
న్యూఢిల్లీ : పని మనుషుల నియామకంలో సహకారానికి కువైట్తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంతో కువైట్లో పనిచేస్తున్న 3 లక్షల మంది భారతీయులకు(అందులో 90 వేల మంది మహిళలే) ప్రయోజనం కలుగుతుంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఎంఓయూలో భారత పని మనుషుల హక్కుల పరిరక్షణకు కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చారు. ఐదేళ్ల వరకు అమలులో ఉండే ఈ ఒప్పందాన్ని రెన్యూవల్ చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఎంఓయూ అమలు పర్యవేక్షణకు సంయుక్త కమిషన్ ఏర్పాటు చేయనున్నారు.