వెంకయ్య నాయుడిపై ఆరోపణలు | pidamarthi ravi allagation on venkaiah naidu | Sakshi
Sakshi News home page

వెంకయ్య నాయుడిపై ఆరోపణలు

Published Wed, Aug 2 2017 5:10 PM | Last Updated on Mon, Oct 8 2018 3:48 PM

వెంకయ్య నాయుడిపై ఆరోపణలు - Sakshi

వెంకయ్య నాయుడిపై ఆరోపణలు

న్యూఢిల్లీ: మాదిగలను బీజేపీ ఓటు బ్యాంకుగా చూస్తోందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి విమర్శించారు. ఎస్సీలను ఏబీసీడీలు వర్గీకరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జంతర్‌మంతర్‌ వద్ద మాదిగ జేఏసీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మాదిగలను వెంకయ్య నాయుడు ఉపయోగించుకుని ఉపరాష్ట్రపతి అవుతున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల వరకైనా వర్గీకరణ అంశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని నిన్న పిడమర్తి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయించిందన్నారు. అయినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement