కర్ణాటక:మహిళలపై కామాంధుల ఆకృత్యాలు అంతకంతకూ శృతిమించితూనే ఉన్నాయి. ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి యత్నించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై ఆమె సహ విద్యార్థి అత్యాచారం చేయడానికి యత్నించాడు. బాధితురాలికి కరాటే రావడంతో ఆ యువకుడ్ని ప్రతిఘటించింది. దీంతో సహనం కోల్పోయిన ఆ విద్యార్థి ఆమె తలపై బండరాయితో మోదాడు. ఆమెకు తలనుంచి రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.