గుజరాత్ ప్రభుత్వ మ్యాప్‌పై వివాదం | Row over map of China handed out by Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్ ప్రభుత్వ మ్యాప్‌పై వివాదం

Published Tue, Sep 23 2014 2:50 AM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

గుజరాత్ ప్రభుత్వ మ్యాప్‌పై వివాదం - Sakshi

గుజరాత్ ప్రభుత్వ మ్యాప్‌పై వివాదం

అక్సాయ్‌చిన్‌ను చైనాలో అంతర్భాగంగా చూపిన మ్యాప్
వివాదాస్పద ప్రాంతాలుగా అరుణాచల్, జమ్మూకాశ్మీర్
భారత్-చైనా మధ్య ఒప్పందం సందర్భంగా మ్యాప్‌ల పంపిణీ

 
 న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, గుజరాత్ సర్కారు వివాదంలో చిక్కుకున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన సందర్భంగా ఈ నెల 17న గుజరాత్ ప్రభుత్వంతో మూడు ఒప్పందాలు కుదరడం తెలిసిందే. వీటిపై సంతాకాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన మ్యాప్‌లు వివాదానికి కేంద్రబిందువయ్యాయి. ఈ మ్యాప్‌ల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ను, అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా భూభాగంగా చూపించారు. అలాగే భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ప్రదేశ్, కాశ్మీర్‌లోని అక్సాయ్‌చిన్‌లను వివాద ప్రాంతాలుగా మార్క్ చే శారు.
 
 కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ సోమవారం ఢిల్లీలో ఈ మ్యాప్‌లను మీడియాకు విడుదల చేసి... గుజరాత్ ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘తీవ్రమైన అంశాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకుంటోంది. మోదీ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రభుత్వం, ప్రధాని వివరణ ఇవ్వాలి’’ అన్నారు. మోదీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన ఒప్పందంలోనూ ఇదే మ్యాప్ ఉందా అని ప్రశ్నించారు.  మోదీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. అయితే ఈ మ్యాప్ ఒప్పందాల్లో భాగం లేదని, ఇది గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, గ్వాంగ్ ఝో నగరాలను చూపుతూ రూపొందించినవని గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ స్పష్టం చేశాయి. ఈ మ్యాప్‌లకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంలేదన్నాయి.
 
 అసలు సరిహద్దే నిర్ధారణ కాలేదు: చైనా
 బీజింగ్: జమ్మూకాశ్మీర్‌లోని లడక్ సెక్టార్‌లో చైనా జవాన్ల, పౌరుల చొరబాట్లపై దేశం స్పందించింది. అసలు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) నిర్ధారణపై భారత్, చైనాల మధ్య  విభిన్నమైన వాదనలున్నాయని, సరిహద్దు రేఖ నిర్ధారణ కాలేదని చైనా సైన్యం పేర్కొంది.  సమస్యలుంటే ఉభయపక్షాలు చర్చలతో పరిష్కరించుకోవచ్చని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement