‘దిశ’కు ఆటా సంఘం నివాళులు | American Atlanta Telugu Association Members And Women Gave Tributes To Disha | Sakshi
Sakshi News home page

కేంద్ర, రాష్ట్రాలు కఠిన చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి

Dec 5 2019 2:46 PM | Updated on Dec 5 2019 7:27 PM

American Atlanta Telugu Association Members And Womens Gave Tributes To Disha - Sakshi

అట్లాంటా: భారతదేశంలో వివిధ ప్రాంతాలలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై అట్లాంటాలోని ప్రవాసాంధ్రులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌(ఆటా) ఆధ్వర్యంలో స్థానిక బిర్యాని పాట్‌ రెస్టారెంట్‌లో అత్యాచారం, హత్యకు గురైన దిశకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అట్లాంటాలోని ప్రవాసాంధ్రులతో పాటు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ విజిల్‌లో భాగంగా క్యాండిల్స్‌ వెలిగించి దిశకు నివాళులర్పించారు. 


అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అదే సమయంలో వారిపై దాడులు కూడా ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఈ కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన సభ్యులు శ్రీరాం, జయచంద్రారెడ్డి, నిరంజన్‌ పొద్దుటూరికి ఆటా కార్యవర్గ సభ్యులు అనిల్‌ బొడిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటా మాజీ అధ్యక్షులు కరుణాకర్‌ అసిరెడ్డి, కిరణ్‌ పాషం, గౌతం గోళి వెంకట్‌ మొండెద్దు, శ్రీని గంగసాని, అనిల్‌ బోదిరెడ్డి, తంగిరాల సత్యనారాయణ రెడ్డి, కళ్యాణి మోడ్గుల, హేమ శిల్ప తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement