ఈ-వ్యర్థాల్లో 4.5 లక్షల మంది బాలలు | This - waste 4.5 million children | Sakshi
Sakshi News home page

ఈ-వ్యర్థాల్లో 4.5 లక్షల మంది బాలలు

Apr 22 2014 4:49 AM | Updated on Sep 2 2017 6:20 AM

ఈ-వ్యర్థాల్లో 4.5 లక్షల మంది బాలలు

ఈ-వ్యర్థాల్లో 4.5 లక్షల మంది బాలలు

దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల(ఈ-వేస్ట్) సేకరణ, రీసైక్లింగ్ వంటి కార్యకలాపాల్లో సుమారు 4.5 లక్షల మంది బాల కార్మికులు పనిచేస్తున్నారని అసోచామ్ వెల్లడించింది.

ప్రమాదకర పరిస్థితుల్లో కార్యకలాపాలు  అసోచామ్ ఆందోళన
 
 కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల(ఈ-వేస్ట్) సేకరణ, రీసైక్లింగ్ వంటి కార్యకలాపాల్లో సుమారు 4.5 లక్షల మంది బాల కార్మికులు పనిచేస్తున్నారని అసోచామ్ వెల్లడించింది. 10-14 ఏళ్ల మధ్య వయసుల్లోనే ఉన్న వీరంతా సరైన రక్షణ, ప్రమాణాలు లేని వర్క్‌షాపుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. ఈ-వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ వంటి పనులకు బాలలను వినియోగించకుండా చట్టాన్ని తీసుకురావాలని సిఫారసు చేసింది. మౌలిక వసతుల లేమి కారణంగా సేకరించిన మొత్తం ఈ-వ్యర్థాల్లో 4 శాతం మాత్రమే రీసైకిల్(పునర్వినియోగం) అవుతున్నాయని, దీనివల్ల పర్యావర ణానికీ నష్టం కలుగుతోందని తెలిపింది.

ఈ-వ్యర్థాల్లో 95% అసంఘటిత రంగం నుంచే వస్తున్నాయని, వాటిని తుక్కు డీలర్లు రీసైకిల్ చే యకుండా భాగాలుగా విడగొట్టి పారేస్తున్నారంది. అసోచామ్ ప్రకారం.. దేశంలో ఏటా 12.5 లక్షల మెట్రిక్‌టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. 2015 నాటికి 15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనుంది. ఈ-వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి అవుతున్న నగరాల్లో ముంబై (96 వేల మెట్రిక్ టన్నులు) మొదటిస్థానంలో ఉండగా.. తర్వాత ఢిల్లీ (67 వేలు), బెంగళూరు (57 వేలు), చెన్నై (47 వేలు), హైదరాబాద్ (25 వేలు) ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement