Recycling
-
ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ కోసం.. తొలి జాయింట్ వెంచర్
ముంబై: రీ సస్టెయినబిలిటీ కంపెనీ (ReSL)లో భాగమైన రీ సస్టెయినబిలిటీ అండ్ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (Re Sustainability and Recycling Private Limited (ReSRL)) మరియు స్పెషాలిటీ కెమికల్స్ విభాగంలో పేరొందిన ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ (AIL) అనుబంధ సంస్థ ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ (Aarti Circularity Limited (ACL)) కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు చేతులు కలిపాయి. ప్లాస్టిక్ వనరుల రికవరీ మరియు పర్యావరణహిత వనరుల నిర్వహణ విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా భారతదేశవ్యాప్తంగా ప్లాస్టిక్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ఫెసిలిటీలను (PMRF) అభివృద్ధి చేసే క్రమంలో భారత్లో ఈ తరహాలో ఇదే తొలి జాయింట్ వెంచర్గా నిలవనుంది.ప్లాస్టిక్స్ సహా వివిధ వ్యర్ధాలను వేరు చేసి, వనరులను వెలికి తీసి, రీసైక్లింగ్ చేయడం ద్వారా ముడి సరుకుగా, ఇంధనాలుగా లేదా రీసైకిల్డ్ పాలిమర్ ఫీడ్స్టాక్గా ఉపయోగపడే అడ్వాన్స్డ్ సర్క్యులర్ మెటీరియల్స్ (ఏసీఎం) ఉత్పత్తి చేయడంపై పీఎంఆర్ఎఫ్లు ప్రధానంగా దృష్టి పెడతాయి. 2030 నాటికి రోజుకు కనీసం సుమారు 500 టన్నుల వనరుల రికవరీ సామర్థ్యాన్ని సాధించాలని భాగస్వామ్యం నిర్దేశించుకుంది. అలాగే మెటీరియల్, పవర్ సర్క్యులారిటీని గరిష్ట స్థాయిలో మెరుగుపర్చే దిశగా, ReSL కార్యకలాపాల ద్వారా కూడా ఉత్పత్తయ్యే వాటితో సహా వివిధ ఫీడ్స్టాక్స్ను పరిశీలించాలని కూడా నిర్దేశించుకుంది.ఈ భాగస్వామ్యం కింద తొలి ప్లాస్టిక్స్ మెటీరియల్స్ రీసైక్లింగ్ ప్లాంటు తెలంగాణలోని హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. ప్రాంతీయంగా అధునాతన రీసైక్లింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుంది. పర్యావరణహితమైన విధంగా వ్యర్ధాల నిర్వహణను చేపట్టే దిశగా సాగుతున్న భారత ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయిగా నిలవగలదు. సుస్థిరత మరియు సాంకేతిక ఆవిష్కరణల విషయంలో ఇరు సంస్థలకు గల నిబద్ధతకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది. భారతదేశపు రీసైక్లింగ్ మరియు వ్యర్ధాల నిర్వహణ రంగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పేలా, అధునాతన పీఎంఆర్ఎఫ్లను రూపొందించి, నిర్వహించేందుకు తగిన అగ్రగామి సాంకేతిక భాగస్వాములను జాయింట్ వెంచర్ కంపెనీ ఎంచుకుంటుంది.“పర్యావరణహితంగా వనరులను నిర్వహించే దిశగా సాగుతున్న మా ప్రస్థానంలో ఈ భాగస్వామ్యం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. వ్యర్ధాల నిర్వహణ మరియు వనరుల రికవరీకి సంబంధించి మాకున్న అపార అనుభవం మరియు ఆర్తి ఇండస్ట్రీస్ యొక్క సుసంపన్నమైన వారసత్వం మరియు స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో ఆ సంస్థకున్న 40 ఏళ్ల అనుభవం ఈ భాగస్వామ్య ఒప్పందానికి దన్నుగా నిలవనున్నాయి. క్రిటికల్ వ్యర్ధాల సవాళ్లను పరిష్కరించే అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మాకు తోడ్పడనున్నాయి. అత్యాధునిక టెక్నాలజీలు మరియు పర్యావరణహిత విధానాలను ఉపయోగించడం ద్వారా వనరులను సమర్ధంగా నిర్వహించుకోవడం మరియు సర్క్యులారిటీ తోడ్పాటుతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థను సృష్టించాలనేది మా లక్ష్యం. భారత్లోను, ఇతర ప్రాంతాల్లోనూ సుస్థిర అభివృద్ధికి సంబంధించి మేము సమష్టిగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతాం” అని రీ సస్టెయినబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో Mr. మసూద్ మాలిక్ తెలిపారు.“ACL, ReSRL మధ్య భాగస్వామ్యమనేది, రెండు దిగ్గజ సంస్థల శక్తి, సామర్థ్యాల మేలు కలయిక ద్వారా, సుస్థిరతకు నవకల్పనలను మేళవించి తీవ్రమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు తోడ్పడగలదు. ఈ జేవీ ద్వారా భారతదేశంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ రీసైక్లింగ్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనేది మా లక్ష్యం. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, వ్యర్ధాల ఉత్పత్తిని తగ్గించడం, సహజ వనరుల వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం మరియు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడమనే ఏసీఎల్ విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉంటుంది” అని ఆర్తి సర్క్యులారిటీ లిమిటెడ్ డైరెక్టర్ Mr. మిరిక్ గోగ్రి (Mirik Gogri) తెలిపారు. -
రిస్కులో బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ
న్యూఢిల్లీ: రీసైక్లింగ్ వ్యవస్థలో గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ పలు రిస్కులు ఎదుర్కొంటోందని మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఆర్ఏఐ) తెలిపింది. పరిశ్రమలోకి మోసపూరిత వ్యాపార సంస్థల ఎంట్రీతో పాటు పర్యావరణంపరంగా విపత్తులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వివరించింది.ప్రస్తుత ధర విధానం వల్ల లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల దిగుమతులపై భారత్కు సుమారు 1 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారకంపరంగా నష్టం వాటిల్లుతోందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో లిథియం రీసైక్లింగ్కు ఫ్లోర్ ధరను పెంచాలని, నిబంధనలు పారదర్శకంగా అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంఆర్ఏఐ వివరించింది. -
అమ్మో.. ప్లాస్టిక్ భూతం!
సాక్షి, అమరావతి: భారత్ను ప్లాస్టిక్ భూతం భయపెడు తోంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తోంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే ప్లాస్టిక్ ఉద్గారాలకు భారత్ నిలయంగా మారుతోంది. నేచర్ జర్నల్లో ప్రచురించిన లీడ్స్ విశ్వవిద్యాలయ (ఇంగ్లడ్) బృందం అధ్యయనం ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యాలు లేకపోవడంతో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో చైనాను దాటుకుని భారత్ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో 2 లక్షల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ను నింపొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే 5.21 కోట్ల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ కాకపోవడంతో ఎక్కువ భాగం పర్యావరణంలోకి ప్రవేశించి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నట్టు నివేదిక చెబుతోంది. ఇందులో దాదాపు ఐదో వంతు (18 శాతం) భారత్ నుంచే వస్తుండటం గమనార్హం.ఈ క్రమంలోనే చైనాలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ అక్కడి రీసైక్లింగ్ వ్యవస్థ ద్వారా వాటిని నియంత్రిస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. భారత్ తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనా ప్లాస్టిక్ ఉద్గారాల్లో పోటీపడుతున్నాయి. యూకే మాత్రం 4 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో 135వ ర్యాంకు పొందింది.ఏటా వివిధ దేశాలు ఉత్పత్తి చేస్తూ నిర్వహణకు నోచుకోని ప్లాస్టిక్ వ్యర్థాలు (లక్షల టన్నుల్లో)ఆరోగ్యానికి ముప్పుప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారకాలకు కారణం అవుతోంది. జనాభా పెరుగుదలకు తోడు ఆదాయ వనరులు పెరగడంతో విలాసాల జీవితం దగ్గరవుతోంది. ఫలితంగా ఎక్కువ వ్యర్థాలు బయటకొస్తున్నాయి. దీంతో దేశంలో వ్యర్థాల నిర్వహణను చేపట్టడం సవాల్గా మారింది. దేశంలో డంపింగ్ యార్డుల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ఇక్కడ సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.12 కేజీల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.అయితే, దేశంలో 95 శాతం వ్యర్థాలను సేకరిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, విచ్చలవిడిగా తగలబెడుతున్న వ్యర్థాలు, అనధికారికి రీసైక్లింగ్లోని వ్యర్థాలను లెక్కించడం లేదని అధ్యయనం పేర్కొనడం గమనార్హం. మరోవైపు ప్లాస్టిక్ను బహిరంగంగా కాల్చడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత రసాయనాలు విడుదల అవుతున్నాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కేన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. 20 దేశాల నుంచే 69 శాతం వ్యర్థాలుప్రపంచంలో 69 శాతం వ్యర్థాలు 20 దేశాల నుంచే వస్తున్నట్టు అధ్యయనం నమోదు చేసింది. ఇందులో 4 తక్కువ ఆదాయ, 9 తక్కువ మధ్య ఆదాయ, 7 ఉన్నత మధ్య ఆదాయ దేశాలున్నాయి. అధికాదాయ దేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రపంచంలో రీసైక్లింగ్ చేయని ప్లాస్టిక్లో దాదాపు 43 శాతం చెత్తగా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. అయితే.. అత్యంత ప్లాస్టిక్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంటే.. అక్కడ సగటున రోజులో ఒక వ్యక్తి ఉత్పత్తి చేస్తున్న వ్యవర్థాలు తక్కువగా ఉండటంతో 153వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ 127వ స్థానంలో ఉంది. -
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ 'అటెరో' వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 8300 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో, కో ఫౌండర్ 'నితిన్ గుప్తా' తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సంవత్సరానికి 1,44,000 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్ ), 15,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీని రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సంస్థ ఈ పెట్టుబడి పెట్టింది.సంస్థ ప్రతి ఏటా 100 శాతం వృద్ధి సాధిస్తోందని, ఈ క్రమంలోనే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఐరోపా దేశంలో ఇప్పటికే తన కార్యకలాపాలనను ప్రారంభించింది. భారతదేశంలో మరొక గ్రీన్ఫీల్డ్ సౌకర్యాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ / జార్ఖండ్లో స్థలాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.కంపెనీ తన ఉనికిని విస్తరించిన తరువాత రీసైక్లింగ్ కెపాసిటీ ఏడాదికి 50000 టన్నులకు చేరుతుంది. ప్రస్తుతానికి కంపెనీ రీసైక్లింగ్ సామర్థ్యం 415000 టన్నులు అని తెలుస్తోంది. కంపెనీ 2027 నాటికి దాదాపు రూ. 16500 కోట్ల ఆదాయం గడించాలని యోచిస్తోంది. 2023లో కంపెనీ ఆదాయం రూ. 285 కోట్లు, 2024లో రూ. 440 కోట్లు.అటెరోకు ప్రస్తుతం 25 శాతం మార్కెట్ వాటా అది. ఇది వచ్చే ఏడాదికి 35 శాతానికి పెరుగుతుంది. అయితే మార్కెట్ వాటా పరంగా కంపెనీ దాని ప్రత్యర్థుల కంటే 10 శాతం తక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో కంపెనీ గణనీయమైన వృద్ధి సాదిస్తుందని భావిస్తున్నట్లు నితిన్ గుప్తా పేర్కొన్నారు. -
ఇంట్లో వాడే పాత్రల వెనుక ఇంత కష్టం ఉంటుందా?
మనం నిత్యం ఎలా పడితే అలవాడే పాత్రలు ఎలా తయారవ్వుతాయో వింటే షాకవ్వుతారు. ఇంత శ్రమ ఉంటుందా! అనుకుంటారు. మనం పాత సామాన్లను అమ్మేస్తుంటాం. ఎంతో కొంత డబ్బులు తీసుకుని పనికిరాని సామాన్లను పాత సామాన్ల వాడికి ఇచ్చేస్తుంటాం. అలా వచ్చిన వాటిని వాళ్లు ఏం చేస్తారో తెలుసా..? మనం నిత్యం కూరలు వండేది అల్యూమినియం పాత్రల్లోనే. వాటిల్లో వండొద్దని హెచ్చరిస్తున్నా.. మనం వాటిల్లోనే వండేస్తుంటాం. అవే అయితే కడగడం ఈజీ. పైగా అంత బరువు ఉండవు. వాడుకునేందుకు సౌలభ్యంగా ఉండటంతో ప్రజలు ఆ పాత్రలకే అలవాటు పడిపోయారు. అదీగాక పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో కూడా వీటిని వాడుతుంటారు. కడిగేందుక వీలుగానూ, ఎక్కువ మొత్తంలో వండే కూరకు ఈ గిన్ని కాస్త వెసులుబాటుగా ఉంటుంది. బరువు కూడా ఓ మోస్తారుగా ఉంటుంది. అలాంటి ఈ అల్యూమినియం పాత్రలను మనం ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం వీటి వెనుక ఇంత కష్టం ఉంటుందా? అని నోరెళ్లబెడతారు. వాడిపడేసిన అల్యూమినయం చెత్తను బొగ్గుల వేడిపై కరిగించి వాటిని మంచిగా మరిగించి ఓ పాత్ర రూపంలో ఉన్న బట్టిలో వేసి అల్యూమినియం గిన్నెలను తయారు చేస్తారు. అవి అందంగా ఉండేలా మంచి పాలిష్ పెట్టడం ఒక వంతు. ఆ తర్వాత ఆ గిన్నెలను పట్టుకునేలా హ్యాండిల్స్ బిగించి చక్కగా గిన్నె తయారయ్యిందని నిర్థారించుకున్నాక కంపెనీ స్టిక్కర్ వేసి పొద్దికగా పెట్టడం ఒక ఎత్తు. ఇంత తతంగం అయితే గానీ ఒక గిన్నే తయారవ్వదు. అయితే ఇలా తయారయ్యిన గిన్నెలు తక్కువ స్వచ్ఛతను కలిగి ఉంటాయని అంటున్నారు నిపుణులు. వీటిలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియం తదితర మెటల్ మలినాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వంట ప్రకియలో ఆయా కూరలు తయారు చేసేటప్పుడూ ఉప్పు, పులుపు వంటివి ఉంటాయని, వాటితో ఈ అల్యూమినియం రియాక్షన్ చెంది రంధ్రాలను ఏర్పరచటం లేదా అల్యూమినయంలోని విషపదార్థాలు ఈ కూరలో కలవడం జరుగుతుందని అన్నారు. ఇది ఆహారంగా తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తయాని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. Using recycled aluminium to make pans What issues immediately stick out here? pic.twitter.com/i0QceNsTgx — Science girl (@gunsnrosesgirl3) March 13, 2024 (చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి!) -
పాత జీన్స్ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా?
అతి కొద్దిమంది మాత్రమే వ్యర్థాలను కూడా ఉపయుక్తంగా మలచి, తమ జీవితాన్ని కూడా అర్థవంతంగా మార్చుకుంటారు. ఆ కొద్దిమంది జాబితాలో నిలుస్తుంది సౌమ్య కల్లూరి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాసి అయిన సౌమ్యముంబైలో సోషల్ ఎంటర్ప్రైజ్ ‘ద్విజ్’ అనే సంస్థను ఏర్పాటు చేసిదాని ద్వారా వాడి పడేసే డెనిమ్ దుస్తులను తిరిగి ఉపయోగించుకునేలా బ్యాగులు, టోపీలు, జ్యువెలరీ, క్లచ్లు, ఇతర యాక్సెసరీస్.. తయారు చేస్తోంది. ఈ పని ద్వారా 40 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథిమ్లో జరుగుతున్న దస్తకారి హాత్ సమితి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన డెనిమ్ స్టాల్లో తన ఉత్పత్తుల ద్వారా వ్యర్థాలతో కొత్త అర్థాలను మనకు పరిచయం చేస్తోంది.రెండోసారి మరింత కొత్తగా! ‘‘ద్విజ్ అంటే రెండవది అని అర్థం వచ్చేలా ఈ రీయూజ్ కాన్సెప్ట్ను ఎంచుకున్నాను. డెనిమ్ లేదా జీన్స్ అని పిలిచే క్లాత్ చాలా గట్టిగా ఉంటుందని మనకు తెలుసు. కొంత కాలం వాడాక పాతబడి పోవడమో, బోర్ అనిపించడమో, రంగు వెలిసిందనో పిల్లలవైతే పొట్టిగా అయ్యాయనో .. ఇలా రకరకాల కారణాలతో డెనిమ్ దుస్తులను ఎవరికైనా ఇచ్చేస్తుంటారు. అవి తీసుకున్నవాళ్లు వాటిని వాడతారు అనే నమ్మకం లేదు. ఎందుకంటే, అవి వారి సైజుకు సరిపోకపోవచ్చు. వారు వాటిని చెత్తలో పడేయచ్చు. ప్రపంచమంతటా విరివిగా ఉపయోగిస్తూ, వాడి పడేసే జీన్స్ను తిరిగి ఉపయుక్తంగా మార్చేలా చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దీంతో 2018లో ఈప్రాజెక్ట్ను 6 లక్షల రూపాయలతో ఆరంభించాను. పర్యావరణ హితంగా.. మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఎమ్మెస్ కోసం జర్మన్ వెళ్లాను. అక్కడ కార్బన్ ఉద్గారాలు, వ్యర్థాలపై పరిశోధన చేస్తున్నప్పుడు చాలా విషయాలు పరిశీలనకు వచ్చాయి. పర్యావరణహితంగా ఏదైనా వర్క్ చేయాలనుకున్నాను. ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసినా నా ఆలోచనలు మాత్రం రీ సైక్లింగ్ చుట్టూ తానే తిరుగుతూ ఉండేవి. వాడేసిన డెనిమ్పైన దృష్టి మళ్లి వాటిని సేకరించడం మొదలుపెట్టాను. వాడేసిన వాటర్ బాటిల్స్ను సేకరించి, రీ సైకిల్ చేసి, బ్యాగ్ లోపలివైపు వచ్చేలా డిజైన్ చేశాను. దీనివల్ల ఏదైనా పదార్థాన్ని బ్యాగ్లో తీసుకెళుతున్నప్పుడు డబ్బా మూతలు లీక్ అయినా సమస్య ఉండదు. ఈ బ్యాగ్లుఎక్కడా పాతవిగా అనిపించవు. మొదటిసారి వాడు తున్నట్టుగానే ఉంటాయి. ఈ తరం కోరుకునే బ్యాక్ ప్యాక్స్, క్లచ్లు, ల్యాప్టాప్ బ్యాగ్లు.. కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. చిన్న పీస్ను కూడా వదలం వాడేసిన జీన్స్ను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బల్క్లో కొనుగోలు చేస్తాం. కొందరు నేరుగా వచ్చి డొనేట్ చేస్తారు. ముందు వాటిని శుభ్రం చేయిస్తాం. ఆ తర్వాత వాటి సైజ్, షేడ్, సన్నం, మందం.. క్లాత్ని బట్టి దేనిని ఎలా మలచాలి అనే ఆలోచనకు వస్తాం. పదిమంది ఫుల్ టైమ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 30మంది మహిళలు వాళ్ల ఇంటి నుంచే పని చేస్తారు. బాగా మందంగా ఉండి, పెద్ద పెద్ద జీన్స్ వస్తే వాటిని బ్యాగ్లుగా తయారు చేస్తాం. కొంచెం మీడియం సైజు వాటితో చిన్న బ్యాగ్స్,. పలుచటి, చిరిగిన జీన్స్తో హ్యాండ్మేడ్ జ్యువెలరీ తయారు చేస్తాం. ఇంకా, బొమ్మలు, ఎంబ్రాయిడరీ చేసి హోమ్ డెకార్ ఐటమ్స్ కూడా ఇందులో ఉంటాయి. మా దగ్గరకు వచ్చిన జీన్స్లో చిన్న ముక్కను కూడా వృథాగా పోనివ్వం. ఈ రోజుల్లో పర్యావరణం ఎలా ఉంటుందో చూస్తున్నాం. కాలానుగుణంగా వర్షాలు పడవు, భూ తాపం పెరిగిపోతుంటుంది. కాలుష్యం కంపెనీల నుంచో, వాహనాల నుంచో వస్తుందనే అనుకుంటాం. కానీ, మనం రోజూ వాడే బట్టలు కూడా కాలుష్యానికి పెద్ద కారకం. ఈ సమస్య నివారణకు చేసిన చిన్న ప్రయత్నమే ద్విజ్. స్వచ్ఛంద సంస్థలతో కలిసి మిషన్ గ్రీన్ ముంబయ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ స్కూల్ పిల్లలకు హ్యాండ్ బ్యాగ్లను కానుకగా ఇచ్చాం. దీని ద్వారా అటు చదువుకునే పిల్లలనూ, ఇటు ఈ పనిలో భాగం పంచుకుంటున్న మహిళలనూ ్ ప్రోత్సహిస్తున్నాం. అనిమేథ్ చారిటబుల్ ట్రస్ట్ వారితో కలిసి మహిళలకు డెనిమ్ రీ యూజ్ ప్రాజెక్ట్లో భాగంగా వర్క్షాప్స్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తున్నాం. 2022లో సర్వోదయ ట్రస్ట్ ద్వారా తెలంగాణలోని వికారాబాద్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు హ్యాండ్ బ్యాగ్లను కానుకగా ఇచ్చాం. ఇండియా మొత్తంలో క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కడ జరిగినా అక్కడ మా స్టాల్ ఏర్పాటుకు కృషి చేస్తుంటాం. దీనికి విడిగా షాప్ అంటూ ఏమీ లేదు. ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తుంటాం’’ అని వివరిస్తారు సౌమ్య. -
రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా?
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే పౌరసరఫరాల సంస్థ తీరు పై సమీక్షించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి... పీడీ ఎస్ బియ్యం సరఫరా తీరుతెన్నుల గురించి ప్రత్యేకంగా వా కబు చేశారు. అయితే ప్రతి నెలా పేదలకు పంపిణీ అవుతు న్న 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో ఏకంగా 70 శా తం వరకు బియ్యం పక్కదారి పడుతోందని అధికారులు మంత్రికి వివరించినట్లు తెలిసింది. పీడీఎస్ బియ్యంలో నాణ్యత లోపించడం వల్లే ఇలా జరుగుతోందని తేల్చిన మంత్రి దీనికి ప్రధాన కారణం మిల్లర్లేనని సమావేశంలోనే చెప్పారు. హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు మిల్లర్ల చేతివాటం గురించి పూర్తి అవగాహన ఉండటంతో ఆయన ఈ అంశాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకున్న ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం హుజూర్నగర్లోని చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేసిన ఆయన... రేషన్ బియ్యం దురి్వనియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన పీడీఎస్ రైస్ సరఫరా చేయడంతోపాటు బియ్యం పక్కదారి పట్టడాన్ని నిలువరించడంపై దృష్టి పెట్టారు. మిల్లర్ల కొనుగోళ్ల చక్రం! రాష్ట్రంలోని 90.14 లక్షల ఆహార భద్రతా కార్డులకుగాను 2.83 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వారికి ప్రతినెలా 6 కిలోల చొప్పున 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 3,580 కోట్లు రాయితీ కింద వెచ్చిస్తోంది. అంటే నెలకు రూ. 298 కోట్లు. మొత్తంగా కిలో బియ్యానికి సగటున రూ. 39 వెచ్చిస్తూ సరఫరా చేస్తున్న ఈ బియ్యాన్ని కార్డుదారులకు ఒక్కో యూనిట్ (ఒక్కొక్కరికి)కి నెలకు 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. అయితే ఈ బియ్యాన్ని కార్డుదారుల్లో కొందరు తిరిగి రేషన్ దుకాణాల్లోనే విక్రయించే విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. కార్డుదారుల నుంచి కిలోకు రూ. 6–9 వరకు చెల్లించి కొందరు రేషన్ దుకాణదారులు కొంటుండగా వారి నుంచి కిలోకు రూ. 10–13 చెల్లించి దళారులు కొనుగోలు చేసి రైస్మిల్లులకు పంపుతున్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో రేషన్ డీలర్లు బియ్యాన్ని దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో కిలో రూ. 20 చొప్పున అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈ తతంతంలో కొందరు అవినీతి అధికారుల పాత్ర కూడా ఉందని.. డీలర్లు, దళారుల నుంచి మామూళ్లు తీసుకొని బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎస్ అధికారి నియామకంతో... ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ను ప్రభుత్వం నియమించడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్తోపాటు మంత్రి ఉత్తమ్ కూడా కమిషనర్కు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన చౌహాన్కు గతంలో ఎఫ్సీఐలో పనిచేసిన అనుభవం ఉంది. రీసైక్లింగ్కు పాల్పడితే కఠిన చర్యలు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక హుజూర్నగర్లోని ఓ రేషన్ దుకాణం తనిఖీ హుజూర్నగర్: రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం కిలో బియ్యానికి రూ. 39 ఖర్చుపెట్టి కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తోందని, ఆ బియ్యాన్ని మిల్లర్లుగానీ, ఇతరులెవరైనా రీసైక్లింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని 33వ నంబరు రేషన్ షాపును తనిఖీ చేశారు. రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించి డీలర్ల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కొందరు రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణాకు, బీర్ల తయారీకి అమ్ముతున్నారని చెప్పారు. కొన్ని జిల్లాల్లో కొందరు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేయించి తిరిగి వాటినే ప్రభుత్వ (ప్రొక్యూర్మెంట్) సేకరణకు ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, మాఫియాలా కొనసాగుతోందని మండిపడ్డారు. ఇక నుంచి రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే నష్టాలు... గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాకం వల్లే పౌరసరఫరాల సంస్థ రూ. 56 వేల కోట్ల అప్పుల్లో, రూ. 11 వేల కోట్ల నష్టాల్లో ఉందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అప్పులపై ఏటా రూ. 3 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర రూ. 22 వేల కోట్ల విలువైన ధాన్యం నిల్వలు పెట్టడంపై సమీక్షిస్తున్నామని... మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యం రికవరీకి తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ తెలిపారు. ధాన్యం సేకరణ పద్ధతులను, రేషన్ వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మంత్రి వెంట ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న తదితరులు ఉన్నారు. -
Poonam Gupta: వ్యాపారాన్ని ఫైల్ చేసింది!
సాధారణంగా చదువు అయి΄ోగానే వెంటనే ఉద్యోగ వేటలో పడతారు చాలామంది. మంచి ఉద్యోగం కోసం వెతికి వెతికి చివరికి చిన్నపాటి జాబ్ దొరికినా చేరి΄ోతారు. కొంతమంది మాత్రం తాము కోరుకున్న దానికోసం ఎంత సమయం అయినా ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరందరిలాగే ప్రయత్నించింది పూనమ్ గుప్తా. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దీంతో తనే ఒక వ్యాపారాన్నిప్రారంభించి వందలమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది. సమస్య ఏదైనా నిశితంగా ఆలోచిస్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుందనడానికి పూనమ్ గుప్తానే ఉదాహరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార కుటుంబంలో పుట్టింది పూనమ్ గుప్తా. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఎకనమిక్స్తో డిగ్రీ పూర్తి చేసిన పూనమ్.. తరువాత ఎమ్బీఏ చేసింది. చదువు అయిన వెంటనే ఉద్యోగాన్వేషణప్రారంభించింది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఇలా జాబ్ ప్రయత్నాల్లో ఉండగానే... 2002లో పునీత్ గుప్తాతో వివాహం జరిగింది. పునీత్ స్కాట్లాండ్లో స్థిరపడడంతో పూనమ్ కూడా భర్తతో అక్కడికే వెళ్లింది. పెళ్లి అయినా.. దేశం మారినా పూనమ్ మాత్రం ఉద్యోగ ప్రయత్నాన్ని మానుకోలేదు. ఎలాగైనా జాబ్ చేయాలన్న కోరికతో అక్కడ కూడా ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. అనుభవం లేదని ఒక్కరూ ఉద్యోగం ఇవ్వలేదు. స్కాట్లాండ్లో అయినా జాబ్ దొరుకుతుందనుకున్న ఆశ నిరాశగా మారింది. అలా వచ్చిన ఆలోచనే... ఉద్యోగం కోసం వివిధ ఆఫీసులకు వెళ్లిన పూనమ్కు.. అక్కడ కట్టలు కట్టలుగా పేర్చిన ఫైళ్లు కనిపించేవి. ఉద్యోగం దొరకక సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ఫైళ్లను రీసైక్లింగ్ చేయవచ్చు గదా. అన్న ఐడియా వచ్చింది. పేపర్ను రీసైక్లింగ్ ఎలా చేయాలి, ఈ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను క్షుణ్ణంగా తెలుసుకుని కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుంది. స్కాటిష్ ప్రభుత్వం ఓ పథకం కింద ఇచ్చిన లక్షరూపాయల రుణంతో 2003లో ‘పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్’ కంపెనీని పెట్టింది.ప్రారంభంలో యూరప్, అమెరికాల నుంచి పేపర్ వ్యర్థాలను కొని రీసైక్లింగ్ చేసేది. రీసైక్లింగ్ అయిన తరువాత నాణ్యమైన పేపర్ను తయారు చేసి విక్రయించడమే పూనమ్ వ్యాపారం. ఏడాదికేడాది టర్నోవర్ను పెంచుకుంటూ కంపెనీ విలువ ఎనిమిది వందల కోట్లకు పైకి చేరింది. ప్రస్తుతం అరవై దేశాల్లో పీజీ పేపర్స్ వ్యాపారాన్ని విస్తరించింది. అమెరికా, చైనా, ఇండియా, ఈజిప్టు, స్వీడన్లలో సొంతకార్యాలయాలు ఉన్నాయి. పూనమ్కు అండగా... పీజీ పేపర్స్ని పూనమ్ ప్రారంభించిన రెండేళ్లకు భర్త పునీత్గుప్తా కూడా ఎనభై లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి కంపెనీలో చే రారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యాపారాభివృద్ధికి కృషిచేశారు. దీంతో అనతి కాలంలోనే పీజీ పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. పేపర్ ట్రేడింగ్ కంపెనీతోపాటు డెంటల్ హెల్త్ వంటి వ్యాపారాల్లోనూ పూనమ్ రాణిస్తోంది. అందరూ అదర్శమే... ‘‘నాకు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. ఒక్కోక్కరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుని ఈ స్థాయికి ఎదిగాను. నాన్న, మామయ్య, టీచర్స్ నన్ను చాలా ప్రభావితం చేశారు. పెద్దయ్యాక మదర్ థెరిసా, ఇందిరా గాంధీ వంటి వారు మహిళలు ఏదైనా చేయగలరని నిరూపించి చూపించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకెళ్తూ విజయాలు సాధిస్తున్నాను’’. – పూనమ్ గుప్తా -
వాడేసిన ప్లాస్టిక్తో వండర్స్
మనింట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ పోగవుతాయి. వాటిని చెత్తలో పడేస్తాము. అవి ఎప్పటికీ మట్టిలో కలవక అలాగే కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాని ఈ ప్లాస్టిక్ కవర్లనే రాజిబెన్ దారాలుగా చేసి బ్యాగులు అల్లుతుంది. బుట్టలు చేస్తుంది. పర్సులు చేస్తుంది. డోర్మ్యాట్లు సరేసరి. అందుకే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఆమె వల్ల ఎందరికో ఉపాధి కలుగుతోంది. కొత్త ఆలోచన చేసిన వారే విజేతలు. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోటె అనే చిన్న పల్లెలో ఏమీ చదువుకోని అమ్మాయి – రాజి బెన్ పెరిగి పెద్దదయ్యి లండన్ వెళ్లి అక్కడ పెద్దవాళ్లతో తాను చేసిన కృషిని వివరించింది. ఆమె తన జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేసి, గుర్తింపు పొందేలా చేసింది ఏమిటో తెలుసా? వృధా ప్లాసిక్. వాడేసిన ప్లాస్టిక్ రోడ్ల మీద, ఇళ్ల డస్ట్బిన్లలో, చెత్త కుప్పల మీద అందరూ ప్లాస్టిక్ కవర్లను, రేపర్లను పారేస్తారు. వాటిని ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచదు. అవి తొందరగా మట్టిలో కలిసిపోవు. కాని రాజిబెన్ వాటిని ఉపయోగంలోకి తెచ్చింది. వాటిని సేకరించి, కట్ చేసి పీలికలుగా మార్చి, కలిపి నేసి అందమైన వస్తువులు తయారు చేసింది. బ్యాగులు, సంచులు, పర్సులు... వాటి మన్నిక కూడా ఎక్కువ. ఎలా చేస్తారు? వాడేసిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను సేకరించి సర్ఫ్ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత వాటిలోని మలినాలు పోవడానికి వేడి నీళ్లలో నానబెడతారు. తర్వాత రెండు రోజులు ఎండలో ఆరబెడతారు. ప్లాస్టిక్ మందంగా ఉంటే అర ఇంచ్ వెడల్పు రిబ్బన్లుగా; పలుచగా ఉంటే ముప్పావు ఇంచ్ రిబ్బన్లుగా కట్ చేస్తారు. ఈ ముక్కలను నాణ్యమైన జిగురుతో అంటించి పొడవైన ఉండగా మారుస్తారు. అంటే మగ్గం మీద నేయడానికి దారం బదులు ఈ ప్లాస్టిక్ ఉండనే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్ దారాలతో నేస్తే దళసరి వస్త్రం తయారవుతుంది. దానిని కట్ చేసుకుని రకరకాల వస్తువులుగా చేతి నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు. హ్యాండ్ బ్యాగ్లు, కూరగాయల బ్యాగ్లు, ఫోన్ బాక్సులు, పర్సులు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. మన్నికతో ఉంటాయి. ఎలా వచ్చింది ఐడియా? రాజి బెన్ నేత కుటుంబంలో పుట్టింది. అయితే తండ్రికి నేత మీద విసుగుపుట్టి వ్యవసాయం చేసేవాడు. అదీగాక ఆడపిల్లలు మగ్గం మీద కూచోవడం నిషిద్ధం. కాని రాజి బెన్కి మగ్గం మీద పని చేయాలని 12 ఏళ్ల వయసు నుంచే ఉండేది. అందుకని మేనమామ కొడుకు దగ్గర రహస్యంగా మగ్గం పని నేర్చుకుంది. 14 ఏళ్లు వచ్చేసరికి మగ్గం పనిలో ఎక్స్పర్ట్గా మారింది. అయితే ఆమెకు పుట్టింటిలో కాని మెట్టినింటిలో గాని మగ్గం మీద కూచునే అవకాశమే రాలేదు. ఏడేళ్లు కాపురం చేశాక భర్త హటాత్తుగా మరణించడంతో రాజి బెన్ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది ముగ్గురు పిల్లల కోసం. కచ్లో ఒక ఎన్.జి.ఓ ఉంటే అక్కడ మగ్గం పని ఖాళీ ఉందని తెలిస్తే వెళ్లి చేరింది. అందమైన వస్త్రాలు అల్లి వాటిని ఆకర్షణీయమైన వస్తువులుగా తీర్చిదిద్దే స్థానిక కళలో ఆమె ప్రావీణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎన్.జి.ఓ వారు ఆమె చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించేవారు. 2012లో జరిగిన ఎగ్జిబిషన్లో ఒక విదేశీ డిజైనర్ ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి తయారు చేసిన బ్యాగ్ను చూపించి ‘ఇలాంటిది తయారు చేయగలవా?’ అని అడిగాడు. అది ఎలా తయారయ్యిందో అర్థమయ్యాక రాజి బెన్కు నాలుగు రోజులు కూడా పట్టలేదు అలాంటి బ్యాగులు తయారు చేయడానికి. ఆ డిజైనర్ వాటిని చూసి సంతృప్తిగా కొనుక్కుని వెళ్లాడు. మరికొన్ని బ్యాగులు జనం క్షణాల్లో ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వేస్ట్ ప్లాస్టిక్ నుంచి రాజి బెన్ హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తోంది. స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్ రాజి బెన్ ఖ్యాతి ఎంత దూరం వెళ్లిందంటే అమృత మహోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్’ పురస్కారం ఆమెకు ప్రకటించారు. అలాగే యూరప్ దేశాల నుంచి ఆమె ఉత్పత్తులకు ఆర్డర్లు వస్తున్నాయి. ‘ప్లాస్టిక్ పీడ విరగడ అవ్వాలంటే దానిని ఎన్ని విధాలుగా రీసైకిల్ చేయవచ్చో అన్ని విధాలుగా చేయాలి. రాజి బెన్ కొత్త తరాన్ని తనతో కలుపుకుంటే ఆమె ఉత్పత్తులు చాలా దూరం వెళ్లడమే కాక పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది’ అని విదేశీ ఎంట్రప్రెన్యూర్లు అంటున్నారు. రాజి బెన్ ప్రస్తుతం 90 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 2018 నుంచి సొంత సంస్థ పెట్టుకోవడంతో దాని టర్నోవర్ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు దాటిపోయింది. ఆమె గెలుపు గాథ మరింత విస్తరించాలని కావాలని కోరుకుందాం. -
పాలీసైక్ల్తో రీ సస్టెయినబిలిటీ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యర్ధాల నిర్వహణ సంస్థ రీ సస్టెయినబిలిటీ (గతంలో రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్) తాజాగా పాలీసైక్ల్ ప్రైవేట్ లిమిటెడ్తో జట్టు కట్టింది. ప్లాస్టిక్ రసాయనాల రీసైక్లింగ్ కోసం దేశీయంగా ఫీడ్స్టాక్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద తక్కువ గ్రేడ్ ప్లాస్టిక్స్ను సేకరించి పాలీసైకిల్, దాని భాగస్వామ్య సంస్థల కెమికల్ రీసైక్లింగ్ ప్రాజెక్టుల కోసం ఫీడ్స్టాక్ను సిద్ధం చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా ఢిల్లీలో తొలి సారి్టంగ్, ప్రీ–ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు తోడ్పడగలవని రీ సస్టెయినబిలిటీ సీఈవో మసూద్ మలిక్ తెలిపారు. -
అపశకునం కాదు, దేవుడి విగ్రహాలతో రీసైక్లింగ్
ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తాం. ఇంట్లో ఉండే దేవతామూర్తుల విగ్రహాలు, పటాలు, ఫొటో ఫ్రేములు జారిపడినా, పక్కకు ఒరిగిపోయినా అపశకునంగా భావిస్తారు. అందుకే మరింత శ్రద్ధగా పూజ చేయడంతో పాటు, పూజాసామగ్రిని ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు విగ్రహాలు పాతబడి విరిగిపోవడం, ఫొటో ఫ్రేములు చిరిగిపోవడం లేదా తుప్పు పట్టి పాడైపోవడం జరుగుతుంటుంది. అలాంటి వాటిని వెంటనే తీసేసి కొత్తవాటిని పూజలో పెట్టుకుంటారు. మనలో చాలామంది ఇలానే పడేస్తుంటాము. తృప్తిౖ గెక్వాడ్ మాత్రం ఈ విగ్రహాలను పడేయకుండా.. రీ సైకిల్ చేసి రకరకాల వస్తువులను తయారు చేస్తోంది. చెత్తగా మారకుండా... సరికొత్త హంగులు అద్ది అందంగా మారుస్తోంది. మహారాష్ట్రలోని యోవలాలో పుట్టిపెరిగిన తృప్తి గైక్వాడ్ వృత్తిపరంగా నాసిక్లో స్థిరపడింది. న్యాయవాదిగా క్షణం తీరికలేని పని తనది. అయితే తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే విషయాలను ఎంతో ఆసక్తిగా గమనించే మనస్తత్వం కావడం వల్ల 2019లో ఓసారామె గంగానదిని చూడడానికి వెళ్లింది. అప్పుడు గంగానదిని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇదే సమయంలో ... విరిగిపోయిన దేవతామూర్తుల విగ్రహాలు, ఫ్రేములు తీసుకుని నదిలో వేయడానికి వచ్చాడు ఒకతను. అతన్ని చూసిన తృప్తి..‘‘వీటిని నదిలో వేయకు. వీటిలో ఉన్న పేపర్, కార్డ్బోర్డ్, మట్టిబొమ్మలు నదిని మరింత కలుషితం చేస్తాయి’’ అని చెప్పి అతను వాటిని నదిలో వేయకుండా వారించింది. అందుకు ఆ వ్యక్తి ఇక్కడ వేయవద్దు.. సరే వీటిని ఏం చేయాలి?’’ అంటూ చికాకు పడ్డాడు. అప్పటికేదో సమాధానం చెప్పి అతణ్ణి పంపింది కానీ తృప్తి మనసులో కూడా ‘అవును వీటిని ఏం చేయాలి?’ అన్న ఆలోచన మొదలైంది. కొద్దిరోజులు తర్వాత వీటిని రీ సైకిలింగ్ చేసి ఇతర వస్తువులు తయారు చేయవచ్చన్న ఆలోచన తట్టింది తనకు. తన ఐడియాను కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగుతో పంచుకుంది. అంతా ప్రోత్సహించేసరికి .. పాత దేవతామూర్తుల విగ్రహాలు రీసైకిల్ చేయడం ప్రారంభించింది. సంపూర్తిగా... విగ్రహాలను రీసైక్లింగ్ చేసేందుకు‘సంపూర్ణమ్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. సంపూర్ణమ్ టీమ్ దేవతామూర్తుల పాతవిగ్రహాలు, ఫొటోఫ్రేములను గుళ్లు, చెట్లకింద పడి ఉన్న వాటిని, ఇళ్లనుంచి సేకరిస్తుంది. ఈ విగ్రహాలను పూర్తిగా పొడిచేసి మొక్కలకు ఎరువులా మారుస్తారు. ఎరువుగా పనికిరాని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలిసిన మట్టిని కుండలు, పాత్రలు, ఇటుక రాళ్లుగా తయారు చేస్తారు. వీటితో పక్షులు, జంతువులకు గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా తయారైన పాత్రల్లో పక్షులు, జంతువులకు ఆహారం, తాగునీటిని అందిస్తున్నారు. సంపూర్ణమ్ సేవలను మహారాష్ట్రలోని పూనే, నాసిక్, ముంబై, సోలాపూర్, సంగమ్నేర్లకు విస్తరించింది తృప్తి. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో సైతం సేవలను ప్రారంభించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా ఈ రీసైక్లింగ్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఆకర్షణీయమైన టాయిస్.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలిసిన విగ్రహాలను పొడిగా మార్చి, ఈ పొడికి కొద్దిగా సిమెంట్ను కలిపి టాయిస్ను రూపొందిస్తున్నారు. మురికి వాడల్లోని నిరుపేద పిల్లల ద్వారా పాతవిగ్రహాలు, ఫొటోఫ్రేమ్లనూ సేకరిస్తూ వారికి ఆర్థికంగా సాయపడుతోంది. ‘‘దేవతల విగ్రహాల ఫొటోఫ్రేములను చక్కగా అలంకరించి నిష్ఠగా పూజిస్తారు. ఇటువంటి ఫ్రేములు పాడైతే పడేయాల్సిందే. ఇది నచ్చకే సంపూర్ణమ్ను తీసుకొచ్చాను. దేవుడి విగ్రహాలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేసిన తరువాతే రీసైక్లింగ్ చేస్తున్నాను. వాట్సాప్, ఫేస్బుక్లో చాలామంది కస్టమర్లు నన్ను సంప్రదిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా వేల సంఖ్యలో రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడాను. అదేవిధంగా దేవుడి పటాలకు మంచి రూపాన్ని ఇవ్వడం ఎంతో తృప్తినిస్తోంది’’. – తృప్తి గైక్వాడ్ -
ఎక్స్ట్రూజన్పై హిందాల్కో దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్ల తయారీకి వీలుగా ఎక్స్ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్లకోసం ఎక్స్ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు. -
రీసైక్లింగ్ పరిశ్రమల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
కోల్కతా: తయారీ సంస్థలకు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టడం (ఈపీఆర్) వంటి విధానపరమైన చర్యల ద్వారా రీసైక్లింగ్ను మరింతగా ప్రోత్సహించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా వ్యర్ధాలను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని, పునర్వినియోగాన్ని పెంపొందించవచ్చని భావిస్తోంది. కేంద్ర గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర సి జోషి ఈ విషయాలు తెలిపారు. ఈపీఆర్ విధానం కింద వాడేసిన ఉత్పత్తుల సేకరణకు నిధులు సమకూర్చడం, రీసైక్లింగ్ ఖర్చులను భరించడం తద్వారా పర్యావరణంపై ప్రభావాలను తగ్గించడం వంటి వాటికి తయారీ సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనివల్ల రీసైక్లింగ్ పరిశ్రమకు తోడ్పాటు లభిస్తుంది. అధునాతన సాంకేతికత తోడ్పాటుతో వనరుల వినియోగ సామర్థ్యాలను పెంచుకునేలా పరిశ్రమను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోందని జోషి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈపీఆర్ వంటి విధానపరమైన చర్యలను పరిశీలిస్తోందని వివరించారు. మరోవైపు మెటల్ స్క్రాప్పై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఆర్ఏఐ) సీనియర్ వైస్–ప్రెసిడెంట్ ధవళ్ షా కేంద్రాన్ని కోరారు. 2030 నాటికి 30 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు రీసైక్లింగ్ రంగంలో పెట్టుబడులు వచ్చేలా ఆకర్షణీయమైన పాలసీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశీయంగా ఉక్కు ఉత్పత్తిలో రీసైకిల్ చేసిన స్టీల్ వాటా 22 శాతంగా ఉంటుంది. -
బల్దియాల్లో చెత్త సమస్య
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో పట్టణీకరణ అంతకంతకూ పెరిగిపోతోంది. జనాభా, ఆధునిక జీవనశైలికి తగినట్లు బల్దియాల్లో వాతావరణ పరిస్థితులను మార్చాలంటే అది వందశాతం పారిశుధ్యం నుంచే మొదలుకావాలి. పట్టణాల్లో జనాభా ఏటా పెరిగిపోతుండగా.. నిత్యం టన్నుల కొద్దీ చెత్త వెలువడుతోంది. అయితే ఆ చెత్తను డంప్ చేయడానికి మాత్రం రామగుండం, మంథనిలో స్థలాలు లేవు. ఫలితంగా గోదావరి ఒడ్డున, రోడ్డుపైనే పోస్తున్నారు. జిల్లాలోని బల్దియాల్లో చెత్తను నిర్ణీత విధానంలో రీసైక్లింగ్ చేయకపోవడంతో డంపింగ్యార్డుల్లో టన్నుల కొద్దీ పేరుకుపోతోంది. ప్రభుత్వం నూతన మున్సిపాలిటీ చట్టం తెచ్చినప్పటికీ.. పట్టణాల్లో నిత్యం వెలువడే చెత్తను రీసైక్లింగ్ చేసి పర్యావరణానికి మేలు జరిగేలా ఎరువుల తయారీ చేపట్టకపోవడంతో సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జిల్లావ్యాప్తంగా బల్దియాల్లో రీసైక్లింగ్ చర్యలు అరకొరగానే సాగుతున్నాయి. గాడి తప్పిన తడి, పొడి చెత్త ప్రక్రియ.. నిత్యం ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. తడిచెత్త ద్వారా ఎరువు, పొడిచెత్త ద్వారా కార్మికులు ఆదాయం పొందవచ్చు. తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ రామగుండం కార్పొరేషన్ పరిధిలో కాగితాలకే పరిమితం అవుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ తడి, పొడిచెత్త నిర్వహణతోపాటు బహిరంగ మల, మూత్ర విసర్జన, మురుగు నిర్వహణ కూడా కీలకం. కేవలం పొడి చెత్త నిర్వహణ చేపడుతున్న అధికారులు.. తడి చెత్తపై చేతులెత్తేశారు. తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేయడానికి అవసరమైన అన్ని వనరులూ ఉన్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు మాత్రం ముందుకుపడటం లేదు. తడి చెత్తతో ఎరువులను తయారు చేసి నర్సరీలకు వాడుతున్నట్లు తప్పుడు నివేదికలు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారీ చేసేందుకు గౌతమినగర్, ఎన్టీఆర్నగర్, జ్యోతినగర్లో షెడ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, అవి వినియోగానికి నోచుకోలేదు. రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాలను నిర్వహించి కొంత ఫలితం సాధించారు. తర్వాత ఈ ప్రక్రియ నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. రామగుండంతోపాటు జిల్లాలో ఉన్న పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో వాహనాల్లో ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. నేరుగా డంపింగ్ యార్డులకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. రీసైక్లింగ్ ప్రక్రియను పట్టించుకోకపోవడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. ఆ చెత్త కుప్పలను కాల్చడంతో పొగ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్లను వివరణ కోరగా.. డంపింగ్ యార్డుల స్థలసేకరణకు సింగరేణికి లేఖ రాశామని చెప్పారు. తడి, పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్ల వినియోగంపై వివరణ కోరగా.. చెత్తద్వారా ఆదాయం పొందేలా, షెడ్లను పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డుపైనే పారబోత ఈ చిత్రంలో రోడ్డుపక్కనే చెత్త డంపింగ్ చేసి కనిపిస్తున్నది మంథని మున్సిపాలిటీలోనిది. మంథని మున్సిపాలిటీగా రూపాంతరం చెందినప్పటికీ డంపింగ్యార్డు లేకపోవడంతో ప్రతిరోజూ సేకరించే సుమారు 18 టన్నుల చెత్తను మంథని–కాటారం రహదారి వెంబడి.. పట్టణ శివారులో డంప్ చేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించకుండా అంతా కలిపేస్తుండడం.. అనంతరం కాల్చివేయటం పరిపాటిగా మారింది. దీంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రీసైక్లింగ్ పరిశ్రమ @ 20 బిలియన్ డాలర్లు!
ముంబై: వ్యర్థాల శుద్ధి పరిశ్రమ (రీసైక్లింగ్) 2030 నాటికి 20 బిలియన్ డాలర్లకు (రూ.1.64 లక్షల కోట్లు) విస్తరిస్తుందని అవెండస్ క్యాపిటల్ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ పరిమాణం 4 బిలియన్ డాలర్లుగానే ఉంది. అంటే ఏడేళ్లలో ఐదు రెట్లు పెరగనుంది. వ్యయాలను ఆదా చేయడం, అసలైన మెటీరియల్స్పై ఆధారపడడం దీనివల్ల తగ్గుతుందని పేర్కొంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ప్రస్తుతం 2.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిమాణం 1.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. బ్యాటరీ రీసైక్లింగ్ 100 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ మూడు విభాగాలు కలసి 2030 నాటికి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటాయని తన తాజా నివేదికలో అ వెండస్ క్యాపిటల్ పేర్కొంది. రీసైక్లింగ్ మెటీరియల్ వినియోగం వల్ల సహజ వనరుల క్షీణత తగ్గుతుందని తెలిపింది. ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి పరిమాణం ఏటా 24 శాతం చొప్పున పెరుగుతూ 2030 నాటికి 10.2 బిలియన్ డాలర్ల స్థాయి విలువకు చేరుకుంటుందని అవెండస్ క్యాపి టల్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ అహుజా తెలిపారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఏటా 23 శాతం చొప్పున పెరుగుతూ ఇదే కాలంలో 7.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. ఇక ప్రస్తుతం 100 మిలియన్ డాలర్లుగానే ఉన్న బ్యాటరీ వ్యర్థాల రీసైక్లింగ్ 2 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని చెప్పారు. -
కేటీఆర్తో ‘హస్క్ ఇంటర్నేషనల్’ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హస్క్ పెల్లెట్లు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు ‘హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్’ప్రతినిధులు ఆదివారం మంత్రి కె. తారక రామారావుతో లండన్లో భేటీ అయ్యారు. సుమారు 200 కోట్ల పెట్టుబడితో ఏటా వెయ్యి మెట్రిక్ టన్నుల బయో పెల్లెట్ల తయారీ యూనిట్ ఏర్పాటును ప్రతిపాదించింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హస్క్ (ధాన్యం ఊక/పొట్టు), పునర్వినియోగానికి వీలుండే ప్లాస్టిక్ను సహకార పద్ధతిలో సేకరించేందుకు హస్క్ ఇంటర్నేషనల్ ఆసక్తి చూపింది. రాష్ట్రంలో హస్క్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలకు పూర్తిగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్కు చెందిన ‘ఇంక్రెడిబుల్ హస్క్ యూకే’సీఈఓ కీత్ రిడ్జ్వే, ఇంక్రెడిబుల్ హస్క్ ఇండియా సీఈఓ సీకా చంద్రశేఖర్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ ఆత్మకూరి అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు లండన్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రతిష్టించిన భారీ అంబేడ్కర్ విగ్రహ నమూనాను మ్యూజియం అధికారులకు ఆయన బహూకరించారు. బారిస్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు ఆయన నివసించిన ఇంటినే మ్యూజియంగా మార్చారు. -
ఎల్రక్టానిక్ వేస్ట్ బంగారమే! త్వరలో హైదరాబాద్ శివార్లలో రీసైక్లింగ్ ప్లాంట్
మన చేతిలోని సెల్ఫోన్.. చూసే టీవీ.. కంప్యూటర్.. కీబోర్డు.. ఇలా ఎన్నో ఎల్రక్టానిక్ వస్తువులు. పాడైపోతేనో, పాతబడిపోతేనో పడేస్తూ ఉంటాం. ఇలాంటి ఎల్రక్టానిక్ చెత్త (ఈ–వేస్ట్) నుంచి బంగారం, వెండి, లిథియం వంటి ఎన్నో విలువైన లోహాలను వెలికి తీయవచ్చు తెలుసా? ఎలక్ట్రానిక్ పరికరాల్లోని మదర్బోర్డులు, ఇంటిగ్రేటెడ్ చిప్లు, పలు ఇతర భాగాల్లో స్వల్ప స్థాయిలో విలువైన లోహాలను వినియోగిస్తారు. బోర్డులు, చిప్లు మన్నికగా పనిచేయడంతోపాటు వాటిలో వేగంగా/సమర్థవంతంగా విద్యుత్ ప్రసారానికి ఇవి తోడ్పడతాయి. మరి ఎల్రక్టానిక్ పరికరాలను పడేసినప్పుడు.. వాటి నుంచి సదరు లోహాలను వెలికితీసే ‘ఈ–వేస్ట్ రీసైక్లింగ్’ప్లాంట్ త్వరలో హైదరాబాద్లో ఏర్పాటు కాబోతోంది. సాక్షి, హైదరాబాద్: ఎల్రక్టానిక్ వ్యర్థాలను (ఈ–వేస్ట్) రీసైకిల్ చేసి విలువైన లోహాలను వెలికితీసే ప్లాంట్ హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లో ఏర్పాటుకానుంది. వివిధ రకాల వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైక్లింగ్, రీయూజ్ చేయడంలో గుర్తింపు పొందిన రాంకీ కంపెనీకి చెందిన ‘రీసస్టెయినబిలిటీ లిమిటెడ్’సంస్థ.. అమెరికాకు చెందిన రెల్డాన్ రిఫైనింగ్ సంస్థతో కలిసి ఈ–వేస్ట్ రిఫైనరీ ప్లాంట్ పనులు చేపట్టింది. పాడైపోయిన కంప్యూటర్లు, మొబైల్ఫోన్స్, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను హైదరాబాద్తోపాటు బెంగళూర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, హల్దియా, వైజాగ్ తదితర కేంద్రాల్లో ధ్వంసం చేసి వాటిల్లోని విలువైన మెటల్స్ ఉండే భాగాలను వేరు చేస్తారు. వాటిని హైదరాబాద్ ప్లాంట్లో రీసైక్లింగ్ చేస్తారు. మే నాటికి అందుబాటులోకి.. ఈ ప్లాంట్లో అధునాతన ‘పైరో మెటలర్జికల్ టెక్నాలజీ’ద్వారా ఈ–వేస్ట్తోపాటు పారిశ్రామిక వ్యర్థాలు కలిపి ఏటా దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల వరకు రీసైకిల్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రీసైక్లింగ్ ద్వారా విలువైన బంగారం, వెండి, కోబాల్ట్, లిథియం, నికెల్, పల్లాడియం, ప్లాటినం వంటివి వేరుచేస్తారు. ఈ లోహాలను తిరిగి ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ రంగాలతోపాటు స్టీల్, ఫర్నిచర్, భారీ మెషినరీ పరిశ్రమల్లో వినియోగిస్తారు. దాదాపు రూ.65 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్ను వచ్చే మే నెలలో ప్రారంభించే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో ఫార్మాస్యూటికల్, పెట్రో కెమికల్, జ్యువెలరీ వ్యర్థాలను సైతం రీసైక్లింగ్ చేసే యోచనలో ఉన్నట్టు ‘రీసస్టెయినబిలిటీ’ప్రతినిధులు చెప్తున్నారు. ఉత్పత్తి మేరకు రీసైక్లింగ్ లేదు ప్రపంచంలో ఈ–వేస్ట్ ఎక్కువగా ఉత్పత్తవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ఈ–వేస్ట్లో నాలుగో వంతు కంటే తక్కువే రీసైకిల్ చేయగల పరిస్థితులు ఉన్నాయి. దేశంలో 2019లో వెలువడిన ఈ–వేస్ట్ 3.2 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా.. 2030 నాటికి ఇది మరో 21 శాతం పెరుగుతుందని అంచనా. 90శాతం రీసైక్లింగ్ అశాస్త్రీయంగానే.. దేశంలోని ఈ–వేస్ట్లో దాదాపు 90 శాతం రీసైక్లింగ్ అనధికారికంగా, అశాస్త్రీయంగా జరుగుతోంది. నీతి ఆయోగ్ గణాంకాల మేరకు దేశవ్యాప్తంగా మూడు వేలకుపైగా కేంద్రాల్లో ఈ పనులు జరుగుతున్నాయి . వాటిలో పనిచేసే కారి్మకులు మాన్యువల్గానే వ్యర్థాల్ని వేరు చేస్తుండటంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. వాటి పరిసరాల్లోని ప్రజలు తీవ్ర వ్యాధులబారిన పడే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికతతో పరిష్కారం అధిక మొత్తాల్లో ఈ–వేస్ట్ను రీసైక్లింగ్ చేయ గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చైనా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో మాత్రమే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లో 13.6 ఎకరాల స్థలంలో ఏర్పాటవుతున్న ఈ–వేస్ట్ రిఫైనరీ ప్లాంట్ కూడా ఆధునికమైనదే. దీనితో ఈ–వేస్ట్ సెక్టార్ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించనుందని.. సర్క్యులర్ ఎకానమీ బలోపేతమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఈ–వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2022 సవ్యంగా అమలు కావాలన్నా ఇలాంటి ప్లాంట్లు అవసరమని అంటున్నారు. -
కస్టమ్ మిల్లింగ్పై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాను పూర్తిగా అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి వాటిని బియ్యంగా మార్చే ప్రక్రియలోకి పీడీఎస్ బియ్యం వచ్చి చేరకుండా జాగ్రత్త పడుతోంది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీఎంఆర్ మిల్లుల విద్యుత్ వినియోగం, కస్టమ్ మిల్లింగ్ జరిగిన బియ్యం పరిమాణాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తోంది. ఇందులో భాగంగానే 8 జిల్లాల్లో సుమారు 46 మిల్లుల్లో సీఎంఆర్ బియ్యం పరిమాణం కంటే విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉండటాన్ని గుర్తించింది. తక్కువ విద్యుత్ వాడి ఎక్కువ మొత్తంలో మిల్లింగ్ చేయడం ఎలా సాధ్యమైందన్న అంశంపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా ఆయా మిల్లులను వెంటనే తనిఖీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించింది. తగ్గిన అక్రమ రవాణా మరోవైపు విజిలెన్స్ బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండటంతో చాలావరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గింది. దీనికి తోడు 6ఏ కేసులను త్వరగా విచారించి పట్టుబడ్డ బియ్యాన్ని తిరిగి బహిరంగ వేలం ద్వారా మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్, డీసీఎస్వో, పౌర సరఫరాల శాఖ ఏఎం, మార్కెటింగ్ శాఖ ఏడీలతో ప్రత్యేక కమిటీలను నియమించింది. వీరు సంబంధిత తహసీల్దార్ ఆధ్వర్యంలో బియ్యం నాణ్యత, రకాన్ని బట్టి అప్సెట్ ధరను నిర్ణయించి బహిరంగ వేలానికి వెళ్తున్నారు. అక్రమ రవాణాలో దొరికిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు బయటకు పంపించేలా ప్రతి నెలలో రెండు సార్లు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణంలో రికార్డులకు మించి స్టాక్ ఉంటే దానిని సీజ్ చేసి కేసు నమోదు చేస్తారు. ఇటువంటి నిల్వలకు మోక్షం కలి్పంచి పీడీఎస్ ధరకే ప్రజా పంపిణీలోకి తీసుకొస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రైవేట్ గోడౌన్లు, దుకాణాలు, లారీల్లో స్వా«దీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం బహిరంగ వేలానికి పెడుతున్నారు. నిల్వలతో సమస్య అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు కేసులు నమోదు చేసి ఎక్కడికక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లలో సరుకును నిల్వ చేస్తున్నారు. అయితే, కేసుల విచారణ జాప్యంతో నిల్వలు పేరుకుపోయి బియ్యం ముక్కిపోవడం, రంగు మారడం, పురుగులు పట్టి ప్రజా వినియోగానికి పనికిరావట్లేదు. వీటి ప్రభావం ఎంఎల్ఎస్ పాయింట్లలోని తాజా సరుకులపైనా పడుతోంది. ఒక్కోసారి ఈ నిల్వలు సాధారణ పీడీఎస్లో కలిసిపోతుండటంతో సరైన లెక్కలు ఉండట్లేదు. వీటిని అరికట్టేందుకు జిల్లాల్లో ఒకట్రెండు ఎంఎల్ఎస్ పాయింట్లను గుర్తించి వాటిలో మాత్రమే అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ చౌక బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో సరుకు విలువ రూ.50 లక్షలకు పైబడి ఉంటే కలెక్టర్, రూ.50 లక్షలు లోపు ఉంటే జాయింట్ కలెక్టర్ విచారించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులు మినహా మిగిలిన వాటిని జిల్లా స్థాయిలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. సీఎంఆర్పై ప్రత్యేక దృష్టి పౌరసరఫరాల శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మిల్లుల కరెంటు వాడకం, వారిచ్చిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం పరిమాణాన్ని పోల్చి చూస్తున్నాం. కొన్ని మిల్లుల్లో సీఎంఆర్ చేసి ఇచ్చిన బియ్యానికి, వాడిన కరెంట్కు పొంతన లేదు. తక్కువ కరెంట్తో ఎక్కువ బియ్యం సీఎంఆర్ చేసినట్టు చూపిస్తున్నారు. దీనిపై ఆయా జిల్లాల జేసీలను తనిఖీ చేయాలని ఆదేశించాం. వారిచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. – హెచ్.అరుణ్కుమార్, పౌరసఫరాల శాఖ కమిషనర్ వేగంగా కేసులను డిస్పోజ్ చేస్తున్నాం రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తుండటంతో చాలా వరకు రేషన్ అక్రమ రవాణా తగ్గింది. దీనితో పాటు ఇప్పటివరకు నమోదైన 6ఏ కేసులను కూడా త్వరగా విచారించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కొన్నేళ్లుగా విచారణకు నోచుకోని కేసులు, భారీగా పేరుకుపోయిన నిల్వలను క్లియర్ చేస్తున్నాం. సరైన పత్రాలు లేకుండా తరలిస్తూ పట్టబడ్డ బియ్యానికి బహిరంగ వేలం నిర్వహించి ప్రజా వినియోగంలోకి తీసుకొస్తున్నాం. – విజయ సునీత, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ -
కాలంచెల్లిన చాక్లెట్లు,బిస్కెట్లకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. ముఠా గుట్టు రట్టు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొడిప్పల్లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లను రీసైకిల్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ఎక్స్పైర్ అయిన వస్తువులు, ఆహార పదార్థాలను సేకరించి వాటికే కొత్త లేబుల్స్ వేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తోంది. సబ్బులు, షాంపులు, తిను బండారాలు వంటి వంటి మొత్తం 300 రకాల వస్తువులను ఈ ముఠా రీసైకిల్ చేసి భారీ మోసానికి పాల్పడటటేగాక.. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. హైదరాబాద్ శివార్లలోని గోదాములు, కోఠిలోని హరిహంత్ కార్పోరేషన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేయగా ఈ రీసైక్లింగ్ ముఠా బాగోతం బట్టబయలైంది. ఈ సోదాల్లో రూ.కోట్లు విలువ చేసే ఆహారపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. -
కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లుకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు..
-
గ్రామాల్లో రీసైక్లింగ్ రోడ్లు.. సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రహదారులు
గ్రామాల్లో సిమెంట్, తారు రోడ్లను మాత్రమే ఇప్పటివరకు చూశాం. ఇకపై ప్లాస్టిక్ రోడ్లనూ చూడబోతున్నాం. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించిన ఏపీ సర్కారు.. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్పైనా ప్రత్యేక దృష్టి సారించింది. వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు అర్థాన్ని.. ప్రయోజనాన్ని చేకూర్చేలా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి అనువుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సిమెంట్ పరిశ్రమల్లో వినియోగించే విధంగానూ రీసైక్లింగ్ యూనిట్లను సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: పర్యావరణంతో పాటు భూగర్భ జలాలకు ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి.. వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేలా రీసైక్లింగ్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గానికి ఒకచోట ఈ తరహా రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 160 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు గ్రామాల ఎంపిక సైతం పూర్తయింది. పట్టణాల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటినుంచీ నేరుగా చెత్త సేకరణ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చెత్త సేకరణ కేంద్రాల (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల)లో ప్లాసిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి ఉంచుతారు. గ్రామాల వారీగా ఇలా వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వారానికి ఒకటి లేదా రెండు విడతలుగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్కు తరలించేలా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతివారం రూట్ల వారీగా ఆ వాహనంతో అన్ని గ్రామాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తారు. అనంతరం ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను మెషిన్ల సాయంతో బండిల్స్ రూపంలో అణచివేసి.. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలు ముక్కలుగా మార్చి నిల్వ చేస్తారు. రోడ్ల నిర్మాణంలో వినియోగించేలా.. ప్లాస్టిక్ బాటిల్స్ వంటివి మట్టిలో కలవడానికి కనీసం 240 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షం నీటిని భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో పీఎంజీఎస్వై (గ్రామీణ సడక్ యోజన) కింద చేపట్టే రోడ్ల నిర్మాణంలో కంకరతో పాటు కొంతమేర ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని సిమెంట్ పరిశ్రమలలో మండించడానికి ఉపయోగించేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రీసైక్లింగ్ యూనిట్లలో సిద్ధం చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాల్సి ఉంటుంది. రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్డ నిర్మించే కాంట్రాక్టర్లకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను విక్రయించే ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణంలో వీటి వాడకం పెరిగే పక్షంలో జిల్లాల వారీగా ప్రత్యేక వేలం కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2021 అక్టోబర్ నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. వాటిలో స్థానికంగా అమ్మడానికి వీలున్న వాటిని గ్రామ పంచాయతీల స్ధాయిలోనే చిరు వ్యాపారులకు అమ్మేశారు. అమ్మకానికి పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నాశనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామాల్లొ సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్ల నిర్మాణం లేదా సిమెంట్ పరిశ్రమలో మండించడానికి ఉపయోగించేలా రీసైక్లింగ్ ప్రాసెస్ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. -
స్పెషల్ బ్లూ జాకెట్లో ప్రధాని మోదీ!
అందరి దృష్టిని ఆకర్షించేలా స్పెషల్ బ్లూ జాకెట్ని ధరించి పార్లమెంట్కి వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ ధరించిన జాకెట్ని రీసైకిల్ చేసిన పీఈటీ బాటిళ్లతో తయారుచేసింది. బెంగళూరులో సోమవారం జరిగి ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రధాని మోదీకి ఈ స్పెషల్ జాకెట్ని బహుకరించింది. ఈ ఎనర్జీ వీక్ అనేది శక్తి పరివర్తన హౌస్గా ఎదుగుతున్న భారత్ సామర్థ్యాన్ని ప్రదర్శించేందకు ఉద్దేశించింది. ఈ మేరకు మోదీ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నందున బుధవారం పార్లమెంట్లో ఆయన ఈ జాకెట్లో కనిపించారు. కాగా ఇండియా ఆయిల్ ఉద్యోగులు సాయుధ దళాల కోసం ఇలాంటి దుస్తులను తయారు చేసేలా దాదాపు 10 కోట్ల పీఈటీ బాటిళ్లను రీసైకిల్ చేయనున్నారు. అదీగాక ఇటీవల ప్రభుత్వం సుమారు రూ. 19 వేల కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ప్రారంభించింది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేలా, కార్బన్ తీవ్రతను కూడా తగ్గించే దిశగా ఈ మిషన్ని ఏర్పాటు చేసింది. అలాగే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన పరివర్తన నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి రూ. 35 వేల కోట్లను అందించారు. అంతేగాదు ఆ బడ్జెట్లో దాదాపు ఏడు ప్రాధాన్యతల్లో హరిత వృద్ధికి స్థానం కల్పించారు కూడా. (చదవండి: సిగ్నల్ వద్ద బ్రేక్ బదులు ఎక్స్లేటర్ తొక్కడంతో..ఇద్దరు మృతి) -
వ్యర్థం నుంచి అర్థం.. రీసైక్లింగ్తో ఏం చేస్తారు?
2020లో హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేతలో వెలువడిన నిర్మాణ వ్యర్థాలు 1,46,000 మెట్రిక్ టన్నులు. వీటన్నింటినీ ఏం చేయాలి? పెద్ద సమస్య! హైదరాబాద్లోనే భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఉండటంతో అక్కడకు తరలించారు. 2022లో నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్స్ను కూల్చివేసినప్పుడు వెలువడిన వ్యర్థాలు 30,000 మెట్రిక్టన్నులు. వాటినేం చేయాలి ? అక్కడ ఉన్న ప్లాంట్కు తరలిస్తూ రీసైక్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లో కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయాన్ని కూల్చివేస్తే, నోయిడాలో అక్రమ నిర్మాణం జరిపినందున సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూల్చేశారు. ఇలా పెద్ద పెద్ద భవంతులే కాదు ఏ రకమైన నిర్మాణాలను కూల్చివేసినా, లేదా కొత్తగా నిర్మాణాలు చేపట్టినా నిర్మాణ ప్రక్రియలోను, కూల్చివేతల తర్వాత వ్యర్థాలు వెలువడటం తెలిసిందే. ప్లాస్టిక్ మాదిరిగానే వీటిని కూడా రీసైక్లింగ్ చేసి పునర్వినియోగించేందుకు సీ అండ్ డీ వేస్ట్ (నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల) రీసైక్లింగ్ ప్లాంట్స్ ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు సీ అండ్ డీ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. దేశవ్యాప్తంగా 250 రీసైక్లింగ్ కేంద్రాలు అవసరం కాగా, ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అవి హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, సూరత్, థానే, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో ఉన్నాయి. మరికొన్ని ప్లాంట్ల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో సీ అండ్ డీ వేస్ట్ నిర్వహణకు ఇప్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో రెండు ప్లాంట్లు ఈ సంవత్సరం అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లోని ప్లాంట్లను హైదరాబాద్ సీ అండ్ డీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రాంకీకి చెందిన ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా పేరు మారింది) నిర్వహిస్తుండగా, సోమ శ్రీనివాస్రెడ్డి ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ (ఎస్ఎస్ఆర్ఈసీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్గానూ వ్యవహరిస్తున్నారు) నగర శివార్లలోని శామీర్పేట దగ్గరి తూముకుంట, శంషాబాద్లలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. జూన్ నాటికి వీటి పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతానికి ఈ సంస్థ సీ అండ్ డీ వ్యర్థాలను సేకరిస్తోంది. రీసైక్లింగ్తో ఏం చేస్తారు? శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు. దుమ్మూధూళి పైకి లేవకుండా, పరిసరాలు కలుషితం కాకుండా వాటర్ వాషింగ్ అండ్ క్రషింగ్తో ‘వెట్ప్రాసెస్’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రీసైక్లింగ్కు పనికిరాని చెక్క, ప్లాస్టిక్ వంటివి వేరు చేశాక ప్రాసెసింగ్లో సిల్ట్, ఇసుక, కంకరలు, లోహాలు తదితరమైనవి విడివిడిగా బయటకు వస్తాయి. ఇసుక, మెటల్, కంకరలను యాడ్మిక్సర్లు వాడి ఇటుకలు, పేవర్బ్లాక్లు, కెర్బ్స్టోన్, టైల్స్, ప్రీకాస్ట్ వాల్స్ వంటివి తయారు చేస్తారు. క్రషింగ్ ద్వారా కంకరను 20 మిమీ కంటే ఎక్కువ, 20మిమీ కంటే తక్కువ సైజు కంకరగా రెండు మూడు రకాలు, ఇసుకను సన్న ఇసుక, దొడ్డు ఇసుకగా మారుస్తున్నారు. కంకరను రోడ్లకు పై పొరగా కాకుండా లెవెల్ ఫిల్లింగ్కు వాడొచ్చు. ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీ గాను, ల్యాండ్స్కేపింగ్ పనులకు వాడవచ్చు. సిల్ట్ను ల్యాండ్ఫిల్లింగ్కు వాడవచ్చు. వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్ అనే రెండు విభాగాలుగా ఈ పనులు చేస్తున్నారు. దేశంలో రీసైక్లింగ్ ఒక్క శాతమే.. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోలిస్తే సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్లో హైదరాబాదే నయం. మన దేశంలో ఏటా వెలువడుతున్న సీ అండ్ డీ వ్యర్థాలు 54.57 మిలియ¯Œ టన్నులు కాగా 1.80 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం సీ అండ్ డీ వ్యర్థాల్లో కేవలం ఒక శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. హైదరాబాద్లో రోజుకు 2200 టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 2200 మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఒక్కోప్లాంట్ సామర్థ్యం రోజుకు 500 మెట్రిక్ టన్నులు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల రీసైక్లింగ్ మొత్తం పూర్తయితే రోజూ వెలువడే వ్యర్థాలను దాదాపుగా ఎప్పటికప్పుడే రీసైకిల్ చేయవచ్చు. ప్రస్తుతం రోజుకు 1200 మెట్రిక్ టన్నుల సేకరణ జరుగుతోంది. గత నవంబర్ వరకు సేకరించిన మొత్తం వ్యర్థాలు 21.30 లక్షల మెట్రిక్ టన్నులు. అందులో 19.20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, నాలాలు, ఫుట్పాత్లపై కుమ్మరించిందే! మిగతాది నిర్మాణదారులు తరలించింది. జీహెచ్ఎంసీలో ఇలా.. జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లున్నాయి. వీటిల్లో ఒక్కో సంస్థకు 15 సర్కిళ్లలోని వ్యర్థాలను తరలించేలా జీహెచ్ఎంసీ వాటితో ఒప్పందం కుదుర్చుకుంది. యూసుఫ్గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం–పటా¯Œ చెరువు, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను జీడిమెట్ల ప్లాంట్కు తరలిస్తారు. ఉప్పల్, హయత్నగర్, ఎల్బీ నగర్, సరూర్నగర్, మలక్పేట, సంతోష్నగర్, అంబర్పేట సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను ఫతుల్లాగూడ ప్లాంట్కు తరలిస్తారు. ఇందుకోసం ప్రజలు సంప్రదించాల్సిన టోల్ఫ్రీ ఫో¯Œ నంబర్: 18001201159, వాట్సాప్ నంబర్: 9100927073. చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలోని వ్యర్థాలను శంషాబాద్ సెంటర్కు; కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలోని వ్యర్థాలను శామీర్పేట దగ్గరి తూముకుంట సెంటర్కు తరలిస్తారు. టోల్ఫ్రీ నంబర్ 18002030033కు ఫోన్ చేసి, లేదా వాట్సాప్నంబర్ 7330000203 ద్వారా సంప్రదించి తరలించవచ్చు. ఎంత ఫీజు.. వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్కు చెల్లించాల్సిన ఫీజులు మెట్రిక్ టన్నుకు ప్లాంట్ల వారీగా ఇలా ఉన్నాయి. జీడిమెట్ల: రూ.399, ఫతుల్లాగూడ:రూ. 389, శామీర్పేట:రూ.435, శంషాబాద్:రూ.405. ఈ మేరకు ఆయా సంస్థలు జీహెచ్ఎంసీతో పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ∙ సిహెచ్ వెంకటేశ్ నైపుణ్యంతో నాణ్యమైన ఉత్పత్తులు.. నైపుణ్యాలను పెంచుకుంటూ ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’ సీ అండ్ డీ వ్యర్థాలతో నాణ్యమైన, మన్నిక కలిగిన, విలువైన ఉత్పత్తుల్ని చేస్తోంది. మా కంపెనీకి చెందిన ఆరు కేంద్రాల ద్వారా ఏటా 3,10,985 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 92 శాతం రీసైక్లింగ్ సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మరో రెండు కేంద్రాలు పని ప్రారంభించనున్నాయి. ఈ రంగంలో గడించిన అనుభవంతో వేస్ట్ను ఆదాయ వనరుగా మారుస్తున్నాం. గత సంవత్సరం పేవర్బ్లాకులు, కెర్బ్స్టో¯Œ ్స, ఇటుకలతో సహా మొత్తం 1,83,561 యూనిట్లను ఉత్పత్తి చేశాం. నోయిడాలో సూపర్టెక్ ట్వి¯Œ టవర్స్ కూల్చివేతలో వెలువడిన 30వేల టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలను రీసైక్లింగ్తో నాణ్యమైన నిర్మాణ ఉత్పత్తులుగా మారుస్తున్నాం. రీసైక్లింగ్ ద్వారా మెరుగైన ఉత్పత్తులతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్ను అందజేస్తున్నాం. రోజురోజుకూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నాం. – గౌతమ్రెడ్డి, ఎండీ, రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్. జాతికి మేలు జరగాలని.. మూడు దశాబ్దాలకుపైగా భవనాలు, బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణరంగంలో ఉన్న మా సంస్థ ద్వారా ప్రజలకు, పర్యావరణానికి మేలు చేయాలనే తలంపుతో ఈ రంగంలోకి ప్రవేశించాం. పునరుత్పత్తులపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఏమైనా చేయవచ్చుననే నమ్మకం ఉంది. వేల టన్నులతో గుట్టలుగా పేరుకుపోతున్న సీ అండ్ డీ వ్యర్థాలతో ఎన్నో అనర్థాలున్నాయి. చెరువుల్లో నింపుతున్నందున చెరువులు కనుమరుగవుతున్నాయి. సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్ ఎందుకు జరగడం లేదా అని ఎన్నో ఏళ్లనుంచి ఆలోచిస్తున్నాం. దేశంలోని వివిధ నగరాల్లో రెండు సంవత్సరాలు పరిశోధన చేశాం. ఆయా నగరాల్లో రీసైక్లింగ్ ప్లాంట్ల పనితీరు పరిశీలించాం. చేయగలమనే నమ్మకంతో ఈ రంగంలోకి దిగాం. ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలకు తగిన అవగాహన కలిగేలా విస్తతంగా ప్రచారం చేయాల్సి ఉంది. ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పునరుత్పత్తులను ప్రోత్సహించాలి. భవన నిర్మాణ అనుమతులు పొందే సమయంలోనే అధికారులు ఈ ఉత్పత్తుల గురించి తెలియజేయాలి. – సోమ శ్రీనివాసరెడ్డి, ఫౌండర్, ఎస్ఎస్ఆర్ఈసీ ప్రభుత్వ నిబంధనల మేరకు సీ అండ్ డీ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. దేశవ్యాప్తంగా 250 రీసైక్లింగ్ కేంద్రాలు అవసరం కాగా, ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అవి హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, సూరత్, థానే, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో ఉన్నాయి. మరికొన్ని ప్లాంట్ల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో సీ అండ్ డీ వేస్ట్ నిర్వహణకు ఇప్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో రెండు ప్లాంట్లు ఈ సంవత్సరం అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లోని ప్లాంట్లను హైదరాబాద్ సీ అండ్ డీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రాంకీకి చెందిన ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా పేరు మారింది) నిర్వహిస్తుండగా, సోమ శ్రీనివాస్రెడ్డి ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ (ఎస్ఎస్ఆర్ఈసీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్గానూ వ్యవహరిస్తున్నారు) నగర శివార్లలోని శామీర్పేట దగ్గరి తూముకుంట, శంషాబాద్లలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. జూన్ నాటికి వీటి పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతానికి ఈ సంస్థ సీ అండ్ డీ వ్యర్థాలను సేకరిస్తోంది. రీసైక్లింగ్తో ఏం చేస్తారు? శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు. దుమ్మూధూళి పైకి లేవకుండా, పరిసరాలు కలుషితం కాకుండా వాటర్ వాషింగ్ అండ్ క్రషింగ్తో ‘వెట్ప్రాసెస్’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రీసైక్లింగ్కు పనికిరాని చెక్క, ప్లాస్టిక్ వంటివి వేరు చేశాక ప్రాసెసింగ్లో సిల్ట్, ఇసుక, కంకరలు, లోహాలు తదితరమైనవి విడివిడిగా బయటకు వస్తాయి. ఇసుక, మెటల్, కంకరలను యాడ్మిక్సర్లు వాడి ఇటుకలు, పేవర్బ్లాక్లు, కెర్బ్స్టోన్, టైల్స్, ప్రీకాస్ట్ వాల్స్ వంటివి తయారు చేస్తారు. క్రషింగ్ ద్వారా కంకరను 20 మిమీ కంటే ఎక్కువ, 20మిమీ కంటే తక్కువ సైజు కంకరగా రెండు మూడు రకాలు, ఇసుకను సన్న ఇసుక, దొడ్డు ఇసుకగా మారుస్తున్నారు. కంకరను రోడ్లకు పై పొరగా కాకుండా లెవెల్ ఫిల్లింగ్కు వాడొచ్చు. ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీ గాను, ల్యాండ్స్కేపింగ్ పనులకు వాడవచ్చు. సిల్ట్ను ల్యాండ్ఫిల్లింగ్కు వాడవచ్చు. వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్ష¯Œ అనే రెండు విభాగాలుగా ఈ పనులు చేస్తున్నారు. దేశంలో రీసైక్లింగ్ ఒక్క శాతమే.. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోలిస్తే సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్లో హైదరాబాదే నయం. మన దేశంలో ఏటా వెలువడుతున్న సీ అండ్ డీ వ్యర్థాలు 54.57 మిలియ¯Œ టన్నులు కాగా 1.80 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం సీ అండ్ డీ వ్యర్థాల్లో కేవలం ఒక శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. హైదరాబాద్లో రోజుకు 2200 టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 2200 మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఒక్కోప్లాంట్ సామర్థ్యం రోజుకు 500 మెట్రిక్ టన్నులు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల రీసైక్లింగ్ మొత్తం పూర్తయితే రోజూ వెలువడే వ్యర్థాలను దాదాపుగా ఎప్పటికప్పుడే రీసైకిల్ చేయవచ్చు. ప్రస్తుతం రోజుకు 1200 మెట్రిక్ టన్నుల సేకరణ జరుగుతోంది. గత నవంబర్ వరకు సేకరించిన మొత్తం వ్యర్థాలు 21.30 లక్షల మెట్రిక్ టన్నులు. అందులో 19.20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, నాలాలు, ఫుట్పాత్లపై కుమ్మరించిందే! మిగతాది నిర్మాణదారులు తరలించింది. జీహెచ్ఎంసీలో ఇలా.. జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లున్నాయి. వీటిల్లో ఒక్కో సంస్థకు 15 సర్కిళ్లలోని వ్యర్థాలను తరలించేలా జీహెచ్ఎంసీ వాటితో ఒప్పందం కుదుర్చుకుంది. యూసుఫ్గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం–పటాన్ చెరువు, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను జీడిమెట్ల ప్లాంట్కు తరలిస్తారు. ఉప్పల్, హయత్నగర్, ఎల్బీ నగర్, సరూర్నగర్, మలక్పేట, సంతోష్నగర్, అంబర్పేట సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను ఫతుల్లాగూడ ప్లాంట్కు తరలిస్తారు. ఇందుకోసం ప్రజలు సంప్రదించాల్సిన టోల్ఫ్రీ ఫోన్ నంబర్: 18001201159, వాట్సాప్ నంబర్: 9100927073. చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలోని వ్యర్థాలను శంషాబాద్ సెంటర్కు; కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలోని వ్యర్థాలను శామీర్పేట దగ్గరి తూముకుంట సెంటర్కు తరలిస్తారు. టోల్ఫ్రీ నంబర్ 18002030033కు ఫోన్ చేసి, లేదా వాట్సాప్నంబర్ 7330000203 ద్వారా సంప్రదించి తరలించవచ్చు. ఎంత ఫీజు.. వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్కు చెల్లించాల్సిన ఫీజులు మెట్రిక్ టన్నుకు ప్లాంట్ల వారీగా ఇలా ఉన్నాయి. జీడిమెట్ల: రూ.399, ఫతుల్లాగూడ:రూ. 389, శామీర్పేట:రూ.435, శంషాబాద్:రూ.405. ఈ మేరకు ఆయా సంస్థలు జీహెచ్ఎంసీతో పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ∙ సిహెచ్ వెంకటేశ్ -
Funday Cover Story: ఆర్.. ఆర్.. ఆర్
చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కానీ ఇది కలియుగం! భూమికి మనమందరం కలిసి చేస్తున్న ద్రోహం ఎంత చెప్పుకున్నా తీరేది కానేకాదు. గాలి, నీరు.. భూమి.. ఖనిజాలు.. ఇలా భూమ్మీది వనరులన్నింటినీ... విచ్చలవిడిగా వాడేసిన ఫలితంగా ముంచుకొస్తున్న.... భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాలంటే... ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాల్సిందే! మానవాళి మొత్తం... మన మనుగడ కోసమే చేస్తున్న ఈ యుద్ధంలో.. అందరి తారక మంత్రం ఒకటే కావాలి. అదేమిటంటారా.... వాతావరణ మార్పుల గురించి కానీ... పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతల గురించి కానీ ఈ రోజు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. కనీసం రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి నియమించిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ తరచూ అధ్యయన పూర్వకంగా విడుదల చేసిన నివేదికల్లో హెచ్చరిస్తూనే ఉంది. భూమి సగటు ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దం అంతానికి 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే పెనుముప్పు తప్పదని, సముద్ర తీర నగరాలన్నీ మునిగిపోవడం మొదలుకొని అకాల, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలతో భూమిపై మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఇప్పటివరకూ వెలువడిన ఆరు ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విపత్తు ముంచుకొస్తోందని తెలిసినా.. జంతుజాతి వినాశనం అంచున కొట్టుమిట్టాడుతోందన్నా ప్రపంచదేశాలు ఇప్పటికీ వీటిని ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడం!! బాధ్యులెవరు? ఖర్చులు ఎవరు భరించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు నెపం ఇంకొకరిపైకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇది మరెంతో కాలం కొనసాగే సూచనలు లేవు. నిరుడు యూరప్ మొత్తం కరవు చుట్టుముట్టింది. అలాగే ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలు పాకిస్థాన్ను పలకరించాయి. ఈ ఏడాది మొదట్లోనూ వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయింది. ఈ వైపరీత్యాలన్నీ వాతావరణ మార్పుల ప్రభావమేనని స్పష్టమైతేనైనా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రపంచదేశాలు ముందుకు కదులుతాయి. ఈ అంశం అలా పక్కనుంచితే... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చిరకాలంగా సూచిస్తున్న తారక మంత్రం రెడ్యూస్.. రీసైకిల్.. రీ యూజ్! క్లుప్తంగా ఆర్ఆర్ఆర్ అని పిలుచుకుందాం. వ్యక్తుల స్థాయిలో... ప్రభుత్వాలూ చేపట్టగల ఈ మూడు పద్ధతులను అమలు చేయగలిగితే.. ఒకవైపు వనరుల సమర్థ వినియోగం సాధ్యమవడమే కాకుండా... భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఎలా మొదలైంది? ఆర్ ఆర్ ఆర్ గురించి దశాబ్దాలుగా మనం వింటున్నాం. కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. చెత్తను తగ్గించుకునేందుకు, వనరులను ఆదా చేసుకునేందుకు, ఒక వస్తువు లేదా పదార్థాన్ని ఇంకో రూపంలోకి మార్చి మళ్లీ మళ్లీ వాడేందుకు తమదైన రీతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, పరికరాల రూపకల్పన సరేసరే. అంతా బాగుంది కానీ.. ప్రపంచమంతా ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ ఆర్ ఆర్ ఆర్ ఎలా మొదలైంది? ఊహూ.. స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే ఏటా ఏప్రిల్ 22న నిర్వహించే ఎర్త్ డేకు ఈ ఆర్ ఆర్ ఆర్కూ కొంత సంబంధం ఉందని చాలామంది అంగీకరిస్తారు. 1970లో అమెరికాలోని విస్కాన్సిన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఈ ఎర్త్ డేను ప్రారంభించినప్పుడు ఆ దేశంలో సుమారు రెండు కోట్ల మంది వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. జాతరలు, ప్రదర్శనలు, ఊరేగింపుల్లాంటివి నిర్వహించారు. తద్వారా పర్యావరణ పరంగా భూమికి జరుగుతున్న నష్టాన్ని, ప్రమాద నివారణకు వ్యక్తిగత స్థాయిలో చేయగల పనులను ఈ సందర్భంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయానికి అమెరికా మొత్తమ్మీద వాడి పారేసే వస్తువులతో పెద్ద సమస్యగా ఉండేదట. 1950లలో ఆర్థికంగా బాగా వృద్ధి చెందడంతో మొదలైన ఈ సమస్య 1970ల నాటికి పతాక స్థాయికి చేరుకుందన్నమాట. కుప్పల్లోనూ చెత్త పేరుకుపోయి ఉండేది. ఎర్త్ డే సందర్భంగా చెత్త సమస్యపై ప్రజల దృష్టి పడటంతో ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ను సిద్ధం చేసింది. ఈ చట్టం కారణంగా వస్తువులను రీసైకిల్ చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పే రిసోర్స్ రికవరీ యాక్ట్ కూడా సిద్ధమైంది. ఈ సందర్భంలోనే అమెరికాలో ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే పదం ప్రజల నోళ్లల్లో నానడం మొదలైంది. క్రమేపీ ఒక ఉద్యమంలా మారిందని అంటారు. ఆర్ ఆర్ ఆర్...ఇంతకీ వీటి పరమార్థం? ఆర్ ఆర్ ఆర్ పరమార్థం ఒక్క ముక్కలో చెప్పాలంటే దేన్నైనా అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకోమ్మని. పిసినారిగా ఉండమని చెప్పినా తప్పేమీ కాదు. దీనివల్ల ఆర్థికంగా మనకు కొంచెం లాభం చేకూరడమే కాకుండా... భూమి మొత్తాన్ని కాపాడేందుకు మన వంతు సాయం చేసినట్టూ ఉంటుంది. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూమ్మీద ఉన్న వారందరూ చేయిచేయి కలిపినా రాగల ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేము. తీవ్రత కొంచెం తగ్గవచ్చు అంతే. ప్రజలతోపాటు ప్రభుత్వాలు తగు విధానాలు సిద్ధం చేసి, తగినన్ని నిధులు, టెక్నాలజీలను సమకూర్చి కార్యాచరణకు దిగితేనే ప్రయోజనం. ఈ దిశగా ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్లలో మొదటిదైన రెడ్యూస్ విషయాన్ని పరిశీలిద్దాం. చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చెత్త తగ్గాలంటే మనం వాడే వనరులను కూడా మితంగా అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అది కరెంటు కావచ్చు.. నీళ్లు కావచ్చు. ఇంకేదైనా వనరు, పదార్థం కావచ్చు. మితంలోనే పరమార్థమన్నమాట. వ్యక్తులుగా దీన్ని సాధించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. మీలో కొందరు ఇప్పటికే వీటిని పాటిస్తూండవచ్చు కూడా. అవేమిటంటే... ఇంటికి కావాల్సిన వస్తువులను చిన్న చిన్న మొత్తాల్లో కాకుండా... నెలకు లేదా కొన్ని నెలలకు సరిపడా ఒకేసారి కొనేయడం. దీనివల్ల ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్ గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువ మోతాదుల్లో కొంటే ఖర్చులూ కలిసివస్తాయి. మళ్లీమళ్లీ వాడుకోగల సంచులను దగ్గరుంచుకుంటే మరికొంత ప్లాస్టిక్ను చెత్తకుప్పలోకి చేరకుండా నిలువరించవచ్చు. వాడి పారేసే వస్తువుల కంటే మళ్లీమళ్లీ వాడుకోగలవాటికే ప్రాధాన్యమివ్వండి. ఇంట్లో అవసరమైనప్పుడు.. అవసరమైన చోట మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వాడటం ద్వారా విద్యుత్తును తక్కువగా వాడవచ్చు. కుళాయిల్లో, బాత్రూమ్ సింక్లలో లీకేజీలు లేకుంటే బోలెడంత నీళ్లు మిగుల్చుకోవచ్చు. వారంలో ఒక్క రోజు మాంసాహారం మానేసినా పాడి పశువుల పెంపకానికయ్యే వనరులు తగ్గి భూమికి మేలు జరుగుతుందంటారు నిపుణులు. విమాన ప్రయాణాలను తగ్గించుకోవడం, వీలైనప్పుడల్లా కాళ్లకు పనిచెప్పడం లేదా సైకిళ్లను ఉపయోగించడమూ రెడ్యూస్ కిందకే వస్తుంది. కర్బన ఉద్గారాలు మరింత ఎక్కువ కాకుండా ముందుగానే అడ్డుకోవడం అన్నమాట. ► 98 %: వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో (క్యారీబ్యాగుల్లాంటివి) చమురులాంటి శిలాజ ఇంధనాలతో తయారయ్యేవి. ► 7.5 – 19.9 కోట్ల టన్నులు: సముద్రాల్లోకి చేరి కాలుష్యం సృష్టిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల పరిమాణం. ► 450 ఏళ్లు: ప్లాస్టిక్ బాటిళ్లు నశించేందుకు పట్టే సమయం. ► 2800 కోట్లు: ఏటా చెత్తకుప్పల్లోకి చేరుతున్న గాజు బాటిళ్ల సంఖ్య. వీటిల్లో మూడొంతులు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. ► 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల టన్నుల కాగితాన్ని రీసైకిల్ చేశారు. చెత్తకుప్పల్లోకి చేరిన కాగితాల్లో ఇది 68 శాతం మాత్రమే. ఈ ఏడాది తయారైన కార్డ్బోర్డులో 91.4 శాతం రీసైకిల్ చేసిన కాగితం. ఒకే ఒక్క శాతం చెత్తకుప్పల్లోకి చేరే చెత్తలో అల్యూమినియం మోతాదు ఇది. అలసిపోయేంతవరకూ రీసైకిల్ చేసుకోగలగడం ఈ లోహపు ప్రత్యేకత కూడా. కానీ.. ఏటా దాదాపు 70 లక్షల టన్నుల అల్యూమినియం రీసైకిల్ కావడం లేదు. వాడి వాడి.. మళ్లీ వాడి... పర్యావరణ పరిరక్షణ తారక మంత్రం ఆర్ ఆర్ ఆర్లో రెండోది రీ యూజ్. పేరులో ఉన్న మాదిరిగానే వస్తువులను వీలైనంత ఎక్కువగా వాడటమే ఇది. నిజానికి ఈ విషయం భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. చిరిగిన చీరలిక్కడే బొంతలవుతాయి.. అలాగే వాడేసిన తువ్వాలు తుండుగుడ్డ అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలు... పచారీ సామాను నిల్వకు వాడేదీ ఇక్కడే మరి!! మోజు తీరిన దుస్తులు అనా«థ శరణాలయాలకు చేరడమూ మనం చూస్తూంటాం. రీ యూజ్ వల్ల కలిగే అతిపెద్ద లాభం వాడదగ్గ వస్తువులు చెత్తగా కుప్పల్లోకి చేరకుండా నిలువరించడం. ఉన్నవాటినే ఎక్కువ కాలం వాడటం వల్ల కొత్తవి కొనే అవసరం తప్పుతుంది. తద్వారా డబ్బు ఆదాతోపాటు భూమికీ మేలు జరుగుతుంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటున్నాయి. అవసరానికి తగ్గట్టు కొత్త ఉత్పత్తులను కాకుండా.. సెకెండ్ హ్యాండ్వి కొనగలిగితే వనరులను మిగుల్చుకోగలం. ప్రపంచమంతా.... ఆర్ ఆర్ ఆర్లలో ఇది చాలా పాపులర్. తరచూ అందరికీ వినిపించే రీసైక్లింగ్. వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులు మార్చి ఇంకో అవసరానికి వాడుకోవడాన్ని రీసైక్లింగ్ అనవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యర్థానికి కొత్త అర్థం చెప్పడమన్నమాట. ఈ రీసైక్లింగ్ జాబితాలోకి రాని వస్తువు అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్ చేసి వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. ప్లాస్టిక్ లాంటి పదార్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ విభాగంలోకి ఇటీవలే వచ్చి చేరిన కొత్త రకం వ్యర్థం ఈ–వేస్ట్. యూఎస్బీ డ్రైవ్లు మొదలుకొని, ఎయిర్పాడ్స్, స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తమ జీవితకాలం తరువాత వృథా అయిపోతూండటం వల్ల ప్లాటినమ్ వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇక సేంద్రీయ వ్యర్థాల విషయానికి వస్తే... పొలాల్లోని వ్యవసాయ వ్యర్థాలు మొదలుకొని ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం వరకూ చాలావాటిని కుళ్లబెట్టి సహజసిద్ధమైన ఎరువులు లేదా వంటగ్యాస్లను తయారు చేసుకోవచ్చు. గ్యారీ ఆండర్సన్ సృష్టి.. ఈ లోగో! ఆర్ ఆర్ ఆర్లు మూడు వేర్వేరు అంశాలు కావచ్చు కానీ.. వీటిని సూచించేందుకు వాడే గుర్తు లేదా సింబల్ మాత్రం ఒక్కటే. మూడు ఆరో గుర్తులతో ఒక వృత్తంలా ఉండే ఈ గుర్తును దాదాపు ప్రతి ప్యాకేజ్పైనా చూడవచ్చు. ఆసక్తికరమైన అంశం ఈ లోగోను రూపొందించింది ఎవరన్న విషయం. ఒక ప్రైవేట్ సంస్థ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా పెట్టిన డిజైన్ పోటీల్లో పాల్గొన్న యూఎస్సీ గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్యారీ అండర్సన్ దీన్ని డిజైన్ చేశారు. అప్పట్లో సీసీఏ రీసైక్లింగ్ పనిలోనూ ఉండటం వల్ల దాన్ని సూచించేందుకు లోగోను రూపొందించాలని పోటీ పెట్టారు. పోటీలో నెగ్గిన తరువాత ఆ లోగోతోపాటు గ్యారీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఎందరో మహానుభావులు... ఎనెన్నో ప్రయత్నాలు! భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థల స్థాయిల్లో పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషతుల్యమైన కాలుష్యాలను వాతావరణం నుంచి తొలగించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు కొత్త టెక్నాలజీలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటి గురించి స్థూలంగా చూస్తే... ఓషన్ క్లీనప్ ప్రాజెక్టు... చెత్తకుప్పల్లోంచి నదుల్లోకి.. అటు నుంచి సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి కొత్త రూపంలో ఆ వ్యర్థాలను వాడుకునేందుకు బోయన్ స్లాట్ అనే యువ ఔత్సాహిక శాస్త్రవేత్త చేపట్టిన ప్రాజెక్టు ఇది. సముద్రాల్లోని ప్లాస్టిక్లో అధికభాగం జల ప్రవాహాల ఫలితంగా పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున పోగుపడ్డాయి. ‘ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్’ అని పిలిచే ఈ చెత్తకుప్ప సైజు ఎంత ఉందో తెలుసా? ఫ్రాన్స్ దేశ వైశాల్యానికి మూడు రెట్లు... లేదా టెక్సస్ వైశాల్యానికి రెండు రెట్లు ఎక్కువ. అంకెల్లో చెప్పాలంటే కొంచెం అటు ఇటుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు! 2017 నాటి లెక్కల ప్రకారమే ఇక్కడ పోగుపడ్డ ప్లాస్టిక్ బరువు సుమారు 29.7 కోట్ల టన్నులని అంచనా. ఈ నేపథ్యంలో సముద్ర జీవులకు పెను ప్రమాదంగా పరిణమించిన ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ను తొలగించేందుకు 2013లో బోయన్ స్లాట్ అనే నెదర్లాండ్ కుర్రాడు ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టాడు. సముద్రపు అలల సాయంతోనే చెత్తను పోగుచేసి బయటకు తరలించేందుకు అవసరమైన టెక్నాలజీలను సిద్ధం చేశాడు. బోయన్స్లాట్ స్థాపించిన ఓషన్ క్లీనప్ సంస్థ ఐదేళ్ల కాలంలో ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్లో సగాన్నైనా ఖాళీ చేయాలని సంకల్పిస్తోంది. గత 30 రోజుల్లో ఓషన్ క్లీనప్ సంస్థ ఎనిమిది ఇంటర్సెప్టర్ల సాయంతో 1,11,804 కిలోల ప్లాస్టిక్ చెత్తను తొలగించింది. ఇప్పటివరకూ తొలగించిన చెత్త 20,68,237 కిలోలు. సముద్రాల్లో మాత్రమే కాకుండా... నదుల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ను కూడా అక్కడికక్కడే ఒడిసిపట్టేందుకు బోయన్ స్లాట్ ప్రయత్నిస్తున్నాడు. డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్... భూతాపోన్నతికి ప్రధాన కారణం? గాల్లో కార్బన్డైయాక్సైడ్ వంటి విష వాయువుల మోతాదు ఎక్కువ కావడం. అందుకేనేమో కొందరు ఈ సమస్యను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే... గాల్లోని కార్బన్ డైయాక్సైడ్ను నేరుగా తొలగించేందుకు డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్ పేరుతో పలు ప్రాజెక్టులు చేపట్టారు. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి గాలిని పోగు చేయడం.. అందులోని కార్బన్ డైయాక్సైడ్ను రసాయనాల సాయంతో తొలగించి వేరు చేయడం స్వచ్ఛమైన గాలిని మళ్లీ వాతావరణంలోకి వదిలేయడం ఈ ప్రాజెక్టుల పరమోద్దేశం. వేరు చేసిన కార్బన్ డైయాక్సైడ్ను భూమి అట్టడుగు పొరల్లో భద్రపరచడం లేదా కొన్ని ఇతర టెక్నాలజీ సాయంతో విలువైన ఇంధనం, ఇతర పదార్థాలుగా మార్చి వాడుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. చిన్నా చితక కంపెనీలను వదిలేస్తే డైరెక్ట్ క్యాప్చర్ టెక్నాలజీలో చెప్పుకోవాల్సిన కంపెనీలు క్లైమ్వర్క్స్ ఒకటి. దీంతోపాటు కార్బన్ ఇంజినీరింగ్, గ్లోబల్ థెర్మోస్టాట్లు అనే రెండు కంపెనీలు కలిపి మొత్తం 18 చోట్ల ఫ్యాక్టరీలను స్థాపించి గాల్లోని కార్బన్ డైయాక్సైడ్ను వేరు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో ఏడాది ఒక టన్ను నుంచి నాలుగు వేల టన్నుల సామర్థ్యమున్నవి ఉన్నాయి. అత్యధిక సామర్థ్యమున్న కంపెనీ ఏడాదికి ఎనిమిది వేల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ను వాతావరణం నుంచి తొలగిస్తోంది. అమెరికాలో ఇప్పుడు ఏడాదికి పది లక్షల టన్నుల సామర్థ్యమున్న ఫ్యాక్టరీ ఒకటి వచ్చే ఏడాదికల్లా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా... మరికొన్ని సంస్థలు కూడా గాల్లోని కార్బన్ డైయారక్సైడ్ను సమర్థంగా పునర్వినియోగించుకునేందుకు కొన్ని టెక్నాలజీలను సిద్ధం చేశాయి. వీటిల్లో రెండు మన దేశంలోనే ఉండటం విశేషం. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చక్ర ఇన్నొవేషన్స్ సంస్థ డీజిల్ జనరేటర్లు, బస్సుల పొగ గొట్టాల నుంచి వెలువడే కాలుష్యం నుంచి కర్బనాన్ని వేరు చేసి ప్రింటింగ్ ఇంక్గా మారుస్తూంటే... పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఇంకో కంపెనీ కార్బన్ క్రాఫ్టస్ డిజైన్ వాటితో భవన నిర్మాణాల్లో వాడే టైల్స్గా మారుస్తోంది. రీసైకిల్కు బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ.. రీయూజ్, రెడ్యూస్లకు సంబంధించినవి తక్కువే. అలాగని ప్రయత్నాలు జరగడం లేదని కాదు. ముంబైలో ఓ యువకుడు చెత్తకుప్పల్లోకి చేరిన తెల్లటి క్యారీబ్యాగులను సేకరించి వాటితో సరికొత్త కాలిజోళ్లు సిద్ధం చేస్తూండటం రీయూజ్కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే.. టెట్రాప్యాకులను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో కుర్చీలు, బల్లలు తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తోంది ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ. ఇలా ప్రతి దేశంలో, ప్రతి సమాజంలోనూ వ్యక్తులు, సంస్థలు కూడా ఉడతాభక్తి చందంగా ఈ భూమిని రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి!! -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
తెలుగు కుర్రాడి సత్తా.. ప్రతిష్టాత్మక సీఎన్ఎన్ హీరోస్ అవార్డు..
వాషింగ్టన్: తెలుగు కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. వాడి పడేసిన బ్యాటరీలు రీసైకిల్ చేస్తున్నందుకు సీఎన్ఎన్ హీరోస్ యంగ్ వండర్ అవార్డు కైసవం చేసుకున్నాడు. 13 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించాడు. ఈ కుర్రాడి పేరు శ్రీ నిహాల్ తమ్మన. తెలుగు మూలాలున్న ఇతని కుటుంబం అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్లో నివసిస్తోంది. వాడి పడేసిన బ్యాటరీలు పర్యావరణానికి హానికరం. అందులోని కెమికల్స్ మట్టిని, నీటిని కలుషితం చేస్తాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల బ్యాటరీలను పడేస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో 10 ఏళ్ల పసిప్రాయంలోనే గుర్తించాడు నిహాల్. 2019లోనే 'రీసైకిల్ మై బ్యాటరీ క్యాంపెయిన్' ప్రారంభించాడు. బ్యాటరీ రీసైకిల్పై అమెరికాలోని స్కూళ్లు తిరిగి విద్యార్థులకు అవగాహన కల్పించాడు నిహాల్. తనతో కలిసి స్వచ్ఛందంగా పనిచేసేందుకు 300 సభ్యుల టీంను ఏర్పాటు చేసుకున్నాడు. వాడిపడేసే బ్యాటరీల కోసం స్కూళ్లు, ఇతర ప్రదేశాల్లో ప్రత్యేక బిన్లు ఏర్పాటు చేశాడు. ఇలా మూడేళ్లలో మొత్తం 2,25,000 బ్యాటరీలను సేకరించి వాటిని రీసైకిల్ చేశాడు. నిహాల్ ప్రతిభను గుర్తించిన సీఎన్ఎన్ అతడ్ని యంగ్ వండర్ అవార్డుతో గౌరవించింది. భవిష్యత్తుల్లో ప్రపంచమంతా రీసైక్లింగ్ బ్యాటరీ సేవలను విస్తరించి పర్యావరణాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిహాల్ చెబుతున్నాడు. చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో తొలిసారి మరణాలు! -
విశాఖలోని డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు
-
ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం..రోజుకు రెండున్నర టన్నుల రీసైక్లింగ్
మధురవాడ (భీమిలి): నగరంలోని మధురవాడ జోన్–2 పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డులో రోటరీ ఫౌండేషన్, రోటరీ క్లబ్లు, ఎన్జీవోలు, పలు సంస్థలు సహాయ సహకారాలతో ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ ప్రాజెక్టును ఆదివారం సాయంత్రం రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్. స్టీఫెన్ ఉర్షిక్ ప్రారంభించారు. రోటరీ క్లబ్ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. దీనికి రోటరీ ఫౌండేషన్, ఆమెరికాలోని నేపర్ విల్లే, సన్రైజ్, అరోరా, డారియన్, బ్రాడ్లీబోర్బోనైస్, ఓక్ పార్క్ రివర్ ఫారెస్ట్, సోనోమా వ్యాలీ రోటరీ క్లబ్ సహకారం, భారతీ తీర్థ, నార్త్ సౌత్ ఫౌండేషన్ వంటి ప్రభుత్వేతర సంస్థలు, అరబిందో ఫార్మా ఫౌండేషన్, విహాన్ కియా వంటి సంస్థలు తమ సీఎస్ఆర్ నిధులు సమకూర్చాయి. ఈ ప్రాజెక్టు ఇండియా యూత్ ఫర్ సొసైటీ (ఐవైఎఫ్ఎస్) వంటి పర్యావరణ పరిరక్షణ రంగంలో చురుగ్గా పనిచేస్తున్న ఎన్జీవో ద్వారా అమలు చేయనున్నట్టు నిర్వాహకులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిల్స్ను సేకరించి రోజుకు రెండున్నర టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఒక కిలోకి 60–70 బాటిల్స్ ఉంటాయన్నారు. ఈ వ్యర్థాలతో టూత్ బ్రష్లు, దువ్వెనలు, ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు అరెకరం విస్తీర్ణంలో ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసి తాజాగా మొయినాబాద్ సహకారంతో ప్రారంభించినట్టు తెలిపారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థ రహిత విశాఖగా మారే అవకాశం ఉందన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్. స్టీఫెన్ ఉర్షిక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ రోటరీ 7 ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్కు అమెరికా, ఇండియాలతో రోటరీ ప్రతినిధులు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ విజయవంతమైతే ప్రపంచంలో మరిన్ని చోట్ల ఆయా రోటరీ క్లబ్లతో కలసి అమలుకు కృషి చేస్తామని చెప్పారు. పూర్వ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ మెహతా మాట్లాడుతూ రోటరీ గ్లోబల్ గ్రాంట్తో ఇండియా,అమెరికా క్లబ్ కలిసి పనిచేశాయన్నారు. తద్వారా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినా బాద్ ప్రెసిడెంట్ పతాంజలి రామ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఇక్కడ బాటిల్ రీసైక్లింగ్ చేస్తుందని, భవిష్యత్లో మరిన్ని నిధులు వెచ్చించి వేరే రకాల ప్లాస్టిక్ కూడా రీసైక్లింగ్ చేసేవిధంగా రూపకల్పన చేస్తామన్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ రఘనాథన్ కన్నన్ మాట్లాడుతూ వేరే ప్రాంతాల్లో కూడా అమలు చేసే విదంగా ఈ ప్రాజెక్టులు డిజైన్, ప్లానింగ్ చేశామన్నారు. అలాగే యువత కూడా పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వినియోగించిన అనంతరం సక్రమంగా డస్ట్బిన్స్లో వేయాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ నీరజ్ జెల్లి, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సునీల్ వడ్లమాని, సర్వీస్ ప్రాజెక్టు చైర్మన్ ఉదయ్ పిలానీ, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ అంజు బ్రిజేష్, రోటరీ క్లబ్ అమెరికా ప్రతినిధి శ్రీ నమశ్శివాయం, రోటరీ క్లబ్ వైజాగ్ ఎలైట్ ప్రతినిధి రవీంధ్ర నాథ్ డొక్కా తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు రోటరీ క్లబ్ ప్రయత్నాలు
-
దడ పుట్టిస్తున్న ఈ–వేస్ట్
శ్రీకాంత్రావు.కె, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్ధాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలపై (ఈ–వేస్ట్ (వ్యర్థ్ధాలు) పలు దేశాలు చట్టాలు చేసినా వాటి అమలుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ–వ్యర్థాలు భూమిలో కలిసిపోయేవి కాకపోవడంతో విషపూరితంగా మారి గాలిలో, భూమిలో, నీటిలోనూ కలుస్తూ ప్రాణకోణిపై ప్రభావం చూపెడుతున్నాయి. సరైన విధానంలో వీటిని ధ్వంసం చేయకపోవడం, అవగాహన లేక తగలపెట్టడం వల్ల వాటిని నుంచి విష వాయువులు వాతావరణంలో కలుస్తున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా.. వీటిని ఉత్పత్తి చేస్తున్న సంస్థలు కానీ, వినియోగదారులు కానీ, చివరకు పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోక పోవడం వల్ల ఏటేటా ఈ–వ్యర్థ్ధాలు లక్షల మెట్రిక్ టన్నుల మేర పేరుకుపోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థ్ధాలున్నాయి. అయితే అందులో కొంతమేరకు రీసైక్లింగ్ జరిగాయి. ఏతావాతా గడచిన సెప్టెంబర్ చివరి నాటికి నికరంగా 34.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థ్ధాలు భూమిపై ఉన్నాయి. ఒక్క ఏడాదిలో 5.7 కోట్ల టన్నుల వ్యర్థ్ధాలు ఒక్క 2021 సంవత్సరంలోనే 5.7 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జమ అయినట్లు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. వాస్తవంగా ఈ–వ్యర్థ్ధాల ముప్పును గుర్తించిన తరువాత.. 2014 నుంచి ప్రతియేటా ఏ మేరకు ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అంశంపై వివిధ సంస్థలు సీరియస్గా దృష్టి సారించాయి. 2014 ముందు ఎలక్ట్రానిక్ వ్యర్థ్ధాలకు సంబంధించి పూర్తి సమాచారం లేకున్నా అంచనాలు మాత్రం వేయగలిగారు. రీసైక్లింగ్లో నిర్లక్ష్యం తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఆధునికత పేరిట ప్రపంచం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగం వైపు పరుగులు పెడుతోంది. ఆధునిక వస్తువులు మార్కెట్లోకి వస్తున్న కొద్దీ.. అప్పటివరకు వినియోగించిన వస్తువులను పక్కన పడేస్తున్నారు. మార్కెట్లోకి కొత్తది వస్తేచాలు పాతది ఇక పనిచేయదన్న భావనలో పడిపోతున్నారు. మరింత సౌకర్యవంతమైన వాటి వెంట పడుతున్నారు. దీంతో ప్రతి సంవత్సరం 20 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉన్న దేశాలు వీటిని రీసైకిల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పాతవాటిని సక్రమంగా డిస్పోజ్ చేయకుండా బాహ్య ప్రపంచంలో పారేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పువాటిల్లుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఈ–వ్యర్థ్ధాల్లో 17.4% మాత్రమే రీ సైకిల్ అవుతున్నట్లు సమాచారం. 78 దేశాల్లో చట్టాలున్నా.. ప్రపంచ వ్యాప్తంగా 71 శాతం జనాభా కలిగిన మొత్తం 78 దేశాలు ఈ–వ్యర్థ్ధాలపై చట్టాలు, నియంత్రణ, విధానాలు తీసుకునివచ్చాయి. కానీ వాటి అమలు అంతంత మాత్రంగానే ఉంది. విచిత్రంగా అమెరికాలోని దాదాపు 25 రాష్ట్రాల్లో ఈ–వ్యర్థ్ధాలు రీసైక్లింగ్కు సంబంధించి ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. టాప్ త్రీలో చైనా, అమెరికా, భారత్ ఈ–వ్యర్థ్ధాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా, అమెరికా, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏటా ఆసియాలో 2.4 కోట్ల మెట్రిక్ టన్నులు, అమెరికాలో 1.3 కోట్ల మెట్రిక్ టన్నులు, యూరోప్లో 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తలసరి ఉత్పత్తి యూరోప్లో 16.2 కిలోలు, ఓషియానియా దేశాల్లో 16.1 కిలోలు, అమెరికాలో 13.3 కిలోలుగా ఉంది. ఆఫ్రికా దేశస్తుల తలసరి ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అతితక్కువగా ఉంది. ఈ–వ్యర్థాల్లో ఏది ఎంత? ఈ వ్యర్థాల్లో మైక్రోవేవ్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, టోస్టర్స్, ఏవర్స్, హెయిర్ డ్రయ్యర్స్ (17.4 ఎంటీ), వాషింగ్ మెషీన్స్, టంబుల్ డ్రయ్యర్స్, స్టవ్స్, డిష్వాషర్స్, కుక్కర్స్ (13.4 ఎంటీ), రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండీషనర్స్, హీట్పంప్స్ (10.8ఎంటీ), స్క్రీన్స్,మానిటర్స్, టెలివిజన్స్, నోట్బుక్స్, టాబ్లెట్స్ (6.7ఎంటీ), ఐటీ, టెలీఎక్విప్మెంట్, సెల్ఫోన్స్, వైర్లెస్ రూటర్స్, జీపీఎస్, కాలుక్యులేటర్స్ (4.7ఎంటీ), బల్బులు, ఎల్ఈడీ (0.9ఎంటీ)లు ఉన్నాయి. ప్రజలు ఏంచేయాలి.. ►ప్రతి వ్యక్తీ తన స్థాయిలో ఈ–వ్యర్థ్ధాలను అరికట్టేందుకు సిద్ధం కావాలి. సరిగా డిస్పోజ్ చేయాలి. పర్యావరణహిత జీవనశైలి అలవర్చుకుంటే చాలా మార్పు వస్తుంది. ►వస్తువు కొనుగోలు చేసేటప్పుడే ఆలోచించాలి. దాని వినియోగం ఎలా..?దాని కాలపరిమితి తీరిన తరువాత ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసుకోవాలి. ►పాత టెక్నాలజీతో కూడిన వాటిని తొందరపడి పారేయకూడదు. పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం కంటే వాటి మరమ్మతులు చేసేలా చూసుకోవాలి. విలువైన ముడి పదార్థాలు వ్యర్థంగా.. ఈ–వ్యర్థ్ధాలను రీసైక్లింగ్ చేయకుండా భూమిపై వదిలేయడంతో.. వాటిలో విలువైన ముడి పదార్థాలు ఎందుకు కొరగాకుండా పోతోంది. 2019 సంవత్సరంలో ఉత్పత్తి అయిన ఈ–వ్యర్థ్ధాలు 5.3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే.. అందులో వినియోగించిన విలువైన బంగారం, వెండి, రాగి, ఇనుము తదితర లోహాల విలువ దాదాపు 57 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. పది లక్షల సెల్ఫోన్లలోని సర్క్యూట్లను రీసైకిల్ చేయడం ద్వారా సుమారు 34 కిలోల బంగారం, 336 కిలోల వెండి, 17వేల కిలోల కాపర్, 17 కిలోల పల్లాడియం మెటల్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవన్నీ రీసైకిల్ కాకపోవడంతో సాధారణ వ్యర్థ్ధాలతో కలిసి భూమిలోనే ఇమిడిపోతున్నాయి. ఇవి కాకుండా హానికారక సీసం, జింక్, నికెల్, క్రోమియం, బేరియం లాంటివి భూమిలో కలవడంతో పర్యావరణానికి నష్టం చేకూరుతోంది. వీటివల్ల ప్రజల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. రెండేళ్లకే గాడ్జెట్స్ మార్చేస్తున్నారు.... ఎలక్ట్రానిక్ పరికరాలు నిత్యజీవితంలో భాగమయ్యాయి. ఆధునిక సాంకేతికతల్లో వేగంగా వస్తున్న మార్పులతో ఒకటి, రెండేళ్లకే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మార్చేస్తున్నారు. కంప్యూటర్లు, టీవీలు, సెల్ఫోన్లు, చార్జర్లు, ఇతర ఆక్సెసరీల వాడకం పెరిగింది. అదే సమయంలో మన దగ్గర ఈ–వేస్ట్ రీసైకిల్ చేస్తున్న ఏజెన్సీలు తక్కువ ఉన్నాయి. జనరల్ వేస్ట్తో కలిపి ఈ–వేస్ట్ను పడేస్తుండడంతో ప ర్యావరణం కలుషితమౌతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కంటే ఉత్పత్తిదారుడు, వినియోగదారులే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. – పి.రఘువీర్, విశ్రాంత ఐఎఫ్ఎస్, మాజీ పీసీసీఎఫ్ టేక్ బ్యాక్ పాలసీ ముఖ్యం.. ఈ–వేస్ట్ను సరైన పద్ధతుల్లో పడేయడం లేదా రీసైకిల్ చేయకపోతే ఎదురయ్యే సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. నగరాలు, ముఖ్య పట్టణాల్లో కాలంచెల్లిన, పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలను వినియోగదారుల నుంచి వెనక్కు తీసుకునే ఏర్పా టు జరగలేదు. అందువల్ల వీటి టేక్ బ్యాక్ పాలసీ (వెనక్కి తీసుకునే విధానం) ముఖ్యం. మొబైళ్లు, టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి వాటిలో సూక్ష్మ స్థాయిలో గోల్డ్, కాపర్ వంటివి ఉంటాయి. వీటి కోసం వస్తువలు కాల్చేయడం వల్ల కేన్సర్ కారక విష వాయువులు విడుదలవుతున్నాయి. – మురళీకృష్ణ, ఈ–వేస్ట్ నిర్వహణ నిపుణులు -
26న విశాఖకు సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 26న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలోని సాగర తీర పరిరక్షణ కోసం అమెరికా (న్యూయార్క్)కు చెందిన పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య బీచ్ పరిరక్షణపై ఎంవోయూ జరుగుతుందని కలెక్టర్ డా.మల్లికార్జున శనివారం మీడియాకు తెలిపారు. సాగర గర్భంలోనూ, తీరం వెంబడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని పార్లే సంస్థ సేకరించి.. వాటిని రీ సైకిల్ చేసేందుకు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. దీనికి సంబంధించిన ఒప్పంద కార్యక్రమాన్ని ఈ నెల 26న ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ.. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న 5 వేల మందికి ఉపాధి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. -
సుస్థిర ప్రగతిలో హరిత విధానాలు
సాక్షి, అమరావతి: సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతోంది. సుస్థిర ప్రగతిలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించేలా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టెయిన్బుల్ ప్లానెట్ (జీఏఎస్పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విస్తృతంగా చర్చించారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీని పైలట్ ప్రాజెక్టు కింద విశాఖలో చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంతో అనుసంధానించి దీన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా బీచ్లను అత్యంత పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఇతర అంశాలపైనా తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. హరిత విధానాలకు పెద్దపీట ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, రీ సైక్లింగ్పై అనుసరిస్తున్న వివిధ పద్ధతుల గురించి జీఏఎస్పీ ప్రతినిధి, ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్, పార్లీ ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరిల్ గట్చ్ సమావేశంలో వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమవుతున్న సముద్రాలను, భూగోళాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలతో వ్యర్థాల రీ సైక్లింగ్ చాలా కీలకమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 150 మిలియన్ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అవుతుండగా కేవలం 9% మాత్రమే రీ సైక్లింగ్ జరుగుతున్నాయని, మిగతావన్నీ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయన్నారు. వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చడంలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థకు దారులు వేయవచ్చన్నారు. జీఏఎస్పీ అనుబంధ సంస్థ పార్లే ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేస్తున్న పలు ఉత్పత్తుల గురించి ముఖ్యమంత్రికి తెలియజేశారు. బ్రాండింగ్ భవన నిర్మాణ మెటీరియల్, ఫర్నిచర్, వస్త్రాలు, బూట్లు తదితర వస్తువులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. మన్యంలో ఎకో టూరిజం ఎకో టూరిజంపై ఉత్తరాఖండ్లో చేపడుతున్న ప్రాజెక్టు వివరాలను జీఏఎస్పీ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో అరకు, అనంతగిరి, రంపచోడవరం ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్థానికులకు మంచి ఆదాయాన్ని సమకూర్చేలా ప్రణాళిక ఉండాలన్నారు. కర్బన వ్యర్థాలతో నిరుపయోగ భూములను సారవంతంగా మార్చడంతోపాటు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, అంతర్జాతీయ మార్కెటింగ్ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. విశాఖలో పైలట్ ప్రాజెక్టు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కోసం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న వ్యర్థాల ప్రాసెసింగ్ విధానాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి జీఏఎస్పీ ప్రతినిధులకు వివరించారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీకి విశాఖను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో అనుసంధానించి విలువైన ఉత్పత్తుల తయారీని చేపట్టడంతోపాటు బీచ్ను పరిశుభ్రంగా ఉంచడంపై దృష్టి పెట్టాలన్నారు. విశాఖలో పైలట్ ప్రాజెక్టు అనంతరం మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ తరహా విధానాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. -
రీసైక్లింగే అసలు సమస్య
సాక్షి, అమరావతి : పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అదుపుచేసేందుకు ప్రపంచమంతా విద్యుత్ వాహనాల వినియోగానికి మొగ్గు చూపుతోంది. 2040 నాటికి ప్రపంచంలోని పాసింజర్ వెహికిల్స్లో మూడింట రెండొంతులు విద్యుత్ వాహనాలే ఉంటాయని ‘బ్లూమ్బర్గ్’ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ అంచనా వేసింది. మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం 2070 నాటికి కర్బన ఉద్గారాలు సున్నాకు చేరేలా ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్ వాహనాల కోసం జాతీయ రహదారుల వెంబడి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మన రాష్ట్రం సన్నాహాలు చేస్తోంది. బ్యాటరీ స్టోరేజ్ సాంకేతికతలు అభివృద్ధి చెందుతుండడంతో విద్యుత్ నిల్వ వ్యవస్థలూ పెరుగుతున్నాయి. విశాఖలోనూ బ్యాటరీలతో విద్యుత్ నిల్వ చేసే ప్రాజెక్టుల స్థాపనకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ నిల్వ, వాహనాలు నడిచేందుకు ప్రధానాధారమైన బ్యాటరీలు ప్రస్తుతానికి ఖరీదైనవే కాకుండా రీసైక్లింగ్కు కష్టతరమవుతుండటంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. వీటి రీసైక్లింగ్.. ప్రమాదకరం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. కానీ, సాధారణ బ్యాటరీలను రీసైకిల్ చేసేందుకు ఉపయోగించే పద్ధతులు లిథియం బ్యాటరీ విషయంలో పనిచేయవు. లిథియం బ్యాటరీలు సాధారణ బ్యాటరీల కంటే పెద్దవి. వీటి నిర్మాణం సంక్లిష్టంగా ఉండటమే కాకుండా రీసైక్లింగ్లో ఏ మాత్రం తేడా జరిగినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటిని ల్యాప్టాప్స్, వాహనాలు, పవర్ గ్రిడ్స్ వంటి అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. సాధారణంగా రీసైక్లింగ్ ప్లాంట్లలో బ్యాటరీ భాగాలను చూర్ణం చేస్తారు. ఆ చూర్ణాన్ని అలాగే కరిగించడం(పైరోమెటలర్జీ) లేదా, యాసిడ్లో కరిగించడం(హైడ్రో మెటలర్జీ) చేస్తారు. కానీ లిథియం బ్యాటరీలను అలా చేయడం సాధ్యం కాదు. అంతేకాదు రీసైక్లింగ్లో తిరిగి ఉపయోగించేందుకు పనికొచ్చే ఉత్పత్తుల విలువ కంటే రీసైక్లింగ్ ప్రక్రియకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. దీంతో 5 శాతం లిథియం బ్యాటరీలు మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నాయి. అదే జరిగితే ఇక తిరుగు లేదు.. ఒక టన్ను లిథియం తవ్వాలంటే 5 లక్షల గ్యాలన్ల(సుమారు 22,73,000 లీటర్ల) నీరు అవసరం. అలాగే పదేళ్ల తర్వాత.. వాడేసిన కోట్లాది లిథియం బ్యాటరీలను సమర్థంగా రీసైకిల్ చేసే వ్యవస్థలుండాలి. దీంతో లిథియం బ్యాటరీల రీసైక్లింగ్కు పర్యావరణ అనుకూల, తక్కువ ఖర్చు, సులభ పద్ధతుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు లిథియం బ్యాటరీలు కాకుండా.. పర్యావరణ అనుకూల బ్యాటరీలను తయారు చేసేందుకు మరికొన్ని ప్రయాత్నాలు జరుగుతున్నాయి. సేంద్రియ పదార్థాలను సింథసైజ్ చేసి ఎలక్ట్రాన్లను పుట్టించేలా ఆర్గానిక్ రాడికల్ బ్యాటరీ(ఓఆర్బీ)లను తయారు చేస్తున్నారు. 2025 సంవత్సరం చివరికల్లా లక్షలాది ఎలక్ట్రానిక్ వెహికిల్ బ్యాటరీల జీవిత కాలం ముగుస్తుంది. అప్పటిలోగా వాటిని సమర్థంగా రీసైక్లింగ్ చేయగలిగే విధానాలను గాడిలో పెట్టడంతో పాటు ఆర్గానిక్ బ్యాటరీలు అందుబాటులోకొస్తే విద్యుత్ వాహనాలకు రవాణా రంగంలో తిరుగుండదు. -
ఎర్త్షాట్ ప్రైజ్ గెలుచుకున్న భారత్
లండన్: క్వీన్ ఎలిజబెత్ II మనవడు ప్రిన్స్ విలియం లండన్లో జరిగిన ఎర్త్షాట్ ప్రైజ్ అవార్డు వేడుకల్లో కోస్టారికా, ఇటలీ, బహామాస్, భారతదేశాల ఎర్త్షాట్ ప్రైజ్లను గెలుచుకున్నాయి. వాతావరణ మార్పు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మన భూమిని ఏవిధంగా రక్షించుకోవాలి అనే అంశంలోని సరికొత్త ఆవిష్కరణలకు ఈ వార్షిక అవార్డులను ప్రకటించారు. మొత్త ఐదుగురు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పైగా ఒక్కొక్కరిక 1.4 మిలియన్ డాలర్ల్ పౌండ్లు అందజేస్తారు. అంతేకాదు ఈ ఆవిష్కరణలు స్కాంట్లండ్లో జరిగే కాప్56 శిఖరాగ్ర సదస్సుకు ఎంతోగానో ఉపకరిస్తాయని ప్రిన్స్ విలియమ్స్ అన్నారు. (చదవండి: "అంతరిక్షంలో సినిమా షూటింగ్ విజయవంతం") ఈ మేరకు అడవుల రక్షణకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ విభాగంలో కోస్టారికా రిపబ్లిక్ "ప్రకృతిని రక్షించండి పునరుద్ధరించండి" అనే అవార్డును, భారత్ వ్యవసాయ వ్యర్థాలను ఎరువుగా మార్చే పోర్టబుల్ మెషిన్ను సృష్టించినందుకు భారతీయ కంపెనీ తకాచర్ "క్లీన్ అవర్ ఎయిర్" అవార్డును గెలుచుకోగా, బహమాస్ పగడాలకు సంబంధించిన ప్రాజెక్టు విభాగంలోనూ, ఉత్తర ఇటాలియన్ నగరం "ఫుడ్ వేస్ట్ హబ్స్" విభాగంలోనూ, థాయ్ జర్మనీ పరిశుభ్రమైన హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోలైజర్ను ఆవిష్కరించినందుకు అవార్డులను గెలుచుకున్నాయి . ఈ మేరకు మానవ జాతి పరిష్కరించలేని వాటిని కూడా పరిష్కరించగలదు అంటూ విలియమ్స్ ఆవిష్కర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా విలియమ్స్ మాట్లాడుతూ....."మనం పర్యావరణం కోసం తీసుకునే చర్యలు రానున్న పది సంవత్సరాల కాలంలో మనం భూమి మనుగడను నిర్దేశిస్తాయి. మన భవిష్యత్తును మనమే నిర్ధేసించుకోవాలి. మనం అనుకోవాలే గానీ సాధ్యం కానీదంటూ ఉండదు." అని అన్నారు. అయితే విలియం తండ్రి, ప్రిన్స్ చార్లెస్ కూడా దీర్ఘకాల పర్యావరణవేత్తగా ఎన్నో సేవలందించడం విశేషం. ఈ ఎర్త్షాట్ ప్రైజ్ వేడుకను గతేడాది అక్టోబర్ నుంచి ప్రారంభించారు. తదుపరి ఎర్తషాట్ ప్రైజ్ వేడుక యూఎస్లో జరుగుతుందని విలియమ్స్ ప్రకటించారు. (చదవండి: బలశాలి బామ్మ) -
Quilt Craft: పాత బట్టలను జ్ఞాపకాల బొంతలుగా మార్చిన తోబుట్టువులు...
నేటి తరానికి క్విల్ట్గా పరిచయమైన నిన్నటి తరం బొంతను జ్ఞాపకాల పుంతలా అందిస్తున్నవారిని గుర్తించింది ఢిల్లీ ఎన్సిఆర్. అంతేకాదు, ఈ అందమైన కళను కాపాడేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీతో పాటు అక్కడి చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసే ఎన్సిఆర్ (నేషనల్ కాపిటల్ రీజియన్) ఇటీవల పాత బట్టలతో కొత్తగా రూపొందించే రెండు క్విల్ట్ (బొంతల తయారీ) క్రాఫ్ట్ వెంచర్లను గుర్తించి, ఈ తయారీకి సపోర్ట్గా నిలిచింది. మెమరీ క్విల్ట్లుగా గతకాలపు జ్ఞాపకాలతో నిండిన పెట్టెలుగా మనల్ని హత్తుకునేలా తీర్చిదిద్దుతున్నారు వీటి రూపకర్తలైన మనీషా దేశాయ్, ఆయేషా దేశాయ్. నలభై ఏళ్ల మనీషా దేశాయ్, నలభై మూడేళ్ల ఆయేషా దేశాయ్లు తోబుట్టువులు. ఇద్దరూ గురుగ్రామ్లోని గార్డెన్ ఎస్టేట్లో ఉంటున్నారు. వారి ట్రంక్ పెట్టెల నిండా గత కాలంలో ఉపయోగించిన అత్యుత్తమ దుస్తులు దొంతర్లుగా ఉంటాయి. మనీషా మాట్లాడుతూ ‘నేను పూణెలో ఉన్నప్పుడు 2016లో కర్ణాటక బెల్గాంలో ఉన్న మా పుట్టింటికి వచ్చాను. మా చిన్ననాటి నుంచి మేం వాడిన పాతబట్టలతో నిండిన పెద్ద ట్రంకు పెట్టె ఉంది. ఆ డ్రెస్సులన్నీ తీసేస్తానన్నప్పుడు మా అమ్మ పెద్ద గొడవ చేసింది. వాటిని ఏదైనా చేయాలనుకుంటే కూతుళ్లు అని కూడా చూడనని బెదిరించింది. ఎంత చెప్పినా తను వినలేదు. మా ఇంట్లో అందరం కూర్చొని వాటిని ఏం చేయాలో చర్చించుకున్నాం’ అని తమ క్రాఫ్ట్స్ తయారీ మూలం గురించి వివరించింది మనీషా. గతంలో తాము ధరించిన దుస్తులకు మరింత ప్రత్యేకత జత చేయాలనే ఉద్దేశ్యంతో ఓ కుట్టు మిషన్ని కొని, కొన్ని బట్టలను ఎంచుకొని, వాటిలోని నాణ్యమైన భాగాలను ఎంపిక చేసుకుంటూ ఓ బొంతను కుట్టాం. అది చూసి అమ్మ ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. కుటుంబసభ్యులు, స్నేహితులు అందరికీ బాగా నచ్చింది. అడిగారు అని మా స్నేహితుల కోసం కొన్ని బొంతలు కుట్టి ఇచ్చాం’ అని తెలిపిన ఈ సోదరీమణులు ఆ మరుసటి ఏడాది ఎంతగా అంటే, ఇదే కాన్సెప్ట్తో ‘కార్నోకోపియా’ అనే పేరుతో ఒక సంస్థనే ఏర్పాటు చేశారు. గతం ఇచ్చిన కానుకగా జత కట్టి ‘చాలా మంది తమ పాత బట్టలను వదులుకోవడానికి ఇష్టపడరు. వాటితో వారికి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. తమ కుటుంబసభ్యులు ప్రేమగా ఇచ్చినవి, ప్రత్యేక సందర్భాలలో కొనుగోలు చేసినవి, తమకు తాముగా కుట్లు అల్లికలు చేసుకున్నవి.. ఇలా వాడిన దుస్తుల జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఎవరికైనా ఇవ్వాలంటే ఆ జ్ఞాపకం దూరం చేసుకున్నట్టే అని భావిస్తారు. అలాగే ఉంచేయాలనుకుంటే వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. వారి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ‘థీమ్ ఆధారిత ఎంబ్రాయిడరీ బొంతల’ను నాలుగేళ్ల క్రితం నుంచి తయారుచేయడం మొదలుపెట్టాం. ‘మెమరీ క్విల్ట్’లుగా పిల్లల పాత బట్టల నుండి ప్యాచ్లను తయారుచేయడం ప్రారంభించాం. టీ షర్టుల నుంచి ప్యాంటు వరకు అన్నీ వీటిల్లో ఉపయోగించాం. కొన్ని సమయాల్లో షాపుల నుండి ఫాబ్రిక్ వ్యర్థాలు కూడా సేకరించాం. గురుగ్రామ్ గార్డెన్ ఎస్టేట్లో జరిగిన వర్క్షాప్లో ఢిల్లీ–ఎన్సిఆర్ పాల్గొంది. నివాసితులకు ఇవ్వడానికి కొన్ని బొంతలను తయారుచేయించింది. 4 అడుగుల వెడల్పు ఆరు అడుగుల పొడవు ఉండే మెత్తని బొంత రూ.7,500 ఉంటుంది. బొంత పరిమాణాన్ని బట్టి ధర పెరుగుతుంది’ అని వివరిస్తారు ఈ సోదరీమణులు. అంతే కాదు పాత వస్త్రాలను, క్లాత్ ముక్కలను నూలుగా మార్చడం, వీటి నుండే దారాలు తీయడంతో పాటు ప్యాకేజీకి పనికివచ్చే బ్యాగులను కూడా తయారుచేస్తారు ఈ అక్కాచెల్లెళ్లు. జ్ఞాపకాలకే డిమాండ్ ‘ఫ్యాబ్రిక్ వ్యర్థాల నుండి తయారుచేసిన క్విల్ట్ల కంటే మెమరీ క్విల్ట్లకు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. కోవిడ్ తర్వాత ఈ తరహా మెత్తని బొంతల తయారీకి ఆర్డర్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. జ్ఞాపకాలకు న్యాయం చేయడం అనేది చాలా క్లిష్టమైన బాధ్యత. కానీ, కుటుంబాలు తమ జీవితాంతం ఉపయోగించుకునేలా మనపై నమ్మకం ఉంచినప్పుడు దానినే గౌరవంగా భావిస్తున్నాం. చంటిపాప అయినా, జీవిత భాగస్వామి లేదా అమ్మమ్మ, తాతయ్య అయినా వారు చెప్పే అందమైన కథలో మేమూ భాగం అవుతున్నాం. ఆ జ్ఞాపకాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు ఈ తోబుట్టువులు. మనసు లోతులను తడమాలే కానీ ఇలాంటి ఎన్నో మధురానుభూతులను మిగిల్చే కళలు లోకంలో ఎక్కడో చోట పుడుతూనే ఉంటాయి. వీరి కళ నచ్చితే ఎవరైనా ఓ ప్రయత్నంతో ఈ జ్ఞాపకాల బొంతను సొంతంగా తయారుచేసుకోవచ్చు. బిడ్డలను కథలా అల్లుకుపోయేలా.. ఫరీదాబాద్లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ రాశీ మాలిక్ తన సోదరి కోసం మొట్టమొదటి జ్ఞాపకాల బొంతను సృష్టించినట్టు గుర్తుచేసుకుంది. ‘మా అక్క లండన్లో ఉంది. ఆమె బిడ్డ కోసం తన దుస్తులను ఉపయోగించి, ఒక అందమైన మందపాటి దుప్పటిని రూపొందించాను. అది ఎంత అందంగా అంటే, కొన్ని కథలు రోజూ కళ్ల ముందు కదలాడుతున్నట్టే ఉంటాయి. హృదయానికి హత్తుకున్న దృశ్యమవుతుంది. మా అక్క ఎంత ఆనందించిందో మాటల్లో చెప్పలేను’ అని తన మొదటి జ్ఞాపకాల క్విల్ట్ రూపకల్పన గురించి వివరిస్తుంది రాశీ. ‘మామ్–ఎంటోస్’ పేరుతో క్విల్ట్ వర్క్షాప్ను ప్రారంభించి, బేబీ క్విల్ట్లను సృష్టిస్తోంది. ఆ తర్వాత కొన్నేళ్లుగా తన వెంచర్ను విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు తన వెంచర్ నుంచి పాత దుస్తులను ఉపయోగిస్తూ కుషన్లు, దిండు కవర్లు, బొమ్మలను కూడా తయారుచేస్తోంది. దుప్పట్లు, బొంతలు జ్ఞాపకాలను ఎలా స్పర్శిస్తాయో చెబుతూ ‘మంచం మీద పొరలుగా ఉన్నప్పడు చిన్ననాటి కథలు, మధురమైన జ్ఞాపకాలను మన కళ్ల ముందు ప్రదర్శిస్తాయి. పిల్లలకి వారు పెద్దయ్యాక తమ బాల్యం గురించి తెలుసుకోవడానికి ఇదొక మార్గం అవుతుంది. పెద్దలకు కానుక ఇస్తే.. పిల్లలు తల్లిదండ్రులకు తమ డిగ్రీపట్టాను కానుక ఇచ్చినంత సంబరాన్నిస్తుంది’ అని చెబుతుంది రాశీ మాలిక్. చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. -
వినీషా సోలార్ ఇస్త్రీ బండి
మన చుట్టూ ఉన్నవారికే కాదు పర్యావరణానికీ మేలు జరిగే పనులను చేయాలన్న తపన గల ఓ స్కూల్ విద్యార్థిని ఆలోచనకు అంతర్జాతీయ పేరు తెచ్చిపెట్టింది. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ సౌరశక్తిని ఉపయోగిస్తూ మొబైల్ ఇస్త్రీ బంyì రూపకల్పన చేసింది. బ్రిటన్ యువరాజు విలియమ్ ప్రారంభించిన ఎర్త్షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచింది. పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్ థీమ్తో పర్యావరణాన్ని కాపాడేవారిని ప్రోత్సహించేందుకుగాను బ్రిటన్ యువరాజు కిందటేడాది నవంబర్లో ఎర్త్షాట్ ప్రైజ్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నామినేషన్లను పరిశీలించి, ఇప్పుడు ఫైనల్స్ జాబితా విడుదల చేశారు. 15 మంది ఫైనలిస్ట్ జాబితాలో వినీషా ఉమాశంకర్ ’క్లీన్ అవర్ ఎయిర్’ కేటగిరీలో నిలిచింది. సౌరశక్తితో పనిచేసే మొబైల్ ఇస్త్రీ బండిని డిజైన్ చేసినందుకు, తద్వారా రోజూ లక్షలాది మంది ఉపయోగించే బొగ్గుతో నడిచే ఐరన్కు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. మేలైన ప్రయోజనాలు ఎర్త్షాట్ ప్రైజ్ విశ్లేషకులు వినిషా సోలార్ పవర్డ్ కార్డ్ సూర్యుడి నుండి వచ్చే శక్తితో బొగ్గును భర్తీ చేస్తుందని గుర్తించారు. చార్జింగ్ పాయింట్ ద్వారా ఐదు గంటల పాటు తీసుకున్న సౌరశక్తితో ఇనుము ఇస్త్రీ పెట్టెను ఆరు గంటలు ఉపయోగించవచ్చు. బొగ్గును వాడనవసరం లేదు కాబట్టి ఇది పర్యావరణానికి ఇది ఎంతో మేలైనది. మొబైల్ బండి విధానం వల్ల ఇంటివద్దనే కాకుండా రోడ్డు పక్కన కూడా ఇస్త్రీ చేసి, వినియోగదారులకు ఇవ్వచ్చు. దీని ద్వారా ఆదాయాన్నీ పొందవచ్చు. ఫోన్ టాప్ అప్, ఛార్జింగ్ పాయింట్లను కూడా దీంట్లో ఏర్పాటుచే సి ఉండటం వల్ల, అదనపు ఆదాయాన్నీ పొందవచ్చు. మొత్తమ్మీద ఈ ఇస్త్రీ బండి ద్వారా 13 మేలైన ప్రయోజనాలను పొందవచ్చు అని విశ్లేషకులు గుర్తించారు. ఫైనల్స్కి వెళ్లిన రెండు భారతీయ ప్రాజెక్టులలో ఒకటి వినీషాది కాగా ఢిల్లీ పారిశ్రామిక, వ్యవసాయ వర్థాల రీసైక్లింగ్ కాన్సెప్ట్ కంపెనీ టకాచర్ కో ఫౌండర్ విద్యుత్మోహన్ సృష్టించినది మరొకటి. వీరిద్దరూ ఇక నుంచి ప్రవైట్ రంగ వ్యాపారాల నెట్వర్క్ అయిన ఎర్త్షాట్ ప్రైజ్ గ్లోబల్ అలియన్స్ సభ్యుల నుండి తగిన మద్దతు, వనరులను అందుకుంటారు. విజేతలను అక్టోబర్ 17న లండన్లోని అలెగ్జాండ్రా ప్యాలెస్లో జరిగే అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. -
స్క్రాపేజీ విధానంతో వాహనాల ధరలు తగ్గనున్నాయా...!
న్యూఢిల్లీ: వాహనాల స్క్రాపేజీ విధానంతో కొత్త వ్యాపార మోడల్స్ రాగలవని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్య తరహా సంస్థలు.. వాహనాల టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి అవకాశాలు లభించగలవని పేర్కొన్నారు. నమోదిత వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటు కోసం పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు సుమారు 50–60 దాకా రావచ్చని తెలిపింది. ఆటోమోటివ్ల తయారీ సంస్థలు.. రీసైక్లింగ్ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు తేగలవని ఈవై ఇండియా పేర్కొంది. రీసైకిల్ చేసిన ఉత్పత్తుల కారణంగా ముడి వస్తువుల ధరలు, తత్ఫలితంగా వాహనాల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వివరించింది. కోవిడ్–19 పరిస్థితులు.. ప్రస్తుత సరఫరా వ్యవస్థలోని బలహీనతలను గురించి పరిశ్రమకు తెలియజెప్పాయని ఈవై ఇండియా తెలిపింది. స్క్రాపేజీ విధానం వల్ల కాలుష్యం, ఇంధన దిగుమతుల బిల్లుల భారం వంటివి తగ్గడం.. విడిభాగాల పునర్వినియోగంవంటి సానుకూల పరిణామాలు ఉండగలవని వివరించింది. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు, సర్వీసులు అందించే దిశగా సంప్రదాయ ఆటోమోటివ్ వ్యవస్థలో భాగమైన సంస్థలు, కొత్త సంస్థలు సంఘటితంగా కలిసి పనిచేయడానికి ఆస్కారం ఉందని తెలిపింది. -
స్క్రాప్పాలసీతో సమ్మిళితాభివృద్ధి
గాంధీనగర్: జాతీయ నూతన ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ పాలసీతో సర్క్యులర్ ఎకానమీకి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. వ్యర్ధాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ముడిపదార్థ్ధాల వ్యయాన్ని తగ్గించుకునే ఆర్థిక నమూనాను సర్క్యులర్ ఎకానమీ అంటారు. నూతన పాలసీతో పర్యావరణ హిత ఆర్థిక సమ్మిళితాభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. పాత వాహనాల రీసైక్లింగ్కు నూతన స్క్రాపేజ్ పాలసీ దారి చూపుతుంది. దీనివల్ల దేశీయ మొబిలిటీ, ఆటో రంగానికి కొత్త రూపు వస్తుందని మోదీ చెప్పారు. నూతన పాలసీ విడుదల సందర్భంగా ఏర్పాటైన ఇన్వెస్టర్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. దేశీయ రవాణా రంగంలో కాలం తీరిన(ఫిట్నెస్ లేని) వాహనాలను శాస్త్రీయంగా తొలగించేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని మోదీ తెలిపారు. గతేడాది భారత్ రూ. 23వేల కోట్ల విలువైన స్క్రాప్ స్టీల్ను దిగుమతి చేసుకుందని, కొత్త పాలసీతో ఈ అవసరం చాలావరకు తీరవచ్చని చెప్పారు. పలు రకాల ఖనిజాలను సైంటిఫిక్గా రికవరీ చేయడానికి కొత్త పాలసీ బాటలు పరుస్తుందని, దీంతో ఆయా ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడే అవసరం కూడా తగ్గుతుందన్నారు. ఓడల రీసైక్లింగ్కు పేరొందిన అలాంగ్ ప్రాంతం అన్ని వాహనాల రీసైక్లింగ్ హబ్గా ఎదగాలని ఆకాంక్షించారు. నూతన విధానంలో ముఖ్యాంశాలు ► వాహనం వయసును బట్టి కాకుండా ఫిట్నెస్ను బట్టి స్క్రాపింగ్కు పంపడమే కొత్త విధానంలో కీలకం. ► కొత్త విధానం ప్రకారం తమ పాత వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్కు ఇచ్చే వారికి ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. ► ఈ సర్టిఫికెట్ చూపిన వారికి కొత్తవాహనాల కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. దీంతోపాటు వీరికి రోడ్టాక్స్లో కొంత రిబేటు సైతం ఇస్తారు. ► నూతన తుక్కువిధానంతో కొత్తగా రూ. 10వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా ► దేశంలో దాదాపు కోటి అన్ఫిట్(కాలం తీరిన) వాహనాలున్నాయి, వీటిని తక్షణం రీసైకిల్ చేయాల్సిఉంది. -
ఏపీలో జోరుగా.. ‘స్వఛ్చతా హీరో’
సాక్షి, అమరావతి : ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణంలో స్వఛ్చతా హీరో కార్యక్రమం ప్రారంభమైంది. రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎమ్సి)తో కోకో కోలాకు చెందిన బాట్లింగ్ భాగస్వామి శ్రీ సర్వారాయా సుగర్స్ లిమిటెడ్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. కేంద్రప్రభుత్వ స్వఛ్చ భారత్ మిషన్ స్ఫూర్తిగా దీన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. వ్యర్ధాల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు పౌరులనూ భాగస్వాములను చేయడం అవసరమని ఈ కార్యక్రమం ద్వారా చెబుతున్నామన్నారు. ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు.. వ్యర్ధాల విభజనపై అవగాహన పెంచడం, ప్రజల థృక్పధాలలో మార్పు తీసుకురావడం కూడా ఈ కార్యక్రమంలో భాగమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్లినెస్ డ్రైవ్ చేపడతామని వీరు చెప్పారు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైక్లింగ్ కోసం స్థానికంగా ఉన్న శక్తి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్కు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పలు బ్రాండెడ్ కియోస్క్లు, సెల్ఫీ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాజమహేంద్రవరంలోని 50 వార్డులలో కలెక్షన్ వ్యాన్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను తీసుకుని జ్యూట్ బ్యాగులను ఉచితంగా ఇవ్వడం వంటి ఆకర్షణీయమైన ప్రచారంతో ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ కార్యక్రమం ఊపందుకుంది. తొలిదశ కార్యక్రమంలో భాగంగా నిర్ణీత 35 రోజులలో మురికివాడలు, కాలనీల నుంచి ఇప్పటికే 5టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించామని అంటే సగటున రోజుకి 150 కిలోలు సేకరించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, దీనిలో పాల్గొన్నవారు సదరు ఛాయా చిత్రాలను ఫేస్బుక్, ట్విట్టర్లలో పంచుకుంటూ సోషల్ మీడియా ద్వారా మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మునిసిపల్ అధికారి హెల్త్ ఆఫీసర్ డా.ఎ.వినూత్న మాట్లాడుతూ పరిశుభ్రత, బాధ్యతాయుతంగా వ్యర్ధాలను పారవేయడం అనేవి మనం రోజువారీ జీవితంలో క్రమశిక్షణగా అలవరచుకోవాల్సిన విషయాలు. వ్యర్ధాల నిర్వహణ చుట్టూ అల్లుకున్న సవాళ్లను అధిగమించడానికి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలి’’ అని సూచించారు. -
అటు ఆదాయం.. ఇటు ఉపాధి
సాక్షి, అమరావతి: వేలాది మందికి ఉపాధితో పాటు ఆదాయాన్ని అందించే షిప్ రీ సైక్లింగ్ వ్యాపారంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే రెండు పోర్టులు, నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన బోర్డు.. తాజాగా పాడైపోయిన ఓడలను ఒడ్డుకు చేర్చి విడదీసే రీ సైక్లింగ్ వ్యాపారం చేపట్టాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మారిటైమ్ ఇండియా విజన్–2030 కింద షిప్ రీ సైక్లింగ్ వ్యాపారాన్ని పెద్దయెత్తున ప్రోత్సహిస్తుండటమే కాకుండా, ఓడల రీ సైక్లింగ్ చట్టం–2019ని కూడా తీసుకురావడంతో ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకేసారి 50 ఓడల రీ సైక్లింగ్ గుజరాత్లో (అలాంగ్లో) ఏటా 300 ఓడలు రీ సైక్లింగ్ చేయడం ద్వారా ఆ రాష్ట్రం భారీగా ఆదాయం పొందుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడల రీ సైక్లింగ్ చేపట్టాలని మారిటైమ్ బోర్డు భావిస్తోంది. ఇందుకోసం అలల ఉధృతి ఎక్కువగా ఉండి, మత్స్యకారుల చేపల వేటకు ఎక్కువ ఉపయోగపడని తీర ప్రాంతాలను పరిశీలించి.. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు ఇందుకు అనువైనవిగా గుర్తించింది. వీటిలో ఒక ప్రాంతాన్ని ఖరారు చేసి ఒకేసారి 50 ఓడలను రీ సైక్లింగ్ చేయడానికి తగిన విధంగా అక్కడ మౌలిక వసతులు కల్పించనుంది. అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హానీ లేని విధంగా యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. వేలాది మందికి ఉపాధి యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతంలో ఉపాధి కోల్పోయేవారికి ఓడల రీ సైక్లింగ్ చట్టం–2019 ద్వారా తగిన రక్షణ కల్పించనున్నారు. ఒక ఓడను విడగొట్టాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుంది. 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. దీనికి ఐదు రెట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. యూనిట్లో ఒకసారి 50 ఓడల రీ సైక్లింగ్ ప్రారంభమైతే ప్రత్యక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. కాగా ఏటా 150 ఓడలను రీ సైక్లింగ్ చేయాలని మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. బయటకు తీసిన ఇనుమును తరలించడానికి, ఇనుమును కరిగించడానికి రీ రోలింగ్ మిల్స్ వంటి అనేక అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. ఒక నౌకను విడదీయడానికి కనీసం ఒక ఎకరం స్థలం అవసరమవుతుందని, ఆ విధంగా 50 నౌకలకు కలిపి కనీసం 50 ఎకరాలు అవసరమవుతాయని మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. గతంలో 5 ఓడల రీ సైక్లింగ్ 1995–96 ప్రాంతంలో కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరం వద్ద 5 నౌకలను రీ సైక్లింగ్ చేశారు. దాని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలోనే చెరో రూ.2.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఈ యూనిట్ ఏర్పాటుకు అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు. ► ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వాణిజ్య నౌకల సంఖ్య 53,000 ► ఇందులో ఏటా 1,000 నౌకలు రీ సైక్లింగ్కు వెళ్తున్నాయి ► అంతర్జాతీయ రీ సైక్లింగ్ వ్యాపారంలో మన దేశం వాటా 30 శాతం ► 2024 నాటికి రీ సైక్లింగ్ సామర్థ్యం 40 శాతం పెంచడం ద్వారా 60 శాతం మార్కెట్ వాటాను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ► ఇందులో 50 శాతం వ్యాపారం చేజిక్కించుకోవాలని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక 50% మార్కెట్ వాటా లక్ష్యం కేవలం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమే కాకుండా సముద్ర ఆధారిత వ్యాపారాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి సారించింది. ప్రస్తుతం షిప్ రీ సైక్లింగ్లో రెండవ స్థానంలో ఉన్న మన దేశాన్ని 2030 నాటికి మొదటి స్థానానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా దేశంలో జరిగే షిప్ రీ సైక్లింగ్లో 50 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. –ఎన్.రామకృష్ణారెడ్డి, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
అక్షరాలా లక్ష టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఎంతోమంది ముఖ్యమంత్రుల అధికారిక కార్యకలాపాలకు వేదిక. ఎన్నో కీలక నిర్ణయాలకు సాక్షి. పాలనాపరమైన సంస్కరణలకు కేంద్ర బిందువు, ఎంతోమంది సమస్యల పరిష్కారానికి నెలవు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉండగా ప్రధాన పరిపాలన కేంద్రం. అదే సచివాలయం. కొత్త సచివాలయాన్ని వాగ్దానం చేస్తూ ఇటీవల కాలగర్భంలో కలిసిపోయింది. హుస్సేన్సాగర్ తీరంలో ప్రశాంతంగా కనిపించే సచివాలయ భవన సముదాయం ఇప్పుడు మట్టిదిబ్బగా మారింది. కొత్త భవనం కోసం నెల క్రితం ప్రభుత్వం పాత భవనాల సముదాయాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. కూల్చి వేతలు చాలా వేగంగానే సాగాయి. మధ్యలో భారీ వర్షాల వల్ల కొంత ఇబ్బంది కలిగింది. వ్యర్థాల తరలింపు గత నెలరోజులుగా సాగుతోంది. తరలింపు మరో పక్షం రోజులు పట్టే అవకాశముంది. కూల్చివేతతో ఏర్పడ్డ వ్యర్థాల పరిమాణం ఏకంగా లక్ష టన్నులు ఉండటమే దీనికి కారణం. ఇంతవరకు నగరంలో ఒకచోట లక్ష టన్నుల పరిమాణంలో కూల్చివేత వ్యర్థాలు ఏర్పడటం ఇదే ప్రథమం. ఆ వ్యర్ధాలను తొలుత నగర శివారులోని క్రషర్ల వల్ల ఏర్పడ్డ భారీ గోతులలో వేయాలని భావించారు. క్రషర్ల గోతులతో ఎన్నో ఇబ్బందులు రావటమే కాకుండా పర్యావరణం పరంగానూ అవి సమస్యలకు కారణమవుతున్నాయి. వాటిని పూడ్చాలంటే భారీ పరిమాణంలో మట్టి అవసరం. అంత మట్టి దొరకక గోతులు అలాగే ఉన్నాయి. సచివాలయ కూల్చివేత వ్యర్థాలతో వాటిని పూడ్చాలని భావించినా.. ఆ తర్వాత అధికారులు మనసు మార్చుకున్నారు. వ్యర్థాలను పునర్వినియోగంలోకి తేవాలని నిర్ణయించి, నగర శివారులో ఉన్న రాంకీ సంస్థ ఆధ్వర్యంలోని రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. 60 వేల ట్రక్కుల లోడ్..: ఏకంగా లక్ష టన్నుల వ్యర్థాలు ఏర్పడటంతో వాటి తరలింపు పెద్ద సమస్యగా మారింది. ఆ వ్యర్థాలు ఏకంగా 60 వేల ట్రక్ లోడ్ల పరిమాణంలో ఉండటమే దీనికి కారణం. నెల రోజులుగా నిత్యం వంద ట్రక్కులతో దీన్ని రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రాంకీ సంస్థకు ఒక టన్నుకు రూ.91 చొప్పున ఛార్జీ కూడా చెల్లిస్తోంది. ఆ వ్యర్థాల నుంచి మళ్లీ వినియోగించే సామగ్రిని రాంకీ సంస్థ రూపొందిస్తోంది. వాటిని కొత్త సచివాలయ నిర్మాణంలో వినియోగించాలా వద్దా అన్న విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. నగరంలో ప్రస్తుతం ఇసుక లభించటం కష్టంగా మారింది. దీంతో కూల్చివేత వ్యర్థాల నుంచి భారీ మొత్తంలో పునర్వినియో గించేలా ఇసుకను రూపొందిస్తున్నారు. దాన్ని ప్రధాన నిర్మాణాల్లో కాకుండా అనుబంధ నిర్మాణాలకు వినియోగిస్తారు. ప్రధాన నిర్మాణాలకు కూడా ప్లాస్టరింగ్కు వినియోగిస్తారు. వ్యర్థాలలోని ఇనుము, ప్లాస్టిక్ను కూడా పునర్వినియోగించేలా మారుస్తున్నారు. ప్రహరీలు, ఇతర నిర్మాణాలకు కావాల్సిన భారీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బ్లాక్లను కూడా రూపొందిస్తున్నారు. ఇక ఫుట్పాత్లు, ఫ్లోరింగ్కు వాడుకునేలా జీఎస్బీ మెటీరియల్, ఫుట్పాతలపై పరిచే ఇంటర్లాకింగ్ టైల్స్ తయారు చేస్తున్నారు. 95 శాతం వ్యర్థాలు పునర్వినియోగం.. కూల్చివేత వ్యర్థాల్లో 95 శాతం వరకు మెటీరియల్ పునర్వినియోగానికి వీలుగా ఉంటుంది. ఐదు శాతం మాత్రం సిల్ట్గా వృథా అవుతుంది. ఇక నిర్మాణంలో మంచి నాణ్యమైన మెటీరియల్ ఉంటే పునర్వినియోగ మెటీరియల్ 98 శాతం వరకు ఉంటుందని రాంకీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సచివాలయ వ్యర్థాలS నుంచి 98 శాతం వరకు రీసైక్లింగ్ మెటీరియల్ ఉంటుందన్నారు. -
టెక్నాలజీ ఊతంతో స్వచ్ఛమైన ఇంధనాలు
న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన, సమర్ధమంతమైన, చౌకైన ఇంధనాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కాలుష్యకారక కార్బన్డైఆక్సైడ్ను రీసైక్లింగ్ చేసేందుకు టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ సదస్సులో వీడియో లింక్ ద్వారా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ముడిచమురు ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ అల్–సౌద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కార్బన్డైఆక్సైడ్ను ఒక భారంగా భావించకుండా టెక్నాలజీ ఊతంతో ఇతరత్రా ఉత్పత్తుల కోసం దాన్ని ముడి వనరుగా మార్చుకునే అంశంపై దృష్టి పెట్టాల్సి ఉందని ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచంలోని 800 కోట్ల మంది జనాభాకు ఇంధనం అనేది తప్పనిసరిగా అవసరం. ఈ నేపథ్యంలో చౌకైన, సమర్థమంతమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించాలి. అది కూడా బాధ్యతాయుతమైన పద్ధతిలో చేయగలగాలి‘ అని అంబానీ చెప్పారు. -
రీసైక్లింగ్ షిప్స్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రీసైక్లింగ్ షిప్స్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. మంగళవారం లోక్సభలో ఈ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘రీసైక్లింగ్ పరిశ్రమలో మన దేశం అగ్రశ్రేణిలో ఉంది. దాదాపు 30 శాతం మార్కెట్ ఇండియాదే. అందువల్ల అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పరిశ్రమను నిర్వహించుకోవడం మంచిది. భద్రత, ఆరోగ్యం, పర్యావరణ ప్రమాణాలు తదితర అంశాలతో కూడిన షిప్ బ్రేకింగ్ కోడ్ 2013 ఇప్పుడు ఉనికిలో ఉంది. అయితే ఈ కోడ్ను ఉల్లంఘించేవారికి జరిమానా విధించే అవకాశం గానీ, నౌకల్లో ప్రమాదకర వస్తువుల వినియోగం వంటి వాటి విషయంలో నియంత్రణ నిబంధనలు గానీ లేవు. అందువల్ల షిప్ బ్రేకింగ్ పరిశ్రమ వల్ల మానవాళికి, పర్యావరణానికి ఇబ్బందులు ఉండరాదు. ముఖ్యంగా తీరప్రాంతం మత్స్యకారులకు జీవనోపాధి ఇస్తుంది. అందువల్ల అంతర్జాతీయ ప్రమాణాలతో తాజా బిల్లు రావడం స్వాగతించదగిన అంశం..’ అని పేర్కొన్నారు. విశాఖలో సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించాలి దేశంలో క్యాన్సర్ల బారిన పడ్డ వారి సంఖ్య పెరిగిపోతోందని వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి ఆందోళన వ్యక్తం చేశారు. జీరో అవర్లో ఆమె మాట్లాడారు. ‘20 లక్షల మంది దేశంలో క్యాన్సర్లతో సతమతమవుతున్నారు. ఏటా 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విశాఖలో అధునాతన సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి..’ అని కోరారు. మదాసి కురువ, మదారి కురువలను ఎస్సీ జాబితాలో చేర్చాలి మదాసి కురువ, మదారి కురువలను ఎస్సీ జాబితాలో చేర్చాలని వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన జీరోఅవర్లో మాట్లాడారు. ‘బోయ కులస్తులకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలని గత సెషన్లో నివేదించాను. మదాసి కురువ, మదారి కురువ కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నా. ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉన్న కులాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త తీసుకోవాలి. కురువలను మదాసి కురువ, మదారి కురువలుగా గుర్తించి వారికి సర్టిఫికెట్లు జారీ చేయాలి.’ అని పేర్కొన్నారు. పదవీ విరమణకు ముందు ఆప్షన్లను మన్నించాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ముందు వారు ఇచ్చే ఆప్షన్లకు అనుగుణంగా వారిని బదిలీ చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనురాధ పేర్కొన్నారు. ఆమె జీరో అవర్లో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు ముందు మూడు నాలుగేళ్లు వారు కోరిన చోట ప్రశాంతంగా పని చేసేలా అవకాశం కల్పిస్తూ కేంద్రం తగిన ఆదేశాలు ఇవ్వాలి. వారి ఆరోగ్యం, సేవలు దృష్టిలో పెట్టుకోవాలి..’ అని కోరారు. -
పారేసేది వాడేసేలా
‘మన అవసరానికి భూమి మీద తగినన్ని వనరులు ఉన్నాయి.కానీ, అవి మన దురాశకు కాదు’ అని చెప్పిన గాంధీజీ మాటలను గుర్తుచేసుకున్నారు హరిచందన. పర్యావరణ హితురాలిగా ప్లాస్టిక్రీసైక్లింగ్ విధానాలు, కార్యక్రమాల ద్వారా విభిన్నంగా హరితవనానికినాయకత్వం వహిస్తున్నారు ఐఏఎస్ అధికారి దాసరి హరిచందన.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ అడిషనల్ కమిషనర్గా తను చేపడుతున్న పనులను, ముందున్న సవాళ్లను ఆమె వివరించారు. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ విధానాలలో తన సృజనాత్మక ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇంటి నుంచి మొదలు ‘మా ఇంట్లో పనమ్మాయి మొదట్లో కిచెన్ నుంచి వచ్చిన తడిచెత్త, మిగతా పొడిచెత్త, ఏమైనా పగిలిపోయిన వస్తువులన్నీ కలిపి ఒకే చెత్తబుట్టలో వేసేది. నేనూ మొదట్లో అంతగా పట్టించుకోలేదు. అనారోగ్యకారణం వల్ల ఓ నెల రోజులు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు తను చేస్తున్న పనులు చూసి మూడు చెత్తబుట్టలను ఏర్పాటు చేసి, ఏ చెత్త ఎందులో ఎలా వేయాలో వివరంగా చెప్పాను. నేను గమనించిన అన్నిరోజులూ బాగానే చేసేది. ఆఫీసుకు రావడం మొదలయ్యాక నేను గమనించడం లేదనుకొని మళ్లీ అన్నీ ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో వేయడం మొదలుపెట్టింది. ‘ఎందరికో చెత్త, రీ సైక్లింగ్, పర్యావరణం గురించి అవగాహన కలిగించేలా చెబుతుంటాను. నా ఇంట్లోనే ఇలా ఉంది.. ఏమిటి చేయడం?’ అని ఆలోచించాను. నా భయంతో కాకుండా అవగాహన కలిగించాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా నెల చివర్లో తీసేసే న్యూస్ పేపర్లు తీసి, అమ్ముకోమని మా పనమ్మాయికి చెబుతుంటాను. బాటిల్ ఫెన్సింగ్.. ఆ పేపర్లతో పాటు మరో మార్గం సూచించా. తడి, పొడి చెత్తతో పాటు మూడవ డస్ట్బిన్లో వేసే ప్లాస్టిక్, పనికిరాని వస్తువులను ఉంచేలా చూసి, ఒకరోజు వాటిని వేటికవి విడివిడిగా చేయించా. ఆ చెత్త నుంచి తీసిన స్క్రాప్ను కూడా అమ్మమని చెప్పా. ఆ నెల తనకు అలా మరో నాలుగు వందల రూపాయలు అదనంగా వచ్చాయి. దీంతో పేపర్లతో కలిపి నెలకు ఏడెనిమిది వందల రూపాయలు వస్తున్నాయి. ఇక అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా దేనికది చెత్త డబ్బాలను ఉపయోగిస్తుంది. ప్రతీ ఇంట్లోనూ నెల–రెండు నెలలకోసారి ఏడెనిమిది వందల ఆదాయం మన చెత్త నుంచే వస్తుందంటే ఇదీ ఒక పొదుపే కదా! మనం వాడి పడేసే చెత్తను ఇంటి నుంచే తగ్గిస్తే డంప్యార్డ్లకు చేరే చెత్త తగ్గుతుంది. మనకు పర్యావరణం పట్ల ప్రేమ, అవగాహన, బాధ్యత, భయం కూడా ఉంటేనే ఈ జాగ్రత్త తీసుకోగలం. మా అమ్మాయికి మూడేళ్ల వయసు. తనచేత ఒక కుండీలో మొక్క నాటించి, రోజూ దానికి కొన్ని నీళ్లు పోయమని చెప్పాను. ఇప్పుడు నేను సాయంకాలం ఇంటికి వెళ్లాక ఆ మొక్కకు సంబంధించిన విషయాలన్నీ ఆనందంగా చెబుతుంటుంది. వాటిని శ్రద్ధగా వింటాను. ఆ మొక్క మా ఇద్దరి మధ్య ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచడం నాకు సంతోషంగా అనిపిస్తుంటుంది. పాత టైర్లతో అందమైన చైర్లు, సెంటర్ టేబుల్ పాల పాకెట్ల సేకరణ నుంచి ‘చదువుకునే రోజుల్లో మా అమ్మ చేస్తున్న పనులను అంతగా పట్టించుకునేదాన్ని కాదు గానీ గమనించేదాన్ని. అవి నేను పెద్దయ్యాక ఆలోచింపజేసేలా, ఆచరణలో పెట్టేలా దోహదమయ్యాయి. మా అమ్మ ఏ చిన్న డబ్బా దొరికినా అందులో కొద్దిగా మట్టి పోసి మొక్క పెట్టేస్తుంది.. ఇప్పటికీ ఇండోర్ప్లాంట్స్, రూఫ్గార్డెన్ పనులు అమ్మ చాలా ఇష్టంగా చేస్తుంటుంది. రోజూ పాల ప్యాకెట్లు డస్ట్ బిన్లో కాకుండా ఒక దగ్గర పోగుచేస్తుంది. అమ్మ నిరంతరం చేసే ఆ పనులను గమనించడం వల్ల నాకూ వేస్టేజ్పై దృష్టిపెట్టడం పెరిగిందనుకుంటాను.’ అతి పెద్ద చెత్త కొండ ‘జీహెచ్ఎంసిలో పోస్టు తీసుకోగానే సిటీలో ఉన్న డంప్యార్డ్లను చూడటానికి వెళ్లాను. జవహర్నగర్ డంప్యార్డ్ను చూడగానే ‘వామ్మో’ అనిపించింది. ఎటు చూసినా చెత్త.. పెద్ద కొండలా తయారైంది ఆ డంప్యార్డ్. నేను పుట్టింది ఖమ్మం. పెరిగిందంతా హైదరాబాద్లోనే. కానీ, ఎప్పుడూ అంత చెత్తను చూసింది లేదు. వాటన్నింటి గురించి తెలుసుకుంటే ఇళ్ల నుంచి వచ్చే చెత్తనే ఎక్కువ అని తేలింది. కొంచెం జాగ్రత్తపడితే చెత్త రావడాన్ని మనమే నిరోధించవచ్చు. ఉన్న చెత్తను తగ్గించవచ్చు అనుకున్నాను. అప్పుడే రీ సైక్లింగ్ విషయాల మీద మా టీమ్ అందరితో మాట్లాడాను. వేస్ట్ను తిరిగి వాడే సంస్థల గురించి తెలుసుకున్నాను. వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్తో షెడ్, రీయూజ్ ప్లాస్లిక్తో టైల్స్ డిజైన్ చేయించాం, ఉపయోగంలో లేని టైర్లతోనూ, ఆయిల్ డ్రమ్ములతో సిట్టింగ్ చైర్లు, టేబుళ్లు తయారు చేయించాం. ఇలా వాడి పడేసి ఇక పనికిరావనుకున్న వస్తువులన్నీ తిరిగి పనికి వచ్చేలా ఏమేం చేయచ్చో తెలుసుకుంటూ, వాటిని ఏర్పాటు చేస్తూ, అలా ఏర్పాటు చేస్తామన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నాం. ఆహారం వృధా కాకుండా అవసరమైన వారికి అందజేయచ్చు అని ఉద్దేశ్యంతో ఫీడ్ నీడ్ను ఏర్పాటు చేశాం. అర్బన్ ఫారెస్ట్ పార్క్లను రూపొందించే పనిలో ఉన్నాం. ఈ జాబ్లోకి రాకముందు అమెరికాలో పర్యావరణానికి సంబంధించిన కంపెనీలో వర్క్ చేశాను. ఒక రోజు ఆఫీసులో ఉన్నప్పుడు నా ఆలోచనలు, పనులు ఒక ఆర్గనైజేషన్ వరకే పరిమితం అయితే ఎలా అని ఆలోచించాను. ఒక పెద్ద గ్రూప్లో ఉంటే మన ఆలోచనా విధానం కూడా పెరుగుతుందని ఇటువైపుగా వచ్చాను. ఆ దిశగానే నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనుకుంటున్నాను.’– నిర్మలారెడ్డిఫొటోలు: సురేశ్కుమార్ -
ప్లాస్టిక్ చెత్తను పాతరేద్దాం..
‘ఇందుగలదందు లేదన్న సందేహంబు వలదు.. తరచి చూచిన.. ప్లాస్టిక్ ఎందెందు వెదకినా అందందే గలదు’ ఇదీ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ పరిస్థితి. మనిషికి ప్రియమైన శత్రువుగా మారిపోయిన ఈ ప్లాస్టిక్ను వదిలించుకునేందుకు ఇప్పుడిప్పుడే సీరియస్గా ప్రయత్నాలు మొదలయ్యాయి. మన ప్రధాని మోదీ సైతం తన ‘మన్కీ బాత్’లో ప్లాస్టిక్ చెత్తను వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే మనం ఏం చేయొచ్చు. ఇతర దేశాల్లో అమల్లో ఉన్న మంచి పద్ధతులేంటి..? సగం ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్ జర్మనీ, ఆస్ట్రియా, కొరియాతో పాటు బ్రిటన్లోని వేల్స్లో ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్ అత్యంత సమర్థంగా జరుగుతోంది. వాడి పడేసిన ప్లాస్టిక్లో కనీసం సగం మొత్తాన్ని మళ్లీ వాడుకునేలా చేస్తున్నారు. రీసైక్లింగ్ను ప్రోత్సహించేందుకు తగినన్ని ప్రోత్సాహకాలు ఇవ్వ డంతో పాటు.. నిధులు, మౌలిక సదు పాయాలు కల్పించడం ఇం దుకు కారణం. ప్లాస్టిక్ రీసైక్లింగ్కు సంబంధించి మున్సిపాలిటీలు, పంచాయతీలు సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించడంతో పాటు అమలు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ–వేస్ట్ పనిపడతారు.. వాడేసిన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల చెత్తను వదిలించుకునే విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన తొలిదేశంగా కొలంబియా నిలిచింది. రెండేళ్ల కిందట ప్రకటించిన ఈ విధానం నాలుగు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బాధ్యతాయుతంగా వాడటంపై వినియోగదారుల్లో అవగాహన కల్పించడం.. దిగుమతి చేసుకున్న లేదా దేశీయంగా ఉత్పత్తి చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను సక్రమంగా రీసైకిల్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం.. జాతీయ స్థాయిలో రీసైక్లింగ్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం.. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం చేస్తోంది. కొలంబియాలో ఏటా దాదాపు 2.5 లక్షల టన్నుల ఈ–వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. చెత్త సేకరణకు ఆరోగ్య బీమా.. ఇండోనేసియాలో ప్లాస్టిక్ చెత్తను సేకరించే వారికి ‘గార్బేజ్ క్లినికల్ ఇన్సూరెన్స్’కింద ఆరోగ్య సేవలు అందుతాయి. గమాన్ అల్బిసెయిద్ నేతృత్వంలోని ‘ఇండోనేసియా మెడికా’అనే కంపెనీ ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు 600 మంది ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రీసైకిల్ చేసేందుకు అనువైన పదార్థాలను సేకరించి తీసుకురావడం.. ప్రతిఫలంగా మలాంగ్, జకార్తాల్లోని మూడు ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు పొందడం ఈ పథకం ప్రత్యేకత. సింగపూర్ ఆదర్శం.. మొత్తం 40 లక్షల మంది జనాభా మాత్రమే ఉండే సింగపూర్.. చెత్త నిర్వహణ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న విషయం తెలి సిందే. మండించేందుకు అవకాశమున్న చెత్తను ఇంధన ఉత్పత్తికి వాడు కోవడం.. తడిచెత్తను క్రమపద్ధతిలో ల్యాండ్ఫిల్స్లో నింపి అక్కడ పచ్చదనాన్ని పెంచే ప్రయ త్నం చేయడం సింగపూర్ మోడల్లో చెప్పుకోదగ్గ విశేషాలు. భవన నిర్మాణ వ్యర్థాలను అత్యంత సమర్థంగా తగ్గించుకునే విషయంలో సింగపూర్ మిగిలిన దేశాల కంటే ఎంతో ముం దుంది. 2005 నాటికే ఈ చిన్న దేశం 94 శాతం భవన నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్ చేసేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. పాల ప్యాకెట్లలో వాడే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఒడిశాలో ఇటీవలే పాల ఏటీఎంలు మొదలయ్యాయి. క్యాన్లు, పాత్రలు తీసుకెళ్లి ఈ ఏటీఎంల నుంచి పాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. చెత్త సేకరించే వారు తెచ్చే ప్లాస్టిక్కు బదులు భోజనం పెట్టే పథకం ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ పట్టణంలో అమలవుతోంది. కిలో ప్లాస్టిక్ చెత్తకు ఒక పూట భోజనం అందిస్తున్నారు. అరకిలో చెత్తతో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పనిచేస్తున్న ఓ అటవీ అధికారి.. మొక్కల పెంపకానికి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో వెదురుబొంగులు వాడటం మొదలుపెట్టారు. బెంగళూరులోని 6 హోటళ్లలో ఆహారం పార్సిల్ చేసేందుకు ప్లాస్టిక్ వాడట్లేదు. వినియోగదారులే పాత్రలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేరళలోని కొంతమంది జాలర్లు వేట నుంచి తిరిగొచ్చేటప్పుడు చేపలతో పాటు సముద్రంలోని ప్లాస్టిక్ చెత్తను ఒడ్డుకు చేరుస్తున్నారు. తమిళనాడులో కొంతమంది ఔత్సాహికులు ప్లాస్టిక్ స్ట్రాలకు బదులు బొప్పాయి ఆకు కాడలను స్ట్రాలుగా వాడటం మొదలుపెట్టారు. జొన్న చొప్పతో ప్లాస్టిక్ను తయారు చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం కొత్త పద్ధతిని అభివృద్ధి చేస్తోంది. గొంగడి పురుగులు ప్లాస్టిక్ చెత్తను ఇష్టంగా తిని జీర్ణం చేసుకోగలవని పుణేలోని డాక్టర్ రాహుల్ మూడేళ్ల కిందటే గుర్తించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ను కొన్ని రకాల గొంగడి పురుగులు తినేయడంతో పాటు వాటి విసర్జితాలు ఎరువుగానూ ఉపయోగపడతాయని గుర్తించారు. -
మొబైల్ ‘రీసైక్లింగ్’ 12 శాతమే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ వాడుతున్న హైదరాబాద్ కస్టమర్లలో 12% మంది మాత్రమే స్వచ్ఛందంగా తమ డివైస్ను రీసైక్లింగ్కు ఇస్తున్నారు. కొత్త మోడల్ కొంటున్న సమయంలో 9% మంది పాత ఫోన్ను విక్రేతకు ఇస్తున్నారని గ్యాడ్జెట్ డిస్కవరీ సైట్ 91మొబైల్స్.కామ్ సర్వేలో తేలింది. ఈ–వేస్ట్ కంపెనీ సెరెబ్రా గ్రీన్, మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీతో కలిసి ఈ పోర్టల్ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 15,000 పైచిలుకు స్మార్ట్ఫోన్ వినియోగదార్లు ఇందు లో పాలుపంచుకున్నారు. దీని ప్రకారం... ఫోన్ రీసైక్లింగ్ వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాల గురించి 65% హైదరాబాద్ కస్టమర్లకు అవగాహన ఉంది. వీరిలో 20% మాత్రమే రీసైకిల్కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రీసైక్లింగ్ ప్రక్రియలో పాత మొబై ల్స్ నుంచి పనికి వచ్చే విడిభాగాలను, ప్లాస్టిక్ను వేరు చేసి, కావాల్సిన కంపెనీలకు సరఫరా చేస్తారు. అలాగే పనికిరాని వ్యర్థాలను పర్యావరణానికి హాని కాని రీతిలో, భద్రమైన పద్ధతిలో నిర్వీర్యం చేస్తారు. ఇంట్లో పనికిరాని ఫోన్లు.. వినియోగదార్ల ఇళ్లలో పనికిరాని ఫోన్లు ఓ మూలన పేరుకుపోతున్నాయి. అయిదుకుపైగా పనికిరాని ఫోన్లు తమ వద్ద ఉన్నాయని 12 శాతం మంది సర్వే సందర్భంగా తెలిపారు. అవసరానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో కనీసం ఒక ఫోన్ (కండీషన్లో ఉన్న) అట్టిపెట్టుకుంటున్నట్టు 55 శాతం మంది వెల్లడించారు. పనికిరాని పాత ఫోన్ల రీసైక్లింగ్ విషయాన్ని పట్టించుకోవటం లేదని 16 శాతం మంది తేల్చిచెప్పారు. అమ్మకం ద్వారా ఆశించిన విలువ రాకపోవడం వల్లే పాత ఫోన్ను భద్రంగా దాచుకున్నట్టు 20.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. 6.9 శాతం కస్టమర్లు రీసైకిల్కు వ్యతిరేకం. క్యాష్కు రీసైకిల్ చేసినవారు 58% మంది ఉన్నారు. డిస్కౌంట్ కూపన్లకు 17 శాతం, గిఫ్ట్ కార్డులకు 5.4 శాతం మంది తమ పాత ఫోన్లను ఎక్స్చేంజ్ ద్వారా రీసైకిల్ చేశారు. టాప్–5లో భారత్.. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి రోజురోజుకీ సమస్యగా మారుతున్నాయి. ఇందులో స్మార్ట్ఫోన్లు ప్రధానమైనవి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు జమవుతున్న దేశాల్లో భారత్ టాప్–5లో ఉంది. ఏటా 20 లక్షల టన్నుల ఈ–వేస్ట్ పోగవుతోంది. ఈ నేపథ్యంలో రీసైక్లింగ్ ఇక్కడ అత్యవసరమని 91మొబైల్స్.కామ్ కో–ఫౌండర్ నితిన్ మాథుర్ ఈ సందర్భంగా చెప్పారు. ‘రోజురోజుకూ కొత్త స్మార్ట్ఫోన్ మోడళ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. పనికిరాని స్మార్ట్ఫోన్లను పర్యావరణానికి హానికాని, భద్రమైన పద్ధతిలో ఏ విధంగా రీసైకిల్ చేయవచ్చో వినియోగదార్లకు వివరించాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. ఈ–వేస్ట్ వల్ల ఉత్పన్నమయ్యే పర్యావరణ సమస్యల గురించి 65 శాతం మంది హైదరాబాద్ స్మార్ట్ఫోన్ యూజర్లకు తెలుసు. అయినప్పటికీ వారు తమ మొబైల్ ఫోన్లను రీసైకిల్ చేయాలని భావించడం లేదు. ఈ–వేస్ట్ వల్ల తలెత్తే సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నాం. అలాగే అవసరం లేని ఉత్పత్తులను ఎక్కడ రీసైకిల్, విక్రయించాలో తెలియజేస్తున్నాం’ అని వివరించారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలే స్కూలు ఫీజు
ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు అస్సాం దిస్పూర్లోని అక్షర్ ఫోరం స్కూలు వినూత్న పథకాన్ని ప్రారంభించింది. తమ స్కూలు విద్యార్థులు ఫీజుకు బదులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి విద్యార్థి ప్రతీవారం కనీసం 20 పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు తెచ్చివ్వాలని, అలా తెస్తే వారికి ఉచితంగా చదువు చెప్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థులు తమ ఇళ్లు లేదా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తెచ్చి స్కూల్లో ఇస్తున్నారు. కిందటేడాది వరకు ఈ స్కూల్లో ఉచితంగానే చదువు చెప్పేవారు. అయితే, ఈ సంవత్సరం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు తెస్తేనే ఉచితంగా చదువు చెబుతామని స్కూలు యాజమాన్యం స్పష్టం చేసింది. పిల్లల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిలింగ్ చేసి ఉపయోగిస్తున్నట్టు స్కూలు యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల చేత ప్లాస్టిక్ సీసాల్లో ప్లాస్టిక్ కవర్లను నింపిస్తున్నారు. దాంతో అవి పర్యావరణానుకూల ఇటుకలుగా(ఎకో బ్రిక్స్) తయారవుతున్నాయి. ఇలా చేసినందుకు విద్యార్థులకు కొంత సొమ్ము కూడా చెల్లిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ ఇటుకలతో స్కూలు భవనాలు, మరుగుదొడ్లు, ఫుట్పాత్లు నిర్మిస్తున్నారు. -
చెత్తను చిత్తు చేశారు!
చెత్త.. ఎక్కడపడితే అక్కడ.. పల్లె, పట్టణం తేడా లేదు.. రోజూ వందల టన్నుల్లో.. గుట్టలు గుట్టలుగా.. ప్రజలకు, ప్రభుత్వానికి నిజంగానే ఇదో పెద్ద ‘చెత్త’ సమస్య! కానీ జబల్పూర్ మున్సిపాలిటీకి మాత్రం కాదు.. ఎందుకంటే.. వాళ్లు దీనికో ‘స్మార్ట్’ పరిష్కారాన్ని కనిపెట్టారు.. పైగా.. దాన్నుంచి విద్యుత్ను కూడా తయారుచేస్తూ.. ఆదాయాన్నీ ఆర్జిస్తున్నారు.. అదెలాగో తెలుసుకునే ముందు.. అసలు ఏమిటీ సమస్య.. మన దగ్గర పరిస్థితేంటి అన్నది ముందుగా చూద్దాం.. అసలు రోజూ వందల టన్నుల్లో పోగవుతున్న చెత్తను సేకరించడం ఒక ఎత్తయితే, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడం, యార్డులకు తరలించడం ప్రభుత్వాలకు సమస్యగా మారుతోంది. ఇళ్లలో డస్ట్బిన్లు చెత్తతో నిండిపోయినా మున్సిపాలిటీ వాళ్లు దాన్ని తీసుకెళ్లకపోవడం, రోడ్ల మీద చెత్తను సరిగా శుభ్రం చేయకపోవడంతో రోగాల ఇబ్బంది ఉండనే ఉంది. చాలాచోట్ల డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాలే దొరకడం లేదు. నగర శివారుల్లో వీటిని ఏర్పాటు చేస్తే పరిసరాల్లో ఉండే వారు అభ్యంతరం చెబుతున్నారు. డంపింగ్ యార్డుల్లో చెత్తను తగులబెట్టడంతో పర్యావరణానికీ ముప్పు వాటిల్లుతోంది. మన దగ్గర చూస్తే.. రోజూ 40 మెట్రిక్ టన్నుల చెత్త పోగయ్యే సంగారెడ్డి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డే లేదు. దీంతో చెత్తను రోడ్ల పక్కనే పారబోస్తున్నారు. నిజామాబాద్లో డంపింగ్ యార్డు ఉన్నా చెత్తను నామమాత్రంగా రీసైకిలింగ్ చేస్తున్నారు. దీంతో సమస్య అలాగే ఉంది. కరీంనగర్లో డంపింగ్ యార్డు నగరానికి 15 కి.మీ. దూరంలో ఉండటంతో మున్సిపల్ సిబ్బందికి రాకపోకలు ఇబ్బందిగా మారాయి. మహబూబ్నగర్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉంటే కేవలం 3 నగరాల్లోనే డంపింగ్ యార్డులున్నాయి. దీనికితోడు పారిశుద్ధ్య సిబ్బంది కొరత, శాఖల మధ్య సమన్వయలోపం చెత్త సమస్యను మరింత జటిలం చేస్తోంది. స్వచ్ఛ భారత్ కింద నగరాల్లో చెత్తను తొలగించడం కోసం ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. చెత్తను తడి, పొడిగా విభజించడం.. తడి చెత్తతో కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. అయితే ఇవి పూర్తి స్థాయిలో, శాస్త్రీయంగా జరగడం లేదు. చాలా చోట్ల మొత్తం చెత్తలో పది, ఇరవై శాతమే రీసైకిలింగ్ అవుతోంది. ఇదండీ పరిస్థితి.. ఇక జబల్పూర్కి వెళ్దాం.. అక్కడేం చేశారో చూద్దాం.. కార్మికులకు ఆర్ఎఫ్ఐడీలు.. మధ్యప్రదేశ్లో మూడో పెద్ద నగరం జబల్పూర్. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ మిషన్ కింద ఈ నగరం ఎంపికయింది. ఇక్కడ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్మికులకు ప్రభుత్వం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) రీడర్లను ఇచ్చింది. నగరంలో ఉన్న అన్ని ఇళ్లకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు అమర్చారు. పారిశుద్ధ్య సిబ్బంది ఒక ఇంట్లో డస్ట్బిన్ను ఖాళీ చేశాక తమ దగ్గరున్న ఆర్ఎఫ్ఐడీతో ఆ ఇంటిగోడపై అమర్చిన ట్యాగ్ను స్కాన్ చేస్తారు. వెంటనే ఆ సమాచారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతుంది. ఏ ఒక్క ఇంటి సమాచారం అందకపోయినా కమాండ్ సెంటర్ అధికారులు సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. దీంతో రోజూ ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ తప్పనిసరిగా జరుగుతుంది. చెత్త కుండీలకు సెన్సార్లు.. ఇళ్ల సంగతి ఇలా ఉంటే, నగరంలోని చాలా చోట్ల కమ్యూనిటీ డస్ట్బిన్ (రెండు మూడు వీధులకు కలిపి ఏర్పాటు చేసే చెత్త కుండీ)లు ఉన్నాయి. వీటన్నింటికీ సెన్సార్లు అమర్చారు. ఈ డస్ట్బిన్లు 90 శాతానికిపైగా నిండగానే ఆ సెన్సార్లు కమాండ్ సెం టర్కు, సంబంధిత అధికారులకు చెత్తకుండీని ఖాళీ చేయాల్సిందిగా సందేశం పంపుతాయి. వెంటనే అధికారులు దగ్గర్లో ఉన్న మున్సిపాలిటీ టిప్పర్కు సమాచారం అందజేస్తారు. దీంతో ఆ టిప్పర్ వచ్చి చెత్తను తీసుకెళుతుంది. వందల సం ఖ్యలో ఉన్న ఈ టిప్పర్లన్నింటినీ జీపీఎస్తో అనుసంధానించారు. దీంతో సమాచారం పంపడమే కాక వాటి రాకపోకలను కూడా నియంత్రించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి ఇలా... ఇలా సేకరించిన చెత్త నుంచి తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. దాన్ని నగర శివారులో 65 ఎకరాల్లో నెలకొల్పిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కు తరలిస్తారు. ఈ ప్లాంట్లో రోజుకు 600 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసి తద్వారా రోజూ 11.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆ విద్యుత్ 18 వేల ఇళ్లకు రోజువారీ వినియోగానికి సరిపోతుంది. దేశంలో ఇంత భారీస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నిర్వహణ చేపడుతున్న నగరాల్లో జబల్పూరే మొదటిది. చెత్త నిర్వహణకు అవసరమైన స్మార్ట్ పరిజ్ఞానాన్ని టెక్ మహీంద్ర సంస్థ అందిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఎస్సెల్ గ్రూప్ సంస్థ నెలకొల్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో దీనిని నిర్వహిస్తున్నారు. రోజూ ఉత్పత్తి చేసే విద్యుత్.. 11.5 మెగావాట్లు. -
కండోమ్ రీసైక్లింగ్ కేంద్రంపై దాడి
నాచారం: నాచారం దుర్గానగర్లో కండోమ్లను రీసైక్లింగ్ చేస్తున్న కేంద్రంపై స్థానికుల ఫిర్యాదు మేరకు శుక్రవారం నాచారం పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నజీర్ అనే వ్యక్తి నాచారం దుర్గానగర్లో అక్రమంగా కండోమ్స్ రీసైక్లింగ్ చేస్తున్నాడు. దీంతో కాలనీలో దుర్గందం వెదజల్లుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా కండోమ్ రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. -
అమెరికాలోనే తక్కువ!
జెనీవా: రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో యావత్ భారతదేశం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంటే యూరప్, పశ్చిమ దేశాలు అక్కడ పేరుకుపోయిన చెత్తను పునర్వినియోగంలోకి తెస్తూ క్లీన్ కంట్రీస్గా మారేందుకు శ్రమిస్తున్నాయి. పర్యావరణ హితం కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ యూనోమియా చెత్త నిర్వహణపై ఒక నివేదిక తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చెత్తను రీసైకిల్ చేస్తున్న దేశాల జాబితాను యూనోమియా ఇటీవల విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. చెత్త నిర్వహణ, పునర్వినియోగంలో జర్మనీ మొదటి స్థానంలో నిలవగా... ఆస్ట్రియా, దక్షిణ కొరియా, వేల్స్ దేశాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 52 నుంచి 56 శాతం చెత్తను రీసైకిల్ చేస్తూ దేశాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తమ దేశంలోని సగం చెత్తను రీసైకిల్ చేస్తూ స్విట్జర్లాండ్ అయిదో స్థానంలో ఉంది. స్థానిక ప్రభుత్వాలను, దేశ ప్రజలను చైతన్యం చేస్తూ ఆయా దేశాలు స్వచ్ఛత సాధిస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. ఒకే తరహా చెత్త సేకరణ విధానాలు అవలంభిస్తూ, ఈ దేశాలు చెత్త నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయిస్తున్నాయని స్పష్టం చేసింది. కాగా, జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన వేల్స్ దేశం మిగతా వాటి కంటే ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతోందనీ, కొన్ని నెలల్లోనే అది ప్రథమ స్థానానికి చేరుకోవచ్చని రిపోర్టు వెల్లడించింది. 2050 వరకు జీరో వేస్టేజి దేశంగా అవతరించడానికి వేల్స్ ప్రణాళికలు రచించుకుంది. మరోవైపు, ఇప్పటివరకు ప్రపంచంలోని చాలా దేశాల్లోని ఇండస్ట్రియల్ చెత్తను దిగుమతి చేసుకుని రీసైకిల్ చేసే చైనా తన పంథా మార్చుకుంది. 24 రకాల చెత్తను రీసైకిల్ చేయబోమని ప్రకటించింది. దాంతో చెత్త నిర్వహణపై చైనాపై ఆధారపడ్డ ఆయా దేశాలపై మరింత పనిభారం పడింది. కాగా, ఐరోపా దేశాలు 30 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తుండగా.. అమెరికా కేవలం 9 శాతమే రీసైకిల్ చేస్తోంది. -
ప్లాస్టిక్ అనే నేను.. మిమ్మల్ని ముంచేస్తున్నాను..
ప్లాస్టిక్.. మన అవసరం కోసం సృష్టించాం.. అవసరానికి వాడుకున్నాం.. తర్వాత తర్వాత అవసరాన్ని మించి వాడుకున్నాం.. దీంతో ఇప్పుడది మనల్ని వాడేసుకుంటోంది.. ఈ ప్రపంచంతో ఆడేసుకుంటోంది.. భూతమై భయపెడుతోంది.. పుడమి నిండా పరిచేసుకుని.. పెను విలయాన్ని సృష్టిస్తోంది.. జనంతోపాటు జలచరాలను కబళి స్తోంది.. ఏటా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల లక్షలాది జలచరాలు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. మీకో విషయం తెలుసా? ఒక ప్లాస్టిక్ బాటిల్ పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి(బయోడీగ్రేడ్) 450 ఏళ్ల సమయం పడుతుంది. దీనికి విరుగుడు ఏమిటి? వాడకం తగ్గించడం.. రీసైక్లింగ్ ప్రక్రియను పెంచడం.. 1980 వరకూ రీసైక్లింగ్ ఉండేది కాదు.. తర్వాత మొదలైంది. ప్రస్తుతం ఏటా ఉత్పత్తవుతున్న ప్లాస్టిక్(30 కోట్ల టన్నులు)లో 18% వరకూ రీసైక్లింగ్ అవుతోంది. అయితే.. అన్ని రకాల ప్లాస్టిక్లు రీసైకిల్ కావు.. కొన్ని సులువుగా అయితే.. మరికొన్నిటిని చేయడం కష్టం. ప్లాస్టిక్ బాటిళ్లు వంటివాటిని రీసైక్లింగ్ చేయడం ఈజీ.. స్ట్రాలు వంటివాటిని చేయడం కష్టం.. కొందరు నిపుణులైతే.. డ్రింక్స్ తాగడానికి స్ట్రాలను వాడొద్దని చెబుతున్నారు. దీని వల్ల ఎంతో కొంత పుడమికి మనం మేలు చేయవచ్చని చెబుతున్నారు. అసలు ప్లాస్టిక్లో రకాలు? వాటి రీసైక్లింగ్ తీరుపై లుక్కేస్తే.. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
కొత్త ప్లాస్టిక్తో నిరంతరం రీసైక్లింగ్!
ఈ రోజుల్లో ప్లాస్టిక్ తెచ్చే చిక్కుల గురించి తెలియందెవరికి? కాకపోతే ఇంకో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి తప్పనిసరిగా దాన్నే వాడుతున్నాం. ఇకపై ఈ సమస్య లేదు. ఎందుకంటే... కొలరాడో స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ప్లాస్టిక్ను తయారు చేశారు కాబట్టి. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీసైకిల్ చేసుకోగలగడం దీని ప్రత్యేకత! ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ను కొన్ని సార్లు మాత్రమే రీసైకిల్ చేసుకోవచ్చునన్నది తెలిసిందే. అంతేకాదు... అందుకోసం ప్రమాదకరమైన రసాయనాలను కూడా వాడాల్సి వస్తోంది. కొలరాడో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త రకం ప్లాస్టిక్ తేలికగా ఉండటంతోపాటు దృఢంగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నడంతోపాటు వేడిని కూడా సమర్థంగా తట్టుకోగలదు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ కొత్త ప్లాస్టిక్ ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ ప్లాస్టిక్ తయారీ కంటే తక్కువ ఖర్చు, కాలుష్యంతో దీన్ని తయారు చేసుకోగలగడం ఇంకో విశేషం. మళ్లీమళ్లీ రీసైకిల్చేసుకునే అవకాశం ఉండటం వల్ల కొత్త ప్లాస్టిక్ తయారీకి స్వస్తి చెప్పవచ్చునని అనుకుంటున్నారు. క్రమేపీ ఈ కొత్త ప్లాస్టిక్ అందరికీ అందుబాటులోకి వస్తే, సమస్యలు చాలావరకు తొలగిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ప్లాస్టిక్ రీసైక్లింగ్తో నీటి కాలుష్యానికి చెక్!
రోజువారీ వ్యవహారాల్లో ప్లాస్టిక్ ఎంత ఉపయోగకరమైందో మనకు తెలియంది కాదు. అదే సమయంలో దీంతో కాలుష్యమూ ఎక్కువే. ఇకపై మాత్రం ఈ పరిస్థితిని మార్చేస్తామంటున్నారు బ్రిస్టల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. భూమిని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్తో నీటిలోని కాలుష్యాన్ని తొలగించేందుకు వీరు ఓ వినూత్న టెక్నాలజీని అభివద్ధి చేశారు. వస్త్ర పరిశ్రమలో వాడే కృత్రిమ రంగులు కలిసి నీరు కాస్తా విషమవుతున్న విషయం తెలిసిందే. అయితే పాలిస్టైరీన్ అనే ప్లాస్టిక్తో తాము ఒక కొత్త పదార్థాన్ని తయారు చేశామని... ఇది కాస్తా నీటిలో కలిసిపోయిన నానోస్థాయిలోని కృత్రిమ రంగులనూ తొలగించగలదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ జూలియన్ ఎస్టోయి అంటున్నారు. పాలిస్టైరీన్ను సైక్లోహెక్సేన్తో కలిపి ఉష్ణోగ్రతలను ఆరు డిగ్రీల స్థాయికి తగ్గించడం ద్వారా కొత్త పదార్థం తయారీ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తరువాత సైక్లోహెక్సేన్ను తొలగిస్తే ప్లాస్టిక్ గణనీయంగా ఉబ్బిపోతోంది. ఈ దశలో దానిపై నానోస్థాయి పూత పూస్తే అది నీటిలోని కృత్రిమ రంగుల తాలూకు కణాలను ఆకర్శించి తనలో నిక్షిప్తం చేసుకుంటుందని జూలియన్ వివరించారు. మహా సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తను మరింత సమర్థంగా వాడుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని జూలియన్ అంచనా. -
32 ఏళ్ల కష్టార్జితం.. సెకన్లో దానం
వాషింగ్టన్: అమెరికాలోని జార్జియాకు చెందిన తండ్రి,కొడుకు కలిసి మూడు దశాబ్దాల పాటు శ్రమించారు. తాము సంపాదించిన డబ్బుతో ఏదో తమకు కావలసిన విలాసవంతమైన భవనమో, కారో లేక కావలసిన వసతిని సమకూర్చుకోలేదు. 32 ఏళ్లపాటు శ్రమించి కూడబెట్టిన డబ్బును నాలుగు లక్షల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 2.6 కోట్ల రూపాయలు) ఒక్క సెకన్లో దానం చేసి తమది విశాల హృదయం అని నిరూపించుకున్నారు అమెరికా తండ్రీకొడుకులు. జానీ జెన్నింగ్స్(86), బ్రెంట్ జెన్నింగ్స్(49) జార్జియాకు చెందిన వారు. సరిగ్గా 32 ఏళ్ల కిందట(1985లో) ఓ రోజు వీరిద్దరూ అనాథపిల్లల వసతి గృహానికి వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు చిన్నారులు వీరి వద్దకు వచ్చి మాకు తండ్రిగా ఎవరైనా ఉంటారా, మా బాగోగులు చూస్తారని అని జానీ, బ్రెంట్ను అడిగారు. దీంతో తండ్రీకొడుకుల హృదయం కరిగిపోయింది. వీరికోసం ఏదైనా చేయాలని భావించారు. ఇక అది మొదలుకుని తాము చేసే వృత్తి రీసైక్లింగ్ ద్వారా రోజు డబ్బు పోగుచేసేవారు. తమ ఖర్చులకు పోనూ మిగిలని నగదును అనాథల కోసం దానం చేయడానికి ఇద్దరూ చెమటోడ్చారు. ఈ క్రమంలో 9 మిలియన్ పౌండ్ల పేపర్ను వీరు రీసైకిల్ చేసి తమ ఖర్చులు పోనూ రూ.2.6 కోట్లు కూడబెట్టారు. ఈ సంపదనంతా స్థానిక చారిటీ జార్జియా బాప్తిస్ట్ చిల్డ్రన్స్ హోమ్ కు చెక్ రూపంలో విరాళం ఇచ్చేశారు. కేవలం ఒక్క సెకన్ల వ్యవధిలో అందజేసిన చెక్ ఎంతో మంది చిన్నారులలో సంతోషాన్ని నింపుతుందని, భవిష్యత్తులోనూ ఇలాగే చేయూత అందిస్తామని జానీ, బ్రెంట్ తెలిపారు. -
పడేసేవి కాదు.. పనికొచ్చేవే!
- పాత జీన్స్తో బంప్ బ్యాగులు రెడీ... - బంకమట్టే డిజైనర్ ఆభరణంగా మెరుస్తుంది - గాజు సీసాలు బెడ్ ల్యాంపులుగా ధగధగలాడతాయి - రీసైక్లింగ్తో సరికొత్త వస్తువులను సృష్టిస్తున్న నగరవాసులు సాక్షి, బెంగళూరు: సాధారణంగా జీన్స్ ప్యాంట్స్ బిగుతైపోతే మనం వాటిని పడేయడమో లేదంటే ఏ స్టీల్ సామాన్ల వాడికి ఇవ్వడమో చేస్తూ ఉంటాం. కానీ వాటిని కూడా అందమైన బ్యాగులుగా మార్చవచ్చనే విషయం మీకు తెలుసా! ఎందుకూ పనికిరావనుకునే గాజు సీసాలను ఎంచక్కా బెడ్ ల్యాంప్లుగా మార్చవచ్చని మీరెప్పుడైనా విన్నారా, అంతేకాదు బంకమట్టితో డిజైనర్ ఆభరణాలు, పేపర్తో బ్యాగులు ఇలా ఏ వస్తువునైనా రీసైక్లింగ్తో మరింత కొత్తగా మార్చవచ్చనే విషయాన్ని రుజువుచేస్తున్నారు నగరానికి చెందిన అనేక మంది ఔత్సాహికులు. అంతేకాదు ఇలా తయారుచేసిన వస్తువుల ద్వారా లభించిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాల కోసం వినియోగిస్తూ మన్ననలందుకుంటున్నారు. బీరు సీసాల మూతలు, బంకమట్టే డిజైనర్ జువెలరీ... నగరానికి చెందిన గృహిణి ముక్త ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినదే ‘ఆర్ట్సీ క్రాఫ్టీ క్రియేషన్స్’ సంస్థ. ఇంట్లోనే ఉంటూ ఎన్నో వస్తువులను రీసైక్లింగ్ చేస్తూ మళ్లీ వాటికి కొత్త రూపును ఇస్తున్నారు ముక్త. బీరు సీసాల మూతల నుండి అందమైన ఇయర్ రింగ్స్తో పాటు బంకమట్టితో నెక్లెస్లు, డిజైనర్ జువెలరీని తయారుచేస్తున్నారు. ఇవి కాక దుస్తులు కుట్టేటపుడు మిగిలిపోయిన చిన్న చిన్న క్లాత్ పీసెస్తోటి చిన్నారుల కోసం అందమైన హెయిర్ క్లిప్స్ను తయారుచేయడం, ప్యాకింగ్ కోసం వాడే అట్టముక్కలను గృహాలంకరణకు వీలైన వెల్కమ్ బోర్డ్స్గా మార్చడం ముక్త ప్రత్యేకత. నగరంలో ఎక్కడ హ్యాండీక్రాఫ్ట్ మేళా జరిగినా తను తయారుచేసిన సరికొత్త వస్తువులతో ప్రత్యక్షమౌతారు ముక్త. వీటన్నింటితో పాటు బంకమట్టితో తయారుచేసిన ప్లేట్స్పై చిన్నారుల చేతి, పాద ముద్రలను కూడా అచ్చు పోయించి మధురస్మృతులను తయారుచేయిస్తుంటారు. ఈ తరహా వస్తువుల అమ్మకం ద్వారా లభించిన మొత్తంలో కొంత భాగాన్ని అనాధ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు అందజేస్తుంటానని ముక్త తెలిపారు. పాత సీసాలు బెడ్ ల్యాంప్లుగా మారతాయి నగరంలో రీసైక్లింగ్ ఉత్పత్తుల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించిన సంస్థ మదర్ ఎర్త్. ఈ స్టోర్లో కనిపించే వస్తువులన్నీ రీసైక్లింగ్ విధానంలో తయారైనవే. అంతేకాకుండా ఎకోఫ్రెండ్లీ కూడా. పేపర్తో తయారుచేసిన బ్యాగులు మొదలుకొని పేపర్తో తయారైన గృహాలంకరణ వస్తువులు, మహిళలు వాడే పర్సులు, గడియారాలు కూడా పేపర్తోనే తయారవుతాయి. చాపలతో షూస్టాండ్లు, నారతో తయారుచేసిన ఫర్నీచర్ ఇవన్నీ ఈ స్టోర్ ప్రత్యేకత. ముఖ్యంగా పనికిరాని గాజు సీసాలు ఈ స్టోర్లో బెడ్ ల్యాంప్లుగా దర్శనమిస్తాయి. అంతేకాదు గాజు సీసాపై ప్రత్యేక కలర్ కోటింగ్లను వేసి, వాటిని ఫ్లవర్ వాజ్లుగా కూడా మార్చేస్తుంటారు. ఈ తరహా వస్తువుల తయారీనే ఎందుకు ఎంచుకున్నారని సంస్థ వ్యవస్థాపకులు ‘నీలం చిబ్బర్’ను ప్రశ్నిస్తే...‘ప్రస్తుతం ఏ వస్తువును తయారుచేయాలన్నా ఎన్నో రకాల రసాయనాలు వాడుతున్నారు. ఈ కారణంగా పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే వస్తువుల తయారీలో ఎకోఫ్రెండ్లీ విధానాన్ని ఎంచుకున్నాం. ఇక రీసైక్లింగ్ ద్వారా సరికొత్త వస్తువులను తయారుచేయడం వల్ల వాటి ధర తక్కువై, మధ్య తరగతి వారికి ఆ వస్తువులు అందుబాటులో ఉంటాయనేది నా అభిప్రాయం’ అని చెప్పారు. జీన్స్లతో బంప్ బ్యాగ్లు... సాధారణంగా మార్కెట్లో ఇప్పటి వరకు లెదర్, ఫోమ్, కాటన్ ఇలా తదితర వాటితో తయారైన బ్యాగులు దర్శనమిస్తున్నాయి. వాటన్నింటికి భిన్నంగా వచ్చిన బ్యాగ్లే బంప్ బ్యాగ్లు. ఈ తరహా బ్యాగ్ల తయారీకి శ్రీకారం చుట్టింది నగరానికి చెందిన ‘ఎ హండ్రెడ్ హ్యాండ్స్’ సంస్థ. వాడి పడేసిన జీన్స్ ప్యాంట్లను శుభ్రపరిచి, వాటితో బ్యాగ్లను తయారచేయడమే ఈ సంస్థ ప్రత్యేకత. ఇలా తయారుచేసిన బ్యాగ్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది. ఇందుకోసం ఈ సంస్థలో ఎంతో మంది విదేశీయులు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈ బంప్ బ్యాగ్స్ ధర రూ.250 నుండి ప్రారంభమౌతుందని సంస్థ ప్రతినిధి వెరీనా వెల్లడించారు. -
పేదల కోసం... పరిశుభ్రత కోసం...
రీసైక్లింగ్ గూంజ్, చింతన్... రెండూ వేర్వేరు సంస్థలు.వాడి పడేసిన దుస్తులను, వస్తువులను పునర్వినియోగంలోకి తెచ్చి పేదవాళ్లకు అందిస్తుంది గూంజ్. పరిసరాల పరిశుభ్రత కోసం చెత్తాచెదారాన్ని ఏరిపారేస్తుంటుంది చింతన్. న్యూఢిల్లీలోని ఈ రెండు సంస్థలకు ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘డచ్ బ్యాంక్ అర్బన్ ఏజ్ అవార్డ్-2014 లభించింది. ఈ సందర్భంగా గూంజ్, చింతన్ల పరిచయం. గూంజ్ ఢిల్లీ శివారు గ్రామం మదన్పూర్-ఖాదర్లోని ‘గూంజ్’ భవంతిలో ఒక వైపు గుట్టలుగా దుస్తులు, మరో వైపు ‘పిల్లలు’ ‘పెద్దలు’ ‘మగవాళ్లు’ ‘ఆడవాళ్లు’ ‘పెళ్లి బట్టలు’ ‘దుప్పట్లు’...ఇలా రకరకాల షో కేసులు కనబడతాయి. అక్కడ పనిచేసే మహిళలు దుస్తుల గుట్ట నుంచి ఒక్కొక్కటీ ఓపికగా తీస్తూ సంబంధిత షోకేసులో సర్దుతుంటారు. ఆ తరువాత వీటిని అవసరమైన పేదలకు అందిస్తుంటారు. 1999లో ఏర్పడిన ‘గూంజ్’ స్వచ్ఛందసంస్థ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ‘ఏదీ వృథా కాదు...ప్రతిదీ ప్రయోజనకరమే’ అనేది ‘గూంజ్’ నినాదం. ‘‘ప్రతి సంవత్సరం ఇంటింటికీ వెళ్లి...‘మీ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక్క వస్తువు ఇచ్చినా సంతోషమే’ అని అడుగుతాం. మా ఉద్దేశం ఏమిటో తెలుసుకొని వారు ఉత్సాహంగా స్పందిస్తారు’’ అంటారు ‘గూంజ్’ సహ వ్యవస్థాపకురాలైన మీనాక్షీగుప్తా. కేవలం గృహాలకు మాత్రమే కాకుండా కాలేజీలు, కంపెనీలు, పాఠశాలలకు కూడా వెళుతుంది ‘గూంజ్’. అలాగే కాటన్ దుస్తుల నుంచి శానిటరీ నాప్కిన్లను తయారుచేసి ప్యాక్ల రూపంలో మహిళలకు అందిస్తుంది ‘గూంజ్’. ప్రతి ప్యాక్లో అయిదు న్యాప్కిన్లు ఉంటాయి. ‘మై పాడ్’ పేరుతో కలర్ఫుల్ క్లాత్బ్యాగ్ ఇవ్వడమే కాకుండా... నాప్కిన్లను ఎలా శుభ్రపరచాలి, ఎంత కాలం వరకు ఉపయోగించాలి... మొదలైన విషయాలు కూడా తెలియజేస్తారు. ప్రస్తుత చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ‘‘ ఇప్పుడు మా ముందు ఒక పెద్ద పని ఉంది. వీలైనంత ఎక్కువగా స్వెటర్లను సేకరించాలి’’ అంటున్నారామె. ఇలా కాలానికి, పరిస్థితులకు తగినట్లుగా ఎప్పటికప్పుడు పేద శ్రామికులకు అవసరమైన వస్తువులు, దుస్తులు అందిస్తూ ‘భేష్’ అనిపించుకుంటోంది ‘గూంజ్’. చింతన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆ పరిసర ప్రాంతాలలో ఒక దృశ్యం తరచుగా ఎదురవుతుంటుంది. మెడలో గుర్తింపు కార్డుతో, గ్రీన్ కలర్ టీషర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకున్న కొందరు యువకులు చెత్తను ఏరుతూ తెల్లటి కవర్లలో నింపుతూ కనిపిస్తారు. చాలామంది అనుకున్నట్లు ఆ యువకులు కొత్తగా నియమితులైన రైల్వే ఉద్యోగులు కారు. కాంట్రాక్టు ఉద్యోగులు అంతకంటే కాదు... ‘చింతన్ మెటీరియల్ ఫెసిలిటీ’లో సభ్యులు. ‘చింతన్’ అనేది పర్యావరణ సంబంధిత పరిశోధన సంస్థ. ‘చింతన్’లో పని చేసేవారిని ‘సఫాయి సేన’ అని కూడా పిలుస్తారు. పగటి పూట రోజుకు మూడుసార్లు, రాత్రిపూట రెండుసార్లు చెత్తను ఏరివేసి ఆర్గానిక్, నాన్-ఆర్గానిక్లుగా వాటిని విభజిస్తారు. ఇలా సేకరించిన చెత్తను ఘజియాబాద్, ముజఫర్నగర్లలో ఉన్న ‘చింతన్’ రీసైకిలింగ్ ఫ్యాక్టరీకి తరలిస్తారు. ‘సఫాయి సేన’ రైల్వేస్టేషన్లో రోజుకు మూడు నుంచి నాలుగు టన్నుల చెత్తను క్లియర్ చేస్తుంది. రోజుకు 5000కు తక్కువ కాకుండా ఖాళీ మినరల్ బాటిళ్లను సేకరిస్తుంది. ‘చింతన్’కు సంబంధించిన షెడ్లలో ఎటు వైపు చూసినా మినరల్ వాటర్ బాటిళ్లు కొండలుగా కనిపిస్తాయి. అన్నీ బాటిళ్లే అయినప్పటికీ... హార్డ్ ప్లాస్టిక్ బాటిళ్లను వేరు చేస్తారు. మిగిలినదంతా ఒక ఎత్తు. ఈ ఖాళీ మినరల్ బాటిళ్లను సేకరించడం ఒక ఎత్తు. ‘చింతన్’ ప్రాజెక్ట్ టీంలోని 115 మంది సభ్యులకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్, దాని పరిసర ప్రాంతాలలో చెత్త ఏరుకునే పిల్లలు, యువకుల నుంచి తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. కొన్నిసార్లు అయితే ‘చింతన్’ సభ్యులపై దాడులు కూడా జరిగాయి. ‘సఫాయి సేన’ సభ్యులు రైల్వేస్టేషన్ సమీపంలోనే నివసిస్తారు. వీరికి నెలకు *8,500 గౌరవ వేతనాన్ని అందిస్తారు. ‘‘ప్రతి నెల రైల్వేశాఖకు పది లక్షల రూపాయలు ఆదా చేస్తున్నాం’’ అని చెబుతున్నారు జయప్రకాశ్ చౌధురి. చౌధురి ‘సఫాయి సేన’కు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ‘‘శ్రమైక జీవన సౌందర్యానికి మేము చేస్తున్న పని ఒక సజీవమైన ఉదాహరణ. స్వచ్ఛభారత్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారుగానీ ఆ పని మేము ఎప్పుటి నుంచో చేస్తున్నాం’’ అంటున్నారు చౌధురి. -
సన్నబియ్యం పేరుతో ఘరానా మోసం
గుడివాడ : ‘మేం నాగాయలంక, అవనిగడ్డకు చెందిన రైతులం’ అంటూ మీవద్దకు వస్తున్నారా..? మోపెడ్లపై బియ్యం మూటలతో వచ్చి తక్కువ ధరకు సన్నబియ్యం ఇచ్చేస్తున్నామని చెప్పారా..? వారి మాటాలు నమ్మి ఆ బియ్యం కొన్నారంటే మోసపోయినట్లే.. జిల్లాలోని కొందరు వ్యాపారులు ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇలా అంటగట్టేస్తున్నారు. తీరా ఆ బియ్యం వండి చూస్తే రేషన్ సరుకని తేలి లబోదిబోమనాల్సిందే. గత వారం రోజులుగా గుడివాడ ప్రాంతంలో ఇటువంటి వారు నకిలీ బియ్యాన్ని అమ్మటంతో అనేక మంది మోసపోయారు. కంకిపాడు ప్రాంతంలో ఆ వ్యక్తుల్ని గుర్తించిన సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంకిపాడు పోలీసులు కూపీ లాగకుండానే పెట్టీ కేసు నమోదు చేసి వదిలేశారు. గుడివాడలో వీరి బారినపడి మోసపోయిన వారు ‘సాక్షి’కి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి... విత్తనాలకు డబ్బులేక దాచుకున్నవి అమ్ముకుంటున్నాం... జిల్లాలోని నాగాయలంక, అవనిగడ్డ ప్రాంతాల్లో పండే బీపీటీ సన్నబియ్యం బాగుంటాయని పేరుంది. ఈ బియ్యానికి మంచి గిరాకీ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఘరానా మోసగాళ్లు ఆప్రాంత రైతులమని చెప్పి సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని నిలువునా ముంచేస్తున్నారు. గుడివాడలోని శ్రీరామ్పురంలోకి నాలుగు రోజుల కిందట ఇద్దరు వ్యక్తులు మోపెడ్లపై బియ్యం మూటలతో వచ్చారు. తాము అవనిగడ్డ ప్రాంతానికి చెందిన రైతులమని, విత్తనాలకు డబ్బులేక, తినటానికి దాచుకున్న బియ్యాన్ని అమ్ముకుంటున్నామని తెలిపారు. సన్నబియ్యం తక్కువ రేటుకు అందిస్తున్నామని చెప్పారు. శాంపిల్గా వారి వద్ద ఉన్న ఒక సంచిలో ఉంచిన మంచి బియ్యాన్ని చూపించారు. ఇవన్నీ ఒకే పొలంలోవని చెప్పారు. బహిరంగ మార్కెట్లో 25 కేజీల బస్తా ధర రూ.1,300 ఉందని, రూ.900కే అమ్ముకుంటున్నామని దీనంగా చెప్పారు. ఇళ్లవద్ద ఉండే మధ్యతరగతి మహిళలు వీరి మాటలు నమ్మి, తక్కువ ధరకు బియ్యం వస్తున్నాయని కొన్నారు. తీరా వండిన తరువాత అవి రేషన్బియ్యం అని తేలింది. ఈనెల 13న సత్యనారాయణపురంలో కూడా ఇదే తరహాలో బియ్యం అమ్మారు. ఇలా గుడివాడలోనూ, పరిసరాల్లోని పల్లెల్లో మధ్యతరగతి వర్గాలు ఉండే ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిసింది. మినీ వ్యాన్లో తీసుకొచ్చి.. మోపెడ్లపై అమ్ముతూ.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్చేసి అమ్ముతున్నట్లు సమాచారం. నలుగురైదుగురు మోపెడ్లతో వస్తారు. వీరితోపాటు బియ్యం బస్తాలు మినీ వ్యాన్లో వస్తాయి. వ్యాన్ను గ్రామం చివర్లో ఉంచి బస్తాలను మోపెడ్లపై ఇళ్లవద్దకు తీసుకెళతారు. అమ్మకం పూర్తి కాగానే ఆ ప్రాంతం నుంచి మాయమవుతారు. ఇలా జిల్లాలో కొందరు రేషన్, ముతక బియ్యాన్ని రీసైక్లింగ్చేసి అమాయకులకు అంటగట్టి మోసం చేస్తున్నట్లు తెలిసింది. పట్టిస్తే పెట్టీ కేసు పెట్టారు... గుడివాడలో పలువురిని మోసం చేసిన వారిలో ఇద్దరు కంకిపాడు మండలం కోమటిగుంట లాకుల సమీపంలో మోపెడ్పై బియ్యం పెట్టుకుని ప్రధాన రహదారిపై వెళ్లే వారికి అమ్ముతున్నారు. వీరి మోసానికి బలైన గుడివాడ వాసి వీరిని గుర్తించి కంకిపాడు పోలీసులకు ఉప్పందించారు. వారు వెంటనే స్పందించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వీరు కంకిపాడు మండలం కోలవెన్ను శివారు మాదాసువారి పాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, సూరిబాబుగా గుర్తించారు. వారి వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పెట్టీ కేసు నమోదు చేశారు. వీరిని పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉంటే నకిలీ బియ్యం ముఠా గుట్టు రట్టయ్యేదని పలువురు చెబుతున్నారు. కాగా గుడివాడలో వీరి మోసానికి బలైన వ్యక్తి కంకిపాడు పోలీసు స్టేషన్లో ఉన్న వారివద్దకు వెళ్లారు. నకిలీ బియ్యం అంటగట్టి తీసుకున్న రూ.3,500ను నిందితులు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి అమ్మే ముఠా గుట్టు రట్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి వ్యాపారుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
అక్రమాలు ఆగలె!
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో బియ్యం అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. డీలర్లు, మిల్లర్ల మాయజాలంలతో రీసైక్లింగ్ రూపంలో దారి మళ్లుతోంది. దీనిని అరికట్టాల్సిన అధికారులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జూన్, జూలై నెలలో చేసిన నామమాత్రపు దాడుల్లో దొరికిన రేషన్ సరకుల విలువ రూ.36,39 లక్షల్లో ఉంది. పూర్తి స్థాయిలో దాడులు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అయినా అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. కింది స్థాయి అధికారులపై జిల్లా అధికారుల అజమాయిషీ లేక పోవడమే బియ్యం అక్రమ దందాకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. అక్రమార్జనకు ఇదే నిదర్శనం రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం తెల్లరేషన్కార్డుపై రూపాయికి పంపిణీ చేస్తోంది. డీలర్లు, ప్రజల నుంచి చిరువ్యాపారులు రేషన్ బియాన్ని రూ.8 నుంచి రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. దీనిని కొద్ది మొత్తం రేటు పెంచి మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. మిల్లులకు తరలిన బియ్యాన్ని రీసైక్లింగ్ ద్వారా సన్నగా మార్చి, ఇతర రకాల్లో కలిపి బహిరంగ మార్కెట్లకు తరలిస్తున్నారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలో వైరా కేంద్రంగా బియ్యం రీ సైక్లింగ్ అక్రమ వ్యాపారం సాగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయినా అధికారులు మిల్లర్లపై దాడులు నిర్వహించిన దాఖలాలు లేవు. బినామీల జోరు రేషన్ వ్యవస్థలో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లలో సగానికిపైగా బినామీలే ఉన్నట్లు సాక్షాత్తు సివిల్ సప్లై అధికారులు చెబతున్నారు. రాజకీయ పలుకుబడితో అధిక సంఖ్యలో బినామీల గుప్పిట్లో షాపులు నడుస్తుండడంతో అధికారులు దాడులు చేయడం లేదనేది బహిరంగ రహస్యం. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ వ్యవస్థపై దృష్టి సారించి అసలు, న కిలీల జాబితాను తేల్చితేనే పౌరసరఫరాల వ్యవస్థ గాడిలో పడే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో యంత్రాంగం నిత్యావసర సరకులపై నిత్యం నిఘా ఉంచాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెలు ్లవెత్తుతున్నాయి. ప్రతినెలా జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు నామమాత్రపు డాడులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. గడిచిన రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా చేసిన దాడుల్లో 838.63 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు చెబుతున్నారు. అదే పూర్తిస్థాయిలో నిఘాను పెంచి షాపులు, మిల్లర్లపై దాడులు చేస్తే మరింత ఫలితం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. జూన్లో పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో 57 కేసులు నమోదు చేశారు. దాడుల్లో రేషన్ బియ్యం 460 క్వింటాళ్లు, కందిపప్పు 3 క్వింటాళ్లు, కిరోసిన్ 1,730 లీటర్లు, 27 గ్యాస్ సిలిండర్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ. 12,06,173గా గుర్తించారు. అలాగే జూలైలో 47 కేసులు నమోదు కాగా బియ్యం 378.63 క్వింటాళ్లు, 2.770 లీటర్ల కిరోసిన్, 376 కేజీల కందిపప్పు, 5 క్వింటాళ్ల పంచదార పట్టుబడింది. కానరాని విజిలెన్స్ దాడులు జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో అక్రమ బియ్యం, కందిపప్పు నిల్వలు ఉన్నప్పటికీ జిల్లా అధికారులు దాడులు నిర్వహించకపోవడం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లుల్లో అక్రమ నిల్వలపై గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి వేల క్వింటాళ్ల నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్న సంఘటనలు అనేక ఉన్నాయి. అయితే ఇటీవల మిల్లర్లపై దాడులు నిర్వహించేందుకు విజిలెన్స్ అధికారులు సాహసించడంలేదనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్రమ నిల్వలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
గుట్టుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్
కీసర: రేషన్ బియ్యం రీసైక్లింగ్ గుట్టును అధికారులు రట్టు చేశారు. ఓ రైస్మిల్లుపై దాడి చేసి 650 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండల పరిధిలోని అహ్మద్గూడలో శుక్రవారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం నివాసి చంద్రమౌళి నిరుపేదలకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని కొన్నేళ్లుగా గ్రామాల నుంచి దళారుల ద్వారా సేకరిస్తున్నాడు. కీసర మండల పరిధిలోని అహ్మద్గూడలో ఉన్న ఓ రైస్మిల్లులో గుట్టుగా రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యాన్ని గురువారం లారీలో బహిరంగ మార్కెట్కు తరలించేందుకు సిద్ధమవుతుండగా విశ్వసనీయ సమాచారంతో రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. రైస్మిల్లులో నిల్వ ఉంచిన బియ్యం, మార్కెట్కు తరలించేందుకు లారీలో ఉన్న బియ్యంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్జోన్ సివిల్ సప్లై అధికారి సురేష్ విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిమిత్తం బియ్యాన్ని ల్యాబ్ పంపినట్లు తెలిపారు. రైస్మిల్లును సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కీసర తహసీల్దార్ రవీందర్రెడ్డి తెలిపారు. -
‘రూపాయి’తో కోటి!
రూపాయికే కిలో బియ్యం ఎంతోమంది పేదోళ్ల కడుపులు నింపుతోంది. కానీ.. అదే బియ్యం పక్కదారి పడితే.. కొంతమంది గద్దలకు కోట్లు సంపాదించి పెడుతోంది. ఆ బియ్యం పేదోళ్లకు చేరితే న్యాయం.. ‘పెద్దోళ్ల’ చేతుల్లో పడితే అక్రమం. జిల్లాలో చాలా వరకు అక్రమం.. అన్యాయమే జరుగుతోంది. రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలో కొందరు రైస్మిల్లర్లు రేషన్దుకాణాల ద్వారా బియ్యాన్ని కొనుగోలు చేసి.. రైస్మిల్లుల్లోనే రీ సైక్లింగ్ చేసి.. సంచులను మార్చేసి ఎఫ్సీఐకి లెవీ రూపంలో తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలకూ చేరవేస్తున్నారు. రూపాయికి కిలో బియ్యాన్ని రూ. 25కు అమ్ముతూ కోట్లు సంపాది స్తున్నారు. ఇందుకు అర్సపల్లి రైస్మిల్లులో రూ.28లక్షల విలువ గల రేషన్ బియ్యం పట్టుబడటమే ఉదాహరణ. వీరికి అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కిలో బియ్యం ధర బహిరంగ మార్కెట్లో రూ.32ల నుంచి రూ.40లకు పైగా ధర పలుకుతోంది. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం సరఫరా చేస్తుంది. మార్కెట్లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.25పైనే పలుకుతోంది. రేషన్ బియ్యం సరఫరాను అడ్డుకోవాల్సిన అధికార వ్యవస్థ చేతులెత్తేయడం అక్రమార్కులకు వరంలా మారింది. రూపాయికి సరఫరా చేసే కిలో బియ్యంతో కోట్లు సంపాదిస్తున్నారు. ఈ అక్రమ దందా జిల్లా అధికారులు సూత్రధారులుగా.. దళారు లు, మిల్లర్లు పాత్రధారులుగా నడుస్తున్నట్లు ఆరోపణలూ వస్తున్నాయి. ప్రతినెలా జిల్లాకు కనీసం 10,720.944 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కేటాయిస్తారు. ఒక్కోసారి బియ్యం కోటా పెరుగుతుంది. జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా 7,67,960 కార్డులకు బియ్యాన్ని సరఫరా చేస్తారు. అయితే ఇదివరకే సరఫరా అవుతున్న రేషన్బియ్యంలో నాలుగో వంతు ‘నల్లబజారు’కు తరలుతుందన్న ఆరోపణలున్నాయి. బ్లాక్మార్కెట్కు తరలిస్తే లాభాలు భారీ స్థాయిలో వస్తుండటంతో అక్రమాలు పెరిగే ప్రమాదం ఉంది. తాజాగా శనివారం అర్సపల్లిలోని రైస్మిల్ గోదాముల్లో సుమారు రూ.28 లక్షల విలువ చేసే రేషన్ బియ్యం నిల్వ చేసి.. రీసైక్లింగ్ చేస్తున్న వ్యవహారం బట్టబయలైంది. దీంతో వ్యాపారులు, రైసుమిల్లర్ల చీకటి బాగోతం బయటపడింది. ఇలా జిల్లావ్యాప్తంగా అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలున్నా అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి. ‘బియ్యం’లో అందరికీ వాటాలు..! రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న బాగోతంలో అందరికీ వాటాలు అందుతున్నాయన్న ప్రచారం ఉంది. పౌరసరఫరాల శాఖలోని ‘నిఘా’ అధికారులు కొందరికీ ఇది ‘మామూలే’నన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా నిత్యవసర వస్తువులు నల్లబజారుకు తరలుతున్నాయని బహిరంగంగా చర్చ జరుగుతున్నా సదరు అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిలో బియ్యం రెండు రూపాయలున్న తరుణంలో నాలుగో వంతు నల్లబజారుకు తరలించిన వ్యాపారులకు ఇప్పుడు కిలోపై ఇంకో రూపాయి అదనంగా లభిస్తుంది. సాధారణంగా ప్రభుత్వం లబ్ధిదారుడికి రూపాయికి కిలో బియ్యం ఇస్తుండగా.. లబ్ధిదారుడి పేరుతో స్థానికంగా ఉండే వ్యాపారులు రూ.7 నుంచి రూ.9 కిలో చొప్పున కొంటున్నారు. వ్యాపారులు మధ్యస్థాయి టోకు వ్యాపారికి కిలో రూ.12కు విక్రయిస్తుండగా, మధ్యస్థాయి వ్యాపారి సిండికేట్కు రూ.15లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అక్కడ మిల్లర్లు, దళారులు ప్రవేశించి రీమిల్లింగ్, రీ సైక్లింగ్ ప్రక్రియ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)కి పంపిస్తుండటం గమనార్హం. భూమి గుండ్రగా ఉందన్న రీతిలో సాగుతున్న ఈ అక్రమ దందా ద్వారా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో.. వివిధ మార్గాల ద్వారా మళ్లీ అక్కడికే వెళ్తున్నాయి. కానీ ఏడాదిలో కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. రే షన్ బియ్యానికి ‘లెవీ’ రంగు జిల్లావ్యాప్తంగా చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రూపాయికి కిలో బియ్యాన్ని బ్లాక్మార్కెట్కు తరలించేందుకు వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. 16 మండల స్థాయి నిల్వ కేంద్రాల(ఎంఎల్ఎస్ పాయింట్లు) ద్వారా 7,67,960 కార్డుల లబ్ధిదారులకు సరఫరా చేసేందకు రేషన్ దుకాణాలకు బియ్యం తరలిస్తారు. బాగా సాన్నిహిత్యం ఉన్న గోదాం ఇన్చార్జి ఉంటే.. గోదాముల స్థాయిలోనే బియ్యం చేతులు మారుతాయి. లేదంటే రేషన్ బియ్యానికి సంబంధించి గోనెసంచులు మార్చడం, పాలిష్ పట్టి తరలిస్తున్నారని తెలిసింది. గోదాముల నుంచి రేషన్ దుకాణానికి తరలించకుండా బియ్యాన్ని అక్రమ వ్యాపారులు ఏజెంట్ల ద్వారా టోకున విక్రయిస్తున్నట్లు తెలిసింది. నెలవారీగా వచ్చే బియ్యం కోటా నుంచి కొందరు డీలర్లు సిండికేట్గా ఏర్పడి గోదాము నుంచే నేరుగా లారీ లోడు ద్వారా సమీపంలోని రైస్మిల్లులకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసిన రైస్మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి లెవీ రూపంలో పంపిస్తుండటం విశేషం. అంతేకాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాలలో సేకరించిన కొందరు దళారులు రేషన్ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించేందుకు మూమూళ్ల ముట్టజెప్తూ సాలూర, మద్నూరు తదితర చెక్పోస్టుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పేదోడికి చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా ప్రత్యేక నిఘా కమిటీలు ఏం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
బామ్మ మాటా బంగారు బాట
డబ్బు సంపాదించడమనేది కష్టం కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న ఖర్చులు, మారిపోతున్న జీవన విధానాల కారణంగా సంపాదించిన డబ్బును, సంపదను జాగ్రత్తగా కాపాడుకోవడం మాత్రం కష్టమే. ఇందుకోసం రకరకాల ప్లానింగ్లు వేస్తాం .. వాళ్లనీ, వీళ్లనీ సలహాలు అడుగుతుంటాం. వాళ్లూ, వీళ్లూ చెప్పినవి అమలు చేయడానికి ప్రయత్నించి, వర్కవుట్ కాక.. చేతులెత్తేసి..ఇహ ఇంతే అని సరిపెట్టేసుకుంటాం. అయితే, ఈ క్రమంలో వాళ్లూ.. వీళ్లూ కాకుండా .. మన బామ్మలు, తాతయ్యలు చెప్పిన, పాటించిన భేషైన ఆర్థిక సూత్రాలను మాత్రం మనం లెక్క చేయం. వాళ్లు చెప్పేదేముంది.. అంతా పాతచింతకాయ పచ్చడి లెక్కలు, పెరటి వైద్యం పనికి రాదంటూ కొట్టి పారేస్తుంటాం. కొన్ని విషయాల వరకూ ఇదీ ఓకే అనుకున్నా, ముఖ్యమైన ఆర్థిక అంశాల్లో బామ్మలు, తాతయ్యలు పాటించిన సూత్రాలు అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఎవర్గ్రీనే. వాళ్లకి పని చేస్తాయి.. వీళ్లకు పనిచేయవంటూ లేకుండా.. అందరికీ వర్కవుట్ అయ్యేవే. అలాంటి వాటిల్లో కొన్నింటి సమాహారమే ఈ కథనం. ఆదాయాన్ని బట్టే బడ్జెట్... ఇది చెప్పడం సులువే కానీ పాటించడమే చాలా కష్టంగా ఉంటుంది. అయితే, కొంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇది సాధ్యమే. మనకి ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఖర్చు చేస్తున్నాము.. ఇందులో అచ్చమైన అవసరాలేంటి.. పక్కన పెట్టినా చల్తా హై లాంటి లైఫ్ స్టయిల్ ఖర్చులేమిటి లాంటివి లెక్క వేసుకుని, ఒక బడ్జెట్ తయారు చేసుకుని, దానికి కట్టుబడి ఉండగలిగితే చాలు. ఒకవేళ అదనంగా ఆదాయం వచ్చినా, దాన్ని బడ్జెట్లో కలపకుండా భవిష్యత్ అవసరాల కోసం పక్కన పెట్టేయడం అలవర్చుకోవడం మంచిది. ఇంటి ఖర్చులకు పది రూపాయలే ఉన్నా .. బామ్మలు తమ కాలంలో గంపెడు సంసారాలను గుట్టు చప్పుడు కాకుండా నెట్టుకురాగలిగారంటే కొండొకచో ఇలాంటి ప్లానింగ్ వల్లే. ఫుల్లుగా వాడకం.. ఇది కొంటే అది ఫ్రీ అని.. అది కొంటే మరొకటి ఫ్రీ అని.. అరవై రూపాయలది అర్ధ రూపాయికొస్తోందని.. అవసరమైనవి, అనవసరమైనవి అడ్డదిడ్డంగా కొనిపారేస్తుంటాం. వాటిని కనీసం ఒక్కసారైనా వాడకుండానే మళ్లీ కొత్తవి కొనడానికి బైల్దేరుతుంటాం. దీనివల్ల అనవసరమైనవి ఇల్లంతా పేరుకుపోవడం, పర్సుకు చిల్లుపడటం తప్ప ప్రయోజనం లేదు. అదే బామ్మగారైతే మాత్రం కొన్నదాన్ని పూర్తిగా గిట్టుబాటు చేసేంత వరకూ మరొకటి కొనడానికి ఒప్పుకోదు. ఫలితంగా దుబారాను తగ్గిస్తుంది. పేస్టులు.. షాంపూలు మొదలుకుని మొబైల్ ఫోన్ల దాకా సేమ్ టు సేమ్. రోజుకో స్మార్ట్ఫోన్ వస్తోంది కదాని కొనేయనక్కర్లేదు. మన అవసరానికి అనుగుణంగా కొనుక్కున్నదాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించేసిన తర్వాతే కొత్త వాటివైపు చూడటం ఉత్తమం. రీసైక్లింగ్.. పర్యావరణాన్ని కాపాడేయాలనే తాపత్రయంతో రీసైకిల్డ్ బ్యాగులు, కవర్లు వంటివి కాస్త ఖర్చు ఎక్కువైనా అప్పుడప్పుడు కొనే స్తుంటాం. నలుగురికీ గొప్పగా చెప్పుకుంటాం. అదే సూత్రాన్ని మన ఇంట్లో పాటించాలంటే మాత్రం నామోషీ అడ్డం వస్తుంటుంది. నిజానికి బామ్మలు ఇంట్లో పాత చీరల్లాంటివాటితో బొంతలు వగైరాలు తయారు చేసినా.. చద్దన్నాన్ని పొద్దున్న రిపేరు చేసి వడ్డించినా.. ఏదీ వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే. లైఫ్స్టయిల్ మారిపోయిన ప్రస్తుత తరుణంలో మనమూ అచ్చం ఇలాంటివే చేయాలని లేదు కానీ పాతబడిపోయిన వాటన్నింటినీ బైటపారేయనక్కర్లేదు. కాస్త క్రియేటివిటీని జోడించి కొత్త రూపునిస్తే సరి. దీని వల్ల సదరు వస్తువును కొనాల్సిన అవసరం లేకుండగా.. క్రియేటివ్గా ఏదో ఒకటి చేశామన్న సంతృప్తి కూడా దక్కుతుంది. ఇంటి ఫుడ్డు.. ఫ్రీ టైము.. రెస్టారెంట్లలో తినడం అన్నది అప్పుడప్పుడైతే ఓకే గానీ తరచూ హోటల్ ఫుడ్డు మీదే ఆధారపడటం వల్ల ఇటు శరీరానికే కాదు అటు పర్సు ఆరోగ్యానికీ మంచిది కాదు. ఎంత ఉరుకులు పరుగుల లైఫ్లో ఉన్నా.. కొంత సమయం ఇంటి భోజనానికే కేటాయించగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆదాకి ఆదా కూడా. ఇక, ఇంటిపట్టునే ఉండాల్సి రావడం ఒక పనిష్మెంట్గా కాకుండా.. ఆ సమయాన్ని ఫ్రెండ్స్తో ఆడటంలోనో, కొత్తవి ఏవైనా నేర్చుకోవడంలోనో.. ఆదాయాన్ని పెంచగలిగే అవకాశాల గురించి తెల్సుకోవడానికో వెచ్చిస్తే నిర్మాణాత్మకంగా ఉంటుంది. రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. పైగా ఈ రిఫ్రెష్మెంట్కి అదనంగా ఖర్చేమీ ఉండదు. ఏదైతేనేం.. దుబారా చేయకుండా, పొదుపుగా పద్ధతిగా ఉండటమంటే చీప్గా ఉండటమని కాదు అర్థం. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ నెగ్గాలన్నది తెలిసుండటం. ఖర్చుల విషయంలో స్మార్ట్గా వ్యవహరించడం.. భవిష్యత్ కోసం జాగ్రత్తపడటం. బామ్మ కాస్త చాదస్తంగా చెప్పినా... కాస్త హంగూ ఆర్భాటాలు.. పదాడంబరాలతో ప్లానర్లు చెప్పినా.. వినదగు ఫార్ములాలు దాదాపు ఇవే. అవసరమైన వాటిపైనే ఖర్చు.. బడ్జెట్లో చెప్పుకున్న దాంట్లో ఈ ఖర్చులే కీలకం. సంపద ఎంతైనా ఉండొచ్చు. ఉంది కదా అని.. కానీ దుబారా ఖర్చులు చేసినా, అయాచితంగా ఇచ్చేసినా కొండంత ఖజానా కూడా కరిగిపోతుంది. అలాగని అవసరమైన దగ్గర మరీ లోభిత్వం కూడా చేయకూడదు. చాన్నాళ్ల క్రితం ఒక ఊళ్లో బాగా సంపన్నురాలైన బామ్మ ఉండేది. సంపన్నురాలైనా కూడా వాళ్లింట్లో కరివేపాకు రెబ్బ కావాలన్నా పది పైసలు ఇస్తే గానీ ఇచ్చేది కాదు. అలాంటి ఇంట్లో ఒకసారి భారీ స్థాయిలో పెళ్లి జరిగింది. లక్షలు ఖర్చు పెట్టారు. పెళ్లిరోజున ఊరందరికీ ఒక్కరోజు విందు భోజనాలూ పెట్టారు. కానీ, ఆ మర్నాడు ఊరిజనం మళ్లీ యథాప్రకారం పది పైసలు కడితే గానీ కరివేపాకు రెబ్బ చేతికి రాలేదు. తద్వారా సందర్భానికి తగినట్లుగా ఖర్చు చేయడం, మిగతా సమయాల్లో స్ట్రిక్టుగా నియమాన్ని పాటించడం నేర్పిందా బామ్మగారు. -
ఈ-వ్యర్థాల్లో 4.5 లక్షల మంది బాలలు
ప్రమాదకర పరిస్థితుల్లో కార్యకలాపాలు అసోచామ్ ఆందోళన కోల్కతా: దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల(ఈ-వేస్ట్) సేకరణ, రీసైక్లింగ్ వంటి కార్యకలాపాల్లో సుమారు 4.5 లక్షల మంది బాల కార్మికులు పనిచేస్తున్నారని అసోచామ్ వెల్లడించింది. 10-14 ఏళ్ల మధ్య వయసుల్లోనే ఉన్న వీరంతా సరైన రక్షణ, ప్రమాణాలు లేని వర్క్షాపుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. ఈ-వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ వంటి పనులకు బాలలను వినియోగించకుండా చట్టాన్ని తీసుకురావాలని సిఫారసు చేసింది. మౌలిక వసతుల లేమి కారణంగా సేకరించిన మొత్తం ఈ-వ్యర్థాల్లో 4 శాతం మాత్రమే రీసైకిల్(పునర్వినియోగం) అవుతున్నాయని, దీనివల్ల పర్యావర ణానికీ నష్టం కలుగుతోందని తెలిపింది. ఈ-వ్యర్థాల్లో 95% అసంఘటిత రంగం నుంచే వస్తున్నాయని, వాటిని తుక్కు డీలర్లు రీసైకిల్ చే యకుండా భాగాలుగా విడగొట్టి పారేస్తున్నారంది. అసోచామ్ ప్రకారం.. దేశంలో ఏటా 12.5 లక్షల మెట్రిక్టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. 2015 నాటికి 15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనుంది. ఈ-వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి అవుతున్న నగరాల్లో ముంబై (96 వేల మెట్రిక్ టన్నులు) మొదటిస్థానంలో ఉండగా.. తర్వాత ఢిల్లీ (67 వేలు), బెంగళూరు (57 వేలు), చెన్నై (47 వేలు), హైదరాబాద్ (25 వేలు) ఉన్నాయి.