేమీ మామూలు సంగతి కాదు. స్టోరీ టెల్లింగ్లో జల సంరక్షణ కోసం విజేతలు ఇచ్చిన సూచనలపై మేధావులు, ఆలోచన పరులు ఓషన్ సమ్మిట్ (సముద్ర సదస్సు)లో చర్చలు జరుపుతారు. అది చాలదా! ‘‘ఇదిగో ఈ అద్భుతమైన ఆలోచనను ఇచ్చింది ఈ అమ్మాయే’’ అని అంతా చప్పట్లు చరుస్తూ అభినందిస్తూ ఉంటే!! క్యాష్ ప్రైజ్, ప్రశంసాపత్రం ఎలాగూ ఉంటాయి. యష్మి వెంటనే ఆ పోటీలో పాల్గొంది. ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ అనే కేటగిరీని ఎంపిక చేసుకుంది. లాక్డౌన్లో తన అనుభవాలను పాయింట్లుగా రాసుకుంది. వాతావరణ మార్పులపై ప్రసిద్ధుల ప్రసంగాల నుంచి కొంత నోట్స్ సిద్ధం చేసుకుంది. పోటీలో పాల్గొనడానికి ముందు హెచ్2ఓ 21 నియమ నిబంధనల కోసం ఐక్యరాజ్య సమితి వరుసగా నాలుగు శని, ఆదివారాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ తరగతులకు హాజరు అయింది. అక్కడే కేటగిరీల కేటాయింపు జరుగుతుంది. యష్మి ‘వాటర్ ఈజ్ సేక్రెడ్’ కేటగిరీని ఎంపిక చేసుకోడానికి తగిన కారణమే ఉంది. కొడగులోని వాళ్లంతా కావేరీ నదిని దైవంలా పూజిస్తారు. అన్లైన్ తరగతులకు హాజరవుతున్నప్పుడే వాళ్లు చెబుతున్న విషయాలను బట్టి.. తల్లి కావేరి తమను కాపాడుతున్నంతగా, కావేరిని తాము కాపాడుకోవడం లేదని ఆమె గ్రహించింది. పైగా యష్మి కావేరి నదిని పూజించే కొడవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలోని అమ్మాయి. వెంటనే ఆమె కొడగు వెళ్లిపోయి, కావేరీ నది అందాలను అనేక కోణాలలో షూట్ చేసింది. వాటిని కథానుగుణంగా ఎడిట్ చేసింది. నేపథ్య గీతంగా కొడవలకు ప్రత్యేకమైన భక్తి పాటను ఉంచింది. అంత అందమైన కావేరి నది.. కాలుష్యం కారణంగా ఎలా అంద విహీనం అయిపోతున్నదో చూపించింది. వీడియో చివర్లో ‘లెటజ్ హీల్ హర్. నాట్ ఫిక్స్ హర్’ అనే సందేశంతో.. యువతీ యువకులు కావేరి నది స్వచ్ఛత ను పునరుద్ధరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దృశ్యరూపకంగా జత చేసింది. ఇంత అద్భుతం గా చేశాక యష్మి విజేత కాకుండా ఉంటుందా! అయింది. త్వరలో హవాయి వెళ్లబోతోంది. ‘‘నా చిన్నప్పుడు మా అమ్మ చెబుతుండేది. అమ్మ చిన్నప్పుడు కొడగు ప్రాంతం ఎంతో అందంగా ఉండేదట. ‘భారీగా వర్షాలు పడేవి. చెరువులు స్వచ్ఛంగా ఉండేవి. నేను పెరిగి పెద్దయ్యేనాటికి వాతావరణంలో కాలుష్యాలు పెరిగినా వర్షాలేమీ తగ్గలేదు కానీ, నీటి స్వచ్ఛత తగ్గింది. నువ్వు పెద్దయి, నీ తర్వాతి తరం వచ్చాక నువ్వూ.. మా చిన్నప్పుడు ఇలా ఉండేది.. అని చెప్పకూడదని నా ఆశ. అందుకు మీ తరం వారే ఏదైనా చేయాలి. ఏదైనా కాదు. రెండు చేయాలి. కాలుష్యం తగ్గించాలి. పచ్చదనం పెంచాలి’’ అని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పిన మాటలనే నేను హవాయిలో నా వీడియో ప్రెజెంటేషన్లో చెబుతాను’’ అంటోంది యష్మి. వీడియో తయారు చేయడానికి తన కజిన్ భువన, ఆమె తండ్రి తనకు సహాయపడ్డారట. యష్మి తల్లి నళిని, తండ్రి కుశలప్ప తమ కూతురి కి యూఎస్ వెళ్లే అవకాశం రావడంతో సంతోషం గా ఉన్నారు. కరోనా కారణంగా ఆమె వెళ్లబోయే ‘ఓషన్ డికేడ్ సమ్మిట్’ అన్లైన్లో జరిగే అవకాశాలున్నా.. ‘నా సందేశం వెళ్లింది. అంతే చాలు’ అని అంటోంది యష్మి. -
భారత్ జీడీపీ వృద్ధి 7 శాతం!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2021–22లో 7 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అంచనా వేసింది. ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్ (యూఎన్ఈఎస్సీఏపీ) మంగళవారం విడుదల చేసిన తన సర్వే ఆధారిత నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... 1. మహమ్మారి భారత్ వ్యాపార క్రియాశీలతను తీవ్రంగా దెబ్బతీసింది. దీనితో 2020–21లో ఆర్థిక వ్యవస్థ 7.7% క్షీణిస్తుంది. బేస్ ఎఫెక్ట్సహా ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో 2021–22లో వృద్ధి రేటు 7%గా ఉండే వీలుంది. 2. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15–మే 3, మే 4–మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి, రెండు త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొ లగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊ పందుకోవడంతో మూడో త్రైమాసికంలో స్వల్ప వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలోనూ దాదాపు ఇదే స్థాయి వృద్ధి రేటు నమోదుకావచ్చు. 3. కేంద్ర రుణ సమీకరణలకు సంబంధించి వడ్డీ వ్యయాలను తక్కువ స్థాయిలో ఉంచడం, బ్యాంకింగ్ మొండిబకాయిల తీవ్రతను అందుపులో ఉంచడం దేశం ముందు ఉన్న ప్రస్తుత పెద్ద సవాళ్లు. 4. వర్ధమాన ఆసియా–పసిఫిక్ దేశాల సగటు వృద్ధిరేటు 2021లో 5.9 శాతం ఉండే వీలుంది. 2022లో ఇది 5 శాతానికి తగ్గవచ్చు. 2020లో ఆయా దేశాల ఉత్పత్తి రేటు 1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. 5. బేస్ ఎఫెక్ట్ వల్ల 2021లో భారీ వృద్ధి రేటు (వీ నమూనా) కనిపించినప్పటికీ, తిరిగి ఎకానమీ ‘కే’ నమూనా రికవరీగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. పలు పరిశ్రమలు, వ్యక్తులకు సంబంధించి రికవరీ రేటు విస్తృత ప్రాతిపదికన, ఏకరీతిన కాకుండా విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. 6. ఆసియా, పసిఫిక్ దేశాలు కేవలం వృద్ధిమీదే దృష్టి పెడుతున్నాయి తప్ప, ఉపాధి కల్పన, సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డానికి చర్యలు వంటి అంశాలపై శ్రద్ధ పెట్టడం లేదు. మహమ్మారి వల్ల ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 8.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలో పడిపోయారు. వారు రోజుకు కేవలం 1.90 డాలర్లు (రూ.145కన్నా తక్కువ) సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు. 7. వృద్ధి ప్రణాళికల్లో ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. వర్ధమాన దేశాల్లో సైతం దిగువన ఉన్న ఎకానమీలకు అంతర్జాతీయ సహకారం అందాలి. కోవిడ్ను ఎదుర్కొనడంలో చైనా పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ కారణంగానే 2020 నాల్గవ త్రైమాసికంలో 6.5% వృద్ధిని సాధించగలిగింది. చైనా రిక వరీ మున్ముందూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. -
ఊపిరిపీల్చుకున్న లంక
శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో తీర్మానం వచ్చినప్పుడల్లా ఆ దేశంకంటే మనకే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తటం రివాజుగా మారింది. ఈసారి కూడా అదే అయింది. శ్రీలంక తీరును నిరసిస్తూ బ్రిటన్ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన తీర్మానానికి 47మంది సభ్య దేశాలుండే మండలిలో మంగళవారం రాత్రి ఓటింగ్ జరిగింది. తీర్మానాన్ని 22 దేశాలు సమర్థించగా, 11 దేశాలు వ్యతిరేకించాయి. 25 ఓట్లతో తీర్మానం గెలిచివుంటే లంకకు సమస్యలెదురయ్యేవి. కానీ భారత్తోపాటు 14 దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. తీర్మానం గెలిచితీరాలని బ్రిటన్, దాని మిత్ర దేశాలు శతవిధాల ప్రయత్నించగా, ఇది వీగిపోవాలని శ్రీలంక బలంగా కోరుకుంది. ఏ స్థాయిలో అంటే... లంక ప్రధాని మహిందా రాజపక్స కరోనా భయాన్ని కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్ సందర్శించి ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఆ దేశ ప్రధాని హసీనాను కోరారు. ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ)ను లంక అధ్యక్షుడు గోతబయ రాజపక్స సంప్రదించారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా గోతబయ మాట్లాడారు. తమిళ టైగర్లను అణిచే పేరిట మహిందా రాజపక్స ప్రభుత్వం 2009–10 మధ్య నరమేథం సాగించింది. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్, ఆయన కుటుంబంతోపాటు ఆ సంస్థలోని వారందరినీ మట్టుబెట్టింది. ఆ నరమేథంలో 40,000మంది మరణించారని ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ తేల్చినా...వాస్తవానికి లక్షకు మించి ప్రాణనష్టం జరిగిందని అనధికార గణాంకాలు చెబుతున్నాయి. ఎల్టీటీఈ మహిళా విభాగం కార్యకర్తలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు జరిగాయని, సజీవంగా దహనం చేసిన ఘటనలు కూడా వున్నాయని ఆరోపణలొచ్చాయి. లక్షలాది తమిళ కుటుంబాలు ప్రాణభయంతో వలస బాటపట్టాయి. ఇందుకు బాధ్యులెవరో గుర్తించి శిక్షించాలని కోరినా శ్రీలంక పెడచెవిన పెట్టడంతో మానవ హక్కుల మండలి పదే పదే ఆ దేశాన్ని అభిశంసిస్తోంది. 2009 మొదలుకొని ఇప్పటివరకూ 8 దఫాలు తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాలపై ఓటింగ్ జరిగిన ప్రతిసారీ ఒకే మాదిరి ఫలితం వుంటుంది. చైనా, పాకిస్తాన్, రష్యాలు వాటిని వ్యతిరేకిస్తాయి. లంక సార్వభౌమత్వాన్ని ఈ తీర్మానాలు దెబ్బతీస్తాయని, వీటి వెనక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆ దేశాలు ఆరోపిస్తాయి. సాధారణంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే విదేశాంగ విధానంపై రాజకీయ పక్షాలు స్పందిస్తాయి. విమర్శించటమో, సమర్థించటమో చేస్తాయి. రాష్ట్రాలు దాని జోలికిపోవు. కానీ శ్రీలంక విషయంలో తమిళనాడు స్పందిస్తుంది. అక్కడున్న తమిళులకు ఏం జరిగినా తల్లడిల్లుతుంది. కేంద్రం జోక్యం చేసుకుని, ఆ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరుతుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అది మరింత చర్చనీయాంశమవుతుంది. ఇప్పుడు జరిగింది అదే. ఎవరో కాదు...బీజేపీ మిత్ర పక్షమైన అన్నాడీఎంకే ఆ తీర్మానాన్ని సమర్థించాలని కోరింది. డీఎంకే, ఇతర తమిళ పక్షాలు సైతం ఈ రకమైన డిమాండే చేశాయి. లంక తమిళుల ప్రయోజనాలు కాపాడతామన్న హామీని నిలబెట్టుకోవాలని రాజ్యసభ జీరో అవర్లో కూడా అన్నా డీఎంకే విజ్ఞప్తి చేసింది. కానీ అందుకు భిన్నంగా మన దేశం ఓటింగ్కు గైర్హాజరు కావటంతో తాజా ఎన్నికల్లో అది చర్చనీయాంశమవుతుంది. ఆ సంగతెలావున్నా శ్రీలంక విషయంలో దూకుడుగా పోరాదని మొదటినుంచీ మన దేశం భావిస్తోంది. 2009–13 మధ్య మూడు సందర్భాల్లో ఓటింగ్ జరగ్గా, ఆ మూడుసార్లూ మన దేశం లంక వ్యతిరేక తీర్మానాన్ని సమర్థించిన మాట వాస్తవమే. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పట్లో యూపీఏలో భాగస్వామిగా వున్న డీఎంకే పట్టుబట్టేది. అది తప్పుకుంటే ప్రభుత్వానికి సమస్యలెదురవుతాయన్న భయంతో చివరివరకూ ఊగిసలాడి, చివరకు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు. 2014లో ఎన్డీఏ సర్కారు వచ్చాక మండలిలో ఓటింగ్ జరిగినప్పుడు మన దేశం గైర్హాజరైంది. అటుపై మూడుసార్లు మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కేంద్రం ఏం చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. సమానత్వం, న్యాయం, గౌరవం, శాంతి కావాలన్న శ్రీలంక తమిళులను సమర్థిస్తున్నామని... అదే సమయంలో లంక సమైక్యత, సుస్థిరత, దాని ప్రాదేశిక సమగ్రత కోరుకుంటున్నామని మన దేశం తెలిపింది. ఈ రెండింటినీ పరిగణించే ఓటింగ్కు దూరంగా వున్నట్టు వివరించింది. అయితే మన పొరుగు దేశంగా వున్న లంకతో లౌక్యంగా వ్యవహరించకతప్పదన్న ఆలోచనే తాజా నిర్ణయానికి కారణమని చెప్పాలి. ఇప్పటికే రాజపక్స సోదరుల ఏలుబడిలో లంక చైనాకు దగ్గరైంది. మన దేశం ఆధ్వర్యంలో సాగుతున్న ప్రాజెక్టులకు అవరోధాలు ఎదురవుతున్నాయి. అక్కడ చైనా పలుకుబడి మరింత పెరగటం భద్రత కోణంలో కూడా మంచిది కాదన్న అభిప్రాయం మన ప్రభుత్వానికుంది. తమిళుల ప్రయోజనాలను కాపాడే రాజ్యాంగ సవరణలను అమలు చేయాలని, లంక ప్రాంతీయ మండళ్లకు ఎన్నికలు జరిపి అధికారాలు వికేంద్రీకరించాలని మన దేశం కోరుతోంది. ఆ విషయంలో లంక సర్కారు అనుకూలంగానే వున్న సూచనలు వచ్చాయి. హక్కుల మండలి వంటి సంస్థల పాక్షిక ధోరణులపై విమర్శలున్నా నరమేథంపై ఇన్నేళ్లయినా నిమ్మకు నీరెత్తినట్టున్న లంక తీరు కూడా సమంజసం కాదు. అంతిమంగా అక్కడి తమిళులకు న్యాయం జరిగేలా, వారు ప్రశాంతంగా జీవనం సాగించేలా రాజపక్స ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. -
హైదరాబాద్కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను ట్రీ సిటీగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఎఫ్ఏవో గుర్తించిందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. ఇది గర్వకారణమని, హరితహారం విజయని అన్నారు. సభ్యులు యాదగిరిరెడ్డి, రేఖా నాయక్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రాన్నే సీఎం రీడిజైనింగ్ చేస్తున్నారని టీఆర్ఎస్ సభ్యుడు యాదగిరిరెడ్డి ప్రశంసించారు. ఇక ఇంద్రకరణ్రెడ్డి సమాధానం చెబుతూ విద్యా సంస్థలను 100 శాతం గ్రీనరీ చేయాలన్న లక్ష్యం ఉందన్నారు. 2015 నుంచి ఇప్పటివరకు 179.08 కోట్ల మొక్కలు నాటామని, పునరుజ్జీవనంతో కలిపి మొత్తం 217 కోట్ల మొక్కలు ఇప్పుడు నిలబడ్డాయన్నారు. విద్యుత్శాఖ అధికారులు చెట్ల కొమ్మలు నరకకుండా ఆదేశాలు ఇస్తామన్నారు. 10,750 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయని, దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదన్నారు. -
కరోనా పేరుతో కుబేర వర్గాల ఆట
ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనేవుంది. నాటకంలోని పాత్రధారుడిలా రోజుకో కొత్త రూపును తీసుకుంటూ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంది. అయితే ఈ అంటువ్యాధి మూలాలను అనుమానాలు తీరేలా ఇంతవరకు ఎవరూ నిర్ధారించలేకపోయారు. కానీ సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న యుద్ధాల బీభత్సంలోంచే సూక్షా్మవతారాలు పుట్టుకొస్తున్నాయని మేధావులు హెచ్చరిస్తున్నారు. దీనికంటే బీభత్సం ఈ ఉధృతిలోనే ప్రపంచ కుబేరులు తమ సంపదను కొండల్లాగా పెంచుకుంటూపోవడం; ప్రపంచంలోని పేద వర్గాల ప్రజలను అన్నిరకాలుగానూ తమ గుప్పిట్లోకి తీసుకోవడం. కోవిడ్ ఇకమీదట ఫ్లూ, ఇన్ఫ్లూయెంజాల మాదిరిగానే సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు కానవస్తున్నాయి. శ్వాసకోశ వ్యాధులన్నీ ఆయా రుతువులను బట్టి, గాలిలో నాణ్యతను బట్టి వస్తాయి. సమశీతోష్ణస్థితి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇలాంటి వ్యాధులు విజృంభి స్తుంటాయి. కరోనా, ఫ్లూ ఇంచుమించుగా ఒకేరకం వ్యాధులు కావడంతో ప్రస్తుత పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారుతుంది. కరోనా వ్యాప్తి గురించి ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేసిన 16 మంది ప్రసిద్ధుల అధ్యయన బృందం వెల్లడించిన తాజా నివేదిక(జెనీవా: 18 మార్చి 2021).ఈ బృందానికి ప్రసిద్ధ శాస్త్రవేత్త జెయిట్ చిక్ నేతృత్వం వహించారు.సరిగ్గా సంవత్సరంగా కోవిడ్–19 వ్యాధి సరికొత్త ‘సూక్ష్మావతారం’గా లక్షల సంఖ్యలో ప్రాణాలు తోడుకుంటూ ఉంది. ఈ అంటువ్యాధి అసలు మూలాలను ఇప్పటికీ శాస్త్రవేత్తలు అనుమానాలకు తావులేకుండా నిర్ధారించలేక పోతున్నారు. అయినా నాటకంలో కొందరు పాత్రధారులు రూపాలు మార్చుకొని ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేసిన విధంగా, వైరస్ తన రూపాలను మార్చుకుంటోంది. కొత్త లక్షణాలతో 5,000 రూపాలు బయట పడుతూండటాన్ని వైద్య శాస్త్రవేత్తలు, క్రిమిశాస్త్ర పరిశోధకులు శ్రద్ధగా గమనిస్తున్నారు. అదే సమయంలో అంతమాత్రాన ఎవరూ అజాగ్రత్తగా ఉండరాదనీ, ఎక్కడికి వెళ్లినా మూతికి ఆచ్ఛాదన (మాస్క్) విధిగా ఉండి తీరాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు చేస్తోంది. ప్రకృతి రీత్యా వాతావరణంలో వచ్చే మార్పులకు తోడు, ప్రపంచ దేశాల సంపదపైన, అస్వతంత్ర, నూతన స్వతంత్ర దేశాలపైన తమ పీడనా దోపిళ్లను కొనసాగించడానికి ప్రపంచ పాత, కొత్త వలస సామ్రాజ్యవాద రాజ్యాలైన బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూని యన్లు దఫదఫాలుగా కొనసాగిస్తున్న యుద్ధాలు కూడా ఎబోలా, సార్స్ లాంటి క్రిములు ప్రకోపించడానికి కారణం అవుతున్నాయి. వర్ధమాన దేశాల సమస్యల పైన సుప్రసిద్ధ పరిశోధకుడైన ప్రొఫెసర్ మైఖేల్ చోసుడొవస్కీ తాజాగా వెల్లడించిన పలు అంశాలు మనకు కనువిప్పు కల్గించేలా ఉన్నాయి. ‘ఏకధ్రువ ప్రపంచం’ పేరిట, దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ పేరిట ఐక్యరాజ్యసంస్థను ఆసరాగా చేసుకొని ప్రపంచ కుబేర వర్గాల తరపున పాత, కొత్త సామ్రాజ్యవాద ప్రభుత్వాలు మరి పదేళ్లలో (2030) ఏం చేయబోతున్నాయో చోసుడొవస్కీ ఇలా వివరించారు: ‘2030 సంవత్సరానికల్లా ప్రపంచ కుబేర వర్గాలు ప్రపంచవ్యాపిత సర్దుబాటు (గ్లోబల్ ఎడ్జెస్ట్మెంట్) పేరిట ప్రపంచ సంపదను తమ గుప్పెట్లోకి గుంజుకోబోతున్నారు. ఆ క్రమంలోనే ఈ కుబేరులు ప్రపంచంలో పెక్కు రంగాలకు చెందిన ప్రజలను దోచేసుకుని శంకరగిరి మాన్యాలు పట్టించనున్నారు!’ అదే సమయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటిరెస్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారిని ఆరోగ్య సంక్షోభానికి మించిన సంక్షోభంగా ప్రకటించారు. కానీ ఈ సంక్షోభానికి అసలు కారణాల్ని విశ్లేషించి, అర్థవంతమైన వివరణను సమితి ప్రజలకు అందించలేకపోయింది. ఇందుకు ఈనాటి ఐక్యరాజ్యసమితి ఉదాసీన వైఖరే ప్రధాన కారణమని చోసుడొవస్కీ కుండబద్దలు కొట్టి చెప్పారు. అయినా 2020 సెప్టెంబర్లో సమితి ప్రపంచ దేశాలకు అందజేసిన నివేదికలోని అంశాలు మన కళ్లు తెరిపించగలగాలి. ‘ఇప్పటికే లక్షలాది మంది ప్రపంచ ప్రజలు తమ జీవితాలను కోల్పోయారు. మరికొన్ని లక్షల కోట్లమంది ప్రజల జీవితాలు కకావికలమైపోయాయి. ఆరోగ్య సమస్యకు తోడు అసంఖ్యాక దేశాలలో, ప్రజల మధ్య విస్తారంగా ఉన్న అసమానతలు పదింతలు పెరిగిపోయాయి. ఫలితంగా వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘజీవులుగా, సమాజాలుగా ఎక్కడికక్కడే జీవనం చెల్లాచెదురై పోయింది. ఇది సమాజంలోని ప్రతీ మనిషిని, చివరికి ఇంకా పుట్టని బిడ్డలపైన కూడా తీవ్ర ప్రభావం కల్గిస్తుంది. దేశాల మధ్య, జాతుల మధ్య ఆ మాటకొస్తే వ్యవస్థల మధ్య ఉన్న బలహీనతల్ని ఇది మరింత ప్రకోపింపజేస్తుంది. పొంచివున్న ఈ సమష్టి ప్రమాదాలకు సమన్వయ పూర్వకమైన ప్రపంచ వ్యాపిత స్పందన అవసరాన్ని ఈ సంక్షోభం కలిగించింది. అయితే, ప్రపంచవ్యాపితంగా, సామాజికంగా ఆర్థికంగా సాగుతున్న వినాశనానికి దారితీసిన ఈ పరిణామాలపైన సమితి భద్రతా సంఘం ఇంతవరకూ చర్చించకుండా మూగనోము పట్టింది. దీనికి కారణం అందులోని అయిదు శాశ్వత సభ్యదేశాలే! కానీ అదే సమయంలో ప్రపంచ కుబేర వర్గాల ప్రయోజనాలను కాపాడే ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ ప్రతిపాదించిన ప్రపంచవ్యాపిత ‘ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య వ్యవస్థ సలహాకు మాత్రం ఐక్యరాజ్యసమితి అప్పనంగా ‘తాతాచార్యుల ముద్ర’ వేసి కూర్చుందని మరచిపోరాదు. అందుకే ప్రొఫెసర్ చోసుడోవస్కీతో పాటు, ప్రొఫెసర్ చామ్స్కీ (ప్రసిద్ధ అమెరికన్ భాషా శాస్త్రవేత్త) కరోనా వైరస్ సామ్రాజ్యవాద పాలకులు సృష్టించిన యుద్ధాల కారణంగా వాతావరణం కలుషితమై పుట్టుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు. జింక్, సి విటమిన్, డి–3, బీటాగ్లుకాన్, ఎన్.ఎ.సి. లాంటి తక్షణ ప్రత్యామ్నాయాల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యభాగ్యం కల్గించవచ్చునని డాక్టర్ పాల్ క్రెగ్ రాబర్ట్స్, మన దేశంలోని సీసీఎంబీ లాంటి పరిశోధనా సంస్థల పలువురు విశ్లేషకులు సూచించారు. అయినా ఈ వైరస్ని ప్రతిఘటించే పేరిట ఔషధ గుత్త కంపెనీలు ‘ఆలసించిన లాభాలకు ఆశాభంగం’ అని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యరంగంలో సాగుతున్న పోరాటం – ధనికవర్గ వ్యవస్థలో పాతుకుపోయిన కొన్ని ఫార్మా కంపెనీలకూ, జనాభాలో ఎక్కువ శాతం ఉన్న అసంఖ్యాక పేద, మధ్యతరగతి ప్రజా బాహుళ్య ప్రయోజనాలకూ మధ్యనేనని గుర్తించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘పునర్వ్యవస్థీకరణ’ అన్నా, ‘ఏకధృవ ప్రపంచం’ అన్నా, క్వాడ్ అన్నా, ఆసియా పసిఫిక్, యూరోపియన్ యూనియన్ కూటమి అన్నా ఒకే తానులోని ముక్కలు. సామ్రాజ్యవాదం మానవ ముఖం తగిలించుకుంటే తప్ప బతికే రోజులు ముగుస్తున్నాయి. సరైన వ్యాక్సిన్ రావడానికి అయిదు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుందని క్రిమిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మూడు దశల పరీక్షలు పూర్తిగా నెగ్గితే గానీ వ్యాక్సిన్ ప్రయోగించరాదని నిపుణులు మొత్తు్తకుంటున్నారు. అయినా ఒక వైపు నుంచి బడా ఫార్మా కంపెనీలు, మరోవైపు నుంచి పాలకవర్గాలు పరస్పర ధన ప్రయోజనాలతో కరోనా కట్టడి పేర బేరసారాలు ప్రారంభించాయి. ఉదాహరణకు కరోనా నంజుడు మొదలైన తర్వాత, సెకండ్ వేవ్ కరోనా ముట్టడించక ముందే 2020 మార్చి 18 నుంచి 2020 అక్టోబర్ 8 మధ్య ఒక అమెరికన్ మహా కోటీశ్వరుడు తన సంపదను 850 బిలియన్ డాలర్లకు పెంచేసుకున్నారని అంచనా. అక్కడే కాదు, మన దేశంలోనూ కోవిడ్ పైనే సమయాన్ని చాటు చేసుకుని సుమారు 40 మంది కోటీశ్వరులు తమ సంపదను కొండలుగా పెంచేశారు. గత పదేళ్లలో పెరిగిన వీరి సంపదకన్నా ఒక్క 2020 కోవిడ్ ఉధృతిలోనే 83 బిలియన్ డాలర్లకు చేరింది. ఈలోగా మరో వైపు నుంచి దొంగ సన్యాసులు కూడా రోగుల్ని మోసగిస్తుంటారని పానుగంటివారి సాక్ష్యం. ఎలా? భగవత్ కటాక్షం ఉంటే రోగికి వైద్యుని అవసరం లేదు. భగవత్ కటాక్షం లేకపోతే వైద్యుని అవసరం లేదు. కాబట్టి అసలు వైద్యుడే అవసరం లేనట్లు కన్పిస్తోందని ఓ ‘విట్టు’గా ఒక సందర్భంలో చమత్కరించారు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రపంచ శాంతి స్థాపనకు భారత్ భారీ సాయం
న్యూయార్క్: ప్రపంచంలో శాంతికాముక దేశం ఏదంటే అందరూ భారత్ను చూపిస్తారు. అలాంటి భారతదేశం ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం శాంతి స్థాపనకు విశేష కృషి చేస్తోంది. ఈ క్రమంలో శాంతి పెంపొందించేందుకు భారతదేశం భారీ సహాయం ప్రకటించింది. ఏకంగా లక్షా 50 వేల డాలర్లు ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ నిధులను ఐక్య రాజ్య సమితికి అందించనున్నట్లు న్యూయార్క్లో జరిగిన వర్చువల్ సమావేశంలో భారత్ తెలిపింది. ప్రపంచంలో శాంతిని పెంపొందించేందుకు ఐక్య రాజ్య సమితి తీవ్రంగా శ్రమిస్తోంది. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడితే శాంతి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఐక్యరాజ్య సమితికి అన్ని దేశాలు నిధులు ఇస్తుంటాయి. ఈ క్రమంలో భారతదేశం లక్షా 50 వేల డాలర్లు ఇస్తున్నట్లు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత బ్రాండ్ అంబాసిడర్ టి.ఎస్.తిరుమూర్తి ప్రకటించారు. ‘‘శాంతి స్థాపనలో మా దేశం ఎప్పుడు ముందుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో శాంతి స్థాపన కార్యక్రమాలకు మా మద్దతును పెంచుకుంటున్నాం. అందులో భాగంగానే శాంతి స్థాపన నిధికి 2021 సంవత్సరానికి గాను లక్షా 50 వేల డాలర్లు ప్రకటిస్తున్నాం’’ అని న్యూయార్క్లో జరిగిన వర్చువల్ సమావేశంలో తిరుమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగానే త్రిమూర్తి 2020లో శాంతిస్థాపనకు జరిగిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం ప్రపంచదేశాల మధ్య శాంతియుత వాతావరణం ఉండాలనేది అందరికీ తెలిసిందే. ప్రధానంగా మూడో ప్రపంచ యుద్ధం అనేది రాకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఐరాస కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భారత్ కీలకంగా పని చేస్తుంది. అందుకే భారతదేశానికి ఐరాసలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశంగా భారత్ కొనసాగుతోంది. -
వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ బిల్లులు రైతుల ఆదాయాలను పెంచేందుకు ఉపకరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడిఉందని ఆయన పేర్కొన్నారు. దేశ ఆహార భద్రతకు మద్దతు ధర వ్యవస్థ కీలకమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భగా 75 రూపాయల ప్రత్యేక నాణేన్ని ఆయన విడుదల చేశారు. దేశ ఆహారభద్రతకు మద్దతు ధర, ఆహారోత్పత్తుల సేకరణ కీలకమని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో మెరుగైన సదుపాయాలతో వీటి నిర్వహణ చేపట్టడం అవసరమని నొక్కిచెప్పారు. ఈ విధానాన్ని కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మద్దతు ధర విధానం కొనసాగిస్తూనే రైతులు వారి ఉత్పుత్తుల విక్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులను బలోపేతం చేసేందుకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనేజేషన్స్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. చదవండి : సొంత కారులేదు.. అప్పులూ లేవు -
ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి
స్టాక్హోం : ఆకలిపై పోరాడుతున్న ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్పీ)కి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలిపై ఊపిరిసలపని పోరు సాగించేందుకు డబ్ల్యూఎఫ్పీ చేపట్టిన సేవలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కిందని నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని డబ్ల్యూఎఫ్పీకి అందించాలని తమ కమిటీ నిర్ణయించిందని నోబెల్ కమిటీ పేర్కొంది. యుద్ధ వివాదాలు, ఘర్షణలు తలెత్తిన ప్రాంతాల్లో శాంతి కోసం మెరుగైన వాతావరణం ఏర్పడేందుకు డబ్ల్యూఎఫ్పీ కృషి సాగించిందని తెలిపింది. దీంతో పాటు ఆకలిని యుద్ధ ఆయుధంగా మలుచుకునే చర్యలను నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలకు గాను డబ్ల్యూఎఫ్పీకి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించామని నోబెల్ కమిటీ ట్వీట్ చేసింది. డబ్ల్యూఎఫ్పీ ఏటా 88 దేశాల్లోని 9.7 కోట్ల మంది ప్రజలకు సాయపడుతోందని తెలిపింది. ఇక ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తినడానికి సరిపడినంత ఆహారం లేక బాధపడుతున్నారని పేర్కొంది. డిసెంబర్ 10న ఓస్లోలో జరిగే కార్యక్రమంలో 11 లక్షల డాలర్ల ప్రైజ్ మనీతో పాటు శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు. కరోనా వైరస్తో ఆకలితో అలమటించే బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్పీ సేవలు కొనియాడదగినవని నోబెల్ కమిటీ చీఫ్ బెరిట్ రీస్-అండర్సన్ ప్రశంసించారు. చదవండి : బలహీనతను బలంగా వినిపించే కవిత్వం -
ఈ రోజే ఫ్రెండ్షిప్ డే ఎందుకు?
అన్నింటికంటే పవిత్రమైన బంధం స్నేహబంధం. భూమ్మిద ఉండే ఏ బంధంలోనైనా స్నేహం ఉంటుంది. ఈ బంధానికి ఎల్లలు ఉండవు. తల్లిదండ్రులకు పిల్లల మధ్య, సోదరుల మధ్య ఆఖరికి భార్యభర్తల మధ్య కూడా స్నేహం ఉంటుంది. అంతటి గొప్ప స్నేహ బంధానికి గుర్తుగా ప్రతి ఏడాది ‘స్నేహితుల దినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఫ్రెండ్షిప్ డేని ప్రపంచ దేశాలు ఒకేరోజు జరుపుకోవు. ఒక్కోదేశం ఒక్కోరోజు జరుపుకుంటుంది. భారతదేశం, అమెరికాతో సహా చాలా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్స్ షిప్ డే జరుపుకుంటాయి. కానీ మిగతా దేశాల్లో కొన్ని జులై 30న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. జూలై 30న స్నేహితుల దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని మొదటిసారిగా 1958 జూలై 30 డాక్టర్ రామోన్ ఆర్టెమియా ప్రతిపాదించారు. ఈయన బ్రాచో పరాగ్వేలోని అసున్స్యోన్కు ఉత్తరాన 200 మైళ్ల దూరంలో పరాగ్వే నదిపై ఉన్న ప్యూర్టొ పినాస్కో అనే పట్టణంలో జూలై 30న స్నేహితుల కోసం విందును ఏర్పాటు చేశాడు. ఈ విందు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది జూలై 30న ‘స్నేహితుల దినోత్సంగా’ నిర్వహించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. అప్పుడే ‘స్నేహితుల దినోత్సవం’ అనే ప్రత్యేక రోజు పుట్టింది. ఈ రోజున జాతి, రంగు, కుల, మత బేధాలు లేకుండా మనుషులంతా స్నేహ భావంతో మెలిగేందుకు ప్రతికగా స్నేహితుల దినోత్సవం పుట్టింది. అప్పటి నుంచి పరాగ్వేలో ప్రతి ఏటా జూలై 30 స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితిగా మారింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రపంచ రాయబారి,సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ భార్య నానే అన్నన్ 1998 జూలై 30ను అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రతిపాదించారు. అనంతరం ఏప్రిల్ 27 2011న ఐక్యరాజ్యసమితి జూలై 30ని ‘ప్రపంచ స్నేహితుల దినోత్సవంగా’ ప్రకటించింది. యుఎన్ఓ ప్రతిపాదనను చాలా దేశాలు కూడా స్వీకరించాయి. అయినప్పటికి కొన్ని దేశాలు ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ఈ తేదికి ముందు లేదా తర్వాత ఫ్రెండ్షిప్ డేను సెలబ్రెట్ చేసుకుంటున్నాయి. భారత్, అమెరికా, ఐరోపా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటుండగా.. ఒబెరిన్, ఓహీయో దేశాలు ఏప్రిల్ 9న, నేపాల్ జూలై 30న ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవాన్ని ప్రతిష్టాత్మంగా జరుపుకుంటున్నాయి. -
భద్రతా మండలికి భారత్
ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో అత్యంత శక్తిమంతమైన భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలకు జరిగిన ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 193 సభ్య దేశాలు కలిగిన భద్రతా మండలిలో భారత్కు అనుకూలంగా 184 ఓట్లు వచ్చాయి. బుధవారం జరిగిన భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఆసియా పసిఫిక్ ప్రాంతం కేటగిరీలో ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో భారత్తో పాటుగా ఐర్లాండ్, మెక్సికో, నార్వే దేశాలు ఎన్నికయ్యాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. మిగిలిన దేశాల సభ్యత్వం కోసం ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి పోలింగ్లో 192 దేశాలు పాల్గొన్నాయి. భద్రతా మండలికి ఎన్నిక కావాలంటే మూడింట రెండోవంతు మెజార్టీ సాధించాలి. అంటే 128 దేశాలకు మద్దతు పలకాలి. భారత్కు 184 దేశాల నుంచి మద్దతు లభించడంలో విజయబావుటా ఎగురవేసింది. శాంతిస్థాపన, సమానత్వానికి కృషి: మోదీ భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ సాధించిన అద్భుత విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో శాంతి స్థాపన, భద్రత, సమానత్వం నెలకొల్పడంలో సభ్యదేశాలతో కలిసి పని చేస్తామన్నారు. జనవరి నుంచి రెండేళ్ల పాటు భద్రతా మండలి ఎన్నికల్లో ఆసియా పసిఫిక్ దేశాల తరఫున పోటీ పడడానికి చైనా, పాకిస్తాన్ సహా 55 దేశాలున్న కూటమి భారత్ని గత ఏడాది జూన్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంది. భద్రతా మండలిలో భారత్ సభ్యత్వం 2021–2022 వరకు రెండేళ్ల పాటు కొనసాగనుంది. జనవరి 1 నుంచి అయిదు శాశ్వత సభ్యదేశాలు, తాత్కాలిక సభ్య దేశాలైన ఈస్టోనియా, నైజర్, సెయిర్ విన్సెండ్, గ్రెనాడిన్స్, ట్యునీసియా, వియత్నాం దేశాలతో కలిసి సమావేశాలకు భారత్ హాజరుకానుంది. బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా దేశాల పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగిసిపోనుంది. భారత్ ఇప్పటివరకు ఏడుసార్లు ఎన్నికైంది. ఉగ్రవాదమే ప్రధాన లక్ష్యం ఐక్యరాజ్యసమితిలో శక్తివంతమైన భద్రతా మండలి ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యలను మరింత విస్తృతం చేస్తామని కేంద్రం తెలిపింది. ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించే ప్రక్రియ రాజకీయాల కారణంగా నిర్వీర్యం కాకుండా చూడటమే లక్ష్య ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఆంక్షలు విధించే విషయంలోనూ రాజకీయాలకు తావు లేకుండా చేస్తామని తెలిపింది. మండలిలో ప్రాతినిధ్యం లేని దేశాల గళం వినిపించడంలో భారత్ ముందుంటుం దన్నారు. భారత్ భద్రతా మండలికి ఎన్నిక కావడంపై విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ ఈ మేరకు స్పందించారు. -
ఐరాసలో భారత్ విజయం: మోదీ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ ఎన్నికల్లో భారత్ విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఐరాస ఎన్నికల్లో ఎలాంటి పోటీలేకుండా భారత్ విజయం సాధించడం గొప్ప పరిణామం అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించిన మోదీ.. తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. శాంతి, సామరస్యత, సమానత్వం, భద్రత వంటి అంశాలపై పోరాటంలో భారత తన పంథాను కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు. కాగా బుధవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో మొత్తం 193 ఓట్లు పోలవ్వగా భారత్కు 184 ఓట్లు దక్కాయి. దీంతో రెండేళ్ల పాటు (2021-22 ) ఆ స్థానంలో కొనసాగనుంది. (ఐరాస ఎన్నికల్లో భారత్ విజయం) -
ఐరాస ఎన్నికల్లో భారత్ విజయం
సాక్షి, న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వపు ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి)లో భారత్కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. దీంతో రెండేళ్లపాటు (2021–22) భారత్ కొనసాగనుంది. ఐరాసలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది ఐరాసలో అత్యంత శక్తిమంతమైన విభాగం భద్రతా మండలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల పరిరక్షణను ఇదే పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉంది. సమితిలో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉండగా, మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్), పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. శాశ్వత సభ్యదేశాలకు ‘వీటో’ అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తుంది. మండలిలో కీలక నిర్ణయాలకు కనీసం 9 సభ్యదేశాల ఆమోదం అవసరం. అయితే ఏదైనా నిర్ణయానికి అవసరమైనన్ని సభ్యదేశాల ఆమోదం ఉన్నప్పటికీ.. శాశ్వత సభ్యదేశాల్లో ఏదైనా దేశం వ్యతిరేకించి వీటో చేస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా, చైనా అందుకు మోకాలడ్డుతోంది. Member States elect India to the non-permanent seat of the Security Council for the term 2021-22 with overwhelming support. India gets 184 out of the 192 valid votes polled. pic.twitter.com/Vd43CN41cY — India at UN, NY (@IndiaUNNewYork) June 17, 2020 -
భద్రతా మండలిలో ఎన్నికల సందడి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో ఐదు తాత్కాలిక సభ్యదేశాల నియామక ప్రక్రియ మొదలైంది. 75వ ఐక్యరాజ్యసమితి సమావేశాల అధ్యక్షుడిని ఎంపిక చేయడంతోపాటు సామాజిక, ఆర్థిక మండలి సభ్యుల నియామకానికి కూడా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బుధవారం నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో తమకు స్పష్టమైన విజయం లభించడం ఖాయమని భారత్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో విజయం సాధిస్తే రెండేళ్లపాటు (2021–22) ఐరాస భద్రతా మండలిలో భారత్కు తాత్కాలిక సభ్యదేశ హోదా లభిస్తుంది. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేస్తోంది కాబట్టి గెలుపు తథ్యమే. భారత్ 1950–51, 1967–68, 1972–73, 1077–78, 1984–85, 1991–92, 2011–22లో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది. -
నమస్తేతో ఐక్యరాజ్యసమితికి అక్బరుద్దీన్ వీడ్కోలు
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత కీర్తిప్రతిష్టలు మరింత పెరిగేలా తన పదునైన మాటలతో ఆకట్టుకున్న భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం రిటైర్ అయ్యారు. ముఖ్యంగా ఐరాసాలో భారత్పై పాక్ తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతీసారి పాక్ ప్రతినిధులనోట మాట రాకుండా సయ్యద్ కడిగిపారేసేవారు. 1985 బ్యాచ్కు చెందిన ఈ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెన్ సర్వీస్) అధికారి 2016 జనవరి నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సయ్యద్ తర్వాత ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఇక తన వీడ్కోలు సందర్భాన్నికూడా కరోనావ్యాప్తిని అరికట్టడానికి వీలుపడే ఓ మంచి సూచనను ఇవ్వడానికి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రయత్నించారు. వీడియో కాల్ ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్కు భారత సంప్రదాయ పద్దతిలో నమస్కరించి తన విధులనుంచి తప్పుకున్నారు. నమస్కరించడానికి సమయం ఆసన్నమైంది అంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుటెరస్కు నమస్కరిస్తున్న వీడియోను తన ట్విటర్ఖాతాలో సయ్యద్ పోస్ట్ చేశారు. తన విధులనుంచి తప్పుకునే ముందు ఓ చిన్న విన్నపం అంటూ గుటేరస్కు విజ్ఞప్తి చేశారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎవరినైనా కలిసినప్పుడు లేదా వీడ్కోలు సమయాల్లో హలోగానీ, షేక్ హ్యాండ్వంటివి కాకుండా నమస్తే అని చెబుతారు. అందుకే ఇప్పుడు కూడా నమస్తే చెప్పాలని అనుకుంటున్నాను అని గుటెరస్తో సయ్యద్ అన్నారు. దీనికి చిరునవ్వుతో నమస్తే అంటూ గుటెరస్కూడా బదులిచ్చారు. Time to bow out, with the usual🙏🏽 pic.twitter.com/BM6m7j7qQW — Syed Akbaruddin (@AkbaruddinIndia) April 30, 2020 -
కోవిడ్ -19 విధ్వంసం : పేదరికం గుప్పిట్లోకి 40 కోట్ల మంది
ఐక్యరాజ్యసమితి : కరోనా మహమ్మారి విధ్వంసంతో భారత్లోని అసంఘటిత రంగంలో పనిచేసే 40 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కరోనావైరస్ మహమ్మారి అతిపెద్ద అంతర్జాతీయ సంక్షోభమని ఐఎల్ఓ-మానిటర్ రెండో ఎడిషన్ : కోవిడ్-19 పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపారాలు, కార్మికులపై కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపుతుందని తెలిపింది. ఈ మహమ్మారి ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు మనం వేగంగా, నిర్ణయాత్మకంగా ముందుకు సాగాలని పిలుపు ఇచ్చింది. సరైన సమయంలో సరైన తక్షణ చర్యలు చేపడితేనే వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుకోగలుగుతామని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ అన్నారు. ప్రపంచవ్యాపంగా 200 కోట్ల మంది ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, వీరంతా కోవిడ్-19 విసిరిన సవాళ్లతో ముప్పును ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, నైజీరియా, బ్రెజిల్ సహా పలు దేశాల్లోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది సిబ్బంది, కార్మికులు లాక్డౌన్ ఇతర నియంత్రణలతో ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఐఎల్ఓ వెల్లడించింది. చదవండి : మోదీ చాలా గొప్పవారు.. మంచివారు: ట్రంప్ భారత్లో అసంఘటిత రంగంలో పనిచేసే దాదాపు 40 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోయే ముప్పు నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో చేపట్టిన లాక్డౌన్ చర్యలతో భారత్లో పెద్దసంఖ్యలో అసంఘటిత రంగ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లోని తమ స్వస్ధలాలకు వెనుతిరిగారని పేర్కొంది. అంతర్జాతీయ సహకారానికి గడిచిన 75 ఏళ్లలో ఇదే అతిపెద్ద పరీక్షగా ముందుకొచ్చిందని, ఏ ఒక్క దేశం కుప్పకూలినా ఇతర దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. సరైన చర్యలతో కోవిడ్-19 పెను ప్రభావాన్ని పరిమితం చేయవచ్చని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పనిగంటలు, రాబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. -
కరోనాపై కలసికట్టుగా పోరాడుదాం
వాషింగ్టన్/మాడ్రిడ్/రోమ్/బ్రిటన్/జెనీవా: ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఇల్లు కదలడం లేదు. స్పెయిన్, అమెరికా, బ్రిటన్లో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 188 దేశాల్లో కరోనా విస్తరించడంతో ప్రపంచమే చిగురుటాకులా వణికిపోతోంది. కేసుల సంఖ్య 10 లక్షల 50 వేలకి చేరువలో ఉంటే, మృతుల సంఖ్య 55 వేలు దాటేసింది. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కరోనాను తరిమికొట్టాలని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని రూపొందించింది. తీవ్రంగా ప్రాణనష్టం, ఆర్థిక నష్టం కలిగిస్తున్న కోవిడ్–19పై యూఎన్ తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. ‘‘కోవిడ్–19 వ్యాధిపై పోరాటానికి ప్రపంచ దేశాల సంఘీభావం’’అన్న పేరుతో రూపొందించిన ఈ తీర్మానంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇంకా చర్చించాల్సి ఉంది. ప్రపంచ ప్రజల ఆరోగ్యం, భద్రతపై ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయని తీర్మానం పేర్కొంది. ఎక్కడివారక్కడే ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అసాధారణంగా చూపిస్తున్న ప్రభావం, చాలా మంది జీవనోపాధిని కోల్పోవడంతో వీటిపై అందరూ సమష్టిగా పోరాటం చేయాలని ఆ తీర్మానం పేర్కొంది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మానవ హక్కులు, ప్రజలు ఎదుర్కొనే ఒత్తిళ్లను గౌరవించాలని, ఎలాంటి వివక్ష తావులేకుండా అన్ని దేశాలు పని చేయాలని పేర్కొంది. ట్రంప్కు కరోనా నెగెటివ్.. 15 నిమిషాల్లోనే ఫలితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వైట్ హౌస్ ఊపిరిపీల్చుకుంది. అత్యంత ఆధునిక కరోనా ర్యాపిడ్ పాయింట్ కిట్తో నిర్వహించిన ఈ వైద్య పరీక్షలో ఫలితం కేవలం 15 నిమిషాల్లోనే వచ్చిందని అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు సీన్ కోన్లీ చెప్పారు. శాంపిల్ కలెక్షన్కి ఒక్క నిమిషం పడితే మరో పావుగంటలోనే ఫలితం తేలిందన్నారు. నెలరోజులు ఇల్లు కదలొద్దు అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్లందరూ మరో నాలుగు వారాలు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరానికి మించిన పరిష్కార మార్గం లేదని అన్నారు. ‘‘దేశ పౌరుల ప్రాణాలు కాపాడాలి. స్వీయ నియంత్రణ మీదే మన భవిష్యత్ ఆధారపడి ఉంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇల్లు కదలకుండా ఉండండి. మరో నెల రోజులు ఇలా చేస్తే మనం కరోనాపై యుద్ధంలో గెలుస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాలన్నీ పాటించండి’’అని ప్రజలకు ఆయన హితవు పలికారు అమెరికాలో కేసుల సంఖ్య 2 లక్షల 35వేలు దాటిపోగా, ఇప్పటివరకు 5,800 మంది ప్రాణాలు కోల్పోయారు. గాలి ద్వారా వ్యాపించదు కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే ఈ వైరస్ సోకుతుందని తన తాజా మ్యాగజైన్లలో స్పష్టం చేసింది. ఈ తుంపర్లు ఏదైనా వస్తువులపై పడితే వాటినుంచి కూడా మనుషులకు సోకుతుందని తెలిపింది. ఇటీవల కాలంలో కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని కొన్ని పరిశోధనలు తేటతెల్లం చేసిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ విషయంపై వివరణ ఇచ్చింది. చైనాలో 75 వేల మంది కరోనా వ్యాధిగ్రస్తుల్ని పరిశీలించిన తర్వాత ఈ విషయంపై ఒక నిర్ధారణకు వచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ► బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనాతో ఇంకా బాధపడుతున్నారు. తనకు ఇంకా జ్వరం తగ్గలేదని అందుకే నిర్బంధంలోనే ఉన్నానని సోషల్ మీడియా వేదికగా జాన్సన్ వెల్లడించారు. ► కరోనా కోరల్లో చిక్కుకొని జర్మనీ విలవిల్లాడుతోంది. చైనాను మించిపోయేలా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజుల్లో 6 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తంగా కేసుల సంఖ్య 84 వేలు దాటేసింది. ఇక గురువారం ఒక్క రోజే 140 మంది మరణించారు. ► స్పెయిన్లో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. గత 24 గంటల్లో 900 మందికిపైగా మరణించారు. అయితే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశం ► కరోనా మృతుల్లో మొదటి స్థానంలో ఉన్న ఇటలీలో వైద్య రంగంపై తీవ్రమైన పని ఒత్తిడి పడింది. దీంతో 10 వేల మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 69 మంది డాక్టర్లు మరణించారు. ► కరోనా మృతులకు నివాళులర్పించడానికి దేశవ్యాప్తంగా శనివారం సంతాపదినంగా చైనా పాటించనుంది. వైరస్ను తొలిసారిగా గుర్తించి ప్రాణ త్యాగం చేసిన డాక్టర్ లీ సహా 3,300 మందికి పైగా మరణించారు. వీరి మృతికి నివాళులర్పించడానికి జాతీయ సంతాపం దినంగా పాటించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. -
‘ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోబోతున్నాం’
న్యూయార్క్ : రాబోయే రోజుల్లో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోబోతున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్దం తరువాత ఇలాంటి పరిస్థితిని ప్రపంచం ఎప్పుడు చూసి ఉండదని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఆర్ధిక రంగంపై అత్యధికంగా ఉందని, కనీవినీ ఎరుగని ఆర్ధికమాంద్యాన్ని ప్రపంచం చూడబోతుందన్నారు. ఈ స్ధాయి ఆర్ధిక మాంద్యాన్ని ఎప్పుడు చూసి ఉండరని అంచనా వేశారు. కరోనా వైరస్ ప్రభావం అత్యంత అస్థిరత, ఆశాంతి, ఆందోళనలకు దారితీయబోతుందని చెప్పారు. సామాజికార్ధిక పరిస్థితులపై కరోనావైరస్ ప్రభావంపై నివేదిక విడుదల చేసే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రపంచదేశాలు కలిసికట్టుగా కరోనా వైరస్పై పోరాటం చేయాల్సిన సమయమని అన్నారు. రాజకీయ విషయాలు పక్కన పెట్టిన మానవాళిని రక్షించుకోవడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఈ స్ధాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నివేదికలో అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆరోగ్యరంగాకే పరిమితం కాకుండా అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ మానవ సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. (కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు) కరోనాను ఎదుర్కోవడానికి ఎవరికి వారు సొంత ఎజెండాలతో ముందుకు సాగుతున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు లేని దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని తరిమి కొట్టగలమని అభిప్రాయపడ్డారు. -
ఢిల్లీ ప్రశాంతం..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వణికించిన అల్లర్లు గురువారానికి కొంతవరకు సద్దుమణిగాయి. మౌజ్పూర్, భజన్పురల్లో చోటు చేసుకున్న చెదురు మదురు ఘటనలు మినహా అల్లర్లకు కేంద్ర స్థానమైన ఈశాన్య ఢిల్లీ ప్రశాంతంగానే ఉంది. అల్లర్లను కట్టడి చేసే ప్రత్యేక బాధ్యతల్లో ఉన్న జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ గురువారం కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాగా, అల్లర్ల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మరణించిన వారి సంఖ్య గురువారానికి 38కి చేరింది. బయట ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో అత్తగారింట్లోనే పెళ్లితంతు పూర్తిచేస్తున్న పెళ్లికొడుకు జోహ్రి ఎన్క్లేవ్ ప్రాంతంలోని ఓ మురుగు కాలువలో గురువారం ఉదయం ఒక మృతదేహాన్ని గుర్తించారు. మౌజ్పుర్, భజన్పురల్లో పలు చోట్ల వాహనాలను, దుకాణాలను తగలబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ అల్లర్ల కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. అల్లర్ల కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా రెండు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. డీసీపీలు జోయ్ టిర్కే, రాజేశ్ డియోల నేతృత్వంలో ఆ ప్రత్యేక దర్యాప్తు బృందాలు పని చేయనున్నాయి. ఆప్ నుంచి అల్లర్ల నిందితుడి సస్పెన్షన్ అల్లర్లకు సంబంధించి 48 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని ఢిల్లీ హైకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే, ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కాగా, ఇంటలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ హత్యలో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సెలర్ తాహిర్ హుస్సేన్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, తాహిర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. ప్రశాంతమే కానీ.. ఉద్రిక్త వాతావరణం ఈశాన్య ఢిల్లీలో గురువారం సైతం చాలా ప్రాంతాల్లో దుకాణాలు మూతబడి ఉన్నాయి. పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న చోట్ల ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని కుటుంబాలు ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవడం కనిపించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం ముజఫరాబాద్, మౌజ్పూర్, చాంద్బాగ్, గోకుల్పురి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు. భద్రతాబలగాలు అండగా ఉంటాయని వారికి అజిత్ ధోవల్ భరోసా ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు కవాతు చేపట్టారు. భద్రతాబలగాలను భారీ స్థాయిలో మోహరించారు. మృతదేహాలను తీసుకువచ్చేందుకు వచ్చిన కుటుంబీకులతో, క్షతగాత్రుల బంధువులతో జీటీబీ ఆసుపత్రి వద్ద గురువారం విషాద వాతావరణం నెలకొంది. 10 రోజుల కిత్రమే పెళ్లి జరిగిన అష్ఫాక్ హుస్సేన్ మృతదేహం వద్ద కుటుంబీకుల రోదనలు అక్కడున్నవారికి కన్నీళ్లు తెప్పించాయి. ఎలక్ట్రీషియన్గా పనిచేసే అష్ఫాక్ ఇంటికి తిరిగివస్తుండగా మంగళవారం గోకుల్పురి వద్ద దుండగుల కాల్పులకు గురయ్యారు. ఐరాస ఆందోళన భారత ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఢిల్లీలో మత ఘర్షణల్లో పోలీసుల ప్రేక్షకపాత్రపై ఐరాస మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. హింసను నివారించేందుకు కృషి చేయాలని రాజకీయ పార్టీల నేతలను కోరింది. జమ్మూకశ్మీర్లో పరిస్థితులనూ ప్రస్తావించింది. జెనీవాలో జరుగుతున్న మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో ఐరాస మానవ హక్కుల కమిషనర్ మిచెల్ బాచ్లెట్ ఈ అంశాలను లేవనెత్తారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఈశాన్య ఢిల్లీలో కొనసాగుతున్న ఘర్షణల్లో్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందజేస్తామని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయ్యే వైద్య చికిత్స ఖర్చులను కూడా తమ ప్రభుత్వం భరిస్తుందన్నారు. గృహ దహనాల్లో కీలక పత్రాలను కోల్పోయిన ప్రజలకు తిరిగి వాటిని అందజేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం నిర్మానుష్యంగా మారిన ఈశాన్య ఢిల్లీలోని ఓ ప్రధాన రహదారి రాష్ట్రపతిని కలసిన కాంగ్రెస్ ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని నిందిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి కోవింద్ను కలిశారు. ఢిల్లీ హింసకి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరారు. ఘర్షణల సమయంలో ఆయన తన విధి నిర్వహణలో పూర్తిగా విఫలం చెందారని , కేంద్రం తన రాజధర్మాన్ని పాటిస్తూ అమిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో మన్మోహన్, ఆజాద్, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, ఖర్గే తదితరులు ఉన్నారు. కేసులో కేంద్రం ఇంప్లీడ్ స్పందనకు కేంద్రానికి 4 వారాల గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కేసులు నమోదు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో గురువారం కేంద్రప్రభుత్వమూ ఇంప్లీడ్ అయింది. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రం పరిధిలోని అంశం కనుక, కేంద్ర హోం శాఖ కక్షిదారుగా చేరేందుకు అనుమతించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ విజ్ఞప్తిని ఢిల్లీహైకోర్టు సీజే డీఎన్ పటేల్, జస్టిస్ హరిశంకర్ల బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి 4 వారాల గడువిచ్చింది. అవి నెల క్రితం ప్రసంగాలు బీజేపీ నేతలు చేసినట్లుగా చెపుతున్న విద్వేష ప్రసంగాలు దాదాపు నెల రోజుల కిత్రం నాటివని సొలిసిటర్ జనరల్ తుషార్ కోర్టుకు తెలిపారు. అయినా, ఇది అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొంటూ పిటిషన్దారులు బుధవారం జస్టిస్ మురళీధర్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ను తీసుకువచ్చారన్నారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ముందు ఈ పిటిషన్ గురువారం విచారణకు రానున్నప్పటికీ.. వారు అత్యవసరంగా జస్టిస్ మురళీధర్ ధర్మాసనాన్ని ఆశ్రయించారన్నారు. ఢిల్లీలో ప్రశాంత పరిస్థితిని నెలకొల్పేందుకు అంతా కృషి చేస్తున్నారని, ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. విద్వేష ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది రాహుల్ మెహ్రా.. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సరైన ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. జస్టిస్ మురళీధర్ బదిలీ బుధవారం బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించిన జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్ మురళీధర్ ఆదేశించడం తెల్సిందే. జస్టిస్ మురళీధర్తో పాటు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి రంజిత్ వసంత్రావు మోరె, కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ రావి విజయ్కుమార్ మాలిమత్లను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించాక రాష్ట్రపతి ఈ బదిలీలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టులో మూడో సీనియర్ జడ్జి. సీఏఏ నిరసనకారులపై విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మలపై కేసులను నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని జస్టిస్ మురళీధర్ తీవ్రంగా తప్పుబట్టారు. కొందరిని రక్షించేందుకే.. ఢిల్లీ అల్లర్ల కేసు నుంచి కొందరు బీజేపీ నేతలను రక్షించేందుకే జస్టిస్ మురళీధర్ను బదిలీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. న్యాయవ్యవస్థపై కేంద్రం బెదిరింపు ధోరణికి పాల్పడుతోందని స్పష్టమైందని విమర్శించింది. ఈ బదిలీ న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని, న్యాయాన్ని అణచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. గతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జస్టిస్ లోయాను ఒక ట్వీట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు సిఫారసుల మేరకే.. జస్టిస్ మురళీధర్ బదిలీ సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 12న చేసిన సిఫారసుల మేరకే జరిగిందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు. సాధారణ పరిపాలనాపరమైన బదిలీని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సాధారణంగా, సంబంధిత న్యాయమూర్తి నుంచి అనుమతి తీసుకున్న తరువాతే బదిలీ చేస్తామన్నారు. ‘కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారు. అందుకే దేశ అత్యున్నత వ్యవస్థలను నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’ అన్నారు. జస్టిస్ లోయాను రాహుల్ గాంధీ ప్రస్తావించడంపై స్పందిస్తూ.. ‘రాహుల్ సుప్రీంకోర్టు కన్నా తానే ఎక్కువ అనుకుంటాడు’ అని ఎద్దేవాచేశారు. జడ్జి బదిలీకి సంబంధించి ఫిబ్రవరి 12న సుప్రీం కొలీజియం సిఫారసులు చేసిందని, ఈ నిర్ణయం ఇప్పుడు ఆకస్మికంగా తీసుకున్నది కాదని కేంద్రమంత్రి జవదేకర్ వివరించారు. -
ఆ దేశాలు తప్ప.. మిగిలినవన్నీ..
గ్రెటా థన్బర్గ్.. ఈ పేరు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. స్పీడన్ దేశానికి చెందిన ఈ బాలిక.. ‘‘మీ అవసరాల కోసం మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీకెంత ధైర్యం’’ అంటూ ప్రపంచ దేశాలను ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రశ్నించింది. అభివృద్ది పేరుతో విచ్చలవిడిగా కార్భన్ ఉద్గారాలను విడుదల చేస్తూ పోతున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటని నిలదీసింది. కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పులు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న వేళ.. ఇందుకు సంబంధించిన తాజా నివేదిక.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ప్రపంచంలోని చాలా సంపన్న దేశాలు భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ తమ తాజా నివేదికలో తెలిపాయి. గ్లోబల్ వార్మింగ్, కర్భన ఉద్గారాలు భావితరాల ఆరోగ్యంపై, అభివృద్దిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ప్రపంచంలోని ఏ దేశం కూడా పిల్లల అభివృద్ధి, భవిష్యత్తు, సమానత్వం విషయంలో సత్ఫలితాలను సాధించలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ది లాంసెట్ జర్నల్, యునిసెఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక కమిషన్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం నార్వే, సౌత్ కొరియా, నెదర్లాండ్లో పిల్లలకు ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం లభిస్తున్నాయని వెల్లడించింది. అధిక పరిమాణంలో ఉద్గారాలను వెదజల్లుతున్న అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం ఈ విషయంలో వెనుకంజలో ఉన్నాయని పేర్కొంది. కమిషన్ సభ్యులు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలకు ఆరోగ్యం, విద్య, రక్షణ కల్పించడమే కాకుండా వారికి సురక్షిత భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రపంచ దేశాలపై ఉందని పేర్కొన్నారు. గత ఐదు శతాబ్దాలుగా బాలల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని.. అయితే అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరిగాయని తెలిపారు. మరోవైపు భూగోళం వేడెక్కడం, పర్యావరణానికి హాని కలిగించడం భవిష్యత్ తరాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయని నివేదికలో తెలిపారు. పర్యావరణ క్షీణత పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుపై అత్యంత ప్రభావం చూపుతుందని కమిషన్ సభ్యులు సునీత నారయణ్ పేర్కొన్నారు. చేయని తప్పునకు వారు బలికాబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక విప్లవం తరువాత ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగాయని తెలిపారు. ఆఫ్రికాలోని రెండు దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాలు పిల్లల ఆరోగ్యం, విద్య విషయంలో వెనుకబడి ఉన్నాయని రిపోర్టులో తెలిపారు. -
‘ముందు ఉగ్రమూకను ఖాళీ చేయించండి’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్పై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్స్ చేసిన ప్రతిపాదనను భారత్ తోసిపుచ్చింది. కశ్మీర్పై మధ్యవర్తిత్వానికి సుముఖంగా లేమని, పొరుగుదేశం బలవంతంగా, అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఖాళీ చేసేలా ఐరాస దృష్టిసారించాలని కోరింది. కాగా జమ్ము కశ్మీర్లో పరిణామాలపై తాను తీవ్రంగా కలత చెందానని, ఇరు దేశాలు అంగీకరిస్తే కశ్మీర్పై మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ఐరాస చీఫ్ గుటెర్స్ పాక్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై భారత్ ఈ మేరకు స్పందించింది. మరోవైపు జమ్ముకశ్మీర్పై తమ విధానంలో ఎలాంటి మార్పూ లేదని, కశ్మీర్ భారత్ అంతర్భాగమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంలో ద్వైపాక్షిక సంప్రదింపులు మినహా మరెవరి జోక్యానికీ తావు లేదని తేల్చిచెప్పారు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం నిర్మూలించే దిశగా ఐరాస దృష్టిసారించాలని కోరారు. చదవండి : ఐరాసలో పాక్కు మళ్లీ భంగపాటు -
ఐరాసలో పాక్కు మళ్లీ భంగపాటు
ఐక్యరాజ్యసమితి: భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు భంగపాటు ఎదురైంది. చైనా సాయంతో వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్ ప్రయత్నించగా మండలిలో మిగిలిన సభ్యులెవరూ మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలిపోయింది. కశ్మీర్ అంశం ద్వైపాక్షికమైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ‘పాక్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి వేదికగా పదేపదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు’’అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘పాక్ ప్రయత్నమంతా దృష్టి మరల్చేందుకేనని మిగిలిన సభ్యులు గుర్తించడం సంతోషకరం. సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక పద్ధతులు ఉన్నాయని భద్రత సమితి సభ్యులు పాక్కు గుర్తు చేశారు’అని ఆయన వివరించారు. దురుద్దేశపూర్వక ఆరోపణలు చేయడం పాక్కు అలవాటేనని, సమితి సభ్యులు సూచించినట్టుగా సమస్యల పరిష్కారానికి కొన్ని కష్టమైన చర్యలు తీసుకోవడమే ఆ దేశానికి మేలని ఆయన అన్నారు. చైనా దౌత్యవేత్త ఝాంగ్ జున్ మాట్లాడుతూ ‘కశ్మీర్పై సమావేశం జరిగింది. భారత, పాక్ అంశం ప్రతి సమావేశంలోనూ ఉంటుంది. దీంతో భద్రతామండలి దీనిపై కొంత సమాచారం తెలుసుకుంది’అని పేర్కొనడం గమనార్హం. ఎస్సీఓ భేటీకి ఇమ్రాన్కూ ఆహ్వానం న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) వార్షికభేటీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ సహా పలువురు నేతలకు భారత్ ఆహ్వానం పంపనుంది. ఎస్సీవోలోని పాకిస్తాన్ సహా 8 సభ్య దేశాలు, నాలుగు పరిశీలక హోదా దేశాలనూ ఆహ్వానిస్తామని విదేశాంగ శాఖ మంత్రి రవీశ్ కుమార్ వెల్లడించారు. ‘గతం’ నుంచి భారత్ బయటపడాలి గత అనుభవాలు, ఆలోచనల చట్రంలో బందీగా ఉన్న భారత్, వాటి నుంచి బయటకు రావాల్సి ఉందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. కీలక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో దేశం ప్రస్తుతం కొత్త వైఖరిని అనుసరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అయితే, తనను తాను స్వతంత్రంగా నిర్వచించుకుంటుందా లేక ఆ అవకాశాన్ని ఇతరులకు ఇస్తుందా అనేదే అసలైన ప్రశ్న అన్నారు. ఇందులో స్వతంత్ర వైఖరికే తనతోపాటు తమ పార్టీ మొగ్గుచూపు తాయని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంలో జరుగుతున్న ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలపై అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పోరాటం సాగించాలన్నారు. ఈ పోరులో ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను భాగస్వాములను కానీయరాదని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ మాట్లాడుతూ.. అమెరికాతో తమ దేశం దౌత్యా నికి సిద్ధమే కానీ, చర్చలకు మాత్రం కాదన్నారు. తమ సైనిక జనరల్ సులేమానీని చంపడం అమెరికా చేసిన క్షమించరాని తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇరాన్ మంత్రి జరీఫ్ అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ‘రైజినా డైలాగ్’లో విదేశాంగ మంత్రి జై శంకర్ -
యుద్ధనేరాల విచారణకు ఐరాస నిధులు
ఐక్యరాజ్య సమితి: సిరియా, మయన్మార్లలో జరిగిన యుద్ధ నేరాల విచారణ కోసం ఐక్యరాజ్య సమితి తన బడ్జెట్లో నిధులు కేటాయించింది. 2020 సంవత్సరానికి గాను ఐరాస సర్వ ప్రతినిధి సభ శుక్రవారం 307 కోట్ల డాలర్లను కేటాయించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే బడ్జెట్ స్వల్పంగా పెరిగింది. 2019లో 290 కోట్ల డాలర్ల బడ్జెట్ ఉండేది. ఐక్యరాజ్య సమితి సచివాలయానికి అదనపు బాధ్యతలు అప్పగించడం, ద్రవ్యోల్బణం, డాలర్ మారకం విలువలో తేడాల కారణంగా బడ్జెట్ను పెంచినట్టు యూఎన్ దౌత్యవేత్తలు వెల్లడించారు. యెమన్లో పరిశీలకుల బృందం, హైతిలో రాజకీయ బృందాల ఏర్పాటు, సిరియా అంతర్యుద్ధం, మయన్మార్లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన దాడులకు సంబంధించిన నేరాలపై విచారణకు ఈ బడ్జెట్లో నిధుల్ని వినియోగించనున్నారు. ఇలా యుద్ధ నేరాల విచారణకు ఐక్యరాజ్య సమితి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. గతంలో యూఎన్ స్వచ్ఛందంగా ఈ నేరాల విచారణకు ఆర్థిక సాయాన్ని అందించేది. జూన్లో ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం 600 కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రకటించింది. ఇప్పుడు కొత్త సంవత్సరం వేళ ప్రత్యేకంగా మరో బడ్జెట్ను ప్రకటించింది. కొత్త సైబర్ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు అధికమవుతుండడంతో వాటిని నిరోధించడానికి ఒక కొత్త అంతర్జాతీయ ఒప్పందాన్ని ఐరాస రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని శుక్రవారం ఐరాస సర్వ ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని యూరోపియన్ యూనియన్, అమెరికా, మరికొన్ని దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూఎన్లో ఈ తీర్మానం 79–60 ఓట్ల తేడాతో గట్టెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులతో ఒక కమిటీ వేసి సైబర్ నేరాలు నిరోధించడానికి కసరత్తు జరుగుతుంది. -
అరుదైన ఘనత దక్కించుకున్న మలాలా
న్యూయార్క్ : నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువతిగా గుర్తింపు పొందింది. 21వ శతాబ్ధపు రెండవ దశకంలో ఫేమస్ టీనేజర్గా మలాలా నిలిచినట్లు.. ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2010 నుంచి 2019 మధ్య కాలంలో మలాలాకు వచ్చిన గుర్తింపు ఆధారంగా యూఎన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు యూఎన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్లోని బాలికల విద్య కోసం మలాలా చేసిన పోరాటాన్ని యూఎన్ గుర్తుచేసింది. యుక్త వయసు నుంచే మలాలా బాలిక విద్య గురించి మాట్లాడిందని, తాలిబన్ల అకృత్యాలపై పోరాడిందని తన రిపోర్ట్లో పేర్కొంది. ఆమె సేవను గుర్తింపుగా 2014లో నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలసిందే. 2017లో యూఎన్ శాంతిదూతగా కూడా ఆమె నిలిచారు. -
ప్రపంచాన్ని కదిలిస్తున్న బాల పర్యావరణవేత్తలు
మాడ్రిడ్: వారిద్దరూ స్కూలుకెళ్లి చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ కాలం గడపాల్సిన వాళ్లు. కానీ పర్యావరణ పరిరక్షణపై వారికున్న ఆసక్తి ప్రపంచ దేశాల నేతల ముందు వక్తలుగా మార్చింది. మణిపూర్కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్ వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను కోరుతోంది. స్పెయిన్ వేదికగా ఈనెల 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా ఆమె ప్రసంగించారు. ఆడుకోవాల్సిన వయసులో తమ భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె తండ్రి కేకే.సింగ్ మాట్లాడుతూ..తమ కూతురు ఇప్పటికే 21 దేశాల్లో వాతావరణ మార్పుల గురించి ప్రసంగాలు చేసిందన్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన స్వీడన్ టీనేజర్ గ్రెటా థన్బర్గ్ (16) టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా నిలిచింది. మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్ మేగజీన్ బుధవారం తెలిపింది. వ్యక్తిగతంగా ఈ రికార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు గ్రెటానే అంటూ టైమ్స్ ఆమెను కొనియాడింది. లిసిప్రియా, గ్రెటాలు ఇద్దరూ పర్యావరణం గురించి నిరసనల్లో పాల్గొనేందుకు స్కూలుకు సైతం సరిగా వెళ్లేవారు కాదు. టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గ్రెటా థన్బర్గ్ -
నీ హక్కుకు రక్షణగా నేనున్నా!
-
నీ హక్కుకు రక్షణగా నేనున్నా!
పుట్టిన ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ప్రతి పౌరుడికి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. హక్కులను హరించే హక్కు ఎవరికి ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో ఆ ప్రభుత్వాలే హక్కులను కాలరాస్తుంటాయి. అటువంటి సందర్భాలలో కోర్టుకెక్కి మన హక్కులను దక్కించుకుంటున్నాం. అయితే రారాను మన హక్కులను మనకు దక్కకుండా చేస్తున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో పౌరులందరికి తమ హక్కులు దక్కేలా కృషి చేస్తూ ప్రతి యేడాది డిసెంబర్ 10వ తేదీన మానవహక్కుల దినోత్సవంగా నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషి, చేపడుతున్న చర్యలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
మానవాభివృద్ధి సూచీలో భారత్ @ 129
న్యూఢిల్లీ: ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్ 129వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి సోమ వారం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) నివేదిక–2019ను విడుదల చేసింది. తొలి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ నిలిచాయి. పాకిస్తాన్ 152వ స్థానంలో ఉంది. అట్టడుగున 189 స్థానంలో నైగర్ ఉంది. 189 దేశాలతో జాబితా రూపొందించింది. 2005–06 నుంచి 2015–16 వరకు 27.1 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్టు యూఎన్డీపీ ఇండియా ప్రతినిధి షోకో నోడా వెల్లడించారు. 2018లో భారత్ 130వ స్థానంలో ఉంది. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న అభివృద్ధి కారణంగా పేదరికంలోనూ, భారతీయుల ఆయుర్దాయంలోనూ, విద్య, వైద్య సదుపాయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రిపోర్టు వెల్లడించింది. ► 1.3 బిలియన్ల మంది నిరుపేదల్లో 28 శాతం మంది భారత్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా స్త్రీలు, బాలికలు అసమానతల సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు. హా భర్తల చేతిలో హింసకు గురౌతున్న మహిళలు సింగపూర్లో అతి తక్కువ. ► దక్షిణాసియాలో 31 శాతం మంది మహిళలు భర్తల చేతిలో హింసకు గురౌతున్నారు. ► లింగ అభివృద్ధి సూచీలో దక్షిణాసియా దేశాల సగటు కంటే భారత్ కొద్దిగా మెరుగైన స్థితిలో ఉంది. -
పాకిస్థాన్పై భారత్ సీరియస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విమానం ప్రయాణించేందుకు వీలుగా గగనతల అనుమతి ఇచ్చేందుకు పాకిస్తాన్ నిరాకరించడాన్ని భారత్ సీరియగా పరిగణించింది. ఈ విషయంలో దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. అంతర్జాతీయ పౌర విమానాయాన సంస్థ (ఐసీఏవో) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే యోచనలో కేంద్రం ఉంది. ఒక దేశానికి సంబంధించిన విదేశీ గగనతల ప్రయాణ అనుమతులకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదులను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఐసీఏవో చూసుకుంటోంది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేయడంతో పాకిస్థాన్ దుందుడుకు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ దాయాది తమ గగనతలంలో భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించింది. ప్రధాని నరేంద్రమోదీ విమానానికి కూడా అనుమతి ఇప్పటికే రెండుసార్లు అనుమతి నిరాకరించినప్పటికీ.. భారత్ సంయమనం పాటించింది. తాజాగా యూఏఈ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ బయలుదేరుతున్న నేపథ్యంలో భారత్ మరోసారి గగనతల అనుమతి కోరింది. తాజాగా కూడా పాక్ నిరాకరించడంతో ఫిర్యాదు చేయడమే సరైన చర్యగా భావిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం యూఏఈ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. -
ఇ–వ్యర్థాలను అరికట్టలేమా?
ఆదిమ సమాజం నుంచి నేటి అత్యాధునిక సమాజం వరకు ఒక ‘విచ్ఛిన్న ప్రవాహం’లా సాగిన ప్రకృతి మానవీకరణ క్రమంలో వివిధ చారిత్రక దశల్లో ఏర్పడిన నిర్దిష్ట సామాజికార్థిక సంక్షోభాలకు సహజాతంగా పర్యావరణ సంక్షోభాలు కూడా ఉనికిలోకి వచ్చాయి. లాభార్జనే పరమావధిగా సాగే సరకుల ఉత్పత్తి విధానం, కార్పొరేట్ శక్తుల అత్యాశకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ విధానాల స్థానంలో ప్రకృతికి సమాజానికి మధ్య లావాదేవీల సమతుల్యతను సాధించే ఉత్పత్తి విధానం ప్రపంచంలో ఉనికిలోకి వస్తే తప్ప పర్యావరణ సంక్షోభానికి ఒక హేతుబద్ధ పరిష్కారం దొరకదు. పర్యావరణ సంక్షోభంపై వివిధ అంతర్జాతీయ ఒప్పందాల్ని ఆర్థిక విధానంతో సంబంధం లేకుండా వాటికవిగా అమలు చేయడం సాధ్యం కాదు. ప్రపంచాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో ఇ–వ్యర్థాల నిర్వ హణ అత్యంత కీలకమైన సమస్యగా అవతరిం చింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషీ న్లు, ఫ్రిజ్లు, కంప్యూ టర్లు, ల్యాప్టాప్లు వంటి సవాలక్ష ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగం తర్వాత వ్యర్థాలుగా మారి పర్యావరణ, ప్రజారోగ్య విధ్వంసానికి పాల్పడుతున్నాయి. 2019లో 5 కోట్ల టన్నుల ఇ–వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కానున్నాయని అంచనా. ఆ వ్యర్థాల్లో సగభాగం ఆధునిక సంస్కృతికి అద్దం పడుతున్న, వ్యక్తిగ తంగా వినియోగిస్తున్న కంప్యూటర్లు, స్క్రీన్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, టీవీలు, మిగిలిన వాటిలో వేడి, చల్లబరచే వివిధ రకాల గృహోప కరణాలే. వీటి వినియోగం ద్వారా హానికర వ్యర్థాలు విడుదలవడమే కాకుండా, ఇ–సరుకుల ఉత్పత్తిలో విడుదలయ్యే హరిత గృహ వాయు వులు భూతాపం పెరుగుదలకు, పర్యవసానంగా వాతావరణ మార్పు వైపరీత్యాలకు కారణమవు తున్నాయి. ఇ–వ్యర్థాల నిర్వహణ భౌగోళిక రాజ కీయ సవాలుగా మారి, ప్రపంచస్థాయిలో ఈ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ చేయవలసిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో 2002 ఏప్రిల్లో ‘వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ (డబ్ల్యూఈఈఈ) అంతర్జాతీయ వేదిక ఏర్పడింది. అంతర్జాతీయ సమాజంలో ఇ–వ్యర్థాల అనర్థాలు, నియంత్రణ అవసరంపై అవగాహన పెంపొందిం చేందుకు ‘ఇంటర్నేషనల్ ఇ–వేస్ట్ డే’ను ప్రతి ఏటా అక్టోబర్ 14 తేదీన జరుపుకోవాలని డబ్ల్యూఈ ఈఈ వేదిక 2018లో పిలుపునిచ్చింది. ఏటా 50 శాతం వృద్ధితో ఇ–వ్యర్థాలు పోగవు తున్నప్పటికీ గ్లోబల్ వ్యర్థాల్లో 20 శాతం మించి రిసైక్లింగ్కు నోచుకోవడం లేదు. మిగిలిన 4 కోట్ల టన్నుల వ్యర్థాలను చెత్త క్షేత్రాల్లో నిలువ చేయ డమో, భస్మం చేయడమో లేదా ప్రధానంగా వెనుక బడిన, వర్ధమాన దేశాలకు చట్టవిరుద్ధంగా ఎగు మతి చేయడమో, లేదా సముద్ర జలాల్లో పారబో యడమో జరుగుతోంది. అత్యధిక స్థాయిలో ఇ– వ్యర్థాలను సృష్టిస్తున్న అభివృద్ధి చెందిన ఉత్తరార్థ గోళ పారిశ్రామిక దేశాలు ఆ వ్యర్థాలను జీవ వైవిధ్యం మెండుగా ఉన్న దక్షిణార్థగోళ వ్యావసా యిక దేశాల్లో అన్యాయంగా పారబోస్తున్నాయి. మన దేశంలో ఏటా 18.5 లక్షల టన్నుల ఇ–వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో మహారాష్ట్ర, తమిళనాడు తరవాత 3వ స్థానంలో తెలుగు రాష్ట్రాలున్నాయి. అశాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్, కంటితుడుపు చట్టాలు, లోపా యికారీ నియంత్రణ కారణంగా ఇ–వ్యర్థాల నుంచి పెద్దఎత్తున విష రసాయనాలు వెలువడుతు న్నాయి. సంపన్న దేశాలు భారత్ను ఎలక్ట్రానిక్ వ్యర్థాల కుప్పతొట్టిగా భావిస్తూ ఏటా 50 వేల టన్నులకు పైగా ఇ–వ్యర్థాల్ని భారత్లో లేదా ఇక్కడి సముద్ర జలాల్లో కుప్పపోస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం పునరుద్ధరణ సాధ్యం కాని ‘ఆకస్మిక వాతావరణ మార్పు’ దశకు చేరుకో బోతోంది. ఇ–సరకుల వినియోగం, ఉత్పత్తి విష యంలో వ్యక్తి, సంస్థాగత స్వీయ నియంత్రణలు, ప్రభుత్వ స్థాయిలో నియంత్రణ చర్యలు, అంత ర్జాతీయ ఒప్పందాల ద్వారా ఇ–వ్యర్థాలను నిరో ధించడం అసాధ్యం. ఇ–వ్యర్థాల సమస్య, హరిత గృహ వాయువులు వెలువడుతున్న కారణంగా ఏర్పడిన వాతావరణ మార్పు ముప్పు, పారిశ్రా మిక, వ్యవసాయ కార్యకలాపాల వల్ల జల, వాయు, శబ్ద, కాంతి కాలుష్యాలు తదితర భూగో ళంపై సాగుతున్న పర్యావరణ వైపరీత్యాలన్నీ విడి విడి అంశాలు కావు. సమాజానికి, ప్రకృతికి మధ్య జరిగే లావాదేవీల సమతుల్యత దెబ్బతిన్నందువల్ల ఏర్పడిన పర్యావరణ సంక్షోభంలో ఈ వైపరీత్యా లన్నీ విడదీయరాని అంతర్భాగాలే. ఆదిమ సమాజం నుంచి నేటి అత్యాధునిక సమాజం వరకు ఒక ‘విచ్ఛిన్న ప్రవాహం’లా సాగిన ప్రకృతి మానవీకరణ క్రమంలో వివిధ చారి త్రక దశల్లో ఏర్పడిన నిర్దిష్ట సామాజికార్థిక సంక్షోభాలకు సహజాతంగా పర్యావరణ సంక్షో భాలు కూడా ఉనికిలోకి వచ్చాయి. పర్యావరణ సంక్షోభంపై వివిధ అంతర్జాతీయ ఒప్పందాలు, వినిమయ సంస్కృతిని సంస్కరించే ప్రయత్నాలు, ప్రభుత్వాల నిషేధాలు, నిబంధనలన్నీ ఆర్థిక విధా నంతో సంబంధం లేకుండా వాటికవిగా అమలు చేయడం సాధ్యం కాదు. ఐక్యరాజ్యసమితి దేశాధినేతల సమావేశాన్ని ఉద్దేశించి వాతావరణ మార్పును అరికట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణిగా ప్రపంచ ఖ్యాతిని గడించిన బాలిక గ్రెటా థెన్బర్గ్ చేసిన ప్రసంగం... భవిష్యత్ చిత్రానికి అద్దం పడుతోంది. లాభార్జనే పరమావధిగా సాగే సరకుల ఉత్పత్తి విధానం, కార్పొరేట్ శక్తుల అత్యాశకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ విధానాల స్థానంలో ప్రకృతికి సమాజానికి మధ్య లావాదేవీల సమతుల్యతను సాధించే ఉత్పత్తి విధానం ప్రపంచంలో ఉనికిలోకి వస్తే తప్ప పర్యావరణ సంక్షోభానికి ఒక హేతుబద్ధ పరిష్కారం దొరకదు. (అక్టోబర్ 14న అంతర్జాతీయ ఇ–వేస్ట్ డే సందర్భంగా) వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు వెన్నెలకంటి రామారావు మొబైల్ : 95503 67536 -
ఐక్యరాజ్యసమితికి నిధుల కొరత!
న్యూయార్క్: ప్రపంచ సమస్యలు తీర్చే పెద్దన్న ఐక్యరాజ్యసమితిని నిధుల కొరత వేదిస్తోంది. ఐక్యరాజ్యసమితి సుమారు 230 మిలియన్ డాలర్ల లోటులో ఉన్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. అరకొరగా ఉన్న నిధులు ఈ నెలాఖరుకు ఖాళీ అయ్యే అవకాశముందని తెలిపారు. సమితి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను ఉద్దేశించి ఆయన రాసిన లేఖలో నిధుల కొరతను ఆయన ప్రస్తావించారు. ‘ఈ ఏడాది సాధారణ బడ్జెట్కు సభ్య దేశాల నుంచి కేవలం 70శాతం మాత్రమే నిధులు లభించాయి. దీంతో సెప్టెంబర్ ఆఖరుకు 230 మిలియన్ డాలర్ల నగదు లోటు ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న నిధులు సైతం ఈ నెలాఖరుకు అయిపోయే అవకాశం ఉంది. అందుకే ఖర్చు తగ్గింపులో భాగంగా వివిధ సమావేశాలు, సదస్సులు వాయిదా వేయను న్నాం. కొన్ని సేవలను తగ్గించనున్నాం. అతిముఖ్యమైన పర్యటనలు తప్ప మిగిలిన వాటిపై ఆంక్షలు విధించనున్నాం. ఈ పరిస్థితికి కారణం సభ్యదేశాల నిర్లక్ష్యమే’అని ఆ లేఖలో గుటెర్రస్ పేర్కొన్నారు. కాగా, నగదు కొరత ప్రమాదాన్ని ముందే ఊహించిన గుటెర్రస్ ఈ ఏడాది ఆరంభంలోనే సభ్య దేశాలను హెచ్చరించారు. ఆయా దేశాలు చెల్లించాల్సిన మొత్తాన్ని వీలైనంత త్వరగా జమచేయాలని సూచించారు. 2018–19కి గాను సమితి 5.4 బిలియన్ డాలర్ల బడ్జెట్ను ప్రకటించగా, ఇందులో 22శాతం నిధులు అమెరికా నుంచి వచ్చినవే. -
‘తోలుబొమ్మ యుద్ధం అని బెదిరించింది’
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఆర్మీ చేతిలో తోలుబొమ్మ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్యసమితి వేదికపై యుద్ధం గురించి మాట్లాడుతూ తన వ్యక్తిత్వం ఏమిటో మరోసారి నిరూపించుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు కేటాయించిన పదిహేను నిమిషాల సమయాన్ని ఇతరులపై ఆరోపణలు చేసేందుకు మాత్రమే ఇమ్రాన్ వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ప్రతీ దేశానికి 15 నిమిషాలు కేటాయించారు. ఎవరి వ్యక్తిత్వం ఏమిటో.. ఎవరి శక్తిసామర్థ్యాలు ఏమిటో నిరూపించుకోవాల్సిన సమయం అది. ప్రధాని నరేంద్ర మోదీ శాంతి, అభివృద్ధి గురించి మాట్లాడటానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటే.. పాకిస్తాన్ సైన్యం చేతిలోని తోలుబొమ్మ మాత్రం అణ్వాయుద యుద్ధం జరుగుతుంది అంటూ బెదిరింపులకు దిగింది. మళ్లీ అదే వ్యక్తి కశ్మీర్లో శాంతి అంటూ ఏవేవో మాట్లడతారు’ అని గంభీర్ ట్వీట్ చేశారు.(చదవండి : కలిసికట్టుగా ఉగ్ర పోరు: మోదీ) కాగా ఐక్యరాజ్యసమితి సమావేశంలో భాగంగా భారత ప్రధాని మోదీ శుక్రవారం మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఒక్కటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘భారత్ ప్రపంచానికి యుద్ధాన్ని ఇవ్వలేదు.. బుద్ధిని ఇచ్చింది. శాంతి, అహింసల సందేశాన్ని ఇచ్చింది’ అని భారత జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రస్తావించారు. అదే విధంగా వాతావరణ మార్పులతో పాటు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాలను తన ప్రసంగంలో ఉటంకించారు. ఇక పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం తనకు కేటాయించిన పదిహేను నిమిషాలను పొడగిస్తూ దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇందులో ఎక్కువ భాగం భారత ప్రభుత్వం, కశ్మీర్, ఆరెస్సెస్లపై ఆరోపణలు గుప్పిస్తూ.. ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తే అవకాశం ఉందంటూ బెదిరింపులకు దిగారు.(చదవండి : యుద్ధం వస్తే తీవ్ర పరిణామాలు: ఇమ్రాన్ ఖాన్) The time allotted to each country is 15 minutes. What one does with it shows character and intellect. @narendramodi Ji chose to talk about peace and development while Pakistan Army’s puppet threatened a nuclear war. He is the same man who claims to promote peace in Kashmir.#UNGA — Gautam Gambhir (@GautamGambhir) September 28, 2019 -
కంగ్రాట్స్ ఇమ్రాన్ ఖాన్..థాంక్యూ!
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరును లేవనెత్తి భారత్-ఆరెస్సెస్ పర్యాయ పదాలని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచానికి చాటిచెప్పారని ఆ సంస్థ కార్యకర్త కృష్ణ గోపాల్ అన్నారు. తమకు ఇంత గొప్ప సహాయం చేసినందుకు ఆయనను తప్పక అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో శుక్రవారం తొలిసారిగా ప్రసంగించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆరెస్సెస్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ‘భారత్లో ఆరెస్సెస్ అనే సంస్థ ఉంది. ఆ దేశ ప్రధాని మోదీ అందులో జీవితకాల సభ్యుడు. హిట్లర్, ముస్సోలినిల స్ఫూర్తితో ఏర్పడిన ఆ సంస్థ.. ముస్లింలు, క్రిస్టియన్లపై ద్వేషాన్ని పెంచుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందించిన కృష్ణ గోపాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఆరెస్సెస్ భారత్ కోసం భారత్లో మాత్రమే పనిచేస్తోంది. ప్రపంచంలో మరెక్కడా మాకు శాఖలు లేవు. అయినా పాకిస్తాన్కు మాపై కోపం ఎందుకు? వాళ్లు మాపై కోపంగా ఉన్నారంటే భారత్పై కోపంగా ఉన్నట్లే. ఆరెస్సెస్, భారత్ పర్యాయపదాలుగా మారాయని ఇమ్రాన్ మాటల్లో స్పష్టమైంది. నిజానికి ప్రపంచం కూడా మమ్మల్ని ఇలాగే గుర్తించాలని మేము ఆశించాం. ఆరెస్సెస్ పేరును ప్రస్తావించి ఇమ్రాన్ చాలా గొప్ప సహాయం చేశారు. మా పేరును ప్రపంచవ్యాప్తం చేశారు. ధన్యవాదాలు. ఉగ్రవాద బాధితులకు ఆరెస్సెస్ అండగా ఉంటుంది. బహుశా అందుకే ఇమ్రాన్కు మాపై కోపం వస్తున్నట్లుంది’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక తమ గురించి ప్రచారం చేసింది చాలు అని, పాకిస్తాన్ పరిస్థితులపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. #WATCH RSS leader Dr Krishna Gopal Sharma says, "RSS is only in India. We don't have any branches anywhere in world. If Pakistan is angry with us it means they are angry with India. RSS & India are synonyms now. We also wanted the world to see India & RSS as one." pic.twitter.com/uuYHdPF71B — ANI (@ANI) September 28, 2019 -
చైనాకు భారత్ గట్టి కౌంటర్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కశ్మీర్ గురించి ఐక్యరాజ్యసమితి వేదికగా చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. కశ్మీర్ పూర్తిగా భారత అంతర్గత అంశమని.. ఈ విషయంలో అన్ని దేశాలు భారత సార్వభౌమత్వాన్ని, జాతి సమగ్రతను గౌరవించాలని హితవు పలికింది. అదే విధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో అక్రమంగా నిర్మిస్తున్న చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) గురించి సమాధానం చెప్పిన తర్వాత కశ్మీర్ విషయం గురించి మాట్లాడితే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై విద్వేషపూరిత ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా చైనా విదేశాంగ మంత్రి సైతం కశ్మీర్ అంశంలో భారత్ను దోషిని చేసే విధంగా మాట్లాడారు. ‘ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రూపొందించిన నిబంధనల మేరకు కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సింది. కశ్మీర్ విషయంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు’ అని భారత్ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో చైనా మంత్రి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. ‘జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ భారత భూభాగంలో అంతర్భాగమని చైనాకు తెలుసు. ఇక కశ్మీర్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు కూడా భారత అంతర్గత అంశాలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు గౌరవించాలని ఆశిస్తున్నాం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా- పాకిస్తాన్ అక్రమంగా ఎకనమిక్ కారిడార్ నిర్మించడం కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లే’ అని చైనాకు ఘాటు సమాధానమిచ్చారు. కాగా 50 బిలియన్ డాలర్లతో 2015లో మొదలైన సీపీఈసీలో భాగంగా పాకిస్తాన్, చైనాల మధ్య విరివిగా రోడ్డు రైల్వే మార్గాలు నిర్మించనున్నారు. ఇక భారత్ సొంత విషయమైన ఆర్టికల్ 370 రద్దును పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వేదికపై లేవనెత్తిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. కశ్మీర్లో అమానవీయంగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారని, దానిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో శుక్రవారం తొలిసారి పాల్గొన్న ఇమ్రాన్.. 15 నిమిషాల పరిమితిని దాటి 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇందులో సగం సమయాన్ని భారత్పై విషం కక్కేందుకు ఉపయోగించుకోగా.. మిగతా సమయంలో ఇస్లామోఫోబియా(ఇస్లాం అంటే భయం), మనీ లాండరింగ్ తదితర అంశాలను ప్రస్తావించారు. -
జమ్మూకశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతమే : ఇమ్రాన్
న్యూయార్క్ : అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. భారత ప్రధాని మోదీ ప్రసంగ శైలికి భిన్నంగా భారత్పై విమర్శలు చేయడమే ప్రధాన అంశంగా ఇమ్రాన్ మాట్లాడారు. జమ్మూకశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతమేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికే ఇక్కడికి వచ్చా. సెప్టెంబర్ 11 దాడుల్లో మా ప్రమేయం లేదు. కశ్మీర్ ఉగ్రవాదం గురించి మోదీ మాట్లాడారు. మరి బెలూచిస్తాన్లో భారత్ చేస్తున్న గూఢచర్యం సంగతేమిటి..?. పుల్వామా దాడిలో ఆధారాలు చూపాలని అడిగాం.. సర్జికల్స్ట్రైక్లో 300 మందిని చంపామని అన్నారు. ఇదంతా ట్రైలర్ అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇవన్నీ కూడా పక్కనపెట్టి చర్చలకు రావాలని మోదీని ఆహ్వానించాం. కానీ మోదీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆర్ఎస్ఎస్ వ్యవహారాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ఇండియాలో ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఉంది. మోదీ దానికి జీవితకాల సభ్యుడు. హిట్లర్, ముస్సోలినిల స్ఫూర్తితో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. ముస్లింలు, క్రిస్టియన్లపై ద్వేషాన్ని పెంచే సంస్థ ఆర్ఎస్ఎస్. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ఫోబియా పెరుగుతోంది. 9/11 దాడుల తర్వాత ఆందోళన మరింత ఉధృతమైంది. కొందరు నేతలు ఉగ్రవాదాన్ని ఇస్లాం మతంతో ముడిపెట్టారు. మతంతో టెర్రరిజానికి సంబంధం లేదు. యూరోపియన్ దేశాలు ముస్లింలను అణచివేయాలని చూస్తున్నాయి. ఆ విషయాన్ని ముస్లిం దేశాధినేతలు పట్టించుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు మతాలు ముస్లింలను రాడికల్స్గా ముద్రవేశాయి. ముస్లింలపై వాటి ధోరణి మారాలి. జాత్యహంకార, విద్వేషపూరిత సిద్ధాంతాలే మహాత్మాగాంధీని చంపేశాయి. మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా ఎలాంటి చర్యలకు మద్దతిచ్చారో మీరే తెలుసుకోండి. గుజరాత్లో వేలమంది ముస్లింలను హతమార్చారు. బలగాలు మోహరించి 80 లక్షల మంది కశ్మీరీలను నిర్బంధిస్తే ఆర్ఎస్ఎస్ మాట్లాడటం లేదు. గత 30 ఏళ్లలో లక్షల మంది కశ్మీరీలు చనిపోయారు. జంతువుల కంటే హీనంగా ముస్లింలను నిర్భందించారు. ఐరాస కశ్మీర్కు కల్పించిన హక్కులను భారత్ కాలరాస్తోంది. నిర్బంధం విధిస్తే కశ్మీర్ మౌనంగా ఉంటుందని అనుకుంటున్నారు. అది ఆయన అహంభావం. వీటన్నిటి మీద ఐరాసలో చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది’ అన్నారు. -
‘నాకు మెరుగైన భవిష్యత్తు కావాలి’
న్యూఢిల్లీ : ‘నాకు మెరుగైన భవిష్యత్తు కావాలి. నా భవిష్యత్తు, మనందరి భవిష్యత్తును కాపాడాలనుకుంటున్నాను. అంతేకాదు భవిష్యత్ తరాలతో పాటు ప్రస్తుతం నా సాటి పిల్లలందరి భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాను’ అంటూ రిధిమ పాండే నూయార్క్లో వాతావరణ మార్పులు, సంక్షోభం గురించి ఉద్వేగపూరిత ప్రసంగం చేసింది. ‘మన ప్రభుత్వం కాగితాల మీద మాత్రమే పనిచేస్తుంది. పర్యావరణ పరిరక్షణకై క్షేత్రస్థాయిలో అసలు ఏ చర్యలు తీసుకోవడం లేదు’ అని ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ప్రస్తుతం ప్రపంచమంతా పర్యావరణ కార్యకర్త గ్రెటా థంబర్గ్పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ.. హరిద్వార్కు చెందిన పదకొండేళ్ల రిధిమాను.. ‘భారత గ్రెటా థంబర్గ్’ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. గ్రెటా... ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుంటే... రిధిమా సైతం పర్యావరణ పరిరక్షకు నడుం బిగించింది. వాతావరణ మార్పులపై 2017లో జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ను దాఖలు చేసి వార్తల్లో నిలిచింది. ఇక సోమవారం న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ ప్రణాళిక సదస్సుకు రిధిమ కూడా హాజరైంది. వాతావరణ మార్పులపై ఆయా దేశాల ప్రభుత్వాల వ్యవహారశైలికి వ్యతిరేకంగా థంబర్గ్తో పాటు నిరసన చేపట్టిన 16 మంది పిల్లల్లో రిథిమ కూడా ఒకరు. ఈ సందర్భంగా రిధిమ మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా ప్రక్షాళన కార్యక్రమంపై విమర్శలు గుప్పించింది. ‘ గంగను మనం అమ్మా అని పిలుస్తాం. అయితే ఆ నదిలోనే మురికి బట్టలు కూడా ఉతుకుతాం. చెత్త కూడా పారేస్తాం. ఇక ప్రభుత్వమేమో నదిని ప్రక్షాళన చేస్తామని చెబుతుంది. అయితే ఆ మాటలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. నేటికీ గంగ కాలుష్యానికి గురవుతోంది. ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడితేనే నదీ పరివాహక ప్రాంతంలో మానవాళి మనుగడ కొనసాగుతుంది అని పేర్కొంది. అదే విధంగా ప్లాస్టిక్ను నిషేధిస్తామని పలు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ.. చిత్తశుద్ధి కనబరచడం లేదని విమర్శించింది. కాగా తన తండ్రితో కలిసి న్యూయార్క్ వెళ్లిన రిధిమ.. ఓ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్హత సాధించి గ్రెటా వంటి తోటి పర్యావరణ ప్రేమికులను కలుసుకునే అవకాశం కలిగిందని హర్షం వ్యక్తం చేసింది. “I want a better future. I want to save my future. I want to save our future. I want to save the future of all the children and all people of future generations.” - Ridhima Pandey, one of 16 children who filed a complaint on climate crisis to the UN child rights committee. #UNGA pic.twitter.com/E8O2ZlmfAo — UNICEF India (@UNICEFIndia) September 24, 2019 -
హఫీజ్ ఖర్చులకు డబ్బులివ్వండి : పాక్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ అసలు రంగు మరోసారి బయటపడింది. ఓ వైపు ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతూనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డ హఫీజ్ సయీద్ కోసం ఆ దేశం తాజాగా ఐరాసను ఆశ్రయించింది. ముంబయి పేలుళ్ల సూత్రదారి, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి అతనికున్న బ్యాంక్ఖాతాను నిలిపివేసింది. అప్పటి నుంచి తన వ్యక్తిగత, కుటుంబ ఖర్చులకు ఇబ్బందులు ఎదురవడంతో హఫీజ్ పాక్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో హఫీజ్కు వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ. 1,50,000 (పాక్ కరెన్సీ) విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పాకిస్తాన్ ఐరాసను కోరింది. కాగా పాక్ చేసిన ప్రతిపాదనపై గడువులోగా ఐరాస సభ్య దేశాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో మండలి అందుకు ఆమోదిస్తూ హఫీజ్ తన బ్యాంక్ ఖాతాను వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో అరెస్టైన హఫీజ్ ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
వాతావరణ మార్పులపై ప్రధాని ప్రసంగం
న్యూయార్క్ : వాతావరణ మార్పులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతూ అంతర్జాతీయ సమాజంతో కలిసి వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళతామని అన్నారు. లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు సమకూర్చి మహిళలను పొగబారిన పడకుండా కాపాడామని తెలిపారు. మిషన్ జల్జీవన్తో నీటి కాలుష్యాన్ని నియంత్రిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ సోలార్ కార్యక్రమంలో భారత్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేందుకు అంతర్జాతీయ టెక్నాలజీని వాడుతున్నామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత భారత్కు పిలుపు ఇచ్చామని చెప్పుకొచ్చారు. -
భారత్పై ప్రశంసలు కురిపించిన ఐరాస
న్యూయార్క్ : పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా భారత్ అద్బుతమైన ప్రగతి సాధిస్తోందని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులపై జరుగుతున్న పోరాటంలో భారత్ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భాలను గుర్తుచేసుకున్న ఆంటోనియో , మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐరాస కార్యాలయానికి 193 సౌర ఫలకలు బహుమతిగా ఇచ్చారని.. అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సమకూర్చుకోవడానికి సౌరవిద్యుత్పై భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని కొనియాడారు. క్లీన్ ఇండియాలో భాగంగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సెస్టెంబరు 23న ఐరాసలో వాతావరణ మార్పులపై సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్లర్ ఎంజెలా మోర్కెల్, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్, మార్షల్ ఐలాండ్ అధ్యక్షుడు హిల్డా హీన్లతో కలిసి ప్రసంగించనున్నారు. కర్బన ఉద్ఘారాలను తొలగించడం కోసం కొన్ని దేశాలు అణు ఇంధనం దిశగా అడుగులు వేస్తున్నాయని గుటెరస్ పేర్కొన్నారు. భారత్లో ఎక్కువభాగంలో బొగ్గు నిక్షేపాలు ఉన్న సంగతిని గుర్తుచేశారు. ప్రస్తుతం కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి చేస్తున్న భారత్ను ఐరాస గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐరాస ప్రదాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సౌర ఫలకలతో కూడిన సోలార్ పార్కును సెస్టెంబర్ 24న వివిధ దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం పలు దేశాలకు చెందిన నేతలు గాంధీ సిద్ధాంతాలు తమను ఏ విధంగా ప్రభావితం చేశాయో మాట్లాడనున్నారు. కాగా ఈ సౌర ఫలకలు 50 కిలోల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనుంది. ఈ కార్యక్రమానికి సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్, ఇతర దేశాల నేతలు పాల్గొననున్నారు. -
ఇమ్రాన్కు ఐరాస షాక్
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై నానా రాద్ధాంతం చేస్తున్న పాకిస్తాన్కు ఐక్యరాజ్యసమితి (ఐరాస) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ వ్యవహారం భారత్-పాకిస్తాన్లకు సంబంధించిన అంశమని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటరీస్ ఉద్దేశమని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి భారత్ను టార్గెట్ చేయాలన్న పాకిస్తాన్, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్లకు ఐరాస ప్రకటన మింగుడుపడటం లేదు. కశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని, మూడవ పార్టీ జోక్యం అవసరం లేదన్న భారత్ వాదనకు అనుకూలంగా ఐరాస స్పందించడంతో పాక్కు గట్టి షాక్ తగిలింది. ఐరాస చీఫ్ ఇరు దేశాధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నా ఇరు పక్షాలు చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని, మధ్యవర్తిత్వానికి చోటులేదనే భావిస్తున్నారని స్టీఫెన్ తేల్చిచెప్పడం భారత్ వాదనను బలపరిచినట్టయింది. -
భారత్కు రష్యా, పాకిస్తాన్కు చైనా మద్దతు
న్యూయార్క్ : కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రహస్య సమావేశం నిర్వహించింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ పట్ల భారత ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, జమ్మూకశ్మీర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రష్యా భారత్కు పూర్తి మద్దతుగా నిలిచింది. కశ్మీర్ అంశంపై భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది. ఈ అంశంపై యూన్ భద్రతా మండలిలో చర్చించొద్దని తేల్చిచెప్పింది. ఇక ఆర్టికల్ 370 రద్దుతో భారత్ కశ్మీర్పై అన్యాయం చేస్తోందని గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్ తొలుత అమెరికా తలుపు తట్టింది. కశ్మీర్ విషయం పూర్తిగా భారత్ అంతర్గతమని అమెరికా తేల్చిచెప్పడంతో.. చైనాకు సాగిలపడిన దాయాది దేశం ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశంపై పట్ల చర్చ పెట్టాలని కోరింది. దీంతో ఈ విషయంలో యూఎన్ భద్రతా మండలి శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సమావేశమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలైన ఫ్రాన్స్, యూకే కూడా కశ్మీర్ అంశం భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక అంశమని ఇప్పటికే చెప్పాయి. రహస్య సమావేశం అనగా మీడియాకు అనుమతి లేకపోవడమే. -
ఫ్రెండ్షిప్ డే అలా మొదలైంది..
ఏ బంధానికైనా స్నేహబంధమే పునాది. దానికి ఎల్లలు ఉండవు. ఎల్లలు లేని స్నేహానికి గుర్తుగా ఒక రోజుని పాటించే సంస్కృతి ఈనాటిది కాదు. అయితే ఒక్కో దేశం ఒక్కో రోజు జరుపుకోవడం విశేషం. నిజానికి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం 1930లో ఫక్తు మార్కెట్ వ్యూహాలతో మొదలైంది. హాల్మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్ హాల్ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అందుకు తగ్గట్లు కొన్ని గ్రీటింగ్ కార్డులు మార్కెట్లోకి పంపారు. కానీ దీని వెనుక స్నేహం కన్నా డబ్బులు సంపాదించే వ్యూహం దాగి ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రూసేడ్ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించగా.. క్రమంగా చాలా దేశాలు దీన్ని పాటించడం మొదలుపెట్టాయి. దీంతో ఐక్యరాజ్యసమితి 2011లో ఆ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఇంగ్లిష్ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన ‘విన్నీ ది పూహ్’కార్టూన్ క్యారెక్టర్ టెడ్డీబేర్ను స్నేహానికి ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ భార్య నానె అన్నన్ 1998లో ప్రకటించారు. అప్పట్నుంచి ఫ్రెండ్షిప్డే రోజు టెడ్డీబేర్లు గిఫ్ట్లుగా ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి మొదలైంది. అయితే భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. పాకిస్తాన్లో మాత్రం జూలై 30న చేసుకుంటారు. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జూలై 20న నిర్వహిస్తారు. -
ఇక భూమిపై బతుకు భారం కాబోతుందా?
వంద కోట్ల మందికి పైగా రోజు మూడుపూట్ల తిండి దొరకడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల మందికి పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికే తిండి, గూడు, గుడ్డ దొరకక అనేక మంది ఇబ్బందిపడుతున్నారు. మరి ఇంతకు మరింత రెట్టింపుగా జనాభా పెరిగితే పరిస్థితి ఏమిటి? తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జనాభా గణాంకాలు ఏం చెబుతున్నాయి? ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉంది? అధిక జనాభా వలన కలిగే నష్టాలు ఏమిటి? జనాభానియంత్రణకు చేపట్టవలసిన విధానాల గురించి తెలుసుకుందాం.... -
జైపూర్కు ‘వారసత్వ’ గుర్తింపు
న్యూఢిల్లీ: పింక్ సిటీగా పేరు పొందిన రాజస్తాన్ రాజధాని జైపూర్కు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక మండలి (యునెస్కో) ప్రపంచ వారసత్వ నగరం గుర్తింపు లభించింది. మధ్యయుగపు రాజరిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన జైపూర్ ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా ప్రపంచ గుర్తింపు పొందింది. జైపూర్ను ప్రపంచ వారసత్వ నగరాల్లో చేరుస్తున్నట్లు యునెస్కో శనివారం ట్వీట్టర్లో ప్రకటించింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 43వ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో ఇప్పటి వరకు 167 దేశాలకు చెందిన 1,092 ప్రాంతాలను వారసత్వ స్థలాలుగా గుర్తించింది. యునెస్కో వారసత్వ ప్రాంతాలు, కట్టడాలు, సహజ నిర్మాణాల్లో అత్యధికంగా ఇటలీలో 54, చైనాలో 53, భారత్లో 37 ఉన్నాయి. నిర్మాత రెండో జయసింగ్ యునెస్కో జైపూర్ను వారసత్వ నగరంగా గుర్తించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. క్రీస్తు శకం 1727లో అంబర్ మహారాజు రెండో జయ సింగ్ ఈ నగరాన్ని నిర్మించాడు. తన రాజధానిని అంబర్ నుంచి జైపూర్కు మార్చాడు. 16వ శతాబ్దం నాటి అంబర్ కోట, గులాబీ రంగు ఇసుక రాతి కట్టడమైన హవామహల్, ఖగోళ విజ్ఞాన కేంద్రం జంతర్మంతర్ వంటిని పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తన రాజధాని ఆతిథ్యానికి చిహ్నంగా నిలవాలన్న తలంపుతో జైపూర్ మహారాజు రాంసింగ్ నగరంలోని కట్టడాలన్నింటికీ గులాబీ రంగు వేయించాడని చెబుతారు. అందుకే దీనిని గులాబీ (పింక్)నగరంగా పిలుస్తారు. గుర్తిస్తే ఏమవుతుంది? ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్కు చెందిన 21 దేశాల అధికారుల బృందం 2018లో జైపూర్ను పరిశీలించింది. ఆ బృందం వారసత్వ స్థలాల జాబితాలో చేర్చవచ్చని సూచించింది. బాకులో జరుగుతున్న సమావేశం ఆ ప్రతిపాదనను పరిశీలించి, జైపూర్కు వారసత్వ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిద్వారా మానవ సంస్కృతీ వికాసానికి నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాంతం పరిరక్షణ బాధ్యతలను యునెస్కో చేపడుతుంది. మనుషులు, జంతువులు ఈ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించకుండా, స్థానిక పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యానికి గురి కాకుండా కాపాడుతుంది. ఇందుకు అవసరమైన నిధులను ప్రపంచ వారసత్వ నిధి సమకూరుస్తుంది. -
బైబై ఇండియా..!
భారత్ను వీడి విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభం వంటి సమస్యలు లేకపోయినా విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ తెలిపింది. 2008–18 మధ్యకాలంలో ఇలా విదేశాలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఏకంగా 996.33 శాతానికి ఎగబాకిందని వెల్లడించింది. ఇలా ఆశ్రయం కోరుతున్నవారిలో అత్యధికులు అమెరికా, కెనడా దే శాలవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత ఇతర కారణాలతో ప్రజలు ప్రాణాలను అరచేతపెట్టుకుని పారిపోతుంటారు. ఈ తరహా సమస్యలు ఏవీ లేకపోయినా భారత్ నుంచి భారీగా వలసలు పెరగడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం పరిస్థితి వేరు... పదేళ్ళ క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. 2008–09 మధ్యకాలంలో అమెరికా, కెనడాల ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత పదేళ్ళలో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి 22,967కి చేరుకుంది. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుకున్న భారతీయుల సంఖ్య 28,489కు పెరగ్గా, కెనడా ఆశ్రయాన్ని కోరుకున్న వారి సంఖ్య 5,522కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అమెరికా, కెనడాల తర్వాత భారతీయులు ఆశ్రయం కోరిన దేశాల్లో దక్షిణాఫ్రికా(4,329), ఆస్ట్రేలియా(3,584), దక్షిణకొరియా(1,657), జర్మనీ(1,313) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వలస వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పేదరికం, అంతర్యుద్ధం, విపరీతమైన హింస ఉండే యెమెన్, సూడాన్, బోస్నియా, బురుండి వంటి దేశాలను కూడా భారతీయులు ఆశ్రయం కోరడం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులను విస్మయంలో పడేస్తోంది. 2018లో ఇలాంటి 57 దేశాల్లో భారతీయులు ఆశ్రయాన్ని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్లో నెలకొన్న అసహనం కారణంగానే ఇలా ప్రజలు విదేశీ ఆశ్రయం కోరుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు. భారత్కు వస్తున్నవారు తక్కువే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ఆశ్రయిస్తోన్న శరణార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా 35.03 లక్షల మంది శరణార్థులు వేర్వేరు దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు 11,957 మంది(0.34 శాతం) మాత్రమే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2018 చివరికినాటికి భారత్ 1.95 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాంతాలవారీగా చూసుకుంటే పాకిస్తాన్ 14.04 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అత్యధికులు ఆఫ్గన్లు. 9.06 లక్షల మందితో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రోహింగ్యాలు వీరిలో అత్యధికంగా ఉన్నారు. -
జన విస్ఫోటనంతో వచ్చే సమస్యలు ఇవే!
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో సంతానోత్పత్తి తగ్గుతూ వస్తున్నప్పటికీ 2026వ సంవత్సరం నాటికి దేశ జనాభా 165 కోట్లకు పెరుగుతుందని, 2027 నాటికి దేశ జనాభా చైనా జనాభాను అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించిన విషయం తెల్సిందే. జనాభా పెరుగుదల వల్ల మనకొచ్చే లాభనష్టాలు ఏమిటీ ? ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ ద్వారా భారత్కు ప్రయోజనమని, ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందని అగ్ర రాజ్యాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. జనాభా పెరగడం వల్ల పనిచేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని, వారి శ్రమ వల్ల ఆర్థికవృద్ధి రేటు పెరుగుతుందని ఆ దేశాల వాదన. 15–64 మధ్య వయస్కులను పనిచేసే వారిగా పరిగణిస్తున్నారు. వారి సంఖ్య 1963 నాటికి మొత్తం జనాభాలో 65 శాతం ఉంటుందని అంచనా. అంతమంది పనిచేస్తే ఆర్థిక వృద్ధి రేటు ఆశించిన దానికన్నా ఎక్కువనే సాధించవచ్చేమోగానీ వారందరికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వారి ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యం. 2100 సంవత్సరం నాటికి కూడా పురుషులకన్నా మహిళల సంఖ్య తక్కువగా ఉంటుందని సమితి నివేదిక వెల్లడించింది. 2011లో జరిగిన జనాభా లెక్కల నాటికి ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా, ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య 924 ఉంది, ఇప్పుడిప్పుడే మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే కొద్ది కొద్దిగా పెరుగుతోందని, ఇక ముందు ఇంకా పెరుగుతుందని, అయినప్పటికీ ఇరువురి మధ్య ఉన్న వ్యత్యాసం తొలగిపోయే అవకాశం లేదన్నది అంచనా. అప్పటికి ప్రతి వెయ్యి మంది పురుషులకు 966 మంది మహిళలు ఉంటారన్నది అంచనా. 1950 నాటికి గ్రామీణ ప్రాంతాలు మరింత తగ్గిపోయి పట్టణ వాసుల సంఖ్య మరింత పెరిగిపోతుంది. పట్టణాల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించడం ఓ సవాల్గా మారుతుంది. జనాభా పెరుగుదలతో కాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే తగ్గిపోతున్న భూగర్భ జలాలతో పడుతున్న తిప్పలు అధిక జనాభాతో మరింత పెరుగుతాయి. మెట్రో, బస్సు సర్వీసులను విస్తరించకపోతే మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ముంబై, మద్రాస్ లాంటి నగరాలో అవి కిక్కిరిసి నడుస్తున్నాయి. -
మొండి రోగాల ముప్పు!
వచ్చిన జబ్బేమిటో, దాని తీవ్రత ఎంతో తెలియకపోయినా ఇష్టానుసారం మందులు మింగే అల వాటు మానవాళి మనుగడకే ప్రమాదంగా పరిణమించిందని, మొండిరోగాలు పుట్టుకొస్తున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ బృందం (ఐఏసీజీ) సోమవారం చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కలిగించాలి. బ్యాక్టీరియా వల్లనో, వైరస్వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో ఏదైనా వ్యాధి సోకినప్పుడు శరీరతత్వాన్నిబట్టి స్పందన ఉంటుంది. ఏ కారణంగా నలత ఉందో, దాన్ని అరికట్టడానికి ఏ మందు ఏ మోతాదులో, ఎలా వాడాలో వైద్య నిపుణులు చెప్పాలి. కానీ ఎవరినీ సంప్రదించకుండా, మందుల దుకాణంలో లక్షణాలు చెప్పి గోలీలు కొనుక్కుని వాడే ధోరణి మన దేశంలోనే కాదు... ప్రపంచమంతటా పెరిగిపోయింది. దానికి తోడు ఆసుపత్రులు కాసుపత్రులుగా మారాక అవసరమున్నా లేకున్నా వైద్యులే మందులు అంటగడుతున్నారు. ఇలాంటి ధోరణుల వల్ల మొండి రోగాలు విస్తరించి 2030నాటికి అల్పాదాయ దేశాల్లో దాదాపు రెండున్నర కోట్లమంది తీవ్రమైన పేదరికం బారిన పడతారని, దానివల్ల ఆర్థిక వ్యవస్థలు ధ్వంస మవుతాయని ఐఏసీజీ హెచ్చరిస్తోంది. మన దేశంతోసహా 71 దేశాల్లో గణాంకాలు సేకరించి విశ్లేషిం చాక ఇందులో మూడోవంతు దేశాల్లో వ్యాధికారక క్రిములు మందులకు లొంగని రీతిలో తయా రయ్యాయని తేలిందని అంటోంది. వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్న మన దేశంలో అసలు ఔషధాల వాడకం ఎలా ఉందో, అందులోని గుణదోషాలేమిటో ఆరా తీసే వ్యవస్థ సక్రమంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే. కొన్నేళ్లక్రితం ఏ మందులకూ లొంగని అత్యంత శక్తిమంతమైన కొత్త బ్యాక్టీరియా పుట్టు కొచ్చిందని కనుక్కున్నప్పుడు దానికి ‘న్యూఢిల్లీ సూపర్బగ్’ అని పేరుపెట్టారు. పేరు గురించిన వివాదం సంగతి పక్కనబెడితే ‘ఇ–కొలి’ అనే అసాధారణ బ్యాక్టీరియాలో కొత్త జన్యువు బయల్దేరి దాన్ని మొండి ఘటంగా మార్చిందని ఆ పరిశోధన ద్వారా కనుక్కున్నారు. అశాస్త్రీయంగా, విచ్చలవి డిగా మందులు మింగడం వల్లే ఈ ‘సూపర్బగ్’ పుట్టుకొచ్చిందని నిర్ధారించారు. ఇన్ఫెక్షన్లు ఏర్ప డినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి నిర్దిష్టమైన మోతాదులో మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మోతాదు ఎక్కువైనా, తక్కువైనా రోగికి ముప్పు కలిగించడమే కాదు... ఆ రోగకారక క్రిమి మరింత శక్తి సంతరించుకుని చుట్టూ ఉన్న అనేకమందికి సోకుతుంది. అటుపై దాన్ని అరికట్టడం అసాధ్య మవుతుంది. అంటురోగాలను నివారించడానికి పెన్సిలిన్ కనుగొన్నప్పుడు అందరూ సంబరప డ్డారు. కానీ రెండు దశాబ్దాలు గడిచేసరికల్లా వ్యాధికారక బ్యాక్టీరియా పెన్సిలిన్ను తట్టుకునే విధంగా వృద్ధి చెందింది. మన దేశంలో జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లకు వినియోగించే యాంటీ బయాటిక్ మందుల విక్రయాలపై ఎవరికీ అదుపు లేదు. వైద్యుల చీటీ ఉంటే తప్ప కొన్ని మందులు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించేవారుండరు. అది అమలవుతున్నదో లేదో చూసే వ్యవస్థ సక్రమంగా లేదు. జ్వరం, జలుబు, దగ్గు, అతిసార వంటి వైరస్ కారక జబ్బులకు చాలా సందర్భాల్లో అసలు యాంటీ బయాటిక్స్ అవసరమే ఉండదని, వాటంతటవే దారికొస్తా యని అంటారు. కానీ సరైన అవగాహన లేకపోవడం, శాస్త్రీయంగా ఆలోచించే ధోరణి కొరవడటం, వ్యాపార ప్రయోజనాలు ఇమిడి ఉండటం వగైరా కారణాల వల్ల వైద్యులు అయినదానికీ, కానిదా నికీ రోగులతో ఔషధాలు వాడిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరుగా ఇవ్వాల్సిన యాంటీ బయాటిక్స్ను మొదట్లోనే అంటగడుతున్నారు. ఈ సంగతిని రెండేళ్లక్రితం యునిసెఫ్ నివేదిక వెల్ల డించింది. సక్రమంగా మందులు వాడకపోవడం వల్ల లేదా మోతాదుకుమించి మింగడం వల్ల ఏటా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో లెక్కేసే విధానమే మన దేశంలో లేదు. కనుక దాన్ని అరికట్టడ మనే ఆలోచనే ఉండటం లేదు. మెరుగైన, ప్రామాణికమైన వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పుడే ఔషధాల వాడకం ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. అదొక్కటే కాదు...దీనితో ముడిపడి ఉండే ఇతర సమస్యలపై సైతం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిశు భ్రమైన తాగునీటి లభ్యత, పారిశుద్ధ్యం అంతంతమాత్రం. వాటికి పౌష్టికాహారలోపం తోడవటంతో వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఎక్కువ. ఈ స్థితిలో జబ్బును అరికట్టడానికి అవసరమైన మోతాదులో మందుల వినియోగం కొరవడితే చెప్పేదేముంది? ఔషధ నిరోధకతను అరికట్టడానికి రెండేళ్లక్రితం భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. కానీ ఆచ రణలో అది సరిగా అమలు కావడం లేదు. కొన్ని ఔషధాలను నిషేధించడం, మరికొన్ని ఔషధాల విక్రయంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకున్నా అవి ఏమాత్రం చాలవన్నది ఐఏసీజీ భావన. ఔషధ నిరోధకత ఏ స్థాయిలో ఉన్నదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే దాన్ని సంపూర్ణంగా అరికట్టడం సాధ్యమవుతుంది. ఔషధ నిరోధకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇప్పటికే 7 లక్షలమంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకుంటుందని ఐఏసీజీ అంచనా వేస్తోంది. మన దేశంలో సగటున ప్రతి వేయిమందిలో రోజూ యాంటీబయాటిక్స్ వాడే అలవాటు 63 శాతం పెరిగిందని నిరుడు ఒక అధ్యయనం తెలియజేసింది. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తున్నదని వెల్లడైంది గనుక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే ప్రణాళికలు రచించి మందుల వినియోగంపై వైద్యులు, ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సుల వరకూ అందరికీ అవగాహన కలిగించాలి. విస్తృత ప్రచారోద్యమాన్ని నిర్వహించాలి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల తరహాలో జబ్బుపడినవారెవరికైనా నాణ్యమైన చికిత్స అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఔషధ నిరోధకత ముప్పునుంచి తప్పించుకోగలం. -
మేనిఫెస్టోల్లో ప్రజాసమస్యలు మాయం
భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా సమస్యల ప్రస్తావన మచ్చుకైనా మేనిఫెస్టోల్లో లేకపోవడం విచారకరం. బీజేపీతోసహా రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవు. ప్రతి ఎన్నికల ప్రచారం వివాదాలకు ఆజ్యం పోయడంతోనే ముగుస్తోంది. మానవాభివృద్ధి నివేదికల్లో మన దేశం చిన్న చిన్న దేశాల కంటే అట్టడుగుస్థానంలో పడిపోయింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నిద్రపోతున్న దయనీయమైన స్థితి, 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తుండటం.. ఇవేవీ మేనిఫెస్టోల్లో చోటుచేసుకోకపోవడం గర్హనీయం. ఎవరైతే సమాజగమనాన్ని మార్చడానికి నిరంతరం శ్రమిస్తారో, పరిష్కారమార్గాలకోసం పరితపిస్తారో, తమ కార్యాచరణ ద్వారా ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు కారణమవుతారో, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల మనసుల్లో చిరంజీవులుగా నిలిచిపోతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తం గానూ ఎందరో త్యాగధనులు దేశ భవిష్యత్తుకోసం తమ జీవితాలను ధారపోశారు. కానీ ఇటీవల మన దేశంలో జరుగుతున్న పరిణామాలనూ, నడుస్తున్న చరిత్రనూ గమనిస్తే నిరాశే మిగులుతుంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు చాలా ఉత్సాహంతో, ప్రణాళికలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. సభల్లో అధినాయకుల ప్రసంగాల్లోనూ ప్రజలకు హామీలు గుప్పించేస్తున్నారు. అయితే చాలా వరకు రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, ఓటర్ల సాక్షిగా నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవనడంలో సందేహం అక్కర్లేదు. ప్రజల సమస్యలు పాక్షికంగానే ప్రస్థావనకు వచ్చాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలకు వాళ్ళ ప్రణాళికల్లో, ప్రసంగాల్లో చోటు దక్కడంలేదన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రణాళికను గమనిస్తే మరింత ఆందోళన కలుగుతోంది. ఈ దేశంలో అన్ని విషయాలతో పాటు కులం ఒక నిజం. కులం ఒక వర్గీకరణ మాత్రమే కాదు. అది వివక్షకూ, అణచివేతకూ, అసమానతలకూ ప్రతిరూపం. ఇప్పటికీ అంటరానితనానికీ, అవమానాలకూ గురవుతున్న దళితుల విషయంగానీ, సమాజానికి దూరంగా అడవుల్లో నివసిస్తూ, తమ జీవితాలతో పాటు అల్లుకొని వున్న అటవీ సంపదనూ, ఖనిజవనరులనూ కొల్లగొడుతుంటే చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోతున్న ఆదివాసుల ఊసుగానీ ఈ ప్రణాళికల్లో కనిపించకపోవడం గమనించాల్సిన విషయం. అలాగే వృత్తులనూ, ఉపాధినీ కోల్పోయి పొట్టచేత పట్టుకొని ఎక్కడెక్కడికో వలసపోతున్న బీసీ కులాల గురించిగానీ, మతం పేరుతో వివక్షకూ, హింసకూ గురవుతున్న మైనారిటీల గురించిగానీ ఎన్నికల ప్రణాళికలు పట్టించుకున్న పాపాన పోలేదు. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా ప్రస్థావన మచ్చుకైనా ప్రణాళికల్లో లేకపోవడం గర్హనీయమైన విషయం. గతంలో ఇదే బీజేపీ ప్రణాళికల్లో మాట వరసకైనా ఈ విషయాలను చేర్చింది. కానీ ఈసారి అవేవీ వీరి దృష్టినైనా తాకకపోవడం విచారకరం. పైగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల పేదల కోసం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్ల విషయం మాత్రం చాలా ప్రముఖంగా పేర్కొన్నారు. ఆ పార్టీలో కొనసాగుతున్న ఈ వర్గాల నేతలుగా కొనసాగుతున్న వారు కూడా ఎందుకు నోరు మెదపడంలేదో అర్థం కాని విషయం. పైగా, ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో పేదరికం, ఆకలి, అభద్రత, ఆరోగ్యం, విద్య లాంటి సమస్యలు కూడా ఏ ఎన్నికల ప్రణాళికలోనూ చర్చకు రావడం లేదు. ప్రపంచ ఆహార భద్రత, పోషకాహార స్థితిగతులపై 2018లో విడుదలైన ఒక నివేదిక ఎన్నో కఠినమైన విషయాలను బయటపెట్టింది. ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధ్యయనంలో దాదాపు 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తున్నట్టు తేలింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉంటున్న దయనీయ స్థితి ఉన్నదని తెలిసింది. దేశంలోని 21 శాతం మంది పిల్లలు వయసుకి తగ్గ శారీరక ఎదుగుదల లేక అనారోగ్యంతో బతుకులీడుస్తున్నారని కూడా ఆ సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్త ఆకలి సూచికలో మన దేశం 103వ స్థానంలో ఉంది. ఈ సంస్థ సర్వే చేసిన దేశాలు 119 మాత్రమే. అంటే మన దేశం అ«ట్టడుగు స్థితిలో 7వ స్థానంలో ఉంది. వీటన్నింటితో పాటు, గ్రామీణ, పట్టణ పేద మహిళలు దాదాపు 51.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. తీవ్ర ఆందోళన కలిగించే ఇలాంటి అంశాలేవీ ఈ అతిపెద్ద ఎన్నికల్లో చర్చకు నోచుకోకపోవడం గమనార్హం. చర్చలే జరగకపోతే, మన పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు సైతం ఆకలి సూచికలో మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ మార్చిలో విడుదలైన ఏడవ ప్రపంచ సంతోషదాయక నివేదిక మన దేశంలో గూడుకట్టుకున్న దుఃఖాన్ని ప్రతిబింబించింది. మన పొరుగుదేశమైన భూటాన్ ఆలోచన ప్రకారం మనిషికి ఆర్థికంగా అందే ప్రయోజనాలతో పాటు, ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరా? అనేది కూడా పరిశీలించాలనే ప్రయత్నం మొదలైంది. మార్చి 21న ప్రతి సంవత్సరం సంతోష దినోత్సవం జరుపుతూ గత ఏడేళ్ల నుంచి ఐరాస నివేదికలను విడుదల చేస్తున్నది. అందులో మన దేశం మొదటి నుంచీ వెనుకబడే ఉంది. 2013లో 111వ స్థానం, 2015లో 117వ స్థానం, 2016లో 118వ స్థానం, 2017లో 122వ స్థానం, 2018లో 122వ స్థానం. ఇక 2019లో 140వ స్థానానికి పడిపోవడం మన దేశ దుస్థితినీ, ప్రజల్లోని అసంతృప్తినీ చాటిచెపుతోంది. దేశ ప్రజల సంతోషం గ్రాఫ్ విషయంలో పాక్, బంగ్లాదేశ్, లాంటి దేశాలు కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. ఈ నివేదికలో గృహ వసతి, ఆదాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఉద్యోగం, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు, ఆయుర్దాయం, రక్షణ లాంటి విషయాలను పరిగణనలోనికి తీసుకున్నారు. మన దేశంలో ఆదాయాలు ఎక్కువగా ఉన్న వర్గాలు కూడా సంతోషంగా లేవని ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆరోగ్యంపై పెరుగుతున్న భారం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లల విద్య విషయంలో అవుతున్న వ్యయం కూడా ఈ వర్గాలను వేధిస్తున్నది. ముఖ్యంగా నగరీకరణ పెరుగుతుం డటం వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలు ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. నగరాలలోకి ఆడపిల్లలను పంపాలనే ఆలోచన కూడా తల్లిదండ్రులను భయపెడుతున్నది. గత ఐదేళ్ళలో భిన్న విశ్వాసాలు, ప్రజల్లో పెరుగుతున్న వైషమ్యాలు కూడా ఈ దేశంలోని ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు కారణంగా భావించొచ్చు. వీటన్నింటితో పాటు దేశానికి శక్తివంతమైన మానవ వనరులు మన యువత. ఈ దేశంలోని కోట్లాది మంది యువతీ, యువకులు అభద్రతలో కొట్టుమిట్టాడుతున్నారు. 2018లో మన నిరుద్యోగం రేటు 3.5 శాతం. దాదాపు 40 కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగానే జీవితాలను గడుపుతున్నారు. ఇది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే అంశం. ఎందుకంటే, సమాజ స్థితిని తెలియజేసేది యువత ఎదుగుదల మాత్రమే. ఈ ప్రమాదకర పరిస్థితి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇన్ని సమస్యలున్నా భారతదేశం పేద దేశం మాత్రం కాదు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశమే. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మన స్థూల జాతీయదాయం చూస్తే మన దేశ ఆర్థిక పురోగతి అర్థం అవుతుంది. 1951 నుంచి మన సరాసరి స్థూల జాతీయాదాయం 6.21 శాతంగా ఉండింది. కానీ 2010లో 11.40 శాతాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది. మన దేశ స్థూల జాతీయాదాయం దాదాపు రెట్టిం పైంది. అయితే ఇది ప్రజల బతుకుల్లో ఎక్కడా కనిపించడంలేదు. మన దేశంలో దేశ సంపద పెరుగుతున్నది. కానీ అది కొద్దిమంది చేతుల్లోకే చేరుతున్నది. ‘పెరుగుతున్న అంతరాలు’ పేరుతో ఆక్స్ఫామ్ అనే అంతర్జాతీయ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఆదాయాల్లో అంతరాల గురించి సవివరంగా పేర్కొన్నారు. మనదేశంలోని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ 59 వ నివేదికలో ఇదే రకమైన ఆందోళనను వ్యక్త పరిచింది. దేశంలో అంతరాలు 1990 నుంచి పెరగడం ఎక్కువైంది. సరళీకరణ ఆర్థిక విధానాలూ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల ఆదాయాల్లో అంతరాలు ఆకాశాన్నంటుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. 2017లో వెలువరించిన ప్రపంచ సంపద నివేదికలో పేర్కొన్నట్టు, 2002లో పది శాతం మంది చేతుల్లో 52.9 శాతం సంపద ఉండగా, 2012 కి వచ్చేసరికి 62.1 శాతానికి పెరిగింది. అదేవిధంగా 2002లో 15.7 శాతం సంపద కేవలం ఒక్కశాతం మంది చేతుల్లోనే పోగుపడింది. 2012లో అది 25.7 శాతానికి మించి పోయింది. దీనివల్ల దేశంలో ప్రజల్లో ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం పెరిగిపోతున్నది. ఈ విషయాలేవీ కూడా ఈ ఎన్నికల్లో చర్చకు కూడా రాకపోవడం గమనార్హం. దీనికి బలమైన కారణం ఉన్నది. ఈ దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులూ, వ్యాపారులూ, పారిశ్రామిక వేత్తలూ, వాణిజ్యవేత్తలూ, అవినీతిమయమైన బ్యూరోక్రసీ ఒక కూటమిగా ఏర్పడింది. దీనితో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఏర్పడిన బడ్జెట్లూ, సహజ వనరులైన భూమి, అడవి, భూగర్భ సంపద అంతా కొందరి చేతుల్లోకి పోయింది. దానితో లక్షల రూపాయల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న వాళ్ళు అనతికాలంలోనే వేలకోట్లకు అధిపతులుగా మారుతున్నారు. ఈ స్థితిలో జరుగుతున్న ఎన్నికలు ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబించకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. కానీ సమాజం దీన్ని సమస్యగా భావించకపోవడమే నేరమౌతుంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
మళ్లీ మోకాలడ్డిన చైనా
ఆర్థిక ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టని ప్రపంచంలో చైనా భిన్నంగా ఉంటుందని ఆశించడం పొరపాటే. అది ఎప్పటిలాగే జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించాలన్న ప్రతిపాదనను భద్రతామండలి సమావేశంలో అడ్డుకుంది. మండలిలో శాశ్వత సభ్య దేశంగా తనకున్న వీటో అధికారాన్ని వినియోగించుకుని, ‘సాంకేతిక కారణాలు’ సాకుగా చూపి ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాల ప్రతిపాదనను బుట్టదాఖలా చేసింది. ఇలా చేయడం చైనాకు కొత్తగాదు. పదేళ్లుగా ఇదే పని చేస్తూనే ఉంది. అందుకు పాకిస్తాన్ నుంచి ప్రతిఫలం పొందుతూనే ఉంది. ప్రపంచంలో అత్యధిక దేశాలు ‘ఉగ్రవాదం’ మహమ్మారి బారినపడుతున్నా ఆ పదానికి అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన చట్టబద్ధమైన నిర్వచనం ఇంతవరకూ లేకపోవడం వల్ల చైనా చాలా సునాయాసంగా ఇలాంటి ‘సాంకేతిక కారణాలు’ చూపగలుగుతోంది. ఇలాంటి నిర్వ చనం లేకపోబట్టే చైనా పాలకులు తమ ఏలుబడిలోని జిన్జియాంగ్ ప్రాంతంలో స్వయంపాలన కోసం, మత స్వేచ్ఛ కోసం శాంతియుతంగా పోరాడుతున్న వీగర్ జాతీయవాదుల్ని ఉగ్రవాదులుగా ముద్రేసి తీవ్రంగా అణిచేయగలుగుతున్నారు. అక్కడ ఉగ్రవాద వ్యతిరేక చట్టమంటూ లేకపోయినా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ముందున్న ముసాయిదా ప్రకారం సమాజానికి హాని తలపెట్టే పనులు చేసినా, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినా, ఆర్థిక నష్టాలకు కారణమైనా ఉగ్రవాదులే అవుతారు. ఇలా స్వదేశంలో ఎందరో ఉగ్రవాదుల్ని ‘చూడగలుగుతున్న’ చైనా పాలకులకు మసూద్ అజర్లో అలాంటి లక్షణాలు కాస్తయినా కనబడటం లేదు! కశ్మీర్లోని పుల్వామాలో 43మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్ర దాడి జరిగిన కొద్దిసేపటికే అది తమ ఘనతేనని జైషే సంస్థ ప్రకటించుకుంది. ఆ దాడికి కారకుడైన యువకుడి పేరు సైతం ప్రకటించింది. తాము ఎప్పటిలాగే‘బాధ్యతాయుతమైన’ వైఖరితో ఉన్నామని, ఈ సమ స్యపై సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడాకే నిర్ణయించాలని భావిస్తున్నామని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లూ కాంగ్ చెబుతున్నారు. 2008 నవంబర్లో ముంబైపై ఉగ్రదాడి జరిగాక మసూద్ అజ ర్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ఆ మరుసటి ఏడాది మన దేశం ప్రతిపాదిం చింది. అప్పుడూ ఇదే తరహాలో చైనా ఆ ప్రతిపాదనకు అడ్డుపుల్ల వేసింది. 2016లో పఠాన్కోట్ వైమానిక దళ స్థావరంపై దాడి జరిగాక మరోసారి ఇదే ప్రతిపాదన తీసుకురాగా అప్పుడు సైతం చైనా అడ్డగించింది. ఆ మరుసటి ఏడాది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు తీర్మానం తీసుకొచ్చిన ప్పుడూ చైనా ఈ వైఖరే తీసుకుంది. జైషే సంస్థ భారత్లో దాడులకు పాల్పడిన ప్రతిసారీ తానే కారణమని చెప్పుకుంటోంది. భారత్ను బెదిరిస్తూ మసూద్ చేసిన ప్రసంగాలున్నాయి. కానీ ఇంకేదో కావాలని చైనా కోరుతోంది. ఆ దేశానికి తనపై ఇంత వల్లమాలిన విశ్వాసం ఉన్నందుకు మసూద్ కూడా ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. కానీ చైనాకు వేరే ప్రయోజనాలున్నాయి. పాక్లో వివిధ ప్రాజెక్టుల్లో అది వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ ప్రాజెక్టుల్లో పనిచేసేవారిలో అత్యధికులు చైనా జాతీయులే. వారంతా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయవలసి వస్తోంది. వారికి ఉగ్రవాద బెడద తప్పడంలేదు. పెట్టుబడులు భద్రంగా ఉండటానికి అక్కడి ప్రభుత్వంతో... తమ పౌరులు క్షేమంగా ఉండటానికి పాకిస్తాన్ సైన్యంతో మంచి సంబంధాలు కొనసాగించడం చైనాకు అవసరం. ఇక సెంట్రల్ ఆసియా, యూరప్, ఆఫ్రికాలతో నేరుగా వాణిజ్యబంధం ఏర్పరచుకోవడానికి భారీయెత్తున తల పెట్టిన అధునాతన సిల్క్ రూట్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టులో పాకిస్తాన్ను చేర్చుకుని ఇప్పటికే చైనా పనులు ప్రారంభించింది. అది ఏ మాత్రం అడ్డం తిరిగినా చైనా నిండా మునుగుతుంది. అలాగే మన దేశానికి ఎంతో కొంత చెక్ పెట్టడానికి పాకిస్తాన్ తోడ్పడుతుందన్న నమ్మకం దానికుంది. కనుకనే ఏదో ఒక సాకుతో మసూద్ అజర్ విషయంలో భద్రతామండలి చర్య తీసుకోకుండా అది అడ్డుపడుతోంది. వాస్తవానికి పుల్వామా దాడి జరిగిన వెంటనే చైనా స్పందిం చిన తీరు గతంలో కంటే భిన్నంగా ఉంది. ఉగ్రవాదం బెడదపై ఈ ప్రాంత దేశాలన్నీ సహకరించు కుని దాన్ని అరికట్టడానికి పూనుకోవాలని, శాంతిసుస్థిరతలు సాధించాలని ఆ ప్రకటన సూచిం చింది. ఉగ్రవాదం బెడద పోవడానికి తాను భద్రతామండలిలో సహకరించదు. అజర్పై ఈగ వాలనీయదు. కానీ భారత్–పాకిస్తాన్లు మాత్రం మాట్లాడుకుని శాంతిసుస్థిరతలు సాధించాలి. ఇదెలా సాధ్యమవుతుందో, ఈ తర్కాన్ని ఏమంటారో చైనాయే చెప్పాలి. భద్రతామండలి 1998లో భద్రతామండలి ఆమోదించిన 1267 తీర్మానం పరిధిలోకి మసూ ద్ను తీసుకురావడం పదేళ్లుగా మన దేశం సాగిస్తున్న ప్రయత్నం సారాంశం. ఆ పని చేస్తే అతడి ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని, ఆయుధాల సేకరణ అసాధ్యమవుతుందని భావించడమే ఇందుకు కారణం. 1267 తీర్మానం తర్వాత మండలి ఈ రెండు దశాబ్దాల్లోనూ ఉగ్రవాదుల కట్టడికి అనేక తీర్మానాలు చేసింది. కానీ నిషేధించిన సంస్థల్ని మూసేసి కొత్త పేర్లతో రావడం, యధావిధిగా తమ కార్యకలాపాలు సాగించడం ఉగ్రవాదులకు అలవాటు. గతంలో 1267 తీర్మానం కింద అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించిన జమా ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, మరో అయి దుగురు పాకిస్తాన్లో అరెస్టయినా కొన్ని నెలలకే విడుదలయ్యారు. ఐక్యరాజ్యసమితి ముస్లిం దేశా లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని, భారత్ ప్రభావంతో ఇలాంటి తీర్మానాలు చేస్తున్నదని, సార్వభౌమాధికారం ఉన్న పాక్ దీన్నెలా అనుసరిస్తుందని హఫీజ్ చేసిన వాదనను లాహోర్ హైకోర్టు అంగీకరించి అతగాడిని విడుదల చేసింది. కనుక కశ్మీర్లో శాంతికి ప్రయత్నాలు చేయడం, సరిహద్దుల్లో ఉగ్రవాదులు ప్రవేశించకుండా కట్టడి చేయడంపై దృష్టి పెట్టడం అవసరం. ఆ దిశగా అడుగులేస్తే ఉగ్రవాదం బెడద చాలావరకూ అరికట్టడం సాధ్యమవుతుంది. -
యూఎన్డీపీ అంబాసిడర్గా పద్మాలక్ష్మి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) తన నూతన గుడ్విల్ అంబాసిడర్గా పద్మాలక్ష్మిని నియమించింది. టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మిని అంబాసిడర్గా నియమిస్తున్నుట్లు యూఎన్డీపీ ప్రకటించింది. గుడ్విల్ అంబాసిడర్గా నియమితురాలైన ఆమె అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి పాటుపడాల్సి ఉంటుంది. ‘ప్రపంచంలోని అనేక మంది మహిళలు, బాలికలు ఎన్నో వివక్షలను, అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న సంగతి మనం మరచిపోకూడదు. ప్రధానంగా అసమానతపై దృష్టి సారిస్తా’ అని ఈ సందర్భంగా పద్మాలక్ష్మీ అన్నారు. -
రేపటి దీపాల్ని వెలిగిద్దాం రండి
కొంత ప్రజాస్వామ్యం, కొన్ని పౌరహక్కులు, కాస్తంత సమభావన వైపు సాగుతున్నాం అనుకునే లోపే భారీ తిరోగమనం ప్రారంభమైంది. ఆర్థికరంగంలో స్త్రీ పాత్ర 19.5 శాతానికి పడిపోవడమే కాదు.. మగ ఛాతీ కొలతల్ని సామర్థ్యంగా ప్రకటించుకోవడంతో ఆగకుండా స్త్రీలపై భౌతిక, లైంగిక హింసలు, అంతర్జాలపు దాడులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల వలయం నుంచి బయటపడాలంటే శతాబ్దాల పోరాట స్ఫూర్తి ఆసరా తప్పనిసరి. ఈ మార్చి 8ని ముందుకే సాగే కాలం సాక్ష్యంగా పరిణామం చెందే లోకాన్ని మార్పులోకి వరుగులెత్తించే పోరాటాల స్ఫూర్తిగా భుజాన్నేసుకుని మోసుకుపోవాలి. పాత లోకాల్ని కాల్చే రేపటి దీపాల్ని వెలిగిద్దాం పదండి. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు పిలుపులూ వచ్చాయి. ఒకటి స్వచ్ఛంద సంస్థల నుంచి ’’మెరుగుపడాలంటే సమతుల్యం అవసరం’’ అని. మరొకటి ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం నుంచి ’’సమభావపు ఆలోచన చురుకుగా నిర్మించడం, పురోగమనం కోసం వినూత్నత’’ అనే పిలుపూ వచ్చింది. సమానం అనే ఆలోచన చేసినంత మాత్రాన సమానత్వం ఉందా, వస్తుందా.. లేక ఆలోచనతో మొదలు పెట్టి చురుకుగా సమానత్వం నిర్మించాలా అనే అనుమానం రాకుండా అలవాటైపోయిన ఈ అసమ వ్యవహార శైలిని ఛేదింది సమానత్వం సాధించే దిశగా సాగాలని దానికి వినూత్న పద్ధతులు, ప్రక్రియలు కనిపెట్టాలని ఐరాస కోరింది. ప్రతివారు సాధికారిత గురించే మాట్లాడుతున్నారు కానీ ఆచరణలో అంగుళం కూడా ముందుకు సాగడం లేదు. ఎందుకంటే కనీస హక్కులు అంటే చదువుకోవడం ఉద్యోగం వంటివి ఇస్తే చాలు సాధికారతే అంటూ ప్రతిపనికీ సాధికారత పేరు తగిలిస్తున్నారు. సాధికారత అంటే అధికారం కావాలి. దేనిపైన అధికారం కావాలి స్త్రీలకు? భర్తపైనా? పిల్లలపైనా? కుటుంబం పైనా? సమాజంపైనా? అంటే వందసార్లు కాదు అని చెప్పాల్సి ఉంటుంది.వారి శరీరాలపైనా, వారి చదువులు, ఉపాధి అవకాశాల పైనా, వనరులపైనా, భాగస్వామి ఎంపికపైనా మొత్తంగా చెప్పాలంటే వారి జీవితాలపై నిర్ణయాధికారం కోరుకుంటున్నారు. బీజింగ్ సదస్సు పత్రాల ఆధారంగా 2001–02లో ఐరాస ప్రత్యుత్పత్తి హక్కుల తీర్మానం ప్రతిపాదించింది. దానిపై భారతదేశం సంతకం చేసింది. కానీ ఆనవాయితీ అది అమలులో పెట్టేందుకు ఏ చర్యా తీసుకోకపోగా పరిస్థితి మరింత విషమించింది. స్త్రీలకు ప్రత్యుత్పత్తి హక్కు ఎంత ఘోరంగా నిరాకరించబడుతున్నదో ఆడపిల్లల జననాల రేటు సరోగసీ వ్యాపారాన్ని పరిశీలిస్తే చాలు. నీతిఆయోగ్ 2018లో ప్రచురించిన ’’ఆరోగ్యకరమైన రాష్ట్రాలు భారత దేశ పురోగతి’’ ప్రకారం ప్రధానమైన 17 పెద్ద రాష్ట్రాల్లో ఆడపిల్లల జననాల సంఖ్య దారుణంగా పడిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు కేవలం 914 మంది అమ్మాయిలు పుడుతుండగా (జాతీయ సగటు) అది ఇప్పుడు 900కి తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాలు బాలికా భ్రూణ హత్యల్లో మేం తక్కువ కాదు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బాలికల జననాల రేటు దారుణంగా పడిపోయిందన్న విషయం గుర్తించినట్లు గానీ మాట్లాడినట్లు గానీ కనపడదు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఇది 918గా ఉంది. నీతి ఆయోగ్ లెక్కప్రకారం ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిల పుట్టుక 907 (ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు) అంటే మొత్తంమీద అమ్మాయిలను పుట్టనీయకుండా గర్భస్రావాలకు పాల్పడుతున్నారా లేక తాజా టెక్నాలజీతో పిండంగా మారకముందే ఎలిమినేట్ చేస్తున్నారా అనే అంశంపై ఏ లెక్కలూ లేవు. అమ్మాయిల సంఖ్య పడిపోవడంలో గమనించాల్సిన అంశాలు డబ్బున్న, విద్యావంతులున్న ప్రాంతాలు నగర సంస్కృతిలో అమ్మాయిల పుట్టుక రేటు అతి తక్కువ. ఆదివాసీలు అమ్మాయిల, స్త్రీల సంఖ్య ప్రకృతి నిర్దేశించిన ప్రకారం మగవాళ్ల కంటే అధికంగా అంటే 1000: 1121 (బాలలు: బాలికలు) నిష్పత్తిలో ఉంది. స్త్రీ పురుష వివక్షత ఆదివాసీల్లో చాలా తక్కువగా ఉంది. స్త్రీలపై హింస కూడా. ఆంధ్రప్రదేశ్లో అనేక ఆధిపత్య కులాల్లో పెళ్లికి అమ్మాయిల కొరత ఏర్పడింది. హరియాణా, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు పేద రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని కొనుక్కుని ద్రౌపది ఆచారానికి తిరోగమిస్తున్నారు. హరియాణాలో పెళ్లికాని యువకులు పెరిగిపోవడం, ఫోర్న్ అందుబాటుతో రోజుకి సగటున 8 సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. సంపద పెరుగుదలకూ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికీ, అమ్మాయిల సంఖ్య బాగా పడిపోవడానికి, స్త్రీలపై హింస విపరీతంగా పెరగడానికీ మధ్యగల సంబంధం ఏమిటి? కారణాలు ఏమిటి? అనే విషయం ఈ దేశంలో కనీస చర్చకు నోచుకోలేదు. దేశం కోసం నలుగురు కొడుకుల్ని కనాలని ఒక సాధ్వి, కాదు.. 10 మందిని కనాలని వారిని సైన్యంలోకి పంపాలంటూ ఒక మహారాజు (ఇద్దరూ పార్లమెంటు సభ్యులే) వాగుతుంటే పట్టించుకోని పార్లమెంటరీ వ్యవస్థ స్త్రీలకు ప్రత్యుత్పత్తి హక్కు ఉందని ఒప్పుకోవడానికి నిరాకరించినట్లు కాదా? 53 శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్యావ్యాపారపు వనరుగా మారాక ప్రభుత్వ పాఠశాల కూడా వదిలి అన్నదమ్ముల ఫీజు కోసమో, ఇంటి పనుల భారం మోయడానికో బడి వదిలేసే ఆడపిల్లలను ఏ విద్యా హక్కు ఆదుకుంటోంది? ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా చేసే ఉద్యోగాలు, వృత్తులే స్త్రీలు ఎంచుకుంటే కుటుంబాలు నడుస్తాయనే అభ్యుదయవాదులకు శాస్త్ర సాంకేతిక రంగాల పురోగమనంలో ఏర్పడుతున్న విస్తృతావకాశాల క్రీనీడలు స్త్రీపురుషుల మధ్య డిజిటల్ అగాధాలు ఏర్పరుస్తున్నాయని గమనిస్తున్నారా? గణితంలో, భౌతిక రసాయన శాస్త్రాల్లో పరిశోధనా రంగాల్లో అసలే అంతంతమాత్రంగా ఉంటున్న మహిళలు మరింత ముందుకు సాగి వారి మేధోఫలితాలు సమాజానికి అందించడానికి బదులు కుటుంబంలో కూరుకుపోవడం వల్ల దేశానికి జరిగే నష్టం ఎంతో అంచనా వేస్తున్నారా? పనిచేయగలిగే వయస్సులోని స్త్రీలకు వారు చేయగలిగే ఉపాధి ఇవ్వలేకపోవడంతో ఈ దేశం ఏటా 1.7 ట్రిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోతున్నదని ఏ అర్థశాస్త్రవేత్తలయినా పాలకుల కళ్లు తెరిపించే కాలం కోసం ఇంకెంత కాలం వేచి చూడాలో? ఈనాటికీ ఇంటా బయటా స్త్రీలు చేస్తున్న పని విలువను గుర్తించడంలో దేశాలు, సమాజాలు, కుటుంబాలు విఫలం అయ్యాయని చెప్పాలా? లేక గుర్తించ నిరాకరిస్తున్నారా? ఇంటి పనుల్లో రోజూ పురుషునికంటే కనీసం 3 నుంచి 5 గంటలు స్త్రీలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల శ్రమ స్త్రీలదేనని ఐరాస అధికారిక అధ్యయనం వెల్లడించింది. అయినా ఒక్క వెనిజులా తప్ప మరే దేశం కూడా ఇంటి చాకిరి విలువను స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా లెక్కగట్టేందుకు చొరవ చూపడం లేదు. స్త్రీలు ఉపాధుల్లో ఉండటం అన్నిరకాల ఉత్పత్తిని పెంచుతుందని తెలిసినా స్త్రీల ప్రథమ బాధ్యత పిల్లలు, ఇల్లు అని ఎందుకు నీతులు ఎడతెగకుండా ప్రచారం చేస్తున్నారు? అలాగే స్త్రీలు పనిలో ఆదాయం పొందటం ద్వారా పెరిగే కొనుగోలు శక్తి వలన ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుంది. అయినా ఆ వైపుగా విధానాలు రూపొందించడం లేదు. స్త్రీలు సహజసిద్ధమైన పిల్లల పెంపకం నైపుణ్యాలు, సేవాభావం కలిగి ఉంటారనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేదు. పిల్లల్ని కనడం, పాలివ్వడం వంటి జైవిక ధర్మాలను పిల్లల పెంపకం, త్యాగం, ప్రేమలతో ముడిపెట్టడం ద్వారా స్త్రీలను ఇంటికి పరిమితం చేయడం ఒక సహజ విషయంగా ప్రచారం జరుగుతోంది. స్త్రీ పురుషుల్లో ఎవరైనా నేర్చుకుంటే ఆసక్తి ఉంటే పిల్లల పెంపకం, పెద్దల సేవ చేయవచ్చు. కానీ అలాంటి భావాలకు చోటిస్తే అతి మామూలుగా జరిగిపోతున్న స్త్రీల శ్రమదోపిడీకి దెబ్బతగులుతుంది. పైగా బయట సంపాదించే బాధ్యత మగాడిదే అని చెప్పడం ద్వారా పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, అసంఘటిత రంగంలో స్త్రీల ఉపాధికి పురుషుని కంటే తక్కువ వేతనం ఇచ్చి మరింత లాభాలు పొందే అవకాశం పోతుంది. ధర్మశాస్త్రాలు, రస వివేచనలు, సకల కళలు వాడి ఇంట్లో పనిముట్లు. స్వర్గానికీ నరకానికీ వాడే కామందు అంటూ ధనస్వామ్యం లాభం కోసం పవిత్రాత్మ తోక చివర ఈకలమ్ముతుందంటాడు మయకోవస్కీ. కులసతుల త్యాగాలతో సినిమాలు, మాదకద్రవ్యాల నిషాలో హింసాత్మక ఫోర్నోగ్రఫీ స్త్రీల శరీరాల సరకుపై వారు లాభాలార్జిస్తారు. కొంత ప్రజాస్వామ్యం, కొన్ని పౌరహక్కులు, కాస్తంత సమభావన వైపు సాగుతున్నాం అనుకునే లోపే భారీ తిరోగమనం ప్రారంభం అయింది. ఆర్థికరంగంలో స్త్రీ పాత్ర 19.5 శాతానికి పడిపోవడం ఒక్కటే కాదు. మగ ఛాతీ కొలతల్ని సామర్థ్యంగా ప్రకటించుకోవడంతో ఆగకుండా స్త్రీలపై భౌతిక, లైంగిక హింసలు, అంతర్జాలపు దాడులు పెరుగుతున్నాయి. పురుగులు పడ్డ శవంలా కుళ్లి గబ్బు కొడుతున్న ఆధిపత్యం సాంస్కృతిక రంగాన్ని సైతానులాగా ఆక్రమించుకుంటోంది. స్త్రీలను రాతిబొమ్మలుగా, దేవతలుగా కొలుస్తాం తప్ప రక్తమాంసాలున్న మనుషులుగా పరిగణించం అని పురుషత్వం చిందులు దొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఏది నిజం, ఏది కాదు, ఎటుపోవడం సరైంది, ఏది నీతి, ఏది అభివృద్ధి, ఏది అభ్యుదయం, ఏది అమ్ముడుపోవడం అర్థం కాక స్త్రీల జీవితం దళారులకు అమ్ముడుపోతోంది. తమ జీవితాలపై హక్కుకోసం సంఘటితంగా ఉద్యమించిన మహిళల పోరాట స్ఫూర్తి దినోత్సవం కూడా తార్పుడు భావాల వలలో చిక్కి ఒకరోజు ’బారు’ మహిళల కోసం దాగా ఎగబాకింది. నూనెలో తడిసిన పాలరాయి గచ్చుపై నిలుచున్నట్లున్న ఈ పరిస్థితుల వలయం నుంచి బయటపడాలంటే శతాబ్దాల పోరాట స్ఫూర్తి ఆసరా తప్పనిసరి. దిక్కూ దివాణం తెలియనట్లు కకావికలంగా పరుగులు పెడుతున్న గందరగోళం మధ్య నిదానంగా, నిశ్శబ్దంగా ఒక ఉద్యమ ప్రణాళిక రేఖా చిత్రం కూడా చూడొచ్చు. సమభావన బలం పుంజుకుంటోంది కాబట్టి ఈ ఇనుప డేగలు వేట ఉధృతం చేశాయని గమనించక తప్పదు. కాబట్టి ఈ మార్చి 8ని ముందుకే సాగే కాలం సాక్ష్యంగా పరిణామం చెందే లోకాన్ని మార్పులోకి వరుగులెత్తించే పోరాటాల స్ఫూర్తిగా భుజాన్నేసుకుని మోసుకుపోవాలి. జీవితం పట్ల ప్రేమతో సమానతపై అచంచల విశ్వాసంతో మన లక్ష్యంపై అకుంఠిత దీక్షతో ముందుకు సాగుదాం పదండి. ఇది మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాట దినోత్సవం. పాత లోకాల్ని కాల్చే రేపటి దీపాల్ని వెలిగిద్దాం పదండి. వ్యాసకర్త: పి.దేవి, సాంస్కృతిక కార్యకర్త -
బ్లాక్లిస్ట్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్
ఐక్యరాజ్యసమితి : పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటనలో ప్రమేయమున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను బ్లాక్లిస్ట్లో ఉంచాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. కాగా మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్పై చైనా ప్రతికూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్ల తాజా వైఖరిపై చైనా ఇంకా స్పందించలేదు. మసూద్ అజర్ను అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని, ఆయన ఆస్తులను సీజ్ చేయాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు పదిహేను మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. కాగా ఏకాభిప్రాయంపై నిర్ణయం తీసుకునే కమిటీలో ఈ ప్రతిపాదనపై మార్చి 13లోగా సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. గతంలో 2017లో మసూద్ అజార్ను బ్లాక్లిస్ట్లో పెట్టాలని భద్రతా మండలి కమిటీ ఎదుల ప్రతిపాదన వచ్చిన క్రమంలో ఉగ్రవాదిగా ఓ సంస్థ లేదా వ్యక్తిని నిర్వచించేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయని, ఈ నిబంధనలను సంబంధిత ఐరాస కమిటీ క్షుణ్ణంగా పరిశీలించాలంటూ ఈ ప్రతిపాదనకు చైనా మోకాలడ్డింది. -
పుల్వామా దాడి నీచం, హేయం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగం (యూఎన్ఎస్సీ) శుక్రవారం తీవ్రంగా ఖండించింది. దాడిని క్రూరమైన, పిరికిపందల చర్యగా అభివర్ణించింది. భారత్ వాదనకు మద్దతుగా.. పాకిస్థాన్ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి బాధ్యత వహించినట్లు కూడా తీర్మానంలో పేర్కొంది. దోషుల్ని చట్టం ముందుకు తీసుకురావడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి అన్ని దేశాలూ భారత ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాని నిర్మూలనకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చింది. కాగా భారత్కు చెందిన కశ్మీర్ అని కాకుండా ‘భారత్ అధీనంలోని కశ్మీర్’ అని ప్రకటనలో పేర్కొనాలని ఈ సందర్భంగా చైనా సూచించనట్లు సమాచారం. అయినప్పటికీ చైనా అభ్యంతరాలను తోసిపుచ్చి భారత్ ప్రతిపాదించిన ప్రకటనకే మండలి మొగ్గుచూపడం విశేషం. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ స్థాపకుడు మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి చైనా మోకాలడ్డుతుండడం తెలిసిందే. త్వరలో మరోసారి అజార్ అంశాన్ని ఫ్రాన్స్ మండలిలో ప్రవేశపెట్టనుంది. -
‘మోదీ.. మీరొక చెత్త విలన్లా మిగిలిపోతారు’
న్యూఢిల్లీ : పర్యావరణ సంక్షోభాన్ని రూపుమాపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపాలని స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రీటా తుంగ్బెర్గ్(16) ఆకాంక్షించింది. లేనిపక్షంలో ఆయన మానవ చరిత్రలో ఓ చెత్త విలన్లా మిగిలిపోతారని అభిప్రాయపడింది. ఈ మేరకు గ్రీటా మోదీకి విఙ్ఞప్తి చేస్తున్న వీడియోను బ్రుట్ ఇండియా అనే వీడియో పబ్లిషర్ ప్రసారం చేసింది. ‘డియర్ మిస్టర్ మోదీ.. పర్యావరణ సంక్షోభాన్ని అరికట్టేందుకు మీరు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం మాటలు మాట్లాడితే సరిపోదు. అలాగే చిన్న చిన్న విజయాలకు సంతోషించడం మొదలుపెడితే.. మీరు వైఫల్యం చెందుతారు. ఒకవేళ అదే జరిగితే మానవాళి చరిత్రలో మీరో చెత్త విలన్లా మిగిలిపోతారు. కానీ అలా జరగడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు’ అంటూ గ్రీటా తన మెసేజ్లో పేర్కొంది. కాగా అస్పెర్జర్ సిండ్రోమ్తో బాధ పడుతున్న 16 ఏళ్ల గ్రీటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించింది. ఈ సందర్భంగా.. రాజకీయ నాయకులను ఉద్దేశించి.. ‘మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు. చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించి ప్రపంచ దేశాధినేతల దృష్టిని ఆకర్షించింది. కాగా కర్భన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడతామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 121 దేశాల సహకారంతో 2030 నాటికి సోలార్ పవర్ ఉత్పత్తి పెంచేందుకు ఏర్పాటైన ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ గురించి అంతర్జాతీయ వేదికపై మోదీ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో గ్రిటా.. ఆయనకు మెసేజ్ పంపింది. -
‘భారత్, పాక్లకు మా సహకారం ఉంటుంది’
న్యూయార్క్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను నివారించేందుకు ఇరు దేశాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ పిలుపునిచ్చారు. ఇందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ మాట్లాడుతూ..‘ పుల్వామా ఉగ్రదాడి కారణంగా ఇండియా, పాకిస్తాన్ల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి ఇబ్బందులను తగ్గించుకునేందుకు వారు ముందుకు రావాలి. అదే విధంగా వారు కోరినట్లైతే ఇరు దేశాలకు మా సహాయ సహకారాలు ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. ఇక పుల్వామా దాడిపై విచారణ జరిపేందుకు జమ్మూలో ప్రయాణిస్తున్న యూఎన్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా-పాకిస్తాన్(యూఎన్ఎమ్ఓజీఐపీ) బృందానికి ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని స్టెఫానే ప్రస్తావించారు. యూఎన్ఎమ్ఓజీఐపీ వాహనంపై కొంత మంది నిరసనకారులు పాకిస్తాన్ జెండా ఉంచి ఆందోళనకు దిగారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ బృందానికి మరింత భద్రత పెంచాలని భారత్ను కోరినట్లు వెల్లడించారు.(దాడి చేస్తే.. ఊరుకోం!) కాగా పుల్వామా ఘటన కారణంగా ప్రస్తుతం భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా ఐరాసను పాకిస్తాన్ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు... ‘ ‘పాకిస్తాన్పై భారత్ బలాన్ని ప్రయోగిస్తుందనే ఆందోళనలతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విచారణ కూడా చేయకుండానే పుల్వామాలో ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కారణమనడం అర్థరహితం. ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు తీసుకోవడం అనివార్యం. ఇందుకోసం ఐరాస తప్పక రంగంలోకి దిగాలి’ అని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐరాసకు లేఖ రాశారు. అయితే భారత్, పాక్ల మధ్య మూడో దేశం లేదా సంస్థ జోక్యాన్ని భారత్ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఏ సమస్యైనా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. -
జైషే చీఫ్పై మారని చైనా తీరు
-
జైషే చీఫ్పై మారని చైనా తీరు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనను చైనా ఖండించినప్పటికీ ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వినతిని తోసిపుచ్చింది. జైషే చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్ దీర్ఘకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షౌంగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని, ప్రాంతీయ శాంతి సుస్ధిరతలను పరిరక్షించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జైషే చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలనే అంశంపై చైనా వైఖరిని ప్రస్తావిస్తూ పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ను ఐరాస భద్రతా మండలి కౌంటర్-టెర్రరిజం జాబితాలో ఉంచారని, వ్యక్తిగతంగా మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనే అంశాన్ని బాధ్యతాయుతంగా, వృత్తిపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. -
ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది
-
చేసిన రిస్క్కు ఫలితం దక్కింది
టొరంటో: సౌదీఅరేబియాలో మహిళలను బానిసలుగా చూస్తారని ఆ దేశ యువతి రహాఫ్ ముహమ్మద్ అల్ఖునన్(18) అన్నారు. ఇంట్లో వేధింపులు తాళలేక పారిపోయి వచ్చి.. బ్యాంకాక్లోని ఎయిర్పోర్ట్లో దాక్కుని తన సమస్యను ఐరాస దృష్టికి తెచ్చిన రహాఫ్కు కెనడా ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అంతర్జాతీయంగా వార్తలో నిలిచిన రహాఫ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను చేసిన రిస్క్కు తగిన ప్రతిఫలం దక్కిందని వ్యాఖ్యానించారు. ‘నా కుటుంబ సభ్యులు నన్ను చంపేస్తారనే భయంతోనే థాయ్లాండ్కు పారిపోయి వచ్చాను. అందుకే నన్ను తీసుకెళ్లడానికి బ్యాంకాక్కు వచ్చిన సోదరుడు, తండ్రితో వెళ్లలేదని అన్నారు. ఇకపై కెనడాలోనే చదువుకుని.. ఉద్యోగం చేస్తూ.. సాధారణ జీవితం గడపాలని ఉంది. కెనడాలో జీవించడం చాలా బాగుంది. సౌదీలో ఉంటే నా కలలు కలలుగానే మిగిలిపోయేవి. ఇక్కడ నాకు లభించిన స్వాగతం చూస్తుంటే నాకు మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుంద’ని రహాఫ్ తెలిపారు. కాగా, ఇంట్లో వేధింపులకు తాళలేక రహాఫ్ గతవారం థాయ్లాండ్కు పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న ఆమెను సరైన పత్రాలు లేకపోవడంతో థాయ్లాండ్ ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ హోటల్ గదిలో దాక్కుని తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా ఐరాస, మీడియా దృష్టికి తీసుకెళ్లారు. ఐరాస శరణార్థి సంస్థ చొరవతో కెనడా రహాఫ్కు ఆశ్రయం కల్పించేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఆమె శనివారం కెనడాకు చేరుకున్నారు. -
రైతులకు, గ్రామీణులకూ హక్కులొచ్చాయి!
ఆరుగాలం కాయకష్టంతో పొట్టపోసుకునే చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామాల్లో పనీపాటలతో జీవనం సాగించే బడుగు ప్రజల హక్కులకు ఐక్యరాజ్య సమితి బాసటగా నిలిచింది. 2018 ఆఖరులో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ఒక ముఖ్య పరిణామం ఇది. పరిమిత వనరులతోనే ప్రపంచ జనాభాకు 70% ఆహారాన్ని పండించి అందిస్తున్న మట్టి మనుషులకు ఉన్న హక్కులను సముచితంగా గుర్తించమని అంతర్జాతీయ సమాజానికి ఐరాస సర్వసభ్య సమావేశం చాటిచెప్పింది. ఈ మేరకు డిసెంబర్ 17న తుది డిక్లరేషన్ను న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి 73వ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఇందులో పేర్కొన్న హక్కులను దేశీయ చట్టాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు, గ్రామీణులకు రక్షణ కల్పించాలని ప్రపంచ దేశాల నేతలకు, ప్రభుత్వాలకు సూచించింది. పాలకుల నిరాదరణకు, అన్యాయాలకు గురవుతూ కనీస మానవ హక్కులకు నోచుకోకుండా.. అరకొర ఆదాయాలతో అర్థాకలితో అలమటిస్తూ.. భూమి హక్కులు, సాంఘిక, ఆర్థిక, ఆహార భద్రత లోపించి, అప్పులపాలై కుంగిపోతూ, ఆత్మహత్యల పాలవుతున్న చిన్న–సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు, ఆదివాసులు, సంచార జాతులు, ఇతర గ్రామీణ వృత్తిదారులకు.. ఐక్యరాజ్య సమితి కొత్త సంవత్సరం కానుకగా ఈ డిక్లరేషన్ను వెలువరించడం గొప్ప సానుకూల పరిణామం. సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ తర్జన భర్జనల తర్వాత డిసెంబర్ 17న ఐక్యరాజ్య సమితి రైతులు, గ్రామీణ ప్రజల ప్రత్యేక హక్కుల డిక్లరేషన్ను వెలువరించడం విశేషం. ఏమిటీ డిక్లరేషన్? 74 దేశాలకు చెందిన 164 రైతు సంఘాలతో కూడిన సమాఖ్య ‘లా వయ కంపెసినా’, స్వచ్ఛంద సంస్థలు ‘సెటిమ్’, ‘ఫియమ్’ ఇంటర్నేషనల్తో కలిసి తొలుత 17 ఏళ్ల క్రితం ఈ ప్రతిపాదనను ఐరాస మానవ హక్కుల విభాగం ముందుకు తెచ్చాయి. అంతేకాదు. అది మరుగున పడిపోకుండా పట్టించుకున్నాయి. ఆ తర్వాత ఐరాసలో బొలీవియా దేశ ప్రతినిధి 2012 నుంచి ఈ డిక్లరేషన్ను భుజానేసుకొని డిసెంబర్ 17న ఆమోదింపజేసే వరకూ విశేష కృషి చేశారు. ఐరాసలో సభ్యదేశాలు 193. రైతులు, గ్రామీణులకు ప్రత్యేక హక్కులు అవసరమేనని గుర్తించే 28 అధికరణాలతో కూడిన ఈ డిక్లరేషన్ను భారత్, చైనా సహా 121 దేశాలు సమర్థించాయి. ఆస్ట్రేలియా, యూకే, యు.ఎస్.ఎ. వంటి 8 దేశాలు వ్యతిరేకించాయి. 54 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఏదైతేనేమి డిక్లరేషన్ ఇప్పుడు అంతర్జాతీయ చట్టబద్ధత పొందింది. ఈ హక్కులను ఇక ప్రపంచ దేశాలు ప్రత్యేక చట్టాలు చేసి రైతులు, గ్రామీణుల హక్కులు రక్షించాల్సి ఉంది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? చిన్న కమతాల్లో పంటలు పండించుకొని జీవనం సాగించే చిన్న, సన్నకారు రైతులు ప్రపంచ జనాభాకు అవసరమైన 70% ఆహారాన్ని ఆరుగాలం కష్టపడి పండించి అందిస్తున్నారు. ప్రకృత వనరలను తగుమాత్రంగా వాడుకుంటూ, గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించేందుకు దోహదపడుతున్నారు. అయితే, హక్కుల విషయానికి వచ్చేసరికి పట్టణప్రాంతీయులతో పోల్చితే చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణులు వివక్షకు గురవుతున్నారు. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న వ్యవసాయ విధానాలు సంపన్న రైతులు, పారిశ్రామిక వ్యవసాయదారులకు లబ్ధి చేకూర్చేవిగానే ఉన్నాయని.. ఈ విధానాల వల్ల చిన్న, సన్నకారు రైతులకు, రైతు కూలీలకు, ముఖ్యంగా వ్యవసాయంలో అత్యధికంగా శ్రమిస్తున్న మహిళా రైతులకు, చేకూరుతున్న లబ్ధి తూతూ మంత్రమేనని ఐరాస మానవ హక్కుల సలహా సంఘం చేసిన అధ్యయనంలో వెలడైంది. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణుల హక్కుల డిక్లరేషన్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, సంప్రదాయ విజ్ఞానాన్ని పెంపొందించుకొని అనుసరించడం, ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడం, భూమిపైన, నీటిపైన, అడవి, ఇతర ప్రకృతి వనరులపైన రైతులు, గ్రామీణులకున్న సామూహిక హక్కులను కాపాడటం.. సభ్య దేశాల్లోని ప్రభుత్వాల విధి అని ఐక్యరాజ్యసమితి ఈ డిక్లరేషన్లో పేర్కొంది. దేశీ, స్థానిక వంగడాలను సాగు చేసి భద్రపరచుకొని వినియోగించుకోవడంతోపాటు ఇతర రైతులకు విక్రయించుకునే హక్కు కూడా కల్పించమని ఈ డిక్లరేషన్ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. మన దేశంలో ఇప్పటికే చట్టం ఉన్నా, అది క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదన్న అభిప్రాయం ఉంది. రైతులకున్న హక్కులు పాలకుల దృష్టిలో ఇకనైనా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయని ఆశిద్దాం. -
నేలతల్లికి ఎంత కష్టం.. ఎంత కష్టం..
విత్తనం మొలకెత్తి ధాన్యరాశులైతేనే మన కడుపు నిండేది. మనం తింటున్న ఆహారం 95% మేరకు నేలతల్లే మనకు అందిస్తున్నది. అయితే, ఈ క్రమంలో మనం అనుసరిస్తున్న విధ్వంసకర పద్ధతుల వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమి నాశనమైపోతోందని అందరికీ తెలిసిందే. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఎంత భూమి పాడై ఉంటుంది? ఈ విషయం తెలుసుకునేందుకు 2018లో ఐక్యరాజ్య సమితి ఒక సర్వే జరిపింది. భూముల విస్తీర్ణంలో 75% ఇప్పటికే తీవ్రస్థాయిలో నిస్సారమై పోయిందని దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్లడించింది. రైతులే కాదు మానవాళి యావత్తూ మేలుకొని జాగ్రత్తపడకపోతే 2050 నాటికి 90% భూమి నాశనమైపోవచ్చని కూడా ఐరాస హెచ్చరించింది. భూమికి జరిగే ఈ నష్టం విలువ ఎంత ఉండొచ్చు? ఎడారీకరణపై ఐక్యరాజ్యసమితి ఒడంబడిక నివేదిక ప్రకారం ఈ నష్టం 23 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉండొచ్చని అంచనా. భూతాపం పెరిగి సాగు యోగ్యం కాకుండా ఎడారిగా మారిపోవడానికి మూడింట ఒక వంతు కారణం.. అడవిని నరికేయడం, ప్రకృతికి నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల భూమిలో కర్బనం తగ్గిపోవడం, నీటి లభ్యత తగ్గిపోవడం. భూమిలో జీవం తగ్గిపోవడం వల్ల జీవవైవిధ్యం అంటే.. భిన్న జాతుల చెట్టు చేమ, జీవరాశి అంతరించిపోతోంది. వరల్డ్ వైడ్ ఫండ్ సంస్థ తొలిసారి 2018లోనే ‘గ్లోబల్ సాయిల్ బయోడైవర్సిటీ అట్లాస్’ను రూపొందించింది. చాలా దేశాల్లోని భూముల్లోని సూక్ష్మజీవరాశి, వానపాములు వంటి జీవులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. నిజానికి ఈ ముప్పు మానవాళికి ఎదురవుతున్న ముప్పే. జాగ్రత్తపడకపోతే 2050 నాటికి 500 కోట్ల మంది మనుగడకే ముప్పు పొంచి ఉంటుంది. అటువంటి దేశాల జాబితాలో మన దేశంతోపాటు పాకిస్తాన్, చైనా కూడా ఉన్నాయి. ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో నేలల్లో సూక్ష్మజీవరాశి ఘోరంగా దెబ్బతిన్నది. భూమి లోపల జీవైవిధ్యం దెబ్బతినటంతోపాటు పరపరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు, సీతాకోకచిలుకలు అంతరించిపోతున్నాయి. వ్యక్తులు, సంస్థలు, అన్ని దేశాలూ కలసికట్టుగా కదలాలి. నిర్ణీత కాలంలో జీవవైవిధ్యాన్ని పెపొందించుకునేలా చర్యలు తీసుకొని అమలు చేయడం మేలని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏటేటా ముప్పు పెరుగుతోంది. -
భారత్పై పాక్ ఫిర్యాదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ భారత్పై మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించారు. కశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కశ్మీర్లో ప్రజలు భారత సైన్య చర్యలపై తిరగబడుతున్నారని, వెంటనే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) చేపట్టాలని ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేశారు. పూల్వామాలో ఇటీవల చెలరేగిన హింస కారణంగా భారత భద్రతా బలగాల కాల్పుల్లో ఏడుగురు పౌరులతో సహా, ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం తన సైనిక భలాన్ని ఉపయోగించి కశ్మీర్లో మారణాహోమాన్ని సృష్టిస్తోందని ట్విటర్ ద్వారా ఇమ్రాన్ విషంగక్కారు. పుల్వామాలో భారత సైన్యం చేపట్టిన ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇమ్రాన్ తెలిపారు. కాగా ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్న సైన్యంపైకి స్థానికులు భారీగా రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కొరకు బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు కశ్మీరీ పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇదివరకే కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విచారణకు ఆదేశించారు. -
వలసలతోనే అభివృద్ధి, మానవ వికాసం
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో ‘వలసకార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్గత, అంతర్జాతీయంగావలస వెళ్తున్న పౌరులందరి కోసం డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే) గా ప్రకటించింది. వలస అనేది భౌగోళికంగా లేదా రాజకీయ పరంగా నిర్ణయించిన రెండు సముదాయాల మధ్య జరిగే నివాస మార్పును తెలియజేస్తుంది. వలసలు లేనిదే అభివృద్ధి, మానవ వికాసం లేదు. వలసలకు, అభివృద్ధికి సంబంధం ఉంది. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో పునరేకీకరణ, స్థానభ్రంశం, సురక్షిత వలసలు, సరిహద్దు నిర్వహణ వంటి అంశాలలో కీలకమైన రాజకీయ, విధానపర విషయాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. వలసలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ‘పుష్ ఫ్యాక్టర్’ అంటే.. వలస వెళ్లేలా నెట్టివేయబడే పరిస్థితులు. స్థానిక ప్రదేశంలోని అననుకూల పరిస్థితులు ప్రజలను బయటకు నెట్టివేస్తాయి. ఉదాహరణకు.. అణచివేసే చట్టాలు, అధిక పన్నుల భారం, మతకల్లోలాలు, అంతర్యుద్ధాలు, పేదరికం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం, ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రాజెక్టుల కోసం గ్రామాలను ఖాళీ చేయించడం (డిస్ప్లేస్మెంట్) అనే అంశాలు ప్రేరేపిస్తాయి. ‘పుల్ ఫ్యాక్టర్’ అంటే.. వలస వెళ్లేలా ఆకర్షింపబడే పరిస్థితులు. అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం, బాహ్య ప్రదేశంలోని అనుకూల పరిస్థితులు వారిని ఆకర్షిస్తాయి. సంపన్న దేశంలో మంచి జీతం కలిగిన ఉద్యోగం అంతర్జాతీయ వలసల శక్తివంతమైన ఆకర్షణకు కారణం. పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుంచి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు, దేశాలకు వెళ్లేవారు కొందరు, మరింత మెరుగైన జీవితం కోసం, అధిక సంపాదన కోసం వెళ్లేవారు మరికొందరు. – మంద భీంరెడ్డి, అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర