పార్లమెంట్‌లో తిరుపతి లడ్డూల పంపిణీ | tirumala laddu Distribution in parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో తిరుపతి లడ్డూల పంపిణీ

Mar 16 2017 8:59 PM | Updated on Mar 29 2019 9:31 PM

పార్లమెంట్‌లో తిరుపతి లడ్డూల పంపిణీ - Sakshi

పార్లమెంట్‌లో తిరుపతి లడ్డూల పంపిణీ

ఇటీవలి ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని బీజేపీ.. తిరుపతి ప్రసాదం లడ్డూలను పార్లమెంట్‌లో సభ్యులకు పంపిణీ చేసి అందరితో పంచుకుంది.

న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని బీజేపీ..  తిరుపతి ప్రసాదం లడ్డూలను  పార్లమెంట్‌లో సభ్యులకు పంపిణీ చేసి అందరితో పంచుకుంది. తిరుపతి ఆలయ అధికారులకు సుమారు 1200 లడ్డూలను ఆర్డరివ్వగా వారు బుధవారం సాయంత్రానికి 600 మాత్రం సిద్ధం చేశారు.

వాటిని వెంటనే రాజధానికి తరలించిన బీజేపీ శ్రేణులు.. గురువారం ఉదయం పార్లమెంట్‌ ఉభయ సభల్లో సభ్యులకు పంపిణీ చేశారు. తిరుపతి లడ్డూలకు ఎంతో పేరున్న విషయం విదితమే. ముందుగా ఈ లడ్డూలను బీజేపీ పార్లమంటరీ పార్టీ సమావేశంలో అందజేయాలనుకున్నామని, చివరి నిమిషంలో ఓ నాయకుడు ఇచ్చిన సూచన మేరకు ఆ నిర్ణయం మార్చుకున్నామని వివరించారు.
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement