
సాహసబాలలకు జాతీయ పురస్కారాలు ప్రదానం
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో సాహస బాలలకు ఆదివారం జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు. 25 మంది చిన్నారులకు ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 2015 సంవత్సరానికిగానూ సాహస పురస్కారాలను అందజేశారు. ఇందులో 22 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. అవార్డులు అందుకున్న బాలలు, వారి తల్లిదండ్రులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.