ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు.. బ్రిడ్జిపై నుండి కాలువలోకి బోల్తా పడడంతో 11 మంది మృతిచెందగా, మరో 17 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 32మంది ప్రయాణిస్తున్నారు. గురువారం రాత్రి దుర్గామాత నిమజ్జనంలో పాల్గొని తిరిగివస్తుండగా బైరాంపూర్ జిల్లాలోని బెలా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
Published Fri, Oct 23 2015 2:12 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement