‘ఎంఓపీ’పై సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి | SC recalls order asking govt to explain why memorandum of procedure was not notified | Sakshi

‘ఎంఓపీ’పై సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి

Published Thu, Nov 9 2017 4:27 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

SC recalls order asking govt to explain why memorandum of procedure was not notified - Sakshi

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మెమొరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌(ఎంఓపీ) ఖరారులో జరుగుతున్న ఆలస్యంపై ఇద్దరు జడ్జీల బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ఇలాంటి వాటిపై న్యాయ వ్యవస్థ నిర్ణయాలు తీసుకోకూడదని, జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌(ఎన్‌జేఏసీ) కేసులోనే రాజ్యంగ ధర్మాసనం ఇందుకు సంబంధించిన చట్టానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఎంఓపీ అంశాన్ని న్యాయ వ్యవస్థ తరఫు నుంచి పరిశీలిస్తామని జస్టిస్‌ ఆదర్శ్‌ గోయల్, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్‌ 27న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement