Assocham
-
ఎంఎస్ఎంఈలకు కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్ను ఏర్పాటు చేయాలని అసోచామ్ డిమాండ్ చేసింది. ఆర్బీఐ అంబుడ్స్మన్ తరహాలో ఇది ఉండాని.. పలు శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఈ పోర్టల్ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం ఉండాలని కోరింది. ఫిర్యాదుల దాఖలు, పరిష్కారం విషయంలో ఎంఎస్ఎంఈలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంటూ ఈ కీలక సూచన చేసింది. వ్యాపార నిర్వహణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈగ్రోవ్ ఫౌండేష్ సాయంతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సమస్యల పరిష్కారం, వాటి బలోపేతానికి సూచనలతో ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే లక్ష్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక, కార్యాచరణను ఈ నివేదిక తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని మన ఎంఎస్ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంక్లు, దిగ్గజ కంపెనీల నుంచి మద్దతు అవసరం’’అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నయ్యర్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు కార్పొరేట్ ఆదాయపన్ను రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, సులభతర జీఎస్టీ వ్యవస్థను తీసుకురావాలని అసోచామ్ కోరింది. కేంద్రీకృత పోర్టల్.. ఎంఎస్ఎంఈల నమోదు, వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ తీసుకురావాలని అసోచామ్ తన నివేదికలో కోరింది. జీఎస్టీ రిజి్రస్టేషన్, నిబంధనల అమలు ప్రక్రియలను సైతం సులభతరంగా మార్చాలని పేర్కొంది. స్పష్టమైన నిబంధనలతో మద్దతుగా నిలవాలని కోరింది. సహేతుక కారణాలున్నప్పటికీ సకాలంలో జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్, చెల్లింపులు చేయని ఎంఎస్ఎంఈలపై కఠిన జరిమానాలు విధిస్తున్నట్టు పేర్కొంది. జాప్యం తీవ్రత, కారణాలకు అనుగుణంగా పెనాల్టీలో మార్పులు ఉండాలని సూచించింది. జరిమానాలు ఎంఎస్ఎంఈలకు భారంగా మారరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలంటే వ్యాపార నమూనాలో నిర్మాణాత్మక మార్పు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. ‘‘ఈ నిర్మాణాత్మక మార్పులో ఎంస్ఎంఈలు భాగంగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్లో ఎంఎస్ఎంఈలు గొప్ప పాత్ర పోషించాలి. మా అధ్యయనం ఇదే అంశాన్ని బలంగా చెప్పింది’’అని సూద్ వివరించారు. పెరుగుతున్న కారి్మక శక్తికి ఎంఎస్ఎంఈలు పరిష్కారం చూపించగలవని, ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించగలవని ఈగ్రోవ్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్సింగ్ అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల మాదిరే ప్రతీ రాష్ట్రంలోనూ ఎంఎస్ఎంఈ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా సమన్వయ మండలిని ఏర్పాటు చేసి, పథకాల అమలు సాఫీగా సాగేలా చూడాలని, రాష్ట్రాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీలో 30 శాతం వాటా, తయారీ రంగంలో 45 శాతం వాటా, ఎగుమతుల్లో 46 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక గుర్తు చేసింది. -
అన్నింటికీ ఒక్కటే టీడీఎస్
న్యూఢిల్లీ: అన్ని రకాల చెల్లింపులకు 1 శాతం లేదా 2 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయాలని వాణిజ్య మండలి ‘అసోచామ్’ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. వివాదాల నివారణకు, పన్ను నిబంధనల అమలును సులభతరం చేసేందుకు ఇలా కోరింది. బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించింది. కొన్ని రకాల టీడీఎస్ వైఫల్యాలను నేరంగా పరిగణించరాదని కూడా కోరింది. కొన్ని రకాల చెల్లింపులకు టీడీఎస్ అమలు చేయకపోవడాన్ని నేరంగా చూడరాదని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం ద్వారా పన్ను చెల్లింపుదారు ప్రయోజనం పొందిన కేసుల్లోనే ఇలా చేయాలని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ సూచించారు. ‘‘వివాదాలను తగ్గించడం, నిబంధనల అమలు మెరుగుపరచడం పన్ను సంస్కరణల లక్ష్యం అవుతుందని భావిస్తున్నాం. ఈ దిశగా కార్పొరేట్ రంగం నిర్మాణాత్మక సూచనలు చేసింది. పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యల కోసం కూడా కార్పొరేట్ ఇండియా చూస్తోంది’’అని చెప్పారు. కంపెనీల విలీనాలు, వేరు చేయడాలకు పన్ను న్యూట్రాలిటీని అందించాలని కూడా అసోచామ్ కోరింది. పన్ను అంశాల్లో సమానత్వాన్ని ట్యాక్స్ న్యూట్రాలిటీగా చెబుతారు. మూలధన లాభాల మినహాయింపులు లేదా నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే విషయంలో, విలీనాలు, డీమెర్జర్లు (వేరు చేయడం), గుంపగుత్తగా విక్రయించడంలో ప్రస్తుతం నిబంధనల పరంగా అంతరాలు ఉండడంతో అసోచామ్ ఇలా కోరింది. బైబ్యాక్ల రూపంలో వచి్చన దాన్ని డివిడెండ్గా పరిగణించాలని సూచించింది. -
పన్ను రేట్లు తగ్గించాలి.. వచ్చే బడ్జెట్పై కోర్కెల చిట్టా
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్కి సంబంధించి కేంద్రానికి కార్పొరేట్లు తమ వినతులను అందజేశారు. కస్టమ్స్కి సంబంధించి వన్–టైమ్ సెటిల్మెంట్ రూపంలో గత బాకీలను చెల్లించేసేందుకు ఆమ్నెస్టీ పథకాన్ని ప్రకటించాలని పరిశ్రమల సమాఖ్యలు ఫిక్కీ, అసోచాం కోరాయి.బాకీ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా సుంకాలను తగ్గించడం లేదా వడ్డీ అలాగే పెనాల్టీని పూర్తిగా మినహాయించడం రూపంలో ఊరటనివ్వొచ్చని పేర్కొన్నాయి. దీనితో పరిశ్రమపై లిటిగేషన్ల భారం తగ్గుతుందని తెలిపాయి.మరోవైపు, వ్యక్తులు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ సంస్థల ట్యాక్సేషన్ విషయంలో పన్ను రేట్లను తగ్గించాలని, ఫేస్లెస్ అప్పీళ్లను ఫాస్ట్ ట్రాక్ చేయాలని పీహెచ్డీసీసీఐ విజ్ఞప్తి చేసింది. -
2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రగామిగా ఉన్న భారత్ 2024లో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందనున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అసోచామ్ ఈ రోజు (గురువారం) ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రైల్వేలు, విమానయానం, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీతో సహా నిర్మాణం, ఆతిథ్యం, మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో పెట్టుబడులు పెరగడానికి దారితీసే బలమైన వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో 2024లో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అసోచామ్ వెల్లడించింది. 2023 జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయం మాత్రమే కాకుండా తయారీ పరంగా బూస్టర్ షాట్లతో GDP ఊహించిన దానికంటే వేగంగా 7.6 శాతం వృద్ధి చెందడంతో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత పెరుగుతుందని, మెరుగైన అవకాశాలు లభిస్తాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ 'దీపక్ సూద్' అన్నారు. ఇదీ చదవండి: ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి? భారతదేశ GDP వృద్ధి జూలై-సెప్టెంబర్లో చైనా కంటే ఎక్కువైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆర్థిక, నిర్మాణ, హోటళ్లు, ఏవియేషన్, ఆటో, ఎలక్ట్రానిక్స్ వంటి తయారీ రంగాల ఆధ్వర్యంలో దేశీయ కంపెనీల పనితీరు మరింత మెరుగుపడనుందని అసోచామ్ సెక్రటరీ అభిప్రాయపడ్డారు. -
పెట్టుబడి అవకాశాలు గురించి తెలుసుకోవడానికి చక్కని అవకాశం
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఒమన్లోని సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ ప్రతినిధి బృందంతో వ్యాపార కార్యక్రమంలో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్, B2B సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమం 2023 నవంబర్ 23, 24 తేదీల్లో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ప్రపంచ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా సంస్థ 23 తేదీ సాయంత్రం ఇంటరాక్టివ్ సెషన్తో కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత B2B సమావేశాలు జరుగుతాయి. ఒమన్ అండ్ మిడిల్ ఈస్ట్లోని అనేక వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలను గురించి నగరంలోని వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ అందించే ప్రయోజనాలు, వాటి ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు. ఇందులో పాల్గొనాలంటే తప్పకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'రవి కుమార్ రెడ్డి కటారు' మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు మూలస్తంభంగా నిలుస్తుందని, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రమవుతుందని వ్యాఖ్యానించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచడంలో ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. యూరోప్, ఆఫ్రికాలలో మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతంలోని వ్యాపారాల కోసం ఒమన్ దక్షిణ భారతదేశాన్ని ఇష్టపడుతోంది. ఇప్పటికే ఈ సంస్థలకు అమెరికా, సింగపూర్ దేశాల్లో కూడా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అయితే త్వరలో జరిగే ఈ కార్యక్రమం ఒమన్లోకి ప్రవేశించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి భారతీయ వ్యాపారులకు అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. అసోచామ్ ఈ కార్యక్రమానికి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. -
ప్రైవేట్ పెట్టుబడులూ కీలకమే
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరగవలసి ఉన్నట్లు పారిశ్రామిక సమాఖ్య అసోచామ్ తాజాగా అభిప్రాయపడింది. ప్రభుత్వ పెట్టుబడులతోనే మూలధన వ్యయాలు పుంజుకోవని, ప్రైవేటు రంగం సైతం ఇందుకు దన్నుగా నిలవాలని పేర్కొంది. రానున్న రెండు, మూడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు అసోచామ్కు కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ అజయ్ సింగ్ అంచనా వేశారు. ఇందుకు కేంద్రం నుంచి లభిస్తున్న పెట్టుబడి వ్యయాల ప్రోత్సాహం దోహదపడగలదని తెలియజేశారు. జోరందుకున్న ప్రభుత్వ పెట్టుబడులతో సమానంగా దేశీ కార్పొరేట్ పెట్టుబడులూ పెరగవలసి ఉన్నదని గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా 2023–24 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు. కాగా.. ఒక ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం ప్రభుత్వ పెట్టుబడులే ఉండవని, ప్రైవేటు రంగం సైతం భాగస్వామి కావలసి ఉంటుందని అజయ్ తెలియజేశారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం ప్రోత్సాహక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో కంపెనీలకు దేశ, విదేశాలలో పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. -
పదేళ్ల కనిష్టానికి బ్యాంకుల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ రంగం ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) 2024 మార్చి నాటికి 4 శాతంలోపునకు దిగొస్తాయని అసోచామ్–క్రిసిల్ అధ్యయన నివేదిక తెలిపింది. ఇది దశాబ్ద కనిష్ట స్థాయి అని పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం తగ్గి స్థూల ఎన్పీలు 5 శాతంలోపుగా ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక రంగ కార్యకలాపాలు కోలుకోవడం, రుణాల్లో అధిక వృద్ధి ఎన్పీఏలు తగ్గేందుకు అనుకూలించినట్టు వివరించింది. ప్రధానంగా కార్పొరేట్ రుణాల వైపు ఎంతో పురోగతి ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 2024 మార్చి నాటికి 2 శాతంలోపు ఉంటాయని పేర్కొంది. 2018 మార్చి నాటికి కార్పొరేట్ ఎన్పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాలను ప్రక్షాళన చేసుకున్నాయి. రిస్క్ నిర్వహణ, అండర్ రైటింగ్ను బలోపేతం చేసుకున్నాయి. ఈ చర్యల నేపథ్యంలో క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉన్న రుణ గ్రహీతలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టాయి. కార్పొరేట్ రుణ ఆస్తుల నాణ్యత అదే పనిగా మెరుగు పడుతూ రావడం అన్నది బ్యాంకుల రుణాల నాణ్యతను తెలియజేస్తోంది’’అని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వివరించారు. బహుళ బ్యాలన్స్షీట్ సమస్య దాదాపుగా పరిష్కారమైనట్టేనని, రుణాల వృద్ధి గణనీయంగా మెరుగుపడడం మొదలైనట్టు చెప్పారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన బ్యాంకింగ్ రంగం ఎంతో బలంగా ఉన్నట్టు సూద్ గుర్తు చేశారు. కరోనా వల్ల ఎక్కువగా దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి రుణాల్లో ఎన్పీఏలు.. 2022 మార్చి నాటికి ఉన్న 9.3 శాతం నుంచి 2024 మార్చి నాటికి 10–11 శాతానికి పెరుగుతాయని ఈ నివేదిక తెలిపింది. -
కష్ట కాలంలోనూ భారత్ ఎకానమీ దూకుడు
న్యూఢిల్లీ: క్లిష్టతరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లోనూ భారత్ 2023 సంవత్సరాలన్ని నెట్టుకురాగలుగుతుందన్న విశ్వాసాన్ని పారిశ్రామిక వేదిక– అసోచామ్ వ్యక్తం చేసింది. పటిష్ట వినియోగ డిమాండ్, మెరుగైన కార్పొరేట్ పనితీరు, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, పటిష్ట ఆర్థిక రంగం, మెరుగైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ల సహాయంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన బాటలో నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. ► రబీ పంటలు బాగుంటాయని తొలి సంకేతాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ రంగం సానుకూల పనితీరును ఇది సూచిస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ). ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక రసాయనాలు– ఎరువులు వంటి అనేక పరిశ్రమల పనితీరు బాగుంది. ► పర్యాటకం, హోటళ్లు రవాణా, గృహ కొనుగోళ్లు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, విచక్షణతో కూడిన వినియోగదారు వస్తువుల కొనుగోళ్లు, ఆటోమొబైల్స్ విభాగాల్లోనూ చక్కటి వినియోగ డిమాండ్ కనిపిస్తోంది. ► అయితే, అంతర్జాతీయ కరెన్సీ హెచ్చుతగ్గుల గురించి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరు, పర్యవసానాలపై భారత్ జాగరూకతలో ఉండాల్సిన అవసరం ఉంది. ► అభివృద్ధి చెందిన కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవస్థలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అంచనా వేసింది. అధిక వడ్డీ ప్రభావం భారత్ కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లపై కూడా ప్రతిబింబిస్తోంది. అయితే ఆయా ప్రతికూలతలను భారత్ కార్పొరేట్ రంగం అధిగమిస్తోంది. ► ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ 2022–23లో 6.8 శాతం నుంచి 7 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. 2023–24లో కూడా ఇదే సానుకూలత కొనసాగే అవకాశాలూ ఉన్నాయి. -
కేంద్రం దీనికి ఓకే అంటే.. పన్ను చెల్లింపుదారులకు పండగే!
మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. ప్రతి సంవత్సరం మాదిరే ఈ సారి కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది బడ్జెట్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల సంస్థ అసోచామ్ తన ప్రీ-బడ్జెట్ సిఫార్సులలో కేంద్రానికి ఓ కీలక అంశాన్ని నివేదించింది. అది కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రాబోయే బడ్జెట్లో రూ. 5 లక్షలు చేయాలని పరిశ్రమల సంఘం అసోచామ్ తమ బలమైన వాదనను కేంద్రానికి వినిపించింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ వినియోగ వృద్ధిని పొందుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం గరిష్ట ఆదాయం రూ. 2.5 లక్షలు వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. 60-80 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల విషయంలో, ఇది రూ. 3 లక్షలు ఉండగా 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షలు ఉంది. ఈ సందర్భంగా అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్, సిమెంట్ వంటి రంగాలలోని కంపెనీలు ప్రస్తుత సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రారంభించాయని అభిప్రాయపడ్డారు. ప్రతికూల నష్టాల గురించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచం మాంద్యంలోకి వెళ్లవచ్చని, అది బాహ్య రంగాన్ని ప్రభావితం చేస్తుందని, అందువల్ల భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండింటిలోనూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచేందుకు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలన్నారు. భారత్ ప్రధాన ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించేందుకు కృషి చేస్తున్నందున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి మద్దతుగా ఇతర దేశాలు తీసుకుంటున్న క్రియాశీల చర్యలకు ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలని చెప్పారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఆర్బీఐ.. రేట్ల పెంపుపై దూకుడు వద్దు
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.9 శాతం)ను తదుపరి దశల్లో పెంచే విషయంలో దూకుడు ధోరణిని ప్రదర్శించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ)కు పారిశ్రామిక వేదిక అసోచామ్ విజ్ఞప్తి చేసింది. నెమ్మదిగా కోలుకుంటున్న ఎకానమీ రికవరీకి భారీ రేటు పెంపు సరికాదని పేర్కొంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నేపథ్యంలో అసోచామ్ గవర్నర్ శక్తికాంత్ దాస్కు ఒక లేఖ రాస్తూ, కొత్త రేటు పెంపు 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల శ్రేణిలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, అంతకు మించి పెంపు వద్దని విజ్ఞప్తి చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి రిటైల్ రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించాలని, రాయితీ వడ్డీ రేటును అందించాలని తన సిఫారసుల్లో అసోచామ్ ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. చదవండి: 17 బ్యాంకులు, 5వేల కోట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం మన భారత్లోనే.. ఎక్కడో తెలుసా! -
భారత్ ఎందుకొద్దు?
న్యూఢిల్లీ : ఆరేళ్లుగా కీలక రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గతంలో ఇండియా ఎందుకు? అని ప్రశ్నించిన వాళ్లు ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని అడుగుతున్నారని చెప్పారు. తాము చేపట్టిన సంస్కరణ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రధాని శనివారం ‘అసోచామ్ ఫౌండేషన్ వీక్–2020’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. వ్యవసాయ సంస్కరణలు, కొత్త చట్టాలతో రైతన్నలు ప్రయోజనం పొందడం మొదలైందని వెల్లడించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఎందుకు’ నుంచి ఎందుకొద్దు దాకా.. ‘మనం చేపట్టిన సంస్కరణలు పారిశ్రామిక రంగం ఆలోచనా ధోరణిని మార్చాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ ఎందుకు? నుంచి భారత్ ఎందుకొద్దు? అనే దాకా పరిస్థితి మారిపోయింది. గతంలో పారిశ్రామికవేత్తలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సందేహించేవారు. సంస్కరణలు, వాటి ప్రభావం వల్ల వారు ఉత్సాహం ముందుకొస్తున్నారు. 1,500 పాత, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాం. పెట్టుబడుల అంశంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలు తీసుకొచ్చాం. ప్రభుత్వ ముందుచూపునకు ఇదొక ఉదాహరణ. గతంలో పెట్టుబడిదారులు ఇండియాలో ఉన్న అధిక పన్ను రేట్లను ప్రస్తావించేవారు. ఇండియా ఎందుకు? అని ప్రశ్నించేవారు. మన ప్రభుత్వం పన్ను రేట్లను సరళీకరించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. గతంలో భారత్లోని కఠిన నిబంధనలు, నియంత్రణలను చూసి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గేవారు. మన ప్రభుత్వం అలాంటి నిబంధనలు, నియంత్రణల భారాన్ని తొలగించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అంటున్నారు’. మా మద్దతును విజయంగా మార్చండి ‘అన్ని రంగాల్లో లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగాలి. ఇందుకోసం మిషన్ మోడ్లో పని చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకునే భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం వేగంగా ప్రతిస్పందించాలి. గ్లోబల్ సప్లై చైన్ విషయంలో జరిగే మార్పులను పసిగట్టడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం అందించే మద్దతును ఒక విజయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలదే. భారత ఆర్థి క వ్యవస్థను ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అత్యుత్తమ కార్పొరేట్ పరిపాలనా విధానాలు, లాభాలు పంచుకొనే విధానాలను పారిశ్రామిక రంగం అందిపుచ్చుకోవాలి. ఇక పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)లోనూ పెట్టుబడులు భారీగా పెరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం చొరవ తీసుకోవాలి’. రైతుల పోరాటం మరింత ఉధృతం న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు. తమ పోరాటాన్ని మరింత ఉధృత చేస్తామన్నారు. తదుపరి కార్యాచరణను వచ్చే రెండు–మూడు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు. కొత్త చట్టాలు, పోరాటంపై న్యాయ సలహా తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు శివకుమార్ కక్కా శనివారం చెప్పారు. సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తామన్న కమిటీలో చేరాలా? వద్దా? అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం విరమించే ప్రసక్తే లేదని మరో నేత బల్బీర్సింగ్ తేల్చిచెప్పారు. వేలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలోనే గత 23 రోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ పోరాటంలో పాల్గొంటున్నవారిలో ఇప్పటిదాకా 23 మంది రైతులు మరణించారని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) వెల్లడించింది. -
15 రకాల వస్తు దిగుమతులను నివారించొచ్చు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ (స్వీయ సమృద్ధి) సాధన కోసం భారీగా దిగుమతి చేసుకుంటున్న 15 వస్తువులను అసోచామ్ గుర్తించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా వీటి విషయంలో స్వావలంబన సాధించొచ్చని పేర్కొంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఐరన్–స్టీల్, నాన్ ఫెర్రస్ మెటల్స్, వంటనూనెలు, తదితర ఉత్పత్తులున్నాయి. ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల విలువైన (37,500 కోట్లు) ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని.. విదేశీ మారక నిల్వలకు భారీగా చిల్లు పెడుతున్న ఈ దిగుమతులకు వెంటనే కళ్లెం వేయాలని అసోచామ్ సూచించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న మే నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన (రూ.21,000 కోట్లు) ఎలక్ట్రానిక్ వస్తు దిగుమతులు నమోదయ్యాయి. హెచ్ఎంఏ ప్రెసిడెంట్గా సంజయ్ కపూర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన ప్రెసిడెంట్గా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. 2020–21 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. పలు మల్టీనేషనల్ కంపెనీలకు ఆయన కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్నారు. -
ఐదారేళ్ల క్రితమే ప్రమాదంలో పడింది
సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రారంభ సమావేశాల సందర్బంగా అసోచామ్కు ప్రత్యేక శుభాకాంక్షలు అందచేసిన మోదీ ఐదారు సంవత్సరాల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందనీ, అయితే తమ సర్కారు దానికి కాపాడుకుందని మోదీ ప్రకటించారు. అయితే ప్రస్తుతం దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా పరుగులు తీస్తోందన్నారు. అయితే ఈ వృద్ధి ఇప్పటికిపుడు వచ్చింది కాదనీ గత అయిదేళ్లుగా చేసిన కృషి ఫలితమేనని తెలిపారు. భారతదేశ జీడీపీ వృద్ధి రేటు వరుసగా ఆరు త్రైమాసికాలుగా పడిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేక సంస్కరణలతో చక్కదిద్దుకుంటూ వచ్చామని, ఆర్థిక వృద్ధికి అన్నిరకాలుగా కృషి చేశామని మోదీ వెల్లడించారు. 5-6 సంవత్సరాల వెనక్కిపోతున్న విపత్తునుంచి తమ సర్కారు ఆర్థిక వ్యవస్థను రక్షించిందనీ మోదీ తెలిపారు. దానికి స్థిరీకరించడమే కాక, క్రమశిక్షణ తీసుకొచ్చామన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా పరిశ్రమ పెండింగ్ డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధపెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు రోడ్ మ్యాప్ సిద్ధమైందన్నారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేగవంతమైనాయని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం, జీఎస్టీని తీసుకు రావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశామని ఆయన తెలిపారు. ఈ శ్రమ ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్లో భారత దేశ ర్యాంక్ మెరుగుపడిందని మోదీ తెలిపారు. అలాగే ఆర్థికవ్యవస్థ వృద్దితోపాటు, ఆధునికతను జోడించామని, ముఖ్యంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకోసం ఆధునిక, వేగవంతమైన డిజిటల్ నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు వ్యాపార వైఫల్యాలన్నీ అక్రమాలు, మోసాల వల్ల వచ్చినవి కాదనీ.. వ్యాపార వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఇక కశ్మీర్లో పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్సభలో కూడా అమోదం పొందడాన్ని పరిశ్రమవర్గాలు స్వాగతించాయి. ఇది సాహసోపేతమైన నిర్ణయంగా పేర్కొన్నాయి. దీనితో అక్కడ పెట్టుబడులకు అవకాశం లభిస్తుందని, ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుందని పేర్కొన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దుచేయడం చరిత్రాత్మకమైనదని అసోచాం ప్రెసిడెంట్ బీకే గోయెంకా చెప్పారు. దేశమంతటా ఒకే రాజ్యాంగం అమలయ్యేందుకు ఇది దోహదపడగలదన్నారు. దీనితో జమ్మూ కశ్మీర్లోని టూరిజం, రియల్ ఎస్టేట్, హస్తకళలు, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లోకి పెట్టుబడులు రాగలవన్నారు. అపార సహజ వనరులు, ప్రతిభావంతులు ఉన్న జమ్మూ కశ్మీర్ సమగ్ర అభివృద్ధికి తాజా పరిణామాలు దోహదపడగలవని సీఐఐ ప్రెసిడెంట్గా ఎంపికైన ఉదయ్ కొటక్ తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్లో పెట్టుబడులపై కార్పొరేట్ వర్గాలు దృష్టి పెడతాయని, దీనితో రాబోయే అయిదేళ్లలో స్థానిక యువతకు గణనీయంగా ఉద్యోగావకాశాలు లభించగలవని దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా చెప్పారు. -
అమెరికా వృద్ధి, రూపాయి పతనం.. ఎగుమతులకు అవకాశాలే: అసోచామ్
న్యూఢిల్లీ: అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నాలుగేళ్లలోనే మెరుగైన స్థాయికి చేరడం, అదే సమయంలో రూపాయి విలువ పతనం అన్నవి మన దేశ ఎగుమతులకు మంచి అవకాశమని, నికర ఆదాయాలు పెరుగుతాయని అసోచామ్ అభిప్రాయపడింది. భారత్కు అమెరికా అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో 47.9 బిలియన్ డాలర్ల (రూ.3.35 లక్షల కోట్లు)విలువైన ఎగుమతులు అమెరికాకు జరిగినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమెరికా జీడీపీ 4.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నాలుగేళ్లలోనే అధిక వృద్ధి రేటు ఇది. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఎగుమతులు 303 బిలియన్ డాలర్లలో 16% అమెరికాకు వెళ్లినవే. వార్షికంగా 13.42% పెరిగాయి. భారతదేశ ఎగుమతులు... వస్తువులైనా, సేవలు అయినా అమెరికా అతిపెద్ద మార్కెట్. మరి అమెరికా ప్రస్తుత స్థాయిలోనే వృద్ధి చెందితే అది కచ్చితంగా భారత ఎగుమతులకు మంచిదే’’అని అసోచామ్ నివేదిక తెలిపింది. అయితే, రూపాయి విలువ వేగంగా క్షీణించడం వల్ల దేశ దిగుమతుల బిల్లుపై భారం పడుతుందని, కానీ అదే సమయంలో ఎగుమతుల ద్వారా నికర ఆదాయాలు పెరుగుతాయని అసోచామ్ వివరించింది. ఎగుమతులు మరింత గాడిన పడడం, జీఎస్టీ రిఫండ్లతో ఎగుమతిదారుల పోటీతత్వం ఇనుమడిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేందుకు వీలు కలుగుతుందని అసోచామ్ తెలిపింది. ఇంజనీరింగ్, కెమికల్స్, జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు మన దేశం నుంచి అమెరికాకు ఎక్కువగా జరుగుతున్నాయి. -
ఈ కామర్స్పై అతి నియంత్రణతో నష్టమే!
హైదరాబాద్: ఈ కామర్స్ రంగంపై అతి నియంత్రణ దేశంలో నూతన వ్యాపారాల ఏర్పాటు వాతావరణాన్ని దెబ్బతీస్తుందని పారిశ్రామిక సంఘం అసోచామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ధరల్ని ప్రభుత్వం నియంత్రించడమనేది తిరిగి ఇన్స్పెక్టర్ రాజ్కు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. ఈ కామర్స్, మొత్తం ఆన్లైన్ విభాగం ఇప్పడిప్పుడే ఎదుగుతోందని, దీని విస్తరణకు ఎంతో అవకాశం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. ‘‘ఏ వాణిజ్యానికి అయినా నిబంధనలన్నవి ఉండాల్సిందే. కానీ, అతి నిబంధనలు, అతి నియంత్రణలన్నవి అమలు చేయరాదు. ఇది వ్యాపార స్థాపన వృద్ధిని అణచివేస్తుంది’’ అని రావత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఈ కామర్స్ విధానాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ విధాన ముసాయిదాపై భాగస్వాముల అభిప్రాయాలను కోరింది. దీంతో అసోచామ్ గట్టిగా స్పందించడం గమనార్హం. వివిధ రకాల ధరల్ని అమలు చేయడం లేదా భారీ తగ్గింపులకు కాల పరిమితి విధింపు కూడా ఈ కామర్స్ విధానంలో ఉంది. ఈ కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నూతన విధానంపై దృష్టి సారించింది. కానీ భారీ తగ్గింపులన్నవి లేదా అసలు తగ్గింపులు లేకపోవడం అన్నది వ్యాపార పరమైన నిర్ణయాలని రావత్ పేర్కొన్నారు. భారీ తగ్గింపులపై ఆందోళన ప్రమోటర్లకు, వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్కే ఉండాలన్నారు. -
రైతుల ఆదాయం, వృద్ధికి బలం
న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆదాయం, వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుందని అసోచామ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో 14 ఖరీఫ్ పంటలకు 50 శాతం మేర మద్దతు ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత వారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచగా, ఒక్క దీనివల్లే ప్రభుత్వ ఖజానాపై రూ.15,000 కోట్ల భారం పడుతుంది. అయితే, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనపు ఆదాయం అందేలా చూస్తామని బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ దిశగా ఈ నిర్ణయం ఉండడం గమనార్హం. ‘‘రైతుల సమస్యల నివారణకు మద్దతు ధరల పెంపు కచ్చితమైన లేదా సరైన పరిష్కారం కాదు. కానీ, దీర్ఘకాలిక సంస్కరణలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతకాలం పాటు రైతులను కష్టాల్లో ఉండనీయకూడదు. మొత్తం వినియోగంలో గ్రామీణ ప్రాంతం 70% వాటా కలిగి ఉంది. గ్రామీణులకు తగినంత కొనుగోలు శక్తి రానంత వరకు భారత పరిశ్రమలకు డిమాండ్ పుంజుకోదు’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనను ధాన్యం, కూరగాయల మార్కెట్లలో యంత్రాంగాన్ని మెరుగుపరచడం ద్వారా పరిష్కరించొచ్చని రావత్ సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెంపునకు కారణమయ్యే మార్కెట్ దళారులకు కళ్లెం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించగలవన్నారు. ద్రవ్యోల్బణం, జీడీపీపై ప్రభావం: డీబీఎస్ న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపు వల్ల జీడీపీపై 0.1– 0.2% వరకు ప్రభావం పడుతుందని, దీనికి తోడు ద్రవ్యోల్బణంపైనా దీని ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్ ఓ నివేదిక విడుదల చేసింది. ద్రవ్య పరమైన వ్యయాల పెరుగుదలకు దారితీస్తుందని అభిప్రాయపడింది. జీడీపీపై ప్రభావం నేపథ్యంలో అధిక ఆదాయ మద్దతు అవసరమని లేదా మూలధన వ్యయాలను తగ్గించుకుంటేనే 2018–19లో ద్రవ్యలోటు లక్ష్యాలపై ప్రభావం పడకుండా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆహార సబ్సిడీ కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లు కేటాయించగా, మద్దతు ధరల పెంపు వల్ల సబ్సిడీ బిల్లు రూ.2లక్షల కోట్లు దాటిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మద్దతు ధరల పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలి ఉన్న కాలంలో ద్రవ్యోల్బణంపై 25–30 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం ఉంటుందని డీబీఎస్ నివేదిక తెలియజేసింది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్బీఐ మరో విడత రేట్లను పెంచొచ్చని అంచనా వేసింది. -
‘జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు’
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమనడంతో వీటిపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని, జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని పరిశ్రమ సంస్థలు ఫిక్కీ, అసోచామ్ కేంద్రాన్ని కోరాయి. పెట్రో ధరల రోజువారీ సవరణలో భాగంగా తాజా పెంపుతో పెట్రోల్ లీటర్ రూ 80 దాటి అత్యంత గరిష్టస్థాయిని నమోదు చేసింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశానికి అంటడం ఆందోళనకరమని ఫిక్కీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టస్ధాయిలకు చేరాయి. మరోవైపు పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్ధాయికి చేరడంతో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఇంధన ధరలు పెరగడం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీన్ని నివారించేందుకు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం ద్వారా వినియోగదారులకు తాత్కాలికంగా ఊరట లభిస్తుందని, అయితే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని అసోచామ్ సెక్రటరీ జనవర్ డీఎస్ రావత్ అన్నారు. ఇంధన భద్రతపై భారత్ దృష్టి కోణం మారాలని, వీటిని భారీ ఆదాయ వనరుగా ప్రభుత్వాలు పరిగణించరాదని సూచించారు. -
వాణిజ్య యుద్ధంతో భారత్కు దెబ్బ!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైతే భారత్పై ప్రతికూల ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా ఎగుమతులు దెబ్బతింటాయని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. ‘ఇప్పుడు మొదలైన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది. ఎగుమతులు పడిపోవడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఎగబాకేందుకు దారితీయొచ్చు. దీంతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు దిగజారే ప్రమాదం ఉంటుంది’ అని అసోచామ్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా మొదలుపెట్టిన ఈ రక్షణాత్మక చర్యలతో భారత్లో కూడా ఆర్థికపరమైన సెటిమెంట్ తీవ్రంగా దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఒకవేళ భారత్ కూడా దిగుమతులపై ఇలాంటి ప్రతిచర్యలకు దిగితే... ఎగుమతులపై ప్రభావం పడుతుందని, విదేశీ మారకం రేట్లలో తీవ్ర కుదుపులను చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ ముప్పునుంచి తప్పించుకోవడం కోసం ఒక నిర్ధిష్ట ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ రక్షణాత్మక చర్యల ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. మన క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతింటే.. పోర్ట్ఫోలియో పెట్టుబడులు తిరోగమన బాటపడతాయని.. దీనివల్ల డాలరుతో రూపాయి మారకం విలువపై తీవ్ర ప్రతికూలత తప్పదని అసోచామ్ పేర్కొంది. -
వాణిజ్య యుద్ధం మనకొద్దు
న్యూఢ్లిలీ: అమెరికా సర్కారు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై పన్ను విధిస్తూ అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోసిన నేపథ్యంలో, కీలకమైన భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక సహకారం ద్వారా ఎగుమతుల పెంపుపై దృష్టి సారించాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ సూచించింది. అమెరికా ఒక్క దేశంతోనే మనకు 150 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని, ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలు సరికాదని పేర్కొంది. ఎందుకంటే మన దిగుమతులు అన్నీ కూడా సహజ అవసరాలేనని గుర్తు చేసింది. మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువని, ఈ దృష్ట్యా ప్రతిఘటనకు అవకాశం లేదని పేర్కొంది. మన దిగుమతుల్లో చాలా వరకు అనివార్యమైనవని తెలియజేసింది. ఈ నేపథ్యంలో మన ఎగుమతులపై ప్రభావం పడితే ద్వైపాక్షిక సహకారం ద్వారా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చానల్ను నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతుల బిల్లు 300 బిలియన్ డాలర్లుగా, దిగుమతుల బిల్లు 450 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని పేర్కొంది. దిగుమతుల్లోనూ ఒక వంతు చమురు ఉత్పత్తులేనని గుర్తు చేసింది. ప్లాస్టిక్, ఫెర్టిలైజర్ తదితర దేశీయంగా తగినంత ఉత్పత్తి లేని కమోడిటీలేనని తెలియజేసింది. అమెరికా అధిక పన్నులు వేసినందున స్టీల్ దిగుమతుల్లో ఉన్నట్టుండి పెరుగుదల ఉంటుందేమో దృష్టి పెట్టాలని సూచించింది. స్టీల్ దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అవసరమైతే మరిన్ని ఉత్పత్తులను అధిక టారిఫ్ పరిధిలోకి తీసుకొస్తామ ని, అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు వాణిజ్య యుద్ధానికి సైతం సిద్ధమేనని ఆయన పేర్కొనడం తెలిసిందే. -
ఆధార్ లింక్ గడువు పెంపు?
న్యూఢిల్లీ: ఆధార్తో బ్యాంకు ఖాతాల అనుసంధానికి ఇచ్చిన గడువును పొడిగించాలని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు ఇది అవసరమని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ సూచించింది. పీఎన్బీ స్కామ్ అనంతరం ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) సిబ్బంది తమ ప్రధాన వ్యాపారాన్ని కాపాడుకునే క్రమంలో ఉన్నారని, ఆధార్ అనుసంధానం కోసం వారిపై ఒత్తిడి తీసుకురావడం తగదని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకు ప్రభావాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా బయటకు రాలేదని, మార్చి 31 తర్వాత బ్యాంకు ఖాతాలు నిర్వహణ రహితంగా మారిపోయే రూపంలో ఎదురయ్యే మరో సవాలుకు సిద్ధంగా లేదని పేర్కొంది. ఆధార్తో బ్యాంకు ఖాతాల అనుసంధానానికి ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఉంది. అయితే, కస్టమర్ల ఖాతాలన్నింటినీ మార్చి 31లోపు ఆధార్తో అనుసంధానించడం సవాలుతో కూడుకున్నదని, కనుక గడువును పొడిగించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆధార్తో అనుసంధాన లక్ష్యాన్ని చేరేకంటే ముందుగానే బ్యాంకులు ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. -
విస్తరిస్తున్న విలాస మార్కెట్
ముంబై: ఖరీదైన బ్రాండెడ్ ఉత్పత్తుల వినియోగం పట్ల మక్కువ చూపే వారి సంఖ్య పెరుగుతోంది. అంతర్జాతీయ బ్రాండెడ్ ఉత్పాదనలు అందుబాటులోకి వస్తుండడంతో ఈ మార్కెట్ 30 శాతం వృద్ధితో డిసెంబర్ నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుత దేశీయంగా సంపన్న ఉత్పత్తుల మార్కెట్ విలువ 23.8 బిలియన్ డాలర్ల మేర ఉంది. ‘‘యువతలో అంతర్జాతీయ బ్రాండ్ల వినియోగం పెరుగుతుండటం, చిన్న పట్టణాల్లో ఉన్నత తరగతి ప్రజలు కొనుగోలు శక్తితో లగ్జరీ కార్లు, బైక్లు, విదేశీ పర్యటనలు, దూర ప్రాంత వివాహాలు తదితర వాటితో ఈ మార్కెట్ ఈ ఏడాది చివరికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’ అని అసోచామ్ తన నివేదికలో పేర్కొంది. రానున్న మూడేళ్లలో ఈ మార్కెట్ ఐదు రెట్ల మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. వృద్ధికి కారకాలు... ∙మిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరగనుండటం. ∙ఆర్థిక వృద్ధి పట్టణీకరణకు దారితీయడం, ఆదాయం పెరుగుతుండటం. ∙విలాస ఉత్పత్తుల అందుబాటు, మరిన్ని విలాస బ్రాండ్లు దేశంలోకి ప్రవేశించడం. ∙చిన్న పట్టణాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి, ఖర్చు చేసే ఆదాయం పెరగడం వల్ల 2020 నాటి కి ఇంటర్నెట్పై 10 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. దీంతో ఖరీదైన ఉత్పత్తుల వినియోగం ఎన్నో రెట్లు పెరగనుంది. ∙వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడం. ∙రిటైల్ పరిశ్రమకు సంబంధించి సానుకూల విధానాల ఫలితంగా అంతర్జాతీయ బ్రాండ్లకు ఆకర్షణీయంగా మారిన భారత్ మార్కెట్. -
టార్గెట్లతో ఉద్యోగుల ఉక్కిరిబిక్కిరి
సాక్షి, మంగళూరు : కార్పొరేట్ ఉద్యోగులు పని ఒత్తిళ్లతో సతమతమవుతున్నారని, రోజుకు 6 గంటలకన్నా తక్కువగా నిద్రిస్తున్నారని అసోచామ్ హెల్త్కేర్ కమిటీ నివేదిక వెల్లడించింది. యాజమాన్యాల ఒత్తిళ్లతో ఉద్యోగులు రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అసంబద్ధ టార్గెట్లను నిర్ధేశిస్తుండటంతో ఉద్యోగులు నిద్ర సమస్యలతో పాటు, భౌతిక, మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని, చివరకు విధులకు గైర్హాజరయ్యే పరిస్థితి ఎదురవుతోందని నివేదిక పేర్కొంది. నిద్ర కొరవడటం ఉత్పాదకతపై ప్రభావం చూపుతోందని నివేదికను విడుదల చేస్తూ అసోచామ్ వివరించింది. పనిప్రదేశాల్లో ఒత్తిళ్లు, పై అధికారుల వేధింపులతో ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిపింది. కార్యాలయంలో ఒత్తిళ్ల కారణంగా తాము సరిగ్గా పనిచేయలేకపోతున్నామని, పలు రుగ్మతలు ఎదుర్కొంటున్నామని సర్వేలో పాల్గొన్నవారిలో 46 శాతం మంది వెల్లడించినట్టు తేలింది. ఇక విధినిర్వహణలో ఒత్తిళ్ల కారణంగా తాము తరచూ తలనొప్పితో బాధపడుతున్నామని మరో 42 శాతం మంది పేర్కొనగా, నిద్ర సమస్యలతో తాము కుంగుబాటుకు లోనవుతున్నామని 49 శాతం మంది చెప్పుకొచ్చారు. ఇక సర్వేలో పలకరించిన ఉద్యోగుల్లో 16 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నామని చెప్పగా, 11 శాతం మంది డిప్రెషన్తో సతమతమవుతున్నామని తెలిపారు. ఇక హైబీపీతో 9 శాతం మంది, డయాబెటిస్తో 8 శాతం మంది బాధపడుతున్నట్టు తెలిసింది. స్పాండిలైసిస్తో 5.5 శాతం, గుండెజబ్బులతో 4 శాతం కార్పొరేట్ ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. -
రుణ వృద్ధి 8 శాతమే: అసోచామ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు ఎనిమిది శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అసోచామ్ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం, ఇప్పటికే మొండి బకాయిల సమస్యతో సతమతం అవుతున్న బ్యాంకింగ్ వంటి అంశాలు రుణ వృద్ధి మందగమనానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. 2017 మా ర్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆహారేతర వి భాగ రుణ వృద్ధి కేవలం 5.1 శాతం. ఇది 50 సంవత్సరాల కనిష్టస్థాయి. అయితే తాజా అధ్యయనం ప్రకారం– ఈ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొంత మెరుగుపడుతుండడం కొంత ఆశావహ పరిణామం. రిటైల్, వ్యవసాయ రంగాల నుంచి రుణ డిమాండ్ కొంత మెరుగుపడుతుండడం దీనికి కారణం. -
ఈ–కామర్స్ మార్కెట్@ 50 బిలియన్ డాలర్లు
ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ వచ్చే ఏడాది 50 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. ఇంటర్నెట్ వినియోగం, ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు తోడ్పడనుంది. దేశీ డిజిటల్ కామర్స్ మార్కెట్ ప్రస్తుతం 38.5 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచామ్–కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2013లో 13.6 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2015లో 19.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొబైల్స్.. ఇంటర్నెట్ వినియోగం, ఎం–కామర్స్ అమ్మకాలు పెరగడం, రవాణా.. చెల్లింపులకోసం అత్యాధునిక ఆప్షన్స్ అందుబాటులో ఉండటం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మొదలైనవి ఈ–కామర్స్ అసాధారణ వృద్ధికి ఊతమిస్తున్నాయని నివేదిక వివరించింది. సీవోడీకే ప్రాధాన్యం.. ►ఆన్లైన్ చెల్లింపులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సురక్షితమైన విధానాలను అందుబాటులోకి తెచ్చినా .. కొనుగోలుదారులు ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) విధానాన్నే ఎంచుకుంటున్నట్లు వెల్లడైంది. ► ఆన్లైన్ చెల్లింపు విధానాలపై నమ్మకం లేకపోవడం, క్రెడిట్.. డెబిట్ కార్డుల వినియోగం తక్కువగా ఉండటం, భద్రతపరమైన అంశాలపై సందేహాలు మొదలైనవి ఇందుకు కారణం. ►50 శాతం పైచిలుకు ఆన్లైన్ లావాదేవీలు సీవోడీ విధానంలోనే ఉంటున్నాయి. మరోవైపు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రతి ముగ్గురు కస్టమర్లలో ఒకరు మొబైల్స్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారని, మొబైల్ లావాదేవీల పెరుగుదలకు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. ►ఆన్లైన్ షాపర్స్లో 65% మంది పురుషులే ఉంటుండగా, 35% మహిళలు ఉంటున్నారు. ►2017లో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తుల్లో మొబైల్ ఫోన్స్, దుస్తులు, ఆహార ఉత్పత్తులు, ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి. ► తరచూ షాపింగ్ చేసే వారిలో 28 శాతం మంది 18–25 సంవత్సరాల మధ్య వయస్సుగలవారు కాగా, 42 శాతం మంది 26–35 సంవత్సరాల గ్రూప్లో ఉన్నా రు. 36–45 సంవత్సరాల గ్రూప్ వారు 28 శాతం మంది, 45–60 ఏళ్ల మధ్య వారు 2% మంది ఉంటున్నారు. -
సాగుకు బడ్జెట్లో పెద్దపీట వేయాలి..
న్యూఢిల్లీ: ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వల్ల రెండో క్వార్టర్లో వృద్ధి మందగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని అసోచామ్ సూచించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే వ్యవసాయరంగ జీవీఏ జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 4.1 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఈ క్షీణత చాలా వేగంగా ఉన్నట్టు లెక్క. 2016–17 ఆర్థిక సంవత్సరపు రెండో క్వార్టర్లో ఉన్న 10.7 శాతం వృద్ధితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2.8 శాతం క్షీణించిందని అసోచామ్ తెలియజేసింది. రెండో అంచె రుతుపవనాలు ఖరీప్ ఉత్పత్తిపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. వ్యవసాయ రంగంలో సగానికిపైగా జీవీఏ పశువులు, మత్స్య పరిశ్రమ, ఫారెస్ట్రీ నుంచే సమకూరుతోందని, ఆర్థిక మంత్రి జైట్లీ ప్రధానంగా ఈ విభాగాలతోపాటు సాగుకు కీలకమైన నీటిపారుదలపై దృష్టి పెట్టాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ సూచించారు. ‘‘మన జనాభాలో అధిక శాతం గ్రామీణ సాగుపైనే ఆధారపడి ఉంది. సాగు రంగాన్ని ఒత్తిళ్ల నుంచి బయటపడేస్తే తప్ప వినియోగం ఆధారిత వృద్ధి, పెట్టుబడులు వాస్తవ స్థితికి చేరలేవు’’ అని రావత్ పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ మోసాలపై ఆర్బీఐ హెల్ప్లైన్ న్యూఢిల్లీ: ఆర్బీఐ పేరుతో కొందరు వ్యక్తులు, సంస్థలు చేస్తున్న మోసాలపై అప్రమత్తం చేసేందుకు గాను రిజర్వుబ్యాంక్... ఎస్ఎంఎస్ల ద్వారా అవగాహన ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఈ తరహా మోసాలపై హెచ్చరించేందుకు మిస్డ్ కాల్ హెల్ప్లైన్ కూడా ఆరంభించింది. ఆర్బీఐ పేరుతో లాటరీలు, నగదు బహుమానం వచ్చిందంటూ కొందరు కాల్స్, ఎస్ఎంఎస్లు, మెయిల్స్ ద్వారా సంప్రదిస్తూ, వాటిని విడుదల చేసేందుకు నిర్ణీత మొత్తం ఫీజుగా చెల్లించాలంటూ మోసాలకు పాల్పడుతుండడంతో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. మిస్డ్ కాల్ హెల్ప్లైన్ నుంచి ఈ తరహా మోసాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు, మోసపోతే ఫిర్యాదు చేసే విధానం తెలుసుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో తగిన సమాచారం కోసం 8691960000 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించింది. అలాగే, స్థానిక సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా ట్చఛిజ్ఛ్టి.టbజీ.ౌటజ.జీn పోర్టల్లోనూ ఫిర్యాదు నమోదు చేయవచ్చని తెలియజేసింది. -
మార్చి వరకు కొత్త కొలువులు అంతంతే: అసోచామ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ నిదానంగానే ఉంటుందని అసోచామ్ అభిప్రాయపడింది. బ్యాలెన్స్ షీట్లను చక్కదిద్దుకోవడం, ఖర్చులను క్రమబద్ధీకరించుకునే పనిలో ఉండటమే ఇందుకు కారణాలుగా అసోచామ్ సర్వే పేర్కొంది. కార్పొరేట్ రంగం తన శక్తినంతా వేతనాలు సహా ఖర్చులను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు బ్యాలెన్స్ షీట్లను రుణ రహితంగా మార్చుకునేందుకు వినియోగిస్తోందని, ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగ నియామకాలు 2018–19 సంవత్సరం ప్రారంభమయ్యే వరకు నిదానంగానే ఉంటాయని పేర్కొంది. రుణాలను తగ్గించుకోవడం, ప్రాధాన్యేతర వ్యాపారాల నుంచి తప్పుకోవడం, బ్యాలెన్స్ షీట్లను సరళంగా మార్చుకోవడం, మార్జిన్లను పెంచుకోవడంపైనే కార్పొరేట్ల దృష్టి ఉన్నట్టు తెలిపింది. దేశ సౌర్వభౌమ రేటింగ్ను మూడీస్ పెంచినప్పటికీ, రానున్న రెండు క్వార్టర్లు ప్రైవేటు రంగానికి సవాలేనని, అధిక రుణ భారం, వినియోగదారులు తక్కువ వ్యయం చేయడం వంటి సమస్యలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి తేలిక పడొచ్చని అసోచామ్ జనరల్ సెక్రటరీ డీఎస్ రావత్ అభిప్రాయపడ్డారు. -
ప్రభుత్వ వాటాల విక్రయంతో భారీ ఆదాయం!
న్యూఢిల్లీ: పీఎస్యూ బ్యాంకులకు భారీగా మూలధన సాయాన్ని ప్రకటించిన కేంద్రం... ఆ ప్రణాళికలో భాగంగా బ్యాంకుల్లో తనకున్న వాటాలను 52% వరకూ తగ్గించుకుంటే, రూ.58,000 కోట్ల కంటే అధిక ఆదాయమే సమకూరనుందని అసోచామ్ నివేదికలో తెలిపింది. ‘‘ప్రభుత్వం మూలధన సాయాన్ని ప్రకటించిన తర్వాత పీఎస్యూ బ్యాంకులకు మార్కెట్ అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. వాటి విలువ ఇప్పటికే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాల విక్రయంతో రూ.58,000 కోట్ల కంటే ఎక్కువే రానున్నాయి’’ అని అసోచామ్ తెలిపింది. పీఎస్యూ బ్యాంకులకు మార్కెట్లో అధిక వ్యాల్యూషన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన బాండ్ల సైజును రూ.1,35,000 కోట్ల లోపునకు తగ్గించుకోగలదని, దాంతో బడ్జెట్పై వడ్డీ రేట్ల భారం తగ్గడంతోపాటు, ఆర్థికవ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని వివరించింది. వీటితోపాటు రుణ వితరణ పుంజుకుంటే అధిక ఆర్థిక వృద్ధి రూపేణా మరిన్ని ప్రయోజనాలు సమకూరతాయని అసోచామ్ తన నివేదికలో పేర్కొంది. -
ఇంధన ధరల విధానం వక్రమార్గం: అసోచామ్
పన్నులు తగ్గించాలని డిమాండ్ న్యూఢిల్లీ: రవాణాకు కీలకమైన ఇంధనాలపై పన్ను రేట్లు తగ్గించాలని వాణిజ్య సంఘమైన అసోచామ్ పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని, మార్కెట్ ఆధారిత ధరల విధానం పన్నుల పెంపు కారణంగా పక్కదారి పడుతున్న అభిప్రాయాన్ని అసోచామ్ వ్యక్తం చేసింది. ‘‘వినియోగదారులు పెట్రోల్, డీజిల్పై మూడేళ్ల గరిష్ట స్థాయిలో చెల్లిస్తున్నారు. 2014 మే నెలలో బ్యారెల్కు 107 డాలర్ల నుంచి సగానికి సగం తగ్గిపోయిన పరిస్థితుల్లోనూ తరచూ పన్ను రేట్ల పెంపు వల్ల మార్కెట్ ఆధారిత ధరల విధానం వక్రమార్గం పడుతున్నట్టు వినియోగదారులు భావిస్తున్నారు’’ అని అసోచామ్ తన ప్రకటనలో పేర్కొంది. క్రూడాయిల్ ధరలు గత మూడు నెలల కాలంలో 18 శాతం పెరగ్గా... ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.65.40 నుంచి రూ.70.39కి పెరిగింది. వాస్తవానికి క్రూడాయిల్ ధర పెరుగుదల కంటే రిటైల్ విక్రయ ధరల పెంపు తక్కువగానే ఉందని అసోచామ్ గుర్తు చేసింది. ‘‘వినియోగదారులు దీన్ని గుర్తించేందుకు సుముఖంగా లేరు. 2014 మేలో బ్యారల్ 107 డాలర్లుగా ఉండగా, అదే ఏడాది జూన్ 1న లీటర్ పెట్రోల్ రిటైల్ ధర రూ.71.51. మరి 107 డాలర్ల నుంచి సగానికి అంతర్జాతీయ ధర పడిపోగా, ప్రస్తుతం రిటైల్ విక్రయ ధర అదే స్థాయిలో ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ ఆధారంగా ధరల విధానం అయితే ప్రస్తుతం లీటర్ పెట్రోల్ విక్రయ ధర రూ.40కంటే తక్కువే ఉండాలి’’ అని అసోచామ్ పేర్కొంది. -
రూ.8 లక్షల కోట్ల ఎన్పీఏలపై ‘దివాలా’ చర్యలు!
♦ 2019 మార్చికల్లా దివాలా చట్టం ప్రకారం పరిష్కారానికి అవకాశం ♦ అసోచామ్ అధ్యయన నివేదిక న్యూఢిల్లీ: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దివాలా చట్టం ప్రకారం మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యను పరిష్కరించేందుకు ఆర్బీఐ చర్యలను వేగవంతం చేస్తోందని అసోచామ్ పేర్కొంది. 2019 మార్చిలోపు దాదాపు రూ.8 లక్షల కోట్ల ఎన్పీఏలను ఈ దివాలా చట్టాన్ని ప్రయోగించి బ్యాంకులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. దీనివల్ల వ్యవస్థలో ఎన్పీఏల పరిమాణం తగ్గడంతోపాటు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వం, ఆర్బీఐ చేపడుతున్న కొన్ని చర్యలతోపాటు ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడుతుండటం(టర్న్ఎరౌండ్) వంటి పలు అంశాలు కూడా ఈ ఎన్పీఏల సమస్యనుంచి గట్టెక్కేందుకు దోహదం చేస్తాయని అసోచామ్ పేర్కొంది. కాగా, దివాలా చట్టాన్ని ప్రయోగించినప్పటికీ.. ఈ ఎన్పీఏలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల నుంచి ఎంత త్వరగా తొలగిపోతాయన్నది చూడాల్సి ఉందని.. ఎందుకంటే కొన్ని బ్యాంకులు ప్రస్తుతం మొండిబకాయిలను భరించలేని పరిస్థితుల్లో ఉన్నాయని నివేదికలో ప్రస్తావించింది. కొత్తగా రుణాలివ్వలేని పరిస్థితి...: బ్యాంకుల ఆర్థిక పరిస్థితితో పాటు పనితీరుపైన కూడా ఎన్పీఏలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2016–17లో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.5 లక్షల కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించాయి. అయితే, ఎన్పీఏలకు భారీ ప్రొవిజనింగ్ కారణంగా వీటి నికర లాభం రూ.574 కోట్లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగానికి కొత్తగా రుణాలిచ్చేందుకు బ్యాంకులకు అవకాశం లేకుండా పోతోందని నివేదక తెలిపింది. దివాలా కోడ్(ఐబీసీ) ద్వారా ఆర్బీఐకి మరిన్ని అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది. కాగా, ఇప్పటికే 12 అతిపెద్ద రుణ ఎగవేత కంపెనీలపై దివాలా చట్టం కింద చర్యలు చేపట్టాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు ఈ దిశగా చర్యలు ప్రారంభించాయి కూడా. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న మొత్తం ఎన్పీఏల్లో ఈ 12 కంపెనీలవే 25 శాతం(దాదాపు రూ.2లక్షల కోట్లు) కావడం గమనార్హం. -
ఐటీ హబ్స్లో అద్దెలు ఢమాల్?
బెంగళూరు: ఐటీ కంపెనీల్లో నియామకాలు తగ్గిపోవడం, వేతన పెంపు ఆగిపోవడం ఇటు టెకీలకు మాత్రమే కాక, హౌజ్ ఓనర్లకు ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి. ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఐటీ హబ్స్లోని హౌజ్ ఓనర్లు అద్దెలను తగ్గించేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, నోయిడా, గుర్గావ్, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని ఐటీ హబ్స్లో వచ్చే మూడు క్వార్టర్లలో ఇళ్ల అద్దెలు భారీగా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఇండస్ట్రి బాడీ అసోచామ్ అంచనావేస్తోంది. ఈ తగ్గింపు ఎక్కువగా పుణెలో 20 శాతానికి పైగా ఉంటుందని అధ్యయన రిపోర్టు వెల్లడించింది. '' బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో మున్నుందు కాలంలో ఇళ్ల అద్దెలు 10-15 శాతం తగ్గిపోనున్నాయి. పుణేలో ఎక్కువగా 20 శాతం పైగా తగ్గనున్నాయి. అదేవిధంగా గుర్గావ్, నోయిడాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంటోంది'' అని అసోచామ్ అధ్యయన రిపోర్టు పేర్కొంది. బెంగళూరులోని హౌజ్ ఓనర్లకు సిలికాన్ వ్యాలీకి ఉన్నంత పేరు ఉంది. అద్దెళ్లను తగ్గిస్తూ మంచి సౌకర్యాలతో టెనంట్లను ఆకట్టుకుంటున్నామని వారు చెబుతున్నారు. మంచి ఆప్షన్లతో అద్దెదారులకు అనుకూలంగా మార్కెట్ ఉందని, ముఖ్యంగా నెలకు రూ.50వేల కంటే ఎక్కువగా చెల్లించే వారికి అన్ని రకాల సదుపాయాలు అందిస్తున్నామని హౌజ్ఓనర్లు చెప్పినట్టు తెలిపింది. ముందుకాలంలో ప్రతేడాది వేలకొద్దీ ఉద్యోగులను ఐటీ సంస్థలు నియమించుకునేవి. ఆ నియామకాల ప్రక్రియకు అనుగుణంగానే బెంగళూరులో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగేది. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నెట్బేసిస్లో కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటున్నప్పటికీ, అంత ఆకర్షణీయంగా లేదని అధ్యయన రిపోర్టు తెలిపింది. 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న ఐటీ, ఐటీ ఎనాబుల్ సర్వీసుల ప్రొఫిషినల్స్ వేతనం సగటున వార్షికంగా 20 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో ఉంటే, వారు అద్దెలు రూ.50వేల నుంచి రూ.1.5 లక్షల వరకు చెల్లిస్తున్నారని ఈ అధ్యయనం తెలిపింది. రూ.15 వేల నుంచి రూ.35వేల మధ్యలో కూడా అద్దెలు ఉన్నాయని చెప్పారు. ఈ అన్ని సెగ్మెంట్లలో అద్దెలు తగ్గిపోయే అవకాశాలున్నాయని అధ్యయన రిపోర్టు చెప్పింది.. -
జీఎస్టీపై కొత్త డిమాండ్లు
♦ రైల్వే, రోడ్లను మినహాయించాలన్న అసోచామ్ ♦ వైద్యం ఖరీదవుతుంది: అపోలో ♦ భారం కానున్న ఆర్థిక సేవలు న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుకు గడువు మరో పది రోజులే మిగిలి ఉండగా, కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. రోడ్లు, రైల్వేలను తప్పనిసరిగా జీఎస్టీ నుంచి మినహాయించాలని అసోచామ్ తాజాగా కేంద్రాన్ని కోరింది. ఈ విభాగాల్లో ప్రాజెక్టులు ఫలితాలనిచ్చేందుకు సుదీర్ఘ సమయం తీసుకోవడంతోపాటు, ప్రతికూల రాబడుల నేపథ్యంలో మినహాయింపు అవసరమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదన పంపింది. ప్రస్తుత ప్రాజెక్టులకు మినహాయింపులు ఎత్తివేయడం వల్ల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ప్రస్తుతమున్న మినహాయింపులను ఎత్తివేసేట్టు అయితే జీఎస్టీలో కాంట్రాక్టు విలువపై జీరో రేటింగ్ వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని అభ్యర్థించింది. దీనివల్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అదనపు పన్ను భారం పడకుండా ఉంటుందని వివరించింది. ‘‘ప్రస్తుతం రహదారులపై ప్రయాణికుల నుంచి వసూలు చేసే టోల్కు, రహదారుల నిర్మాణం, నిర్వహణకు గాను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నుంచి అందుకునే కాంట్రాక్టు మొత్తాలపై సేవా పన్ను మినహాయింపు ఉంది. జీఎస్టీలో రహదారులు, వంతెనల సేవలను పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ, ఈ తరహా మినహాయింపు ఎన్హెచ్ఏఐ నుంచి అందుకునే మొత్తాలపై లేదు’’ అని అసోచామ్ పేర్కొంది. ఆరోగ్య సేవలపై పన్ను భారం: ప్రతాప్ సి రెడ్డి జీఎస్టీ కారణంగా ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరిగిపోతాయని అపోలో హాస్పిటల్స్ పేర్కొంది. కొన్ని సేవలు, ఉత్పత్తులపై 15–18 శాతం పన్ను రేటు విధించడమే ఇందుకు కారణమని తెలిపింది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ... ‘‘రెండు శాతం వరకు వ్యయాలు పెరిగితే వాటిని ఆస్పత్రులు సర్దుబాటు చేసుకోగలవు. అంతకు మించితే మాత్రం రోగులే వాటిని భరించాల్సి ఉంటుంది. మాకు జీఎస్టీ లేకపోయినా కొన్ని సేవలు, ఉత్పత్తులు 15–18 శాతం పన్ను పరిధిలో ఉండడం వల్ల భారం పడనుంది’’ అని వివరించారు. క్రెడిట్ కార్డు బిల్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రియం క్రెడిట్ కార్డు వినియోగదారులు, ఇన్సూరెన్స్ పాలసీదారులు జూలై 1 తర్వాత అదనంగా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. క్రెడిట్ కార్డ్ బిల్లు, పాలసీ ప్రీమియంలపై ప్రస్తుతం 15 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండగా, జీఎస్టీలో 18 శాతం పన్ను అమలు కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కస్టమర్లకు అధిక చెల్లింపులపై అలర్ట్ మెస్సేజ్లు పంపడాన్ని ప్రారంభించాయి వీటిలో ఎస్బీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం టర్మ్ పాలసీ ప్రీమియం, యులిప్ పాలసీల్లో ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలపై 18 శాతం పన్ను భారం పడనుందని తన ఖాతాదారులకు పంపిన ఈమెయిల్లో తెలిపింది. ఇక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలపై 1.88 శాతం పన్ను స్థానంలో 2.25 శాతం అమలు కానుంది. అన్ని ఆర్థిక సేవలు, టెలికం సేవలను సైతం 18 శాతం పన్ను పరిధిలో చేర్చిన విషయం తెలిసిందే. ఆటోమొబైల్ రంగానికి కొత్త సవాలు పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత భారత్స్టేజ్–4 ప్రమాణాల అమలు దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు సవాళ్లుగా నిలిచాయి. ఇప్పుడు జీఎస్టీ రూపంలో కొత్త సవాల్ ఎదురుకానుందన్న ఆందోళన నెలకొంది. జీఎస్టీతో తాత్కాలిక విఘాతం ఉంటుందని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఎండీ ఉమేశ్ రేవంకర్ అన్నారు. కొత్త విధానానికి సర్దుబాటు అయ్యే వరకు వినియోగం తగ్గుముఖం పట్టొచ్చన్నారు. దీనివల్ల కొంత కాలం పాటు రవాణా చార్జీలు, వాణిజ్య వాహనాలపై ప్రభావం ఉంటుందన్నారు. మరోవైపు వాహన రుణాలపై సేవా పన్ను భారం సైతం పడనుంది. లోన్ ప్రాసెసింగ్ చార్జీలపై ప్రస్తుతమున్న 15 శాతం పన్ను జీఎస్టీ అనంతరం 18 శాతం కానుంది. -
ఏపీ, తెలంగాణను కేంద్రం అనుసరించాలి
అసోచాం ప్రెసిడెంట్ సందీప్ జజోడియా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారానికి అనుకూల విధానాలు అనుసరిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అనుసరించాలని అసోచామ్ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతున్న అనుమతులు, ఆన్లైన్ దరఖాస్తు, పన్నుల చెల్లింపు, రిఫండ్స్, క్లియరెన్స్ ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారులకు పెనాల్టీల వంటి పద్ధతులను మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో కావాలని అసోచామ్ ప్రెసిడెంట్ సందీప్ జజోడియా చెప్పారు. అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్, తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీకాంత్ బాడిగతో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. వరల్డ్ బ్యాంక్ నివేదికతోపాటు అసోచామ్ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాము ఈ ప్రకటన చేస్తున్నట్టు వెల్లడించారు. వ్యాపార అవకాశాలను ప్రమోట్ చేయడంలో ఈ రెండు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కితాబిచ్చారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన దానికంటే తక్కువ పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అధికంగా ఉండడం, జఠిలమైన స్థల సేకరణ విధానం, కఠిన నిబంధనలు, బ్యాంకుల అధిక ఎన్పీఏలు, మౌలిక వసతుల అడ్డంకులు, నాణ్యమైన మానవ వనరుల తయారీలో వెనుకంజలో ఉండడం ఇందుకు కారణమని స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా పరిశ్రమ గాడిలో పడాలంటే వడ్డీ రేట్లు 2 శాతం తగ్గాలని అభిప్రాయపడ్డారు. వడ్డీ, అసలు చెల్లించని ఖాతాలను ఎన్పీఏలుగా ప్రకటించే 90 రోజుల పరిమితి నిబంధనను సవరించి 180 రోజులకు చేయాలని కోరారు. -
హైదరాబాద్లో వీడియోకాన్ జీఎస్టీ సమిట్
ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయెన్సెస్ కంపెనీ ‘వీడియోకాన్’ తాజాగా అసోచామ్, పానాసోనిక్లతో కలిసి హైదరాబాద్లో జీఎస్టీ సదస్సును నిర్వహించింది. కన్సూమర్ ఎలక్ట్రానిక్ వర్తకుల్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి నెలకొని ఉన్న సందేహాలను, సవాళ్లను నివృత్తి చేయడమే ఈ సమిట్ ఉద్దేశం. ఈ జీఎస్టీ సదస్సులో కమర్షియల్ ట్యాక్స్ (ఎన్ఫోర్స్మెంట్) అసిస్టెంట్ కమీషనర్లు జి.రాజేశ్ కుమార్, ఆర్.ఏడుకొండలు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీడియోకాన్ తాజా సమిట్లో ‘ఎSఖీఃఠిజఝ్చజీl.జీn’ అనే డిజిటల్ హెల్ప్లైన్ను కూడా ఆవిష్కరించింది. దీని ద్వారా రిటైలర్లు వారి సందేహాలను ఈ–మెయిల్ చేసి పరిష్కరించుకోవచ్చు. కాగా సంస్థ దేశవ్యాప్తంగా 200కుపైగా సదస్సులను నిర్వహించనుంది. -
మోదీ సర్కారు అతిపెద్ద విజయం ‘జీఎస్టీ’
న్యూఢిల్లీ: జీఎస్టీని మోదీ సర్కారు సాధించిన అతిపెద్ద విజయంగా అసోచామ్ అభివర్ణించింది. గత మూడేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన వాటిలో జీఎస్టీ ముందుంటుందని పేర్కొంది. మోదీ సర్కారు మూడేళ్ల పాలనలో ఆర్థిక రంగానికి సంబంధించి చేపట్టిన సంస్కరణలపై అసోచామ్ ఓ నివేదికను విడుదల చేసింది. అందరికీ ఆర్థిక సేవలు, డిజిటలైజేషన్, పెట్టుబడులు, విద్యుత్ పంపిణీ సహా ఎన్నో మంచి చర్యల్ని కేంద్రం చేపట్టినట్టు అసోచామ్ పేర్కొంది. జీఎస్టీని స్వాతంత్య్రానంతరం అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించింది. పన్నుల విధానాన్ని మరింత సులభంగా మార్చడం ద్వారా, వ్యాపార సులభతర నిర్వహణకు జీఎస్టీ ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం నియంత్రిత స్థాయిలో కొనసాగడం ప్రభుత్వం సాధించిన ఇతర సానుకూలతల్లో ఒకటిగా పేర్కొంది. సబ్సిడీల పంపిణీ ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యల్ని కూడా ప్రస్తావించింది. ‘‘విదేశీ మారక నిల్వలు 372 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీనివల్ల రూపాయికి బలం చేకూరుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం కట్టడికి వీలవుతుంది’’ అని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్య పరిధి 4%లోపే కొనసాగితే వడ్డీ రేట్లను తక్కువ స్థాయిలోనే కొనసాగిస్తుందని అభిప్రాయపడింది. ప్రైవేటు రంగ రుణాలు పుంజుకోకపోవడం, ఎన్పీఏలు గరిష్ట స్థాయిలో ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒత్తిడిలో ఉన్న మెటల్స్, కన్స్ట్రక్షన్, రియల్టీ, టెలికం, విద్యుదుత్పత్తి వంటి ప్రాధాన్య రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. విద్య, వైద్య రం గాలకు కేటాయింపులు పెంచాలని పేర్కొంది. -
'ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోత'
న్యూఢిల్లీ : దేశీయ ఐటీ సంస్థల్లో గుబేలు రేపుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసేశారు. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ 'హైర్ అమెరికన్, బై అమెరికన్' పేరుతో తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమల్లోకి తెచ్చారు.. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఇక ఎవరు పడితే వారు అమెరికా వెళ్లడానికి వీలు లేకుండా.. ఉద్యోగుల కట్టడి నెలకొంటోంది. ఈ ప్రభావం దేశీయ ఐటీ కంపెనీలపై తీవ్రంగా చూపనున్నట్టు తెలుస్తోంది. వ్యయాల భారంతో పాటు ఉద్యోగులపై వేటు కూడా పడనుందని అసోచామ్ పేపర్ బుధవారం నివేదించింది. పెరుగుతున్న రూపాయి కూడా ఎక్స్పోర్ట్ టెక్నాలజీ సంస్థల మధ్య పరిస్థితిని మరింత అతలాకుతలం చేస్తుందని పేర్కొంది. అమెరికా నుంచి వచ్చే రెమిటెన్స్లు కూడా తగ్గనున్నాయని అసోచామ్ తెలిపింది. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ను దెబ్బతీయనుందని చెప్పింది. వరల్డ్ బ్యాంకు డేటా ప్రకారం రెమిటెన్స్లో అమెరికా భారత్కు రెండో అతిపెద్ద దేశంగా ఉంది. దాని తర్వాత సౌదీ అరేబియా నుంచి ఎక్కువ రెమిటెన్స్లు వస్తున్నాయి. తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఐటీ సంస్థలు తమ వర్క్ఫోర్స్ను బలవంతంగా వేరువేరు ప్రాంతాలకు తరలించనున్నారని, కంపెనీల ఖర్చులు, రూపాయి విలువ పెరగడం కంపెనీలకు తక్కువ గుర్తింపు తెచ్చిపెడుతుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. ఇది ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. హెచ్-1బీ వీసాల్లో కఠినతరమైన నిబంధనలు భారత్ లో ఐటీ దిగ్గజాల నియామకాల్లో, వేతనాల్లో, ఉద్యోగాల్లో కూడా మార్పులు తేనుందని అసోచామ్ నివేదించింది. -
పీవోఎస్ మెషీన్ల డిమాండ్ రయ్ రయ్!
♦ 2022కి 310 కోట్ల ట్రాన్సాక్షన్లు ♦ అసోచామ్ నివేదిక బెంగళూరు: దేశంలో డీమోనిటైజేషన్ తర్వాత పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాల వినియోగం పెరిగింది. వీటి ద్వారా జరిగే లావాదేవీలూ ఊపందుకున్నాయి. 2016లో 16 లక్షలుగా ఉన్న పీవోఎస్ పరికరాల సంఖ్య వచ్చే ఐదేళ్లలో 30 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధితో 76 లక్షలకు చేరొచ్చని అసోచామ్ అంచనా వేసింది. ఇది ఆర్ఎన్సీవోఎస్ బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్తో కలిసి తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘డీమోనిటైజేషన్ తర్వాత పీవోఎస్ లావాదేవీలు చాలా రెట్లు పెరిగాయి. దేశంలో 2016 నవంబర్ 8కి ముందు వరకు దాదాపు 96 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగేవి. కానీ తర్వాత వీటి శాతం 80కి తగ్గింది’ అని అసోచామ్ నేషనల్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ తెలిపారు. దేశంలో 74 కోట్ల డెబిట్/క్రెడిట్ కార్డులున్నాయని, దీంతో పీవోఎస్ పరికరాల సంఖ్య బాగా పెరిగే అవకాశముందన్నారు. గతేడాది రూ.63,500 కోట్లుగా ఉన్న పీవోఎస్ లావాదేవీల విలువ 2022కి రూ.7.5 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. -
వారంలో అన్ని రోజులూ షాపులను అనుమతించాలి
⇒ మోడల్ బిల్లుపై రాష్ట్రాలకు కేంద్రం ⇒ నచ్చజెప్పాలి: అసోచామ్ న్యూఢిల్లీ: చిన్న, మధ్య స్థాయి షాపులు వారంలో అన్ని రోజులూ తెరిచి ఉంచేందుకు వీలుగా మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లును అన్ని రాష్ట్రాలూ తప్పకుండా ఆమోదించాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో రాష్ట్రాలకు నచ్చజెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం గతేడాదే మోడల్ బిల్లును ఆమోదించగా రాష్ట్రాల నుంచి స్పందన తక్కువగా ఉండడంపై అసోచామ్ అందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాష్ట్రం మాత్రమే ఈ బిల్లుకు అనుగుణంగా రాజస్థాన్ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1958కి సవరణలు తీసుకువచ్చే చర్యలు ప్రారంభించినట్టు అసోచామ్ వివరించింది. కాగా, షాపుల్లో పనిచేసే కార్మికుల హక్కులను సైతం పరిరక్షించాలని కోరింది. ఎటువంటి అదనపు ప్రయోజనాలు ఇవ్వకుండా రెండు షిప్టులు వారితో పనిచేయించుకోకుండా చూడాలని, రాత్రి వేళల్లో పనిచేసే వారు ముఖ్యంగా మహిళా కార్మికుల భద్రత చూడాలని సూచించింది. వారంలో అన్ని రోజులూ షాపులను తెరిచి ఉంచడం వల్ల అధిక జనాభా కలిగిన నగరాలు స్థానిక, విదేశీ పర్యాటకులను ఆకర్షించగలవని, దీనివల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంది. -
గతవారం బిజినెస్
నియామకాలు అసోచామ్ కొత్త ప్రెసిడెంట్గా సందీప్ జాజోడియా నియమితులయ్యారు. ఈయన మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. అలాగే వెల్స్పన్ గ్రూప్ చైర్మన్గా ఉన్న బాలక్రిషన్ గోయెంకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ చైర్మన్గా ఉన్న కిరణ్ కుమార్ గ్రంధి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.17% వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 జనవరిలో కేవలం 3.17 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 జనవరితో (5.69%) పోల్చిచూస్తే... 2017 జనవరిలో రిటైల్ బాస్కెట్ మొత్తం ధర కేవలం 3.17% పెరిగిందన్నమాట. నోట్ల రద్దుతో వినియోగ డిమాండ్ తగ్గడం మొత్తం సూచీపై ప్రభావం చూపింది. 2016 డిసెంబర్లో ఈ రేటు 3.41 % రూ.1.42 లక్షల కోట్ల రిఫండ్స్ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరి 10వ తేదీ నాటికి 1.62 కోట్ల రిఫండ్స్ను జారీ చేసింది. విలువ రూపంలో ఈ మొత్తం రూ.1.42 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే.. ఇది 41.5 శాతం అధికమని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ హైరింగ్ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ ఉద్యోగ నియామకాలు తగ్గిపోయాయ్. ప్రతి ఏడాది ఇన్ఫోసిస్ 20 వేల నుంచి 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందని, అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 6,000 మందికే ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ ఐటీ విభాగం కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. జనవరి–మార్చిలో వృద్ధి 5.7 శాతం భారత్ ఆర్థికవృద్ధి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) 5.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనావేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం దీనికి కారణంగా పేర్కొంది. వ్యవస్థలో కరెన్సీ నోట్ల కొరత తీరడం, సంపద పంపిణీ, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ వృద్ధికి దోహదపడే అంశాలని వివరించింది. నవీ ముంబై ఎయిర్పోర్టు కాంట్రాక్టు జీవీకేదే నవీ ముంబై ఎయిర్పోర్టు కాంట్రాక్టు ను తెలుగు రాష్ట్రానికి చెందిన జీవీకే గ్రూపు దక్కించుకుంది. రూ.16,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి జీవీకే, జీఎంఆర్లు మాత్రమే ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి. జీఎంఆర్ కంటే జీవీకే ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు రావడంతో జీవీకేకి కాంట్రాక్టు పనులు అప్పజెప్పినట్లు సిడ్కో ప్రకటించింది. 2019 డిసెంబర్ నాటికి ఈ ఎయిర్పోర్టు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోస్టల్ బ్యాంక్కు రూ.500 కోట్ల కేటాయింపు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017–18) సంబంధించి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్ల ఏర్పాటు ఈ బ్యాంక్ లక్ష్యం. కేటాయింపుల్లో రూ.125 కోట్లు మూలధనం కాగా, రూ.375 కోట్లు ’గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. ఇటీవలే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రయోగాత్మకంగా రాయ్పూర్, రాంచీల్లో సర్వీసులు ప్రారంభించింది. 30 నెలల గరిష్టానికి టోకు ధరలు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 జనవరిలో 30 నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.25 శాతానికి పెరిగింది. అంటే 2016 జనవరితో పోల్చితే, 2017 జనవరిలో పలు కీలక వస్తు ఉత్పత్తుల బాస్కెట్ రేటు 5.25 శాతం పెరిగిందన్నమాట. ఇంధన ధరల పెరుగుదల టోకు ధరలపై ప్రధానంగా ప్రభావం చూపింది. 2016 ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల లేకపోగా (2015 జనవరి నెలతో పోల్చి) 1.07 శాతం క్షీణత నమోదయ్యిం ది. కాగా నవంబర్, డిసెంబర్లలో వరుసగా ద్రవ్యోల్బణం రేట్లు 3.38 శాతం, 3.39 శాతాలుగా నమోదయ్యాయి. మళ్లీ సత్తా చాటిన యాపిల్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తాజాగా మళ్లీ గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్ రారాజుగా అవతరించింది. గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 17.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తన నివేదికలో పేర్కొంది. కాగా శాంసంగ్ 17.8 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన స్మార్ట్ఫోన్ విక్రయాలు 7 శాతం వృద్ధితో 43.2 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయని పేర్కొంది. ఐదవ నెలా ఎగుమతులు అప్..! భారత్ ఎగుమతులు వరుసగా ఐదవ నెలా వృద్ధిని నమోదు చేసుకున్నాయి. 2016 జనవరితో పోల్చిచూస్తే... 2017 జనవరిలో ఎగుమతులు 4 శాతం పైగా వృద్ధిని నమోదు చేసుకున్నాయి. విలువ 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతులు ఇదే నెలలో 11 శాతం పెరిగి 32 బిలియన్ డాలర్లు గా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. టెలికం పరిశ్రమ ఆదాయంపై జియో ఎఫెక్ట్ రిలయన్స్ జియో ఉచిత సర్వీసుల కారణంగా టెలికం పరిశ్రమ దాదాపు 20 శాతంమేర ఆదాయాన్ని కోల్పోయిందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) పేర్కొంది. అలాగే తీవ్రమైన పోటీ కారణంగా పరిశ్రమ 2017–18 అంచనాలను ప్రతికూల స్థితికి సవరించింది. -
నోట్ల రద్దు ఆర్థిక రంగానికి మేలే: అసోచామ్
న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన డీమోనిటైజేషన్ కార్యక్రమం దీర్ఘకాలంలో ఆర్థిక రంగానికి సానుకూల ప్రయోజనం కలిగిస్తుందని అసోచామ్ నివేదిక తెలిపింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని ఆమోదించడం బాగా పెరిగిందని, ఇది దీర్ఘకాలంలో మేలు చేస్తుందని తెలిపింది. ‘విప్లవాత్మక సంస్కరణల ద్వారా భారత పరిణామక్రమం’ అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం వల్ల చెల్లింపుల సేవల సంస్థలు, టెలికమ్యూనికేషన్, ఐసీటీ, ఇతర టెక్నాలజీల వినియోగం పెరుగుతుందని తెలిపింది. పాలనలో మెరుగు, వ్యాపార అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత, బాధ్యతాయుత విధానాలు, సంస్కరణలను సమర్థవంతంగా తక్షణం అమల్లో పెట్టడం వంటివి విదేశీ పెట్టుబడులకు భారత్ను అనుకూల గమ్యస్థానంగా కొనసాగేలా చేస్తుందని పేర్కొంది. వాణిజ్య పరంగా గణనీయమైన ప్రగతి, క్రీయాశీల విధాన చర్యలతో ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందని వెల్లడించింది. అయినప్పటికీ ప్రభుత్వం వ్యాపార సులభతర వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుందని సూచించింది. -
ఈ ఏడాది 4 శాతం పైకి ఇన్సూరెన్స్ విస్తరణ!
న్యూఢిల్లీ: దేశంలో ఇన్సూరెన్స్ విస్తరణ ఈ ఏడాది చివరకు 4 శాతం మార్క్ను అధిగమించొచ్చని అసోచామ్ అంచనా వేసింది. ఇన్సూరెన్స్ విస్తరణ కొద్ది కొద్దిగా పెరుగుతోందని, 2014లో 3.3 శాతంగా ఉన్న విస్తరణ 2015 నాటికి 3.44 శాతానికి చేరిందని తన నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పలు బీమా పథకాలను ప్రవేశపెట్టడం సానుకూల ప్రభావం చూపిందని తెలిపింది. నివేదిక ప్రకారం.. బీమా రంగ సరళీకరణ జరిగిన తొలి దశాబ్ద కాలంలో ఇన్సూరెన్స్ విస్తరణ బాగా జరిగింది. అంటే 2001లో 2.71 శాతంగా ఉన్న ఇన్సూరెన్స్ విస్తరణ 2009 నాటికి 5.20 శాతానికి పెరిగింది. కానీ తర్వాత విస్తరణలో ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఇది 2014 నాటికి 3.3 శాతానికి క్షీణించింది. దీనికి నిబంధనల మార్పు, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు కారణంగా నిలిచాయి. ఇక 2015లో దేశంలో ఇన్సూరెన్స్ విస్తరణ 3.4 శాతంగా నమోదయ్యింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సగటు 6.2 శాతంగా ఉంది. 2015–16లో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారు 36 కోట్లుగా ఉన్నారు. -
అసోచామ్ కొత్త ప్రెసిడెంట్ సందీప్ జాజోడియా
న్యూఢిల్లీ: అసోచామ్ కొత్త ప్రెసిడెంట్గా సందీప్ జాజోడియా నియమితులయ్యారు. ఈయన మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. అలాగే వెల్స్పన్ గ్రూప్ చైర్మన్గా ఉన్న బాలక్రిషన్ గోయెంకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ చైర్మన్గా ఉన్న కిరణ్ కుమార్ గ్రంధి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. ‘అసోచామ్ జాతీయంగా, అంతర్జాతీయంగా తన క్రియాశీలక పాత్ర కొనసాగిస్తుంది. ఎంతో క్లిష్టమైన, సంబంధిత అంశాలపై దృష్టిపెట్టడం ద్వారా భారతీయ కంపెనీలను స్వయం సమృద్ధి దిశగా పయనింపజేయడానికి ప్రయత్నిస్తాం’ అని జాజోడియా తెలిపారు. కాగా శ్రేయీ ఇన్ఫ్రా వైస్ చైర్మన్ సునీల్ కనోరియా నుంచి జాజోడియా ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
డీమోనిటైజేషన్తో చిన్న సంస్థలకు విఘాతం
గ్రామీణ వినియోగం, ఉద్యోగాల కల్పనపైనా ప్రతికూల ప్రభావం • వ్యవస్థీకృత రంగంలోని పెద్ద సంస్థలకు మాత్రం ప్రయోజనం • అసోచామ్–బిజ్కాన్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు చిన్న, మధ్య తరహా సంస్థలు, గ్రామీణ వినియోగం, ఉద్యోగావకాశాల కల్పనపై స్వల్పకాలంలో ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అసోచామ్–బిజ్కాన్ సర్వే వెల్లడించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయం భారీ స్థాయి వ్యవస్థీకృత రంగాలకు మాత్రం దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని తేలింది. ⇔ సర్వేలో పాల్గొన్న వారిలో 81.5 శాతం మంది చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎస్ఎంఈ) డీమోనిటైజేషన్ దెబ్బతీస్తుందని, దీని ప్రభావం మరో త్రైమాసికం పాటు ఉంటుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అదే సమయంలో పెద్ద సంస్థలపై డీమోనిటైజేషన్ సానుకూల ప్రభావం చూస్తుందని ఇంతే శాతం మంది చెప్పడం విశేషం. ⇔ ప్రతికూల ప్రభావం పడే రంగాల్లో వ్యవసాయం, సిమెంట్, ఎరువులు, ఆటోమొబైల్, టెక్స్టైల్స్, రియల్టీ, రిటైల్ ఉండగా.. విద్యుత్తు, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అనుకూల ప్రభావం ఉంటుందని తెలిసింది. ⇔ పెట్టుబడులు, వినియోగదారుల విశ్వాసం, డిమాండ్పై, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల్లో పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం చూపుతుందని 66 శాతం మంది తెలిపారు. ⇔ కూరగాయలు, ఇతర ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టినందున ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపుతుందని 92% మంది చెప్పారు. -
నల్లధనాన్ని తుడిచిపెట్టలేం!
నోట్ల రద్దుపై అసోచామ్ అధ్యయన నివేదిక • పసిడి, రియల్టీలోకి అక్రమ నిధులను నిరోధించడం సాధ్యంకాదని విశ్లేషణ • ఆర్థికవ్యవస్థ నుంచి నల్లధనాన్ని వేరుచేసి చూడలేమని అభిప్రాయం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని భవిష్యత్తులో పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడదని అసోచామ్ అధ్యయన నివేదిక ఒకటి పేర్కొంది. ‘‘పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థలో ప్రస్తుతం నగదు రూపంలో ఉన్న నల్లధనాన్ని కొంత నిర్మూలించవచ్చు. అయితే పసిడి, రియల్టీ వంటి అసెట్స్లోకి మారిన అక్రమ నిధులను మాత్రం తుడిచిపెట్టడం సాధ్యంకాదు’’ అని నివేదిక పేర్కొంది. అయితే ఆస్తి లావాదేవీలపై స్టాంప్ డ్యూటీని తగ్గిస్తే... రియల్టీకి అక్రమధన ప్రవాహం కొంత తగ్గే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడ్డం గమనార్హం. నివేదిక అంశాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వివరించారు. అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ పెద్ద నోట్ల రద్దు అనేది... ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ రూపంలో ఉన్న తక్షణం నల్లధనాన్ని కొంత వరకూ నిరోధించడానికి దోహదపడుతుంది. అయితే భవిష్యత్తులోనూ నల్లధనం నిరోధానికి దోహదపడుతుందని భావించడం సరికాదు. ⇔ భవిష్యత్తులోనూ నల్లధనం నిరోధానికి కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తి లావాదేవీలపై స్టాంప్ డ్యూటీ తగ్గించడం, రియల్టీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ వంటివి ఇందులో ముఖ్యమైనవి. ⇔ రద్దయిన పెద్ద నోట్లలో భారీ మొత్తం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్ రూపంలో చేరిపోయింది. అది అక్రమమైన సొమ్మా లేక సక్రమమా అన్నది అనవసరం. దీన్నిబట్టి నగదురూపంలోని నలధనాన్నీ పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని అర్థం అవుతోంది. ⇔ పెద్ద నోట్ల రద్దు సమయంలో విభిన్న అకౌంట్ల ద్వారా నల్లధనం డిపాజిట్ అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. అయితే వనరుల కొరత వల్ల అలాంటి డబ్బును గుర్తించి, ఇందుకు సంబంధించిన నల్లధన కుబేరులపై చర్యలు తీసుకోవడం కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కత్తిమీద సామే. ⇔ ఎటువంటి ప్రతికూల ప్రభావాలూ చూపకుండా డీమోనిటైజేషన్ అమలు సాధ్యంకాదన్నది సుస్పష్టం. ⇔ అసలు ఆర్థిక వ్యవస్థ (వైట్మనీ) నుంచి బ్లాక్మనీని మొత్తంగా వేరుచేసి చూడడం చాలా కష్టమైన పని. ఉదాహరణకు వినియోగదారునుంచి తీసుకున్న మొత్తానికి సంబంధించి ఒక షాప్ కీపర్ అమ్మకం పన్ను చెల్లించకపోతే, అతని ఆర్జన మొత్తం నల్లధనంగా మారుతుంది. వినియోగం బాగా పెరిగడం వల్ల జరిగే వస్తు కొనుగోళ్లు... పన్ను సరిగా చెల్లించే వ్యక్తి చేతికి తిరిగి ఆ డబ్బు చేరడంతో తిరిగి అదే డబ్బు సక్రమమైపోతుంది. ఇక్కడ ‘సోర్స్’ వద్దే అక్రమ ఆదాయం, సంపదను నిరోధించడం ముఖ్యం. ⇔ రియల్టీలో అనధికార లావాదేవీలకు ఉన్న అవకాశాలను తగ్గించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ–లావాదేవీలు, స్టాంప్ డ్యూటీలో పారదర్శకత విధానాలను ప్రోత్సహించాలి. ⇔ కొన్ని నిబంధనలను అధికారులు స్వయంగా నిర్దేశించుకుని, ఇష్టానుసారం వ్యవహరించే పరిస్థితి ఉంది. ఇది నల్లధనం పెరగడానికి దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితి నిరోధానికి చర్యలు తీసుకోవాలి. అధికారుల విచక్షణాధికాలకు కళ్లెం వేయాలి. ⇔ నల్లధనం నిరోధంలో పటిష్ట రాజకీయ సంకల్పం అవసరం. ఎటువంటి లొసుగులూ లేకుండా నిబంధనలు ఉండేలా బ్యూరోక్రాట్స్కు నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాలి. -
విమానాల్లో వైఫై సర్వీసులకు అనుమతివ్వండి
అసోచామ్ వినతి ∙ప్రధానికి లేఖ న్యూఢిల్లీ: విమానాల్లో వైఫై సర్వీసులను అనుమతించాలని అసోచామ్ ప్రభుత్వాన్ని కోరింది. ఇలా చేయడం వల్ల విమానాల్లో ప్రయాణించేవాళ్లు అనుసంధానమై ఉంటారని, అంతే కాకుండా విమాన భద్రతను మరింతగా మెరుగుపరుస్తుందని వివరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి అసోచామ్ ప్రధాన కార్యదర్శి డి. ఎస్. రావత్ ఒక లేఖ రాశారు. ప్రస్తుతం పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ తమ విమానాల్లో వైఫై సర్వీసులనందజేస్తున్నాయని, కానీ భారత గగనతలంలోకి రాగానే మన దేశ నియమనిబంధనల కారణంగా వీటిని అపేస్తున్నాయని తెలిపారు. -
పూర్తి స్థాయిలోడిజిటలైజేషన్కు 20 ఏళ్లు ఆగాల్సిందే!
• మెట్రో నగరాలైతే మూడు నాలుగేళ్లు • నగదు రహిత లావాదేవీలపై అసోచాం అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే గ్రామాలన్నీ డిజిటల్ చెల్లింపులకు మళ్లడానికి రెండు దశాబ్దాల సమయం పడుతుందని అసోచాం వెల్లడించింది. మెట్రోలు, పెద్ద నగరాలకైతే మూడు నాలుగేళ్ల సమయం పట్టొచ్చని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. అది కూడా ఈ నగరాల్లో 65–70 శాతం మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరగొచ్చని అంచనాగా చెప్పారు. నగదు రహితానికి మరిన్ని ఉద్దీపనలను ప్రధాని మోదీ డిసెంబరు 30న ప్రకటిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొబైల్ వాలెట్ల స్థితిగతులపై కన్సల్టెన్సీ కంపెనీ ఆర్ఎన్సీవోఎస్తో కలసి అసోచాం రూపొందించిన నివేదికను మంగళవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గ్రామీణ భారతమే ఎక్కువ.. భారత జనాభాలో 70 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. నెటిజన్ల సంఖ్య పరిమితంగా ఉన్న కారణంగా గ్రామాల్లో డిజిటల్ లావాదేవీలు పెద్ద సమస్యేనని రావత్ వ్యాఖ్యానించారు. మొబైల్ వాలెట్లు కేవలం ఇంగ్లిషులోనే ఉన్నాయని గుర్తు చేశారు. చదువుకున్న వారికి డిజిటల్ లావాదేవీలతో సమస్య లేదని అన్నారు. నిరక్షరాస్యులకే ఇబ్బందులని చెప్పారు. 2 లక్షల ఏటీఎంలలో గ్రామాల్లో 20 శాతమే ఉన్నాయని, దీంతో సమస్య మరింత క్లిష్టమని వివరించారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు 100 శాతం భద్రమని చెప్పలేమన్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇప్పటికీ పెద్ద సవాల్ అని ఆర్ఎన్సీవోఎస్ ఫౌండర్ శుష్ముల్ మహేశ్వరి అన్నారు. ప్రభుత్వానిదే బాధ్యత.. ఖాతాదారుల నగదు భద్రత బాధ్యత ప్రభుత్వం, బ్యాంకులపైనే ఉందని సైబర్ సెక్యూరిటీ ఇంటెగ్రేటర్స్ ఇండియా చైర్మన్ బాబు లాల్ జైన్ స్పష్టం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల ముప్పు పొంచి ఉంది. వీటి మూలంగా ఏటా 4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఐటీ ఉన్నంత కాలం ఈ ముప్పు తప్పదు. సైబర్ నేరగాళ్ల బారిన సాధారణ ప్రజలు పడకూడదు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వమే చర్యలు చేపట్టాలి. డిజిటల్ లావాదేవీల పట్ల పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని వివరించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ పోలీసు ఉండాలన్నారు. ఎం–వాలెట్ల హవా..: దేశంలో మొబైల్ వాలెట్ల లావాదేవీల విలువ 2012–13లో రూ.1,000 కోట్లు ఉంది. 2015–16లో రూ.20,600 కోట్లకు ఎగసిందని ఆర్ఎన్సీవోఎస్–అసోచాం నివేదిక వెల్లడించింది. 2021–22 నాటికి ఇది రూ.275 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. లావాదేవీల సంఖ్య 300 కోట్ల నుంచి అయిదేళ్లలో 46,000 కోట్లను తాకుతుందని వివరించింది. మొబైల్ పేమెంట్ల రంగంలో లావాదేవీల పరంగా మొబైల్ వాలెట్ వాటా ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 2021–22 కల్లా 57 శాతానికి చేరుతుందని వెల్లడించింది. వాలెట్ల నుంచి రిటైల్పై సగటు వ్యయం రూ.500–700 ఉంది. కొద్ది రోజుల్లోనే ఇది రూ.10 వేల దాకా చేరుతుందని తెలిపింది. -
మొబైల్లో ఇంటర్నెట్ జోరు..
• 2020 నాటికి యూజర్లు 60 కోట్లకు చేరే అవకాశం • ప్రస్తుతం నెట్ వాడకందార్లు 34.3 కోట్లే • ఇంటర్నెట్ పెరిగినా డిజిటల్ అక్షరాస్యత సవాలే: అసోచామ్ న్యూఢిల్లీ: దేశంలోని ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2020 నాటికి 60 కోట్లకు చేరుతుందని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. దీనికి 4జీ, 3జీ మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుదలే కారణమని తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 34.3 కోట్లుగా ఉందని తెలిపింది. హైస్పీడ్ డేటా సర్వీసులు అందించడానికి, పబ్లిక్ వై-ఫైలను ఏర్పాటు చేయడానికి స్పెక్ట్రమ్ లభ్యత ఒక సవాలుగా మారిందని పేర్కొంది. 80 లక్షల వై-ఫై హాట్స్పాట్లు కావాలి అంతర్జాతీయంగా చూస్తే ప్రతి 150 మంది పౌరులకు ఒక వై-ఫై హాట్స్పాట్ అందుబాటులో ఉందని అసోచామ్ తెలిపింది. భారత్లో ఈ పరిస్థితులు రావాలంటే 80 లక్షల హాట్స్పాట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, కాగా మన దేశంలో ప్రస్తుతం 31,000 హాట్స్పాట్స్ మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఇక ఇండియాలో మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలు 55,000కు పైగా ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం వల్ల కమర్షియల్గా ఎలాంటి ఉపయోగం ఉండదని సర్వీస్ ప్రొవైడర్లకు భావించడం వల్ల అక్కడ మొబైల్ కనెక్టివిటీ లేదని వివరించింది. 52 కోట్లకు స్మార్ట్ఫోన్ యూజర్లు: దేశంలో మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 100 కోట్లు దాటిందని అసోచామ్ పేర్కొంది. దీనిలో స్మార్ట్ఫోన్ యూజర్లు 24 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. వీరి సంఖ్య 2020 నాటికి 52 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. భారత్లో ఒకవైపు స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్నా.. ఇంటర్నెట్ విస్తరిస్తోన్నా.. డిజిటల్ అక్షరాస్యత మాత్రం చాలా తక్కువ స్థారుులో ఉంది. పాలసీ సంబంధిత నిబంధనలు సహా నైపుణ్యాలు, అనుభవం, సాంకేతిక వంటి అంశాలకు చెందిన పలు సవాళ్ల వల్ల డిజిటల్ ఇండియా కార్యక్రమం అడ్డంకులను ఎదుర్కొంటోందని పేర్కొంది. స్థానిక భాషల్లో డిజిటల్ సర్వీసులు అందుబాటులో లేకపోవడమనే అంశం గురించి ఆలోచించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. డిజిటల్ ఇన్ఫ్రా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో జతకట్టడం తప్పనిసరని పేర్కొంది. -
హాల్కు అసోచామ్ కార్పొరేట్ ఎక్స్ లెన్స్ అవార్డ్
బెంగళూరు: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు కార్పొరేట్ గవర్నెన్స ఎక్స్లెన్స అవార్డును అసోచామ్ బహూకరించింది. రూ.500కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన ప్రభుత్వ రంగ అన్లిస్టెడ్ కంపెనీ విభాగంలో 2015-16 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందించింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో హాల్ సీఎండీ టి.సువర్ణరాజుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ఈ అవార్డును అందించారు. కార్పొరేట్ పరిపాలనా పరంగా ఇప్పటికే ఆచరిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలను ఇకపైనా కొనసాగించేందుకు, మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా రాజు పేర్కొన్నారు. -
క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితి తొలగించండి
-
క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితి తొలగించండి
• వారానికి రూ.50,000 చాలా చిన్న మొత్తం • దీని వల్ల పరిశ్రమలు సమస్యలను ఎదుర్కొంటున్నారుు • ప్రభుత్వానికి అసోచామ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: క్యాష్ విత్డ్రాయల్స్పై పరిమితిని తొలగించాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ తాజాగా కేంద్రానికి విన్నవించింది. రూ.50,000లు మాత్రమే విత్డ్రా అనే నిబంధన వల్ల పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఈ లిమిట్ చాలా స్వల్పమని, దీన్ని పెంచాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలిపింది. ‘కరెంట్ అకౌంట్ నుంచి వారానికి రూ.50,000లు మాత్రమే విత్డ్రా పరిమితి వల్ల పరిశ్రమలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారుు. సంస్థలకు ఈ మొత్తం చాలా చిన్నది. అందుకే పరిమితిని పెంచాలి. పరిశ్రమలకు ఇలాంటి పరిమితులతో అవసరం లేదు. ఎందుకంటే ఇవి నిర్వహించే లావాదేవీలన్నీ నమోదు అవుతారుు. వీటిని ప్రభుత్వ యంత్రాంగం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది’ అని వివరిస్తూ అసోచామ్.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది. రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో పలు పరిశ్రమలకు సంబంధించిన బ్యాంక్ రుణాల రీపేమెంట్ షెడ్యూల్ను పునర్వ్యవస్థీకరించాలని కోరింది. ఫైనాన్స కోసం బ్యాంకులు/ఆర్థిక సంస్థలపై ఆధారపడ్డ కంపెనీలపై పరిమిత సంఖ్యలో నగదు లభ్యత అనే అంశం తీవ్ర ప్రభావం చూపతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణగ్రహితలు మరీ ప్రత్యేకించి ప్రైవేట్ కంపెనీలు, ఎంఎస్ఎంఈ రంగ సంస్థలు వాటి రుణం/వడ్డీ చెల్లింపులల్లో డిఫాల్ట్ అయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. అందుకే పలు పరిశ్రమలకు సంబంధించిన బ్యాంక్ రుణాల రీపేమెంట్ షెడ్యూల్ను పునర్వ్యవస్థీకరించాలని సూచించింది. క్యాష్ కార్డులను జారీ చేయండి నగదు లభ్యత తక్కువగా ఉన్న తాజా పరిస్థితుల్లో రిటైల్ కస్టమర్లకు, చిన్న వర్తకులకు క్యాష్ కార్డులను జారీ చేయాలని తెలిపింది. దీని వల్ల బ్యాంక్ ఖాతా లేకున్నా లావాదేవీలను నిర్వహించవచ్చని పేర్కొంది. దేశంలో నగదు పంపిణీ (క్యాష్ డిస్ట్రిబ్యూషన్) వేగంగా చేయాల్సి ఉందని, దీని వల్ల వ్యవస్థలో సరిపడ నగదు ఉందనే విశ్వాసం ప్రజల్లో పెరుగుతుందని తెలిపింది. -
ప్రసాదిత్య గ్రూప్ చైర్మన్కు అసోచాం అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశాల్లో వ్యాపార వాణిజ్య రంగంలో కృషి చేసినందుకు ప్రసాదిత్య గ్రూప్ చైర్మన్ ఎంఎస్ఆర్వి ప్రసాద్ను అసోచాం రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కరించింది. అసోచాం ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన భారత్-ఆఫ్రికా వ్యాపార, పెట్టుబడుల ఫోరం సదస్సు సందర్భంగా ఆఫ్రికాలో వ్యాపారం, పెట్టుబడి రంగాల్లో కృషి చేసిన భారతీయ సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు మోటపర్తి శివరామ ప్రసాద్ 1991లో ఘనాలో టెమా అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేసి వ్యాపారం ఆరంభించారు. తరవాత ఎమెక్స్ఫీల్డ్ టోగో స్టీల్ ఎస్ఆర్ఏఎల్ సంస్థను టేకోవర్ చేశారు. ఈ అవార్డులను కేంద్ర మంత్రి రామ్క్రిపాల్ యాదవ్, అసోచాం చైర్మన్ అంబుజ్ చతుర్వేదీ తదితరులు అందజేశారు. ప్రసాద్కు హైదరాబాద్లోని పఠాన్చెరులో అల్లాయ్ స్టీల్ కంపెనీ మార్టోపెరల్, డెక్కన్ ఆటో సంస్థలున్నారుు. ఇటీవల పనామా పేపర్లలోనూ ఈయన పేరు వినిపించింది. అరుుతే విదేశాల్లోని తన వ్యాపారాలన్నీ ఆర్బీఐ, ప్రభుత్వ అనుమతితో జరుగుతున్నవేనని ఆ తరవాత ఆయన వివరణిచ్చారు. -
కొత్త దివాలా చట్టంతో అపరిమిత లాభాలు!
అసోచామ్, క్రిసిల్ అధ్యయనం న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం- 2016ను చిత్తశుద్ధితో అమలు చేస్తే అపరిమితమైన లాభాలున్నట్లు అసోచామ్, క్రిసిల్ అధ్యయనం ఒకటి తెలిపింది. దీనివల్ల ఎన్పీఏల రూపంలో ఉండిపోరుున మొత్తంలో రూ.25,000 కోట్లు బయటకు వస్తాయని సర్వే తెలిపింది. ఇలా ఒనగూరిన మొత్తాన్ని ఇతర ఉత్పాదక రంగాలకు రుణాలుగా ఇవ్వడం వల్ల మరింత ఆర్థిక పురోగతి చోటుచేసుకుంటుందని వివరించింది. బ్యాంకుకు రుణ చెల్లింపు వైఫల్యం వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉద్యోగులు, రుణ దాతలు, షేర్హోల్డర్లు ఎవ్వరైనా కంపెనీ ‘మూసివేత’ ప్రక్రియను ప్రారంభించడానికి తాజా చట్టం వీలు కల్పించనుంది. -
అన్నీ మంచి ‘ఆర్థిక’ శకునములే..!
• ద్వితీయార్ధం బాగుంటుంది:అసోచామ్ • అక్టోబర్లో ‘తయారీ’ రయ్: నికాయ్ పీఎంఐ • క్యూ3 ఉపాధి అవకాశాలపై నీల్సన్ సర్వే ధీమా న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మూడు వేర్వేరు సంస్థలు ఆశాజనక సంకేతాలను అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (2016 అక్టోబర్-2017 మార్చి) భారత్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని అసోచామ్ బిజ్కాన్ సర్వే పేర్కొంది. అక్టోబర్లో ‘తయారీ’ రంగం బాగుందని నికాయ్ పీఎంఐ పేర్కొంది. ఉపాధి అవకాశాల మెరుగుపడ్డానికి సంబంధించి 2016 క్యూ3లో ప్రపంచవ్యాప్తంగా 66 దేశాల్లో చూస్తే... భారతీయులే ఆశాజనకంగా ఉన్నట్లు నీల్సన్ సర్వే వివరించింది. అమ్మకాల్లో వృద్ధి: అసోచామ్: అమ్మకాల్లో వృద్ధి, సంస్థల సామర్థ్యం మెరుగుదల వంటి అంశాలు ద్వితీయార్థం క్రియాశీలతకు కారణమని అసోచామ్ సర్వే పేర్కొంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ అవుట్లుక్ ‘యూ’ టర్న్ తీసుకోడానికి కారణంగా వివరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది ‘టర్న్ఎరౌండ్’ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్లో కొత్త ఆర్డర్లు: పీఎంఐ కొత్త ఆర్డర్లు, కొనుగోలు క్రియాశీలత, ఉత్పత్తి పెరగడం వల్ల అక్టోబర్లో తయారీ రంగం చక్కటి పనితీరును ప్రదర్శించినట్లు నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. సెప్టెంబర్లో 52.1 పాయింట్ల వద్ద ఉన్న సూచీ, అక్టోబర్లో 54.4 పాయింట్లకు పెరిగినట్లు వివరించింది. ఇది దాదాపు 22 నెలల గరిష్ట స్థాయి. దేశంలో తయారీ వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డాయనడానికి ఈ గణాంకాలు సంకేతాలుగా నిలుస్తున్నట్లు కూడా వివరించింది. ఉపాధిపై భారతీయుల విశ్వాసం: నీల్సన్ మరోవైపు ఉపాధి అవకాశాలకు సంబంధించి విశ్వాసంపై ప్రపంచ వ్యాప్తంగా 66 దేశాల్లో గ్లోబల్ ఫెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కంపెనీ నీల్సన్ ఒక సర్వే నిర్వహించింది. ఉపాధి అవకాశాల కల్పన, పర్సనల్ ఫైనాన్స్, వ్యయాలకు సంబంధించి 2016 క్యూ3లో (జూలై-సెప్టెంబర్) ప్రపంచవ్యాప్తంగా చూస్తే... భారతీయుల్లో ప్రగాఢ సానుకూల విశ్వాసం ఉంది. ఉపాధి అవకాశాల కల్పన, పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన అంశాలు కలగలిపిన వినియోగ విశ్వాస సూచీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 128 పాయింట్ల వద్ద ఉంటే, తరువాతి క్వార్టర్కు ఇది 133 పాయింట్లకు ఎగసింది. -
కావేరి గొడవతో సిటీ ఇమేజి.. డ్యామేజి!
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తున్న కావేరీ జలాల వివాదం వల్ల కలిగిన నష్టం ఎంతో తెలుసా.. అక్షరాలా రూ. 25 వేల కోట్లు. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారుల దాడులు, ఆందోళన, విధ్వంసానికి తోడు.. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా మార్గాలు కూడా స్తంభించాయి. సోమవారం చెలరేగిన ఈ అల్లర్ల మూలంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అసోచామ్ ప్రకటించింది. ఐటీ సహా అనేక ప్రధాన కార్యాలయాలు, ఫ్యాక్టరీలు మూతపడ్డ నేపథ్యంలో కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరు నగరంలో చెలరేగిన హింస కారణంగా రూ. 22వేల కోట్లనుంచి రూ. 25 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పింది. ఈ హింసాత్మక పరిణామాలు ముఖ్యంగా బెంగళూరులోని వ్యాపార, పరిశ్రమ వర్గాలను నిరుత్సాహపరిచేదిగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్చూన్ 500 కంపెనీలలో దాదాపు అన్నీ ఇక్కడే ఉన్నాయని.. అలాంటి బెంగళూరు నగర ఇమేజి దారుణంగా దెబ్బతిందని ఆయన అన్నారు. హింసాత్మక ఘటనలు ఒక్కసారిగా పెచ్చరిల్లాయని, దానివల్ల వ్యాపారాలు, పారిశ్రామిక వర్గం నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయని తెలిపారు. భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు పరువు ఘోరంగా దెబ్బతిందని రావత్ చెప్పారు. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని కేంద్రానికి అసోచామ్ విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించాలని కోరింది. కనీస ప్రాథమిక అవసరం నీరు అని, ఇది భావోద్వేగ సమస్య అని తెలిపింది. ఎలాంటి దుశ్చర్యలకు తావులేకుండా పరిష్కరించాలని కోరింది. ప్రశాంతంగా పనిచేసుకునే ఉద్యోగుల్లో ఈ గొడవల వల్ల తీవ్ర భయాందోళనలు కలిగాయని, విదేశాల్లో కూడా ఆందోళన పుడుతోందని అసోచామ్ వ్యాఖ్యానించింది. ఐటీ ఎగుమతుల విషయంలో మంచి స్థానాల్లో ఉన్న బెంగళూరు, చెన్నై నగరాల్లో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదని తెలిపింది. ఈ రెండురాష్ట్రాల వివాదంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరింది. -
4జీతో నాలుగేళ్లలో రూ.79,000ఆదాయం: అసోచామ్
న్యూఢిల్లీ: హై స్పీడ్ 4జీ కనెక్షన్లు 2020 నాటికి దేశ మొత్తం యూజర్ బేస్లో 17 శాతానికి చేరే అవకాశం ఉందని అసోచామ్కేపీఎంజీ అధ్యయన పత్రం ఒకటి తెలిపింది. ఇదే కాలానికి ఆదాయం రూ.79,580 కోట్లకు పెరుగుతుందని కూడా వెల్లడించింది. పవరింగ్ డిజిటల్ ఇండియా పేరుతో ఈ అధ్యయన పత్రం రూపొందింది. డిజిటల్ ఇండియా, స్మార్ సిటీస్ వంటి కీలక చొరవల నుంచి అధిక స్పీడ్ ఇంటర్నెట్ సేవలకు మంచి డిమాండ్ ఉంటుందని అధ్యయనం తెలిపింది. దీనితోపాటు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, వేగంగా సామాజిక పథకాల అమల్లో కూడా 4జీ సేవలు కీలకం కానున్నట్లు వెల్లడించింది. అయితే రిలయన్స్ జియో గానీ లేక ప్రస్తుతం సేవలు అందిస్తున్న ఇతర ఆపరేటర్లపేరుకానీ ప్రస్తావించని అధ్యయన పత్రం, ఉమ్మడి లక్ష్యాల దిశగా పనిచేయడానికి పరిశ్రమలోని వివిధ వర్గాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొంది. వ్యాపార విస్తరణకు ఆపరేటర్లు అందరికీ తగిన అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే తగిన ధరలవైపే వినియోగదారులు మొగ్గుచూపుతారని నివేదిక పత్రంలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. -
స్కూలు బ్యాగ్ లతో సమస్యలే..
కోల్ కతాః కేజీలకొద్దీ బరువున్న పుస్తకాలను బ్యాగుల్లో మోయడంవల్ల పాఠశాల వయసు విద్యార్థుల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తాజా సర్వేలు చెప్తున్నాయి. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోఛెమ్), తన హెల్గ్ కేర్ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలను వెల్లడించింది. భారతదేశంలోని 13 ఏళ్ళ వయసులోపు 68 శాతం మంది విద్యార్థులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడటమే కాక, కొన్నాళ్ళకు గూని సమస్య కూడా వస్తున్నట్లు అసోఛెమ్ నిర్వహించిన సర్వే ద్వారా కనుగొన్నారు. 7 నుంచి 13 ఏళ్ళ వయసు పిల్లలపై నిర్వహించిన సర్వేలో.. వారు మోసే బరువులో 45 శాతం పుస్తకాలు, క్రికెట్ కిట్ లు, స్విమ్ బ్యాగ్ లు, ఆర్ట్ కిట్ లు రూపంలో వారి వెన్నుపై పడటంతో వెన్ను దెబ్బతినడంతోపాటు, తీవ్రమైన నడుం నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తున్నట్లు తెలుసుకున్నారు. విద్యార్థి దశలో ఎక్కువగా బరువులు మోయడంతో ఎర్లీస్లిప్ డిస్క్, స్పాండిలైటిస్, స్పాండిలోలిస్థెసిస్, పెర్సిస్టెంట్ బ్యాక్ ఏక్ వంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు అసోఛెమ్ హెల్త్ కమిటి ఛైర్మన్ బి.కె. రావు తెలిపారు. పిల్లల స్కూల్ బ్యాగ్ యాక్ట్ 2006 ప్రకారం విద్యార్థి బరువులో 10 శాతానికి మించి స్కూల్ బ్యాగ్ బరువు ఉండకూడదు. అంతేకాక నర్సరీ, కిన్నర్ గార్డెన్ చదివే పిల్లలు అసలు స్కూల్ బ్యాగే ధరించకూడదని ఈ చట్టం చెప్తోంది. దీనిపై పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పాఠశాలల్లో పిల్లలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాకర్స్ సౌకర్యం కూడ ఏర్పాటు చేయాలి. అయితే ఈ నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని, దీంతో పిల్లల్లో నడుం నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు తీవ్రమవ్వడమే కాక, అధిక బరువు ప్రభావం పిల్లల పెరుగుదలపై కూడ పడుతోందని రావ్ తెలిపారు. భారీ బరువుతో కూడిన బ్యాక్ ప్యాక్ లు వేసుకొని ఎక్కువ దూరం నడవటం వెన్ను నొప్పికి కాకణమవ్వడంతో పాటు, బరువును మధ్య మధ్యలో కిందికి దింపి మళ్ళీ ఎత్తుకుంటుండటం మరీ ప్రమాదమని రావు చెప్తున్నారు. అధిక బరువు కండరాలు, అస్థిపంజరాలు, డిస్క్ లపై తీవ్ర ప్రభావం చూపి, అవి దెబ్బతినేలా చేస్తుందని కొంత కాలానికి గూని సమస్య కూడ వచ్చే అవకాశం ఉందని బి.కె.రావు తెలిపారు. ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూనె, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, డెహ్రాడూన్ వంటి భారత్ లోని పది నగరాల్లో 2500 మంది విద్యార్థులపై సర్వే నిర్వహించడంతోపాటు, 1000 మంది తల్లిదండ్రులను సైతం అసోఛెమ్ ఇంటర్వ్యూ చేసింది. ప్రతిరోజూ 20 నుంచి 22 టెక్ట్స్ పుస్తకాలు, ఏడెనిమిది వరకూ నోట్ పుస్తకాలతోపాటు రోజు విడిచి రోజు స్కేట్లు, టేక్వోండో పరికరాలు, స్విమ్ బ్యాగ్, క్రికెట్ కిట్ వంటివి కూడా స్కూలుకు తీసుకెళ్ళాల్సి వస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అతి తక్కువ పాఠశాలలు స్పోర్ట్స్ కిట్స్ కోసం లాకర్లను ఇస్తున్నట్లు వారు తెలిపారు. -
ఒక్కరోజు నష్టం రూ. 18వేల కోట్లు
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్ కారణంగా 16 వేల నుంచి 18 వేలకోట్ల రూపాయల వరకు నష్టం ఏర్పడినట్టు అసోచాం అంచనా వేసింది. ఈ రోజు బంద్ కారణంగా బ్యాంకింగ్, ప్రజారవాణా, టెలికాం తదితర సేవలకు అంతరాయం ఏర్పడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడినట్టు అసోచాం ప్రతినిధులు వెల్లడించారు. దేశ జీడీపీలో వాణిజ్య, రవాణా, హోటల్స్ ప్రధాన రంగాలని, అలాగే బ్యాంకింగ్ సహా ఆర్థిక రంగ సర్వీసులు కీలకమైనవని, బంద్ కారణంగా నష్టం ఏర్పడినట్టు తెలిపారు. నెలకు కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని, నెలకు రూ. 3 వేల కనీస పెన్షన్ వంటి 12 డిమాండ్లతో 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ కారణంగా సాధారణ జనజీవనంపై ప్రభావం చూపించింది. ప్రజా రవాణా ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. హరియాణా, జార్ఖండ్, బెంగాల్లో వందలాది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. -
అసోచామ్ రీజినల్ కౌన్సిల్ చైర్మన్గా ఏఎస్ మిట్టల్
హైదరాబాద్: అసోచామ్ రీజినల్ కౌన్సిల్ తొలి చైర్మన్గా సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ వైస్ చైర్మన్ ఏఎస్ మిట్టల్ నియమితులయ్యారు. ఉత్తర భారతంలో పరిశ్రమల వృద్ధికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని తొలగించేందుకు ఈ కౌన్సిల్ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా అసోచామ్ రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలతో కలసి పనిచేస్తుంది. -
ఇన్వెస్టర్లు ఇటే చూస్తున్నారు..
♦ వ్యాపార నిర్వహణ పరిస్థితులు మెరుగుపర్చాలి ♦ తెలంగాణ కు అసోచామ్ సూచన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ కారణాల రీత్యా మౌలిక ప్రాజెక్టుల అమల్లో జాప్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార నిర్వహణ సరళమయ్యేలా చూడటంపై తెలంగాణ ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ సూచించింది. ఇన్వెస్టర్లు ఇటే చూస్తున్న తరుణంలో ఈ చర్యలతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని తెలిపింది. 2010-15 మధ్య వివిధ రాష్ట్రాల్లోని మౌలిక రంగ ప్రాజెక్టుల్లో పెట్టిన పెట్టుబడుల స్థితిగతుల్ని వివరిస్తూ రూపొందించిన అధ్యయన నివేదికను అసోచామ్ డెరైక్టర్ జనరల్ డీఎస్ రావత్ శుక్రవారమిక్కడ విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2010-2015 మధ్య ఇన్ఫ్రాలో పెట్టుబడులు రూ.32 లక్షల కోట్ల నుంచి రూ.53 లక్షల కోట్లకు ఎగిశాయి. రవాణా సేవల్లో అత్యధికంగా 13 శాతం వృద్ధి నమోదైంది. దేశీయంగా రవాణా సేవల రంగం ప్రాజెక్టుల వ్యయాలు సగటున 47 శాతం పెరగ్గా, తెలంగాణలో పెరుగుదల అత్యధికంగా 89 శాతం మేర.. జాప్యం సుమారు 51 నెలల పాటు ఉంటోందని నివేదిక పేర్కొంది. -
‘బ్రెగ్జిట్’పై జర భద్రం!
♦ భారత్ వాణిజ్య సంఘాల సూచన ♦ ఎదుర్కొనడానికి భారత్ సిద్ధంగా ♦ ఉండాలంటున్న అసోచామ్ న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే (బ్రెగ్జిట్) ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనడానికి భారత్ సిద్ధం కావాలని, బ్రిటన్ పరిణామాలతో భారత్ ప్రయోజనాలు ముడివడి ఉన్నాయని అసోచామ్సహా పలు వాణిజ్య సంఘాలు మంగళవారంనాడు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. గురువారం కీలక ప్రజాభిప్రాయం నేపథ్యంలో వాణిజ్య సంఘాలు ఈ సూచన చేయడం గమనార్హం. బ్రిటన్, యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితుల వల్ల దీర్ఘకాలంలో ఫండ్స్ తమ పెట్టుబడులకు భారత్ మార్కెట్వైపు చూసే అవకాశం ఉందని పేర్కొన్న అసోచామ్, అయితే ఏదైనా జరగవచ్చన్న ధోరణిలో, విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థగా పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడింది. వేగంగా మారుతున్న ఆర్థిక పరిణామాలను ఎదుర్కొనడానికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ తగిన చర్యలు తీసుకుంటారన్న విశ్వాసముందని సైతం ప్రకటన పేర్కొంది. బ్రిగ్జిట్ జరిగితే కొంతకాలమైనా అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావం భారత్పైనా ఉంటుందని వివరించింది. ప్రపంచ స్థాయి సంస్థలకు బ్రిటన్ కీలకం కావడంతో బ్రెగ్జిట్పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొనడానికి ప్రధాన కారణమని వివరించింది. ఎఫ్సీఎన్ఆర్ల పునఃచెల్లింపుల తరుణం కీలకం.. పైగా ఈ పరిణామం అంతా ఎఫ్సీఎన్ఆర్ (ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్) డిపాజిట్లు పునఃచెల్లింపుల సమయంలో జరగడం కీలకాంశమని, దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించింది. 2013లో విదేశీ కరెన్సీ బాండ్లు జారీ ద్వారా బ్యాంకులు 24 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను సమీకరించాయి. ఈ ఏడాది చివరకు ఆ బాండ్ల మెచ్యూరిటీ ఉంది. అప్పట్లో రూపాయి విలువను పటిష్టపర్చేదిశగా దేశంలోకి విదేశీ మారకాన్ని తేవాలన్న లక్ష్యంతో విదేశీ కరెన్సీ బాండ్ల జారీకి ఆర్బీఐకి అనుమతినిచ్చింది. ఈ విషయంలో విదేశీ మారకద్రవ్య నిల్వలకు సంబంధించి భరోసా ఉన్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తలు అవసరమని విశ్లేషించింది. భారత్ ప్రయోజనాలు ముడివడి ఉన్నాయి: సీఐఐ ఇదిలాఉండగా, సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఒక ప్రకటన చేస్తూ.. తాజా ‘బ్రిగ్జిట్’ పరిణామాలు భారత్ ప్రయోజనాలకు ముడివడి ఉన్న అంశంగా పేర్కొన్నారు. యూరోప్లోని పలు దేశాలతో పోల్చితే, బ్రిటన్లో భారత్ భారీ పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. మన దేశం బ్రిటన్ మూడవ అతిపెద్ద ఇన్వెస్టర్ అన్న విషయాన్ని ప్రస్తావించారు. దేశాల పరంగా చూస్తే... భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో బ్రిటన్ది 12వ స్థానంగా వివరించారు. భారత్ వాణిజ్య మిగులు ఉన్న 25 ప్రముఖ దేశాల్లో బ్రిటన్ది 7వ స్థానంగా (2015-16లో 3.64 బిలియన్ డాలర్లు) పేర్కొన్నారు. మారిషస్, సింగపూర్ తరువాత భారత్లో బ్రిటన్ అతిపెద్ద మూడవ ఇన్వెస్టర్ అని గణాంకాలు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ... ఆయా అంశాల నేపథ్యంలో తాజాగా ఆ దేశంలో పరిణామాలపై జాగరూకత అవసరమని సూచించారు. దేశంపై ప్రభావం ఉంటుంది: ఫిక్కీ బ్రెగ్జిట్ గనుక జరిగితే... ఆ ప్రభావం భారత్పై ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ పేర్కొన్నారు. ప్రత్యేకించి బ్రిటన్తో వ్యాపారాలు నిర్వహిస్తున్న భారత్ కంపెనీలపై ప్రతికూలత ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడులతో పాటు బ్రిటన్కు ఫ్రొఫెషనల్స్ కదలికలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిక్కీ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పౌండ్లో ఒడిదుడుకుల ప్రభావం అటు భారత్ వ్యాపారాలపైనా, కరెన్సీపైనా కీలకమేనని వివరించారు. జాగ్వార్కు బ్రెగ్జిట్ భయం! లండన్: బ్రిటన్లో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ, టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్)ను బ్రెగ్జిట్ భయాందోళన వేధిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ తప్పుకుంటే ఈ సంస్థ లాభాలు భారీగా హరించుకుపోయే ప్రమాదం ఉందన్నదే ఆందోళనకు కారణం. ఈ దశాబ్దం చివరి నాటికి సుమారుగా బిలియన్ పౌండ్ల మేర (సుమారుగా రూ.10వేల కోట్ల రూపాయలు) లాభాలను కోల్పోయే అవకాశం ఉందని కంపెనీ వర్గాల సమాచారం. ఈ మేరకు కంపెనీ ముఖ్య ఆర్థికవేత్త డేవిడ్రియా ఓ అంతర్గత నివేదికను రూపొందించారు. బ్రిటన్ ఈయూలోనే ఉండాలా లేదా అన్నది గురువారం జరిగే ఓటింగ్లో ప్రజలు తేల్చనున్న విషయం తెలిసిందే. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన క్రమంలో... ఈయూతో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీంతో ఎగుమతులపై సుమారు 10 శాతం టారిఫ్, దిగుమతి చేసుకునే పరికరాలపై 4 శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా. 2015-16లో జేఎల్ఆర్ పన్నులకు ముందు లాభం 1.6 బిలియన్ పౌండ్లుగా ఉంది. జేఎల్ఆర్ సంస్థ గతేడాది మొత్తం కార్ల విక్రయాల్లో సుమారు 25 శాతం యూరోప్లోనే అమ్ముడుపోయాయి. -
పెరిగిన ఈ-వీసా యాత్రికులు
కోల్కతా: ఈ-టూరిస్ట్ వీసా మీద భారత్ను సందర్శించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం 179.9 శాతం వృద్ధి నమోదైందని అసోచామ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ- టూరిస్ట్ వీసా ఆధారంగా ఈ మేలో 43,833 మంది సందర్శించగా, కిందటి సారి ఇదే సమయంలో 15,659 మంది వచ్చారు. ఈ ఏడాది జనవరి-మే మధ్య 4,34,927 మంది ఈ సదుపాయం వినియోగించుకోగా, గత ఏడాది ఇదే కాలంలో 1,10,657 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఈ విధానాన్ని 2014 నవంబర్ 27 నుంచి 2016 ఫిబ్రవరి 25 వరకు 113 దేశాలకు చెందిన పౌరులకు భారత ప్రభుత్వం వర్తింపజేసింది. -
ఆర్థిక వ్యవస్థ రికవరీ: పరిశ్రమ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో రికవరీ కనబడుతోందని పరిశ్రమలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2016-17, ఏప్రిల్-జూన్)లో ప్రభుత్వం మౌలిక రంగంపై భారీగా వ్యయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇది క్యూ1లో చక్కటి వేగవంతమైన ఆర్థికవృద్ధికి దారితీస్తుందని పరిశ్రమ అభిప్రాయపడుతోంది. వివిధ పారిశ్రామిక చాంబర్ల అభిప్రాయాలివి... సీఐఐ: తగిన వర్షపాతం, గ్రామీణ డిమాండ్, సంస్కరణల అమలు వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశాభివృద్ధి రేటును 8 శాతం వద్ద నిలబెడతాయన్నది తమ అంచనా అని సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగవంతమైందన్నది తమ అభిప్రాయమనీ, రానున్న కొద్ది కాలంలో ఈ ధోరణి మరింత పుంజుకుంటుందని భావిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. పలు రంగాలు దిగువస్థాయి వృద్ధి తీరు నుంచి ఎగువస్థాయి వృద్ధి ఎదిగినట్లు సీఐఐ-అసోకాన్ సర్వేలో వెల్లడైందని కూడా సీఐఐ తెలిపింది. ఫక్కీ: ఊహించినదానికన్నా వేగంగా భారత్ రికవరీ జరుగుతోందని స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు పేర్కొంటున్నాయి. నాల్గవ త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోడానికి నిదర్శనం. గడచిన రెండు సంవత్సరాలుగా కేంద్రం చేపట్టిన పలు సంస్కరణలు, అమలు దీనికి కారణమని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ పేర్కొన్నారు. మున్ముందూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. అసోచామ్: ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరగడానికి ఇది తగిన సమయం. ఉపాధి అవకాశాల మెరుగుదల, పటిష్ట వృద్ధి దీనివల్ల సాధ్యమవుతుంది. పెట్టుబడుల పునరుద్ధరణ భారీ స్థాయిలో జరగడమే వృద్ధి పటిష్టతకు ప్రధానంగా దోహదపడే అంశం. వస్తు సేవల పన్ను అమలుకు రాజకీయ ఏకాభిప్రాయ సాధనసహా, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతానికి తగిన పరిస్థితులను సృష్టించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎంబీఏ చదువులు ఘోరం!
♦ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవు ♦ వచ్చినా జీతం రూ.10వేలకన్నా తక్కువే ♦ ఐఐటీ, ఐఐఎం విద్యార్థుల స్థితీ తీసికట్టే ♦ ఇంజినీర్లయితే 20-30 శాతం నిరుద్యోగులే ♦ టీచర్ల వృత్తిలోకి సరైన వాళ్లు రావటంలేదు ♦ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలి: అసోచామ్ న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత స్థాయి చదువులైన ఎంబీఏ, ఇంజినీరింగ్కు సంబంధించి కళ్లు తిరిగే వాస్తవాల్ని అసోచామ్ బయటపెట్టింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో అతికొద్ది మందికి తప్ప మిగతావారికి ఉద్యోగాలే దొరకటం లేదని, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 20-30 శాతం మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని స్పష్టంచేసింది. దీనికి కారణాలను విశ్లేషిస్తూ... మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సి ఉందని స్పష్టంచేసింది. ఈ మేరకు అసోచామ్ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రతిష్టాత్మక ఐఐఎం వంటి కొన్ని అగ్రశ్రేణి బిజినెస్ స్కూళ్లను మినహాయిస్తే... చాలా బిజినెస్ స్కూళ్లలో చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ స్కూళ్ల నుంచి వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకటమే లేదు. చచ్చీచెడీ ఉద్యోగాలు సంపాదించినా వారి జీతాలు మాత్రం రూ.10వేల కంటే తక్కువే ఉంటున్నాయి’’ అని నివేదికలో అసోచామ్ అభిప్రాయపడింది. చదువుల్లో నాణ్యత లేకపోవటం, నాసిరకం మౌలిక సదుపాయాలు, తక్కువ జీతాలకే ప్రాంగణ నియామకాలు జరపడం వంటివి దీనికి కారణాలని పేర్కొంది. నిజానికి దేశంలో దాదాపు 5,500 బిజినెస్ స్కూళ్లున్నాయి. ఇక గుర్తింపు లేనివి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. వీటి చదువుల్లో నాణ్యత మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోందని ఈ నివేదికలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికలో వెల్లడించిన ముఖ్యాంశాలివీ... ♦ దేశంలో ప్రధాన 20 బిజినెస్ స్కూల్స్ను మినహాయిస్తే మిగతా వాటినుంచి ఉత్తీర్ణత సాధిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో 7 శాతం మందికే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ♦ మరో విషయమేంటంటే ఈ గ్రాడ్యుయేట్లలో ఆ 7 శాతం మాత్రమే ఉద్యోగానికి నిజంగా పనికొస్తున్నారు. ♦ గడిచిన రెండేళ్లలో ఢిల్లీ, ముంబయి, కోల్కతా, లక్నో, అహ్మదాబాద్, హైదరాబాద్, డెహ్రాడూన్లలో దాదాపు 200 బిజినెస్ స్కూళ్లను మూసేశారు. ఈ ఏడాది మరో 120 స్కూళ్లు మూసేసే అవకాశముంది. ♦ ఇవన్నీ మూతపడటానికి కారణం నాసిరకం చదువులు, ఆర్థిక మందగమనమే. 2014-16 మధ్య క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఏకంగా 45 శాతం పడిపోయాయి కూడా. ♦ గడిచిన ఐదేళ్ల కాలంలో బి-స్కూళ్లలో సీట్లు మూడింతలయ్యాయి. 2015-16 లో ఎంబీఏ కోర్సుల్లో మొత్తం సీట్ల సంఖ్య 5.20 లక్షలుగా ఉంది. 2011-12 ఈ సంఖ్య 3.2 లక్షలు. ♦ రెండేళ్ల ఎంబీఏ కోసం సగటున ప్రతి విద్యార్థీ రూ.3-5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వారి జీతం రూ.8-10వేలు మాత్రమే ఉంటోంది. ♦ స్కూలు స్థాయిలో నాణ్యమైన విద్య అందకపోవటంతో ఐఐఎం, ఐఐటీ గ్రాడ్యుయేట్ల స్థాయి కూడా పడిపోతోంది. పదిహేనేళ్ల కిందటి వారితో పోలిస్తే ప్రస్తుత గ్రాడ్యుయేట్ల మేధో స్థాయి చాలా తక్కువగా ఉంది. ♦ నాణ్యమైన బోధన సిబ్బంది లేకపోవటం కూడా దీనికి కారణమే. ఈ వృత్తి అంత ఆకర్షణీయంగా లేకపోవటంతో ఎక్కువమంది ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ♦ ఇక ఉన్నత విద్య విషయానికొస్తే నాణ్యత మరీ దారుణంగా ఉంది. కార్పొరేట్ ప్రపంచానికి తగ్గట్టుగా ఏమాత్రం లేదు. ♦ ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 20 నుంచి 30 శాతానికి ఎలాంటి ఉద్యోగాలూ దొరకటం లేదు. చాలా మంది వారి సాంకేతిక అర్హతలకన్నా తక్కువవైన చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరుతున్నారు. -
మాల్యాతో చర్చించండి.. నష్టాలను తగ్గించుకోండి..
బ్యాంకులకు అసోచామ్ సూచన న్యూఢిల్లీ: భారీ ఎత్తున బ్యాంకు రుణాలు కలిగివున్న విజయ్ మాల్యాతో చర్చలు జరిపి రావాల్సిన డబ్బును తిరిగి రాబట్టుకోవాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ బ్యాంకులకు సూచించింది. చర్చలతో నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపింది. మాల్యా బ్యాంకులకు ఇచ్చిన రూ.4,000 కోట్ల ఆఫర్ తన రుణ చెల్లింపు ఉద్దేశాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. మాల్యా రుణ ఎగవేత చర్యపై బ్యాంకులు.. మీడియా నివేదికలకు, బహిరంగ చర్చలకు ప్రభావితం కావొద్దని తెలిపింది. మాల్యా ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా బ్యాంకులు ఆయనతో వాస్తవిక చర్చలు జరిపితే రూ.4,000 కోట్ల సంఖ్య మారొచ్చని పేర్కొంది. ‘ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ముందున్న ప్రధాన అంశం వాటి ఆస్తులను/డబ్బుల్ని తిరిగి రాబట్టుకోవడం. లేకపోతే అవి మొండిబకాయిలుగా మారిపోతాయి. అందుకే డబ్బుల రికవరీకి గట్టి ప్రయత్నం జరగాలి’ అని పేర్కొంది. -
ద్రవ్యలోటు విధాన సమీక్షకు త్వరలో కమిటీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు లక్ష్య నిర్దేశ విధానాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అసోచామ్ బుధవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు నిర్దిష్టంగా ‘ఇంత’ శాతం ఉండాలన్నది ప్రస్తుత విధానం. ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్ట నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ అమలు జరుగుతోంది. ఇలా ఒకే ఒక్క అంకె కాకుండా- (శాతంలో) దీనికి ఒక శ్రేణిని నిర్దేశించుకునే విధాన రూపకల్పన సాధ్యాసాధ్యాలను ప్రతిపాదిత కమిటీ పరిశీలిస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం 3.9ు. 2016-17లో ఈ లక్ష్యం 3.5%. ఈ లక్ష్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి జైట్లీ పేర్కొన్నారు. -
జాట్ల ఆందోళనతో 20 వేల కోట్లు నష్టం
న్యూ ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న జాట్ల ఆందోళనల మూలంగా హర్యానా రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు పారిశ్రామిక సంస్థ అసోచామ్ తన నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రాష్ట్రంలో స్తంభించిపోయిన పారిశ్రామిక ఉత్పత్తుల మూలంగా ఈ నష్టం వాటిల్లినట్లు అసోచామ్ తెలిపింది. జాట్ల ఉద్యమం హర్యానాతో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లపై కూడా ఆర్ధికంగా ప్రభావం చూపుతోందని ఈ నివేదిక తెలిపింది. పలు ముఖ్యమైన జాతీయ రహదారులు హర్యానా రాష్ట్రం గుండా వెళ్తుండటంతో ఆ ప్రాంతంలోని రవాణా అనుబంధ రంగాలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు వెల్లడించింది. ఆదివారం కూడా హర్యానాలో జాట్ల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. -
పన్ను మినహాయింపు పరిమితి రూ.4 లక్షలకు పెంచండి
కేంద్రానికి అసోచామ్ సూచన న్యూఢి ల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రానున్న బడ్జెట్లో రూ.4 లక్షలకు పెంచాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ కేంద్రాన్ని కోరింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. సేవింగ్స్కు సంబంధించి మరిన్ని ప్రోత్సాహకాలను అందించాలని పేర్కొంది. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ నిధుల కేటాయింపు పెరగాల్సి ఉందని తెలిపింది. అసోచామ్ ఇటీవల ‘ఆమ్ ఆద్మీ’ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న 87% మంది పన్ను మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. నిత్యావసర జీవన ప్రమాణ ధరల పెరుగుదల నేపథ్యంలో పరిమితి పెంపు ఆవశ్యకమని అసోచామ్ పేర్కొంది. ప్రస్తుతం సెక్షన్ 80డీ ప్రకారం ఉన్న వార్షిక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు పరిమితిని రూ.15,000 నుంచి రూ.50,000 వరకు పెంచాలని సర్వేలో పాల్గొన్న 88 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లల చదువు ఖర్చుల పరిమితిని కూడా నెలకు రూ.100 నుంచి రూ.1,000 వరకు పెంచాలని అసోచామ్ పేర్కొంది. అలాగే ప్రసు ్తతం ఇద్దరి పిల్లలకు ఇస్తున్న హాస్టల్ ఖర్చుల పరి మితిని నెలకు రూ.300 నుంచి రూ.3,000 వరకు పెంచాలని తెలిపింది. ఇంటి రుణాల వడ్డీరేట్లు పెరుగుతుండటం, ప్రాపర్టీ ధరలు ఎగయడం వంటి అంశాల నేపథ్యంలో వ్యక్తిగత ప్రాపర్టీ వడ్డీరేట్ల మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని పేర్కొంది. -
ఈ-కామర్స్లో 2.5 లక్షల ఉద్యోగాలు: అసోచామ్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ పరిశ్రమ ఈ ఏడాది కొత్తగా 2.5 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తన నివేదికలో పేర్కొంది.2016లో నియామకాలలో పెరుగుదల 60 నుంచి 65 శాతం ఉండొచ్చని రిపోర్టులో తెలిపింది.గత ఏడాది ఈ-కామర్స్ విభాగాల్లో టర్నోవర్ భారీగా పెరిగిందని ,అది మున్ముందు జరిగే అభివృద్ధికి ఎంతగానో తోడ్పడనుందని అసోచామ్ పేర్కొంది.2009లో దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్లు కాగా అది 2014లో 17 బిలియన్ డాలర్లకు చేరింది.ఇది గత ఏడాది 23 బిలియన్ డాలర్లుగా నమోదైంది.ఈ ఏడాది 38 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులో తెలిపింది.తాత్కాలిక ఉద్యోగాలు,సరఫరా,లాజెస్టిక్స్,సహాయక విభాగాలలో ఈ నియామకాలు ఉండొచ్చని అభిప్రాయపడింది. -
పొదుపుపై పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి: అసోచామ్
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పొదుపులకు సంబంధించి పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని పారిశ్రామిక మండలి అసోచామ్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వేతన ఉద్యోగులకు స్టాండెర్డ్ డిడక్షన్ను పునఃప్రారంభించాలని కూడా ఒక ప్రకటనలో కోరింది. ఆయా అంశాలు వ్యవస్థలో వినియోగం, వృద్ధి దారితీస్తాయని వివరించింది. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సోమవారం నుంచి వివిధ ఆర్థిక, వ్యాపార, సామాజిక వర్గాలతో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముందస్తు చర్చలు జరపనున్న నేపథ్యంలో అసోచామ్ తాజా విజ్ఞప్తి చేసింది. -
ఆర్థిక నిర్ణయాల్లో రాజకీయాలొద్దు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక వృద్ధిరేటుకు సంబంధించిన కీలక నిర్ణయాలను రాజకీయాల నుంచి వేరు చేయాలని ఇండస్ట్రీ అసోసియేషన్ అసోచామ్ డిమాండ్ చేసింది. కీలకమైన ఆర్థిక నిర్ణయాల విషయాల్లో పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కకు పెట్టి దేశ వృద్ధికి తోడ్పడాలని అసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా పేర్కొన్నారు. కేవలం అధికార, ప్రతిపక్ష పార్టీల మొండి పట్టుదల వల్ల కీలకమైన జీఎస్టీ బిల్లు ఆరేళ్ల నుంచి ఆమోదం పొందలేకపోతోందని, దీనివల్ల దేశప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ఇండియా దేశ ఆర్థిక వృద్ధిరేటు 1.5 శాతం నుంచి 2 శాతం వృద్ధి చెందుతుందని, ముఖ్యంగా తయారీ రంగం వేగంగా విస్తరించడం ద్వారా అనేకమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇందుకు అవసరమైతే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమై జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం కాకుండా పన్నులు విధించుకోవడానికి రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తే జీఎస్టీ ముఖ్యోద్దేశ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఈ ఏడాది ఆర్థిక వృద్ధిరేటు 7.4 శాతం, వచ్చే ఏడాది 8 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇన్ఫ్రా కోలుకుంటోంది... ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇన్ఫ్రా రంగం కోలుకుంటోందని, ఒకటి రెండు నెలల్లో చాలా కంపెనీల్లో ఈ ప్రతిఫలాలు కనిపిస్తాయని సునీల్ పేర్కొన్నారు. పలు ఇన్ఫ్రా ప్రాజెక్టులు వివాదాల్లో కూరుకుపోవడం వల్ల సుమారు రూ. 5 లక్షల కోట్లు ఆర్బిట్రేషన్లో ఇరుక్కుపోయాయని, ఒక్కసారి ఆర్బిట్రేషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే ఈ నిధులు ఇన్ఫ్రా కంపెనీలకు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగురాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయన్నారు. డెక్కన్ క్రానికల్ పునర్ వ్యవస్థీకరణ: శ్రేయి ఇన్ఫ్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్)ను పునర్ వ్యవస్థీకరించే ఆలోచనలో ఉన్నట్లు శ్రేయి ఇన్ఫ్రా ప్రకటించింది. డీసీహెచ్ఎల్లో 24 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న శ్రేయి ఇన్ఫ్రా, రుణాలు ఇచ్చిన ఇతర సంస్థలతో కలిసి కంపెనీని పునర్ వ్యవస్థీకరించనున్నట్లు తెలి పింది. హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సునీల్ కనోరియా మాట్లాడుతూ కోర్టు అనుమతులతో కంపెనీని పునర్ వ్యవస్ధీకరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కంపెనీ యాజమాన్య వ్యవస్థను మరింత పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. డీసీహెచ్ఎల్కి ఇచ్చిన రూ. 220 కోట్ల రుణాన్ని రాబట్టుకోవడానికి శేయి ఇన్ఫ్రా డెట్ రికవరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. డీఆర్టీ ఆదేశాల మేరకు డీసీహెచ్ఎల్ గత జనవరిలో 6.6 కోట్ల షేర్లను జారీ చేయడంతో శ్రేయి వాటా 24 శాతానికి పెరిగింది. తప్పుడు పత్రాలను పెట్టి రుణాలను తీసుకున్నందుకు కెనరా బ్యాంక్ సీబీఐని ఆశ్రయించగా, ఆంధ్రా బ్యాంక్ కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం డీసీహెచ్ఎల్కి సుమారు రూ. 4,000 కోట్ల అప్పులున్నాయి. -
బ్యాంకింగ్కు రూ.5 లక్షల కోట్లు అవసరం: అసోచామ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి బాసెల్ 3 అమలుకు భారత్ బ్యాంకులకు రూ. 5 లక్షల కోట్ల మూలధనం అవసరమవుతుందని అసోచామ్-ఎన్ఐబీఎం అధ్యయనం ఒకటి తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రకారం.. బాసెల్ ప్రమాణాల అమలుకుగాను 2019 మార్చి నాటికి ఈ నిధుల అవసరం ఏర్పడుతుందని సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. సమీప కాలంలో భారీగా 20 శాతం రుణ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇప్పటికే తీవ్రంగా ఉన్న మొండి బకాయిల భారం, స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు వంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ మూలధనం సమకూర్చుకోవడం సవాలేనని కూడా పేర్కొంది. -
సంక్షోభ రంగాలకు రాయితీలివ్వాలి
ప్రభుత్వానికి అసోచామ్ విన్నపం న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న రంగాలను గట్టెక్కించడానికి రాయితీలు ఇవ్వాలని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ ప్రభుత్వాన్ని కోరింది. రియల్టీ, విద్యుత్తు, ఉక్కు, ఆభరణాలు, రత్నాలు తదితర రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి. ఎస్. రావత్ చెప్పారు. ఈ రంగాలను ఆదుకోవడానికి ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, తక్కువ వడ్డీరేట్లకే రుణాలివ్వాలని, ఎగమతిదారులకు వడ్డీరాయితీ స్కీమ్ను అందించాలని కోరారు. విద్యుత్ పంపిణి కంపెనీలు(డిస్కమ్లు) సమస్యల్లో కూరుకుపోయాయని, వీటిని రక్షించడానికి ఆర్బీఐ, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటిని గట్టెక్కించలేకపోతే అవి నిర్జీవ ఆస్తులుగా, నిరర్ధక ఆస్తులుగా మారిపోతాయని, ఖజానాకు గుదిబండగా తయారవుతాయని హెచ్చరించారు. ఉద్యోగాలు కల్పించే పలు కీలక రంగాలు సమస్యల్లో కూరుకుపోయాయని పేర్కొన్నారు. డిమాండ్ లేకపోవడం, అధిక వడ్డీ వ్యయాలు, చౌక దిగుమతులు వెల్లువెత్తుతుండటం దీనికి ప్రధాన కారణాలని వివరించారు. డిమాండ్ పెంచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉక్కు, సిమెంట్, విద్యుత్ పరికరాలు వంటి నిర్మాణ రంగ మెటీరియల్స్కు స్వల్పకాలిక ప్యాకేజీని ఇవ్వాలని పేర్కొన్నారు. రత్నాలు, ఆభరణాల రంగానికి వడ్డీ రాయితీ వంటి స్కీమ్లు వర్తింపజేయాలని సూచించారు. ప్రత్యేక రాయితీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుందన్న భావన సరికాదని చెప్పారు. -
అతి జాగ్రత్తవల్లే ప్రాజెక్టుల నత్తనడక
మోదీ సర్కారు పాలనపై అసోచామ్ నివేదిక న్యూఢిల్లీ : రోడ్లు, పోర్టులు, విద్యుత్ రంగంలో పలు కీలకమైన ప్రాజెక్టుల జాప్యానికి మోదీ సర్కారు అనుసరిస్తున్న అతి జాగ్రత్త విధానమే కారణమని పారిశ్రామిక మండలి అసోచామ్ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అవితీనికి దూరంగా ఉందని, అయితే ఇదే సమయంలో ప్రభుత్వాధికారులు, బ్యాంకర్లు, పీఎస్యూ అధికారులపై పటిష్టమైన పర్యవేక్షణ కారణంగా వాళ్లు నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుతున్నారని నివేదిక పేర్కొంది. ఈ అతిజాగ్రత్తతో ముఖ్యమైన మౌలిక ప్రాజెక్టుల అమలుకు అడ్డంకులు నెలకొంటున్నాయని అసోచామ్ అభిప్రాయపడింది. ఉదాహరణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పర్యావరణ అనుమతుల్లో జాప్యం కారణంగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్-ఢిల్లీ) పరిధిలో వేలాది పూర్తయిన ఇళ్లకు మోక్షం లభించడం లేదని నివేదిక తెలిపింది. దీంతో రియల్లీ డెవలపర్లు ఆ ఇళ్లను కొనుగోలుదార్లకు అప్పగించడానికి వీల్లేకుండా పోతోందని.. ఈ జాప్యంవల్ల తీవ్ర ఆర్థిక నష్టం కూడా వాటిల్లుతోందని పేర్కొంది. ప్రాజెక్టుల అమలు స్థాయిలో అధికారులు తమకెందుకులే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని.. పూర్తిగా నిబంధనల ప్రకారమే నడుచుకోవడంతోపాటు తమ విచక్షణాధికారాలను ఉపయోగించుకోవడానికి ఎవరూ ముందుకురావడం లేదని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నట్లు అసోచామ్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా జాతీయ రహదారుల విషయంలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. మొండిబకాయిలు పెరిగిపోతుండటంతో బ్యాంకర్లపై కూడా ఒత్తిడి అధికమవుతోందని.. ఫలితాంగా కొత్త, తాజా ప్రాజెక్టు ప్రతిపాదనలవైపే బ్యాంకులు మొగ్గుచూపుతున్నట్లు కూడా అసోచామ్ వెల్లడించింది. డీల్స్ ► ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్డీల్ తాజాగా మొబైల్ అప్లికేషన్ రంగంలో ఉన్న లెట్స్గోమొ ల్యాబ్స్ను కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించిందీ వెల్లడి కాలేదు. ► ఆన్లైన్ హోమ్ డెకార్ స్టోర్ ‘బెడ్బాత్ మోర్డాట్కామ్’ తాజాగా గ్రాఫిక్ ఆర్ట్స్ సంస్థ ‘క్రూడ్ ఏరియా’ను కొనుగోలు చేసింది. పూర్తిగా షేర్ల రూపంలో జరిగిన ఈ డీల్ కోసం ఎంత వెచ్చించినదీ కంపెనీ వెల్లడించలేదు. ► అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంత లిమిటెడ్లో కెయిర్న్ ఇండియా విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి. డీల్ పూర్తిగా షేర్ల రూపంలోనే జరిగింది. డీల్ విలువ 2.3 బిలియన్ డాలర్లు. ► ఔషధాల పరిశోధనకు సంబంధించి జీవికే బయోతో కలసి పనిచేయడానికి స్వీడన్కు చెందిన ఫార్మా స్యూటికల్ కంపెనీ మెడ్విర్ ముందుకొచ్చింది. ఇన్ఫెక్షన్తో వచ్చే వ్యాధులు, క్యాన్సర్ చికిత్స పరిశోధనలో మెడ్విర్కి మంచి పట్టుంది. ► ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సేవల పోర్టల్ ప్రాప్టైగర్డాట్కామ్లో మీడియా దిగ్గజం న్యూస్కార్ప్ తన వాటాలను మరో 5 శాతం పెంచుకుంది. దీంతో మొత్తం వాటా 30 శాతానికి చేరింది. ► ప్రాప్టైగర్డాట్కామ్ మాతృసంస్థ ఎలరా టెక్నాలజీస్లో న్యూస్కార్ప్ వాటాలను పెంచుకోవడం ఇది సాధ్యపడింది. -
పదికి ఏడు మార్కులు..!
మోదీ సర్కారు ఏడాది పాలనపై అసోచామ్ న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం తొలి ఏడాది పనితీరుపై పారిశ్రామిక మండళ్లు సానుకూలంగానే స్పందించాయి. పదికి ఏడు మార్కులు ఇస్తున్నట్లు అసోచామ్ పేర్కొంది. అయితే, పన్ను సంబంధ అంశాలు, వ్యాపారాలకు మెరుగైన పరిస్థితులను కల్పించడం వంటి విషయాల్లో ప్రభుత్వం ఇంకా చాలాచేయాల్సి ఉందని అభిప్రాయపడింది. ‘గడిచిన ఏడాది వ్యవధిలో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చింది. కరెన్సీ స్థిరత్వం, ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకోవడం వంటివి దీనికి దోహదం చేశాయి. రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత లావాదేవీలపై పన్ను విధింపు)లకు సంబంధించి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) ఆందోళనలను పరిష్కరించాలి. భారీ స్థాయి మౌలిక రంగ ప్రాజెక్టులు ప్రారంభం కావాల్సి ఉంది’ అని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐదు విదేశీ పర్యటనలతో ఆర్థికపరమైన దౌత్యంలో కొత్త మార్పులను తీసుకొచ్చేలా చేసిందని కూడా ఆయన పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీలు, స్వచ్ఛ భారత్, జన ధన యోజన వంటి పథకాలపై విదేశాల్లో కూడా విశేష స్పందన వ్యక్తమైందని కపూర్ చెప్పారు. చైనాతో ఆర్థిక బంధం బలపడింది: సీఐఐ ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనతో ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధానికి పునరుత్తేజం లభించిందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. పర్యటన సందర్భంగా కుదిరిన వ్యాపార ఒప్పందాలు శుభపరిణామమని అభిప్రాయపడింది. -
మానసిక ఆందోళన ప్రైవేట్ ఉద్యోగుల్లోనే అధికం!
న్యూఢిల్లీ: భారత్లో దాదాపు 42.5 శాతం ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువ షెడ్యూళ్లు, అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల పలు మానసిక ఆందోళనలతో బాధపడుతున్నట్లు అసోచామ్ తెలిపింది. దాదాపు 18 రంగాలకు చెందిన 150 కంపెనీలకు సంబంధించిన 1,250 మంది ప్రైవేట్ ఉద్యోగులు అసోచామ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్నారు. సర్వే ప్రకారం, మానసిక ఆందోళనల బారిన పడుతున్న ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంఖ్య దేశ రాజధాని ఢిల్లీలో అధికంగా ఉంది. దీని తర్వాత బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, హైదరాబాద్, పుణేలు ఉన్నాయి.‘పోటీ ప్రపంచంలో మనుగడ సాగించటానికి అవసరమైన ఉద్యోగాలను కాపాడుకోవాలనే ధ్యాసలో ప్రైవేట్ ఉద్యోగులు అధిక ఒత్తిడికి గురవుతున్నారు’ అని అసోచామ్ జనరల్ సెక్రటరి రావాత్ అన్నారు. మహిళల్లోనే స్థూలకాయం ఎక్కువ! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనారోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఊబకాయం మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తోందంటోంది హైదరాబాద్కు చెందిన ప్రివెంటివ్ హెల్త్కేర్ సంస్థ అయిన ఈకిన్కేర్.కామ్. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘పర్సనల్ హెల్త్ రికార్డ్ అకౌంట్’ను ఈకిన్కేర్.కామ్ ఫౌండర్, సీఈఓ కిరణ్ కే కలకుంట్ల సోమవారమిక్కడ ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం ఈకిన్కేర్.కామ్ సేవల్ని 1,500 మందికి పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. ఇందులో 70 శాతం మంది 20-30 ఏళ్ల వయస్సు వారే’ అని ఈ సందర్భంగా అన్నారు. మెడికల్ రికార్డుల్ని భద్రపర్చే సేవల్ని ఈకిన్కేర్.కామ్ అందిస్తోంది. -
అభివృద్ధి ప్రమాణాల్లో తమిళనాడు టాప్
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కాస్త బెటర్ న్యూఢిల్లీ: అభివృద్ధికి సంబంధించిన ప్రధాన కొలమానాల్లో దేశవ్యాప్తంగా తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం ఇలా మొత్తం తొమ్మిది ప్రమాణాల్లో ఎనిమిదింట్లో తమిళనాడు అత్యుత్తమ పనితీరును కనబరిచింది. ఒక్క విద్యలోనే వెనుకబడింది. పారిశ్రామిక మండలి అసోచామ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కాగా, కేరళ రెండో స్థానంలో నిలిచింది. 2009-2011; 2012-2014 కాలంలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా ఈ ర్యాకింగ్లను ఇస్తున్నట్లు అసోచామ్ పేర్కొంది. నాలుగు అంశాల్లో ఉత్తమ పనితీరు చూపుతున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మూడు ప్రమాణాల్లో ఉత్తర ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ముందున్నాయని అధ్యయన నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలవీ.. ⇒ ఆదాయం, సమానత్వం విషయంలో చూస్తే... కేరళ, తెలంగాణ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు మంచి పనితీరుతో ముందుకెళ్తున్నాయి. ⇒ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కీలకమైన రోడ్లు, విద్యుత్ లభ్యతలో పురోగతి సాధిస్తున్నాయని.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన గమ్యాలుగా నిలిచేందుకు ఇది దోహదం చేసే అంశమని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. ⇒ మొత్తంమీద చూస్తే పనితీరులో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాల్లో అసోం, మధ్య ప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, జమ్ము-కాశ్మీర్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. ⇒ పారిశ్రామికాభివృద్ధిలో గుజారాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్లు ముందజవేస్తున్నాయి. -
రాత్రిషిఫ్ట్ ఉద్యోగాల్లో తగ్గుతున్న మహిళలు
న్యూఢిల్లీ: రాత్రి షిఫ్ట్ కలిగిన కంపెనీలు, పట్టణ శివార్లలో ఉన్న కంపెనీల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య గత రెండేళ్లలో 27 శాతం తగ్గిందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఉద్యోగం చేయడానికి ఎక్కవ గంటలు ప్రయాణించాల్సి రావడం వల్ల కూడా మహిళ ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నదని ఈ నివేదిక పేర్కొంది. 20 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న మొత్తం 1,600 మంది ఉద్యోగులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 12% పెరిగిన ఆన్లైన్ ఉద్యోగాలు: కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాలలో 12% వృద్ధి నమోదైంది. హైదరాబాద్లో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 36% పెరిగినట్లు టైమ్స్జాబ్.కామ్ పేర్కొంది. రంగాల వారీగా చూస్తే ఐటీ రంగంలో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 22% పెరిగినట్లు తెలిపింది. -
లాబీయింగ్ను చట్టబద్ధ్దం చేయాలి
ఆసోచామ్ డిమాండ్ న్యూఢిల్లీ: ప్రభుత్వం-పరిశ్రమల మధ్య సంబంధాల్లో పారదర్శకత పెంచడానికి లాబీయింగ్ను చట్టబద్ధం చేయాలని ఆసోచామ్ కోరింది. ప్రభుత్వ రహస్య అధికారిక పత్రాలను చేజిక్కించుకునే కార్పొరేట్ గూఢచర్యం వెలుగుచూసిన నేపథ్యంలో ఆసోచామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లాబీయింగ్ అనేదానిని చెడ్డపదంగా పరిగణించకూడదని ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి. ఎస్. రావత్ పేర్కొన్నారు. లాబీయింగ్లో ఏది ఆమోదయోగ్యమైనదో, ఏది కాదో, ఏది చట్టబద్ధమైనదో, ఏది చట్టవిరుద్ధమైనదో నిర్వచించే సమయం ఇదేనని చెప్పారు. చాలా దేశాల్లో లాబీయింగ్కు స్పష్టమైన నిర్వచనం ఉందని, భారత్లో మాత్రం లాబీయింగ్ అంటే లంచాలివ్వడంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. పారదర్శకత కావాలి విధాన నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత అవసరమని రావత్ పేర్కొన్నారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని నినాదంగా కాక ఆచరణలో చూపాలని డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏ భారత పౌరుడైనా ప్రభుత్వం నుంచి సమాచారాన్ని, కావలసిన డాక్యుమెంట్లను పొందవచ్చని గుర్తు చేశారు. బడ్జెట్ తయారీ కూడా పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. -
ఎన్నికల ప్రచార ఖర్చు రూ.200 కోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారపర్వానికి రాజకీయ పార్టీలు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్టు అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచాం) గురువారం వెల్లడించింది. ర్యాలీలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ప్రకటనలకే అందులో 60 శాతానికి పైగా ఖర్చు చేసినట్లు వివరించింది. గత ఎన్నికల ఖర్చుతో పోలిస్తే ఈ మొత్తం 30 నుంచి 40 శాతం ఎక్కువని చెప్పింది. బరిలో నిలిచిన అభ్యర్థుల కంటే రాజకీయ పార్టీలే అధికంగా ఖర్చు పెట్టినట్లు తెలిపింది. ‘అభ్యర్థులు ఖర్చు చేయడానికి గరిష్ట పరిమితి ఉంది. పార్టీలకు అలాటి నిబంధన లు లేవు. ఎలక్షన్ కమిషన్లోని పెద్ద లొసుగు ఇది. దీనిపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది’ అని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్రావత్ అన్నారు. ఎన్నికల వల్ల టీవీ చానెళ్లు, వార్తా పేపర్లు, ప్రింటర్లు, సోషల్ మీడియా సైట్లు, వాహన డ్రైవర్లు, ఎయిర్లైన్స్ మొదలైన సంస్థలు లాభపడ్డాయని వివరించారు. ఎన్నికల పుణ్యమా అని ట్విటర్, ఫేస్బుక్, గూగుల్లు వంటి ఇంటర్నెట్ సంస్థలు బాగానే లాభాలు ఆర్జించినట్లు తెలిపారు. కరపత్రాల తయారీ దారులు కూడా బాగానే వెనకేసుకున్నట్లు వివరించారు. -
నల్లకుబేరుల పేర్లను వెల్లడించొద్దు: అసోచామ్
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయుల పేర్లను ప్రభుత్వం అనాలోచితంగా వెల్లడించరాదని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. నల్లకుబేరుల బండారాన్ని బయటపెట్టాలని రాజకీయంగా డిమాండ్లు జోరందుకున్న నేపథ్యంలో అసోచామ్ వాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందాలు(డీటీఏటీ) అటు భారతీయ పౌరులకు, కార్పొరేట్లకు చాలా ముఖ్యమని.. దీనివల్ల రెండుసార్లు పన్నులు చెల్లించే పరిస్థితి తప్పుతుందని అసోచామ్ తెలిపింది. ‘ఎలాంటి లెక్కలూ చూపకుండా విదేశాల్లో సొమ్ముదాచుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి వ్యక్తుల పేర్లను బహిర్గతం చేయడం వల్ల నల్లధనంపై పోరాటానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. డీటీఏటీలో ఉల్లంఘనల వల్ల భారత్ విశ్వసనీయత దెబ్బతింటుంది. ఒకవేళ ప్రభుత్వం వెల్లడించిన వ్యక్తులు, కంపెనీలపై ఆరోపణలు రుజువు కాకపోతే వాళ్ల ప్రతిష్టకు భంగం వాటిల్లడమేకాకుండా... భారత్లోని చట్టాలపైన కూడా నమ్మకం సన్నగిల్లేందుకు దారి తీస్తుంది’ అని అసోచామ్ అభిప్రాయపడింది. సరైన సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శక పన్నుల విధానం వంటి వ్యవస్థీకృత మార్పుల ద్వారా ఈ నల్లధనం జాడ్యానికి అడ్డుకట్టవేయొచ్చని పేర్కొంది. నల్లకుబేరులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని.. వాళ్ల పేర్లను బయటపెడతామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే.