వాటర్‌ ట్యాంక్‌ కూలి ఇద్దరి మృతి | two died in water tank accident | Sakshi
Sakshi News home page

వాటర్‌ ట్యాంక్‌ కూలి ఇద్దరి మృతి

Published Thu, Aug 24 2017 4:29 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఓ భవనం పై ఉన్న నీటి ట్యాంక్‌ కూలి ఇద్దరు మృతి చెందారు.

అహ్మదాబాద్‌: ఓ భవనం పై ఉన్న నీటి ట్యాంక్‌ కూలి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని నారన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి శాస్ర్తినగర్‌లో ఓ మూడంతస్థుల భవనం పై ఉన్న 5 వేల లీటర్ల వాటర్‌ ట్యాంక్‌ గురువారం నేల కూలింది. ఆ సమయంలో భవనం దగ్గరున్న ఐదుగురిపై వాటర్‌ ట్యాంక్‌ పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement