Kuwait
-
ఫేస్బుక్ పరిచయం.. వివాహితకు శాపం
బంజారాహిల్స్: ఫేస్బుక్ పరిచయం ఆమె పాలిట శాపమైంది. కువైట్లో ఉన్న ఓ వ్యక్తి ఫేస్బుక్ చాట్లో తీయటి మాటలతో ఓ వివాహితను లోబర్చుకున్నాడు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ఆమెతో శారీరకంగా కలవడమే కాకుండా ప్రైవేటు ఫొటోలను, వీడియోలను కూడా తీశాడు. ఫేస్బుక్ మెసెంజర్లో ఆ ఫొటోలను పోస్ట్ చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతుండటంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కువైట్లో ఉంటున్న కుడుపూడి ప్రసాదరావుతో నగరానికి చెందిన ఓ వివాహితకు ఫేస్బుక్లో పరిచయమైంది. ఆ తర్వాత తరచూ చాటింగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తన పట్ల ప్రసాదరావు కనబరుస్తున్న ప్రేమతో అతనిని నమ్మడం ప్రారంభించింది. 2020లో ఇరువురూ శారీరకంగా ఒక్కటయ్యారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ప్రసాదరావు ఆమెతో 2, 3 రోజులుగా గడిపేవాడు. డబ్బు, బంగారం ఇచ్చేవాడు. కువైట్లో ఉన్నప్పుడు ఆమెతో వీడియో కాల్లో మాట్లాడేటప్పుడు ప్రైవేటు పార్ట్స్ను స్క్రీన్ రికార్డ్ చేశాడు. ప్రైవేటుగా కలిసే సమయంలో ఆమె ఫొటోలను సేవ్ చేశాడు. రోజులు గడిచే కొద్దీ ప్రసాదరావు ప్రవర్తన ఆమె పట్ల మారుతూ వచ్చింది. ఆమె కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి అడగడం ప్రారంభించాడు. లేదంటే తనతో ఉన్న ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో వీరిద్దరి ఫొటోలను తన ఐడీ ద్వారా ఫేస్బుక్ స్నేహితులకు మెసెంజర్లో పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని రాజోలు పొన్నమండలో ఉండే ప్రసాదరావు భార్య భవాని, తండ్రి రామకృష్ణ తదితరులు కలిసి ఆమె ఇంటికి వెళ్లి రూ.4,28,800 చెల్లించాలంటూ తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారు. బాధితురాలితో పాటు ఆమె కుమార్తెను బెదిరించి గొలుసు, ఉంగరాలు సహా 28 గ్రాముల బంగారాన్ని తీసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ శనివారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
తానే దిద్దుకున్న బతుకు చిత్రం
బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది. చదువుకు దూరం చేసింది. అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. భర్త పట్టించుకోని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాలనివ్వాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు వదిలి వెళ్లాడు భర్త. ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి. తనకు దూరమైన చదువును వారికివ్వాలి. అందుకోసం తానెంతయినా కష్టపడాలి. ఇదీ ఆమెకు జీవితం నిర్దేశించిన దారి. ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది. పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది. చదువుకుంది. ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఆ విధుల్లో ఏకైక మహిళ రషీదా బేగం షేక్ పరిచయం ఇది.బతుకు బడి రషీదా పుట్టింది తమిళనాడులో. ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. రషీదా బాల్యం, చదువు గూడూరులోనే. ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రి పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కష్టమయ్యాయి. చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువాగిపోయింది. అడిగిన వారికిచ్చి పెళ్లి చేశారు. వ్యసనపరుడైన భర్త వదిలేసి పోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైట్కి వెళ్లింది. పిల్లలను అక్క దగ్గర వదిలి కువైట్లో ఉద్యోగంలో చేరిన రషీదా లక్ష్యం ఒక్కటే. బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. నెలకు నాలుగు వేల రూపాయల ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఆమె చేరిన మైలురాయి ఏమిటో తెలుసా? కువైట్ పబ్లిక్ రిలేషన్స్, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఇదేమీ సినిమా కథలా ఒక రీల్లో జరిగిపోలేదు. ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగూ చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది. ఒక్కొక్క సంఘటన ఒక్కోపాఠం. భాష తెలియక యజమానురాలి ఆదేశం సరిగ్గా అర్థం కాకపోవడం, దాంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, రషీద ఉన్న గది తలుపు వేసి రెండో రోజు వరకు తియ్యకపోవడం... ఇండియాకి వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం. పిల్లల్ని బాగా చదివించాలి... ఒక్కటే లక్ష్యం ఆమెను కువైట్లో కట్టిపడేసింది. ఇటాలియన్ వంటల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సలాడ్లు చేసి జీతం పెంచుకుంది.కష్టాల పాఠాలురషీదా ఓ రోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది. కాలుకు కట్టు కట్టించారు. ఆ ఒక్కరోజే రెస్ట్. రెండో రోజు చేతి కర్ర ఇచ్చి పని చేయమన్నారు. కాలికి కట్టు, కర్ర సాయంతో నడుస్తూ ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది. చిమ్మ చీకటిలోనూ ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం. ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీదా. బ్యూటీషియన్గా పని చేసింది. ఒకరోజు అరబ్ వార్తాపత్రికలో మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ, ఉద్యోగం ప్రకటన ఆమెను కొత్త దారి పట్టించింది. ఆ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళ ఫొటో, కెమెరా బొమ్మ, జీతం అంకె మాత్రమే. కోర్సులో చేరి ఫొటోగ్రఫీ నేర్చుకుంది. డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసింది. ఇంగ్లిష్ మాట్లాడడంతోపాటు అరబ్బీ చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. గవర్నమెంట్లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్లందరినీ అడిగింది. కానీ ఆమె కోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది. ఇప్పుడామె తనకంటూ మినిస్ట్రీలో ఒక అఫిషియల్ క్యాబిన్, పోలీస్ జాకెట్తో ఉన్నతస్థాయిలో ఉన్న విజేత. కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.విజేత లక్ష్యం రషీదా ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవించింది. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది. ఉమెన్స్ థ్రైవ్ ఏపీ పేరులో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను శిక్షణనిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్, ఇంగ్లిష్ చదవడం– మాట్లాడడం, కేక్ తయారీ, పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణనిస్తోంది. అలాగే ఉజ్వల భవిష్యత్తు పేరుతో పాఠశాల పిల్లలకు కెరీర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయోననే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు, పిల్లల కోసం పని చేయాలనేదే తన లక్ష్యం అంటోంది రషీదా బేగం షేక్. ఇకిగాయ్ నేర్పించింది ఫొటోగ్రఫీతోపాటు ఫొటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పటికి నాకు కీబోర్డ్ కాదు కదా, మౌస్ కదపడం కూడా రాదు. బ్యూటీషియన్గా కొనసాగమని సూచించారు. అప్పుడు నాకెంత ఉక్రోషం వచ్చిందంటే... ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను. ఏడాది తర్వాత వారికి ఒక ప్రోగ్రామ్కి ఫొటోగ్రాఫర్ అవసరం ఏర్పడినప్పుడు ఎంక్వయిరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారట. వాళ్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు. మరొక సందర్భంలో నా దుస్తుల కారణంగా చిన్నచూపుకు గురవుతున్నానని తెలిసింది. నేను నేర్చుకున్న మరో పాఠం అది. జపాన్ పుస్తకం ఇకిగాయ్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఉమెన్స్ థ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలోని అంశాలను చేర్చాను. నన్ను నేను మలుచుకున్నట్లే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. – రషీదా బేగం షేక్, ఫొటోగ్రాఫర్, మంత్రిత్వ శాఖ, కువైట్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కువైట్ లో భారత ప్రధాని తోలి పర్యటన
-
భారత్, కువైట్ మధ్య... సుదృఢ బంధం
కువైట్ సిటీ: మిత్రదేశాలైన భారత్, కువైట్ మధ్య బంధం మరింత దృఢపడింది. రెండు దేశాల నడుమ సంబంధాలు కీలక వ్యూహాత్మక భాగస్వా మ్యంగా మారాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కువైట్ సిటీలోని మెజెస్టిక్ బయన్ ప్యాలెస్లో కువైట్ రాజు, ప్రధాని షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జబేర్ అల్–సబాతో సమావేశమయ్యారు. మోదీకి రాజు సాదర స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చే దిశగా చర్చలు జరిపారు. ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఫిన్టెక్, మౌలిక సదుపాయాలు, భద్రత తదితర కీలక రంగాల్లో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు.రెండు దేశాల మధ్య ద్వైపాకిక్ష సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చారు. కువైట్లో నివసిస్తున్న 10 లక్షల మంది భారతీయుల సంక్షేమానికి సహకరిస్తున్నందుకు కువైట్ రాజుకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తమదేశ అభివృద్ధి ప్రయాణంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వెలకట్టలేని సేవలు అందిస్తున్నారని రాజు ప్రశంసించారు. భారత్లో పర్యటించాలని కువైట్ రాజును మోదీ ఆహా్వనించారు. షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జబేర్ అల్–సబాతో అద్భుతమైన భేటీ జరిగిందని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లామని ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో భారత్, కువైట్ సంబంధాలు ఉన్నతంగా పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శనివారం కువైట్కు చేరుకున్న సంగతి తెలిసిందే.తొలి రోజు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కువైట్లోని భారతీయులతో సమావేశమయ్యారు. రెండో రోజు ఆదివారం కువైట్ రాజుతో చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం పర్యటన ముగించుకుని మోదీ భారత్ చేరుకున్నారు. 43 ఏళ్ల తర్వాత కువైట్లో పర్యటించిన తొలి భారత ప్రధాని ఆయనే కావడం విశేషం. అవగాహన ఒప్పందాలు ప్రధాని మోదీ, కువైట్ రాజు చర్చల సందర్భంగా భారత్, కువైట్ మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, క్రీడలు, సంస్కృతి, సోలార్ ఎనర్జీ విషయంలో ఒప్పందాలు కుదిరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రక్షణపై కుదిరిన ఒప్పందంలో రక్షణ పరిశ్రమలు, రక్షణ పరికరాల సరఫరా, ఉమ్మడిగా సైనిక విన్యాసాలు, శిక్షణ, నిపుణులు, జవాన్ల మారి్పడి, పరిశోధన–అభివృద్ధిలో పరస్పర సహకారం వంటి అంశాలను చేర్చారు. ప్రస్తుతం కువైట్ నాయకత్వం వహిస్తున్న గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)తో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి భారత్ ఆసక్తి చూపింది.మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ప్రధాని నరేంద్రమోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్–కబీర్’ లభించింది. కువైట్ రాజు షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జబేర్ అల్–సబా ఆదివారం ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఇది మోదీకి దక్కిన 20వ అంతర్జాతీయ గౌరవం. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అవార్డు. గతంలో బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ వంటి విదేశీ నేతలు ఈ పురస్కారం అందుకున్నారు.ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొందాం ఉగ్రవాద భూతాన్ని ఉమ్మడి ఎదిరించాలని మోదీ, కువైట్ రాజు నిర్ణయించుకున్నారు. పెనుముప్పుగా ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తీర్మానించుకున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న అంతం చేయాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రమూకలకు ఆర్థిక సాయం అందే మార్గాలను మూసివేయడంతోపాటు ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిన దేశాలపై కఠిన ఆంక్షలు విధిస్తే పరిస్థితిలో కచి్చతంగా మార్పు వస్తుందని మోదీ, కువైట్ రాజు అభిప్రాయపడ్డారు. ఇద్దరు నాయకుల భేటీపై ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదలైంది. -
బంధం బలోపేతం
కువైట్ సిటీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం గల్ఫ్ దేశమైన కువైట్కు చేరుకున్నారు. కువైట్ రాజు షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జబేర్ అల్–సబా ఆహా్వనం మేరకు ఆయన కువైట్లో అడుగుపెట్టారు. భారతదేశ ప్రధానమంత్రి కువైట్లో పర్యటిస్తుండడం గత 43 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. రాజధాని కువైట్ సిటీలోని ఎయిర్పోర్టులో నరేంద్ర మోదీకి కువై ట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్–సబాతోపాటు పలువురు మంత్రు లు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికా రు. రెండు రోజుల పర్యటనలో మోదీ కువైట్ పాలకులతో భేటీ కానున్నారు.వివిధ కీలక రంగాల్లో భారత్–కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరుపనున్నారు. అలాగే పలు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉంది. కువైట్కు చేరుకున్న తర్వాత మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తన పర్యటన రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి దో హదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వేర్వేరు రంగాల్లో భారత్, కువైట్ పరస్పరం స హకరించుకుంటూ కలిసికట్టుగా ముందడుగు వేయాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. కు వైట్ నాయకులను కలుసుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. మో దీ ఆదివారం ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, 1981లో అప్పటి భారత ప్రధా ని ఇందిరా గాంధీ కువైట్లో పర్యటించారు. ఆ తర్వాత కువైట్లో అడుగుపెట్టిన మొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డుకెక్కారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా ఎదిగే సత్తా భారత్కు ఉందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన శనివారం కువైట్ సిటీలో ‘హలా మోదీ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కువైట్లో నివసిస్తున్న భారతీయులు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రపంచ ప్రగతిలో మన భారతీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రతిఏటా వందలాది మంది భారతీయులు కువైట్కు వస్తున్నారని, ఇక్కడ భారతీయతను చాటిచెబుతున్నారని పేర్కొన్నారు. కువైట్ అనే చిత్రానికి భారతీయ నైపుణ్యాలు అనే రంగులద్దుతున్నారని వివరించారు. భారతీయ ప్రతిభ, సాంకేతికతను కువైట్ సంప్రదాయంతో మేళవిస్తున్నారని చెప్పారు. కువైట్ దేశం మినీ–హిందుస్తాన్గా పేరుగాంచిందని గుర్తుచేశారు. -
అరబిక్లో రామాయణ భారతాలు..అనువాదకులతో ప్రధాని భేటీ
కువైట్సిటీ: ప్రధాని మోదీ కువైట్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం(డిసెంబర్21) రామాయణ మహాభారతాలను అరబిక్లో అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్,ఈ ఇతిహాసాల అరబిక్ వెర్షన్లను ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్లను కలిశారు. తనకు రామాయణమహాభారతాలను అరబిక్లో అనువదించేందుకు రెండు సంవత్సరాల 8 నెలలు పట్టిందని అల్ బరూన్ అన్నారు. తాము ప్రచురించిన అరబిక్ రామాయణ మహాభారత పుస్తకాలను ప్రధాని మోదీ చూసి సంతోషించారని,రెండు పుస్తకాలపై ఆయన సంతకం చేశారని ప్రచురణకర్త అబ్దుల్లతీఫ్ అల్నెసెఫ్ చెప్పారు. అల్బరూన్,అల్నెసెఫ్ ప్రపంచంలోని ముప్పై దాకా గొప్ప కావ్యాలను అరబిక్లో ప్రచురించారు. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్లో ప్రధాని రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో ప్రధాని మన్కీబాత్లో కూడా అరబిక్లో రామాయణ మహాభారతాలను అనువదించిన ఇద్దరి గురించి ప్రస్తావించడం గమనార్హం. #WATCH | Kuwait | Ramayana and Mahabharata published in Arabic language; Abdullateef Alnesef, the book publisher and Abdullah Baron, the translator of Ramayana and Mahabharata in the Arabic language, met PM Narendra Modi in Kuwait CityAbdullateef Alnesef, the book publisher… pic.twitter.com/jO3EqcflXJ— ANI (@ANI) December 21, 2024 మా తాతను కలవండని ఓ నెటిజన్ విజ్ఞప్తి.. కలిసిన ప్రధాని ప్రధాని మోదీ కువైట్ పర్యటన నేపథ్యంలో కువైట్లో ఉంటున్న తన తాత,రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉద్యోగి మంగళ్ సేన్ హండా (101)ను కలవండని ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఆయనను తప్పకుండా కలుస్తానని బదులిచచ్చిన మోదీ కువైట్ చేరుకున్న అనంతరం మంగల్సేన్హండాను కలిశారు. — Narendra Modi (@narendramodi) December 21, 2024 -
బంధించేశారు, ఒక్కపూటే భోజనం.. రక్షించండి: కువైట్లో ఏపీ మహిళ ఆవేదన
-
బంధించేశారు, ఒక్కపూటే భోజనం..రక్షించండి: కువైట్లో ఏపీ మహిళ ఆవేదన
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నమహిళ తనను కాపాడ్సాలిందిగా వేడుకుంటున్న సెల్ఫీ వీడియో ఒకటి ఆందోళన రేపుతోంది. తిరుపతి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ చెందిన ఎల్లంపల్లి లక్ష్మి తన కుమార్తెను ఉద్దేశించి ఈ వీడియో చేసింది. కువైట్ లో తనను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.మతిస్థిమితం లేని పిల్లవాడి సంరక్షణ కోసం కువైట్ వచ్చిన తనకు కనీసం కడుపు నిండి తిండి పెట్టకుండా, వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. పిల్లవాణ్ని సరిగ్గా చూడటం లేదని ఆరోపిస్తూ తనను బాగా కొట్టిన యజమానులు గదిలో నిర్బంధించారని కన్నీళ్లు పెట్టుకుంది. తిండీ, తిప్పలు లేక, అనారోగ్యంతో బాధలు పడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు రక్షించాలని ఎజెంటుకు విన్నవించుకుంటే 2.50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నానని దయచేసిన తనను ఈ నరకంనుంచి రక్షించాలని సెల్ఫీ వీడియోలో కుమార్తెను వేడుకుంది. దీంతో లక్ష్మి కుమార్తె సుచిత్ర ఆందోళనలో మునిగిపోయింది. తల్లిని కాపాడాలని కోరుతూ స్టానిక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు విజ్ఞపి చేసింది. కువైట్ నుండి తన తల్లిని త్వరగా ఇండియాకు తీసుకురావాలని కోరూతూ ఏమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కుమార్తె సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంది. -
బంధం బలపడేలా...
డిసెంబర్ 21, 22 తేదీలలో రెండు రోజుల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ వెళ్లనున్నారు. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్ను సందర్శించడం ఇదే మొదటిసారి. విశ్వసనీయమైన చమురు సరఫరాదారు అయిన కువైట్లో 21 శాతం జనాభాతో అతిపెద్ద విదేశీ సమూహంగా భారతీయులు ఉంటున్నారు. భారత్లో కువైటీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం, అనూహ్య పరిస్థితులలో ఉపయోగపడటానికి భారత్లో కువైటీ చమురును వ్యూహాత్మకంగా నిల్వ చేయడం, కువైట్ ఆధునికీకరణలో భారత కంపెనీలకు భాగస్వామ్యం కల్పించడం, రక్షణ, భద్రత లాంటి అంశాలు చర్చకు రానున్నాయి.స్థిరమైన, బాగా వృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాల పట్ల ఉన్నత స్థాయి శ్రద్ధ అనేది దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాలలో ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. 1981లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కువైట్ను సందర్శించిన 43 ఏళ్ల తరువాత, 2013లో కువైట్ ప్రధానమంత్రి భారతదేశ పర్యటనకు వచ్చిన 11 ఏళ్ల తరువాత మొదటిసారిగా భారతదేశం నుండి కువైట్కు ప్రధాని స్థాయి పర్యటన జరగడానికి గల కారణం ఇదే అయి ఉండవచ్చు.అతిపెద్ద విదేశీ సమూహంగా భారతీయులుకువైట్తో భారతదేశ సంబంధాలు రెండు దేశాలు స్వాతంత్య్రం పొందడానికి ముందు నుండీ ఉన్నాయి. బస్రా నగరం పేరుతో ప్రసిద్ధి చెందిన బస్రా ముత్యాలను సాహసవంతులైన కువైట్ డైవర్లు సేకరించి బస్రా పోర్టు నుండి భారత్కు తెచ్చేవారు. వీటిని రాజవంశీ యులు, సంపన్నులు ఆభరణాల రూపంలో ధరించేవారు. వారి తిరుగు ప్రయాణంలో దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఆహార పదా ర్థాలు, ఇతర ఉత్పత్తులను తమ పడవల్లో తీసుకువెళ్లేవారు. శిలాజ ఇంధన వనరులను గుర్తించడానికి ముందు, గల్ఫ్ ప్రాంతంలో నిపుణులైన కువైట్ వ్యాపారస్తులకు భారత్తో వాణిజ్యం అనేది సంపదకు ముఖ్య వనరుగా ఉండేది. ఈ సంబంధాలు కేవలం వాణిజ్యం వరకు పరిమితం కాలేదు. బొంబాయిని సందర్శించాలనే ఆకాంక్ష వారిలో ఉండేది. కువైట్కు చెందిన అమీర్ ఒకరు వర్షాకాలంలో గడపడానికి తనకు బాగా నచ్చిన బొంబాయి నగరంలోని మెరైన్ డ్రైవ్లో విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు. ఆ ఆస్తి ఇప్పటికీ ఉంది. ఇరు దేశాలకు చెందిన ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల, 1961లో కువైట్ స్వతంత్ర దేశంగా మారిన ప్పుడు, దానితో మొదటగా దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది.1970ల దశకం నుండి శిలాజ ఇంధనాల ద్వారా భారీగా ఆదాయం రావడంతో, తమ సాంకేతికత, విద్య, రక్షణ, భద్రత, పెట్టుబడులు, వినోదం కోసం పశ్చిమ దేశాలపై కువైట్ ఆధార పడసాగింది. భారత్తో సంబంధాలు కొనసాగినప్పటికీ, వాటి ప్రాధాన్యత అదే విధంగా కొనసాగలేదు. కానీ గత రెండు దశా బ్దాలుగా భారత్లో వేగంగా జరిగిన ఆర్థికాభివృద్ధి, సాంకేతికత– రక్షణ రంగాలలో పెరిగిన సామర్థ్యం, ప్రాంతీయ బలం కారణంగా భారత్, కువైట్ మధ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటింది. కువైట్లో పది లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు నివసి స్తున్నారు. అతి పెద్ద విదేశీ సమూహంగా కువైట్ జనాభాలో 21 శాతంగా ఉన్నారు. ఆ దేశం కార్మిక శక్తిలో 30 శాతంగా ఉన్నారు. భారత్ చమురు దిగుమతి చేసుకునే మొదటి ఆరు దేశాలలో కువైట్ ఒకటి. విశ్వసనీయమైన సరఫరాదారుగా కువైట్ నిలిచింది. ఇండి యాలో కువైట్ సంస్థాగత పెట్టుబడులు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా.రెండు బిలియన్ డాలర్ల ఎగుమతులుఇండియాతో దీర్ఘ కాలంగా వ్యాపార సంబంధాలు నెరుపుతున్న అల్ ఘనిమ్, అల్ షాయా వంటి వ్యాపార సంస్థలు ఇక్కడి తయారీ, సేవల రంగంలో పెట్టుబడులు పెట్టాయి. అదేవిధంగా భారత్కు చెందిన ఎల్ అండ్ టి, శాపూర్జీ పల్లోంజి, కల్పతరు, కేఈసీ, ఇఐఎల్, మేఘా, అశోక్ లేల్యాండ్, విప్రో, టాటా, టీసీఐఎల్, కిర్లోస్కర్ వంటి సంస్థలు కువైట్ మౌలిక వసతులు, అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాయి. ఆర్థిక, సంబంధిత రంగంలో ఎల్ఐసీ, న్యూ ఇండియా ఎస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు అనేక సంవత్సరాలుగా కువైట్లో క్రియాశీల కార్యకలాపాలు నిర్వహి స్తున్నాయి. 2023–24లో మొదటిసారిగా కువైట్కు భారతీయ ఎగుమతులు 34 శాతం పెరిగి 2 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటాయి. ప్రవాస భారతీయుల నుండి భారత్కు వస్తున్న రెమి టెన్సులు ఇప్పుడు 5 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. కువైట్లో భారతీయ ఉత్పత్తులు, బ్రాండ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది.కానీ ఇంకా ఎంతో సాధించవచ్చు. ఇదొకసారి చూడండి: 18,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ భౌగోళిక వైశాల్యం కలిగిన కువైట్ (వైశాల్యంలో అనేక భారతీయ జిల్లాలు దానికంటే పెద్దవి) 105 బిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువ చమురు నిక్షేపాలు కలిగి ఉండి ప్రపంచంలోనే 6వ స్థానంలో ఉంది. దాని సావరిన్ ఫండ్లో సుమారుగా ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయి. భారత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలకు అత్యధిక తలసరి ఆదాయ దేశంగా కువైట్ ఒక లాభసాటి మార్కెట్. పైగా రానున్న పదేళ్లలో మౌలిక సదుపాయాలపై 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక ఉన్నందున భారతీయ సంస్థలకు గొప్ప అవకాశం. అంతే కాకుండా, భారతదేశంలో విలాస వంతమైన పర్యాటకం, పోర్ట్ ఫోలియో పెట్టుబడులకు సంపన్న కువైటీలు ఒక మంచి వనరుగా ఉండగలరు.సంబంధాలు మరో స్థాయికి...విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ 2024 ఆగస్ట్లో కువైట్ను సందర్శించారు. సెప్టెంబర్లో న్యూయార్క్లో కువైట్ యువ రాజు, ప్రధాని మోదీ భేటీ జరిగింది. కువైట్ విదేశాంగ మంత్రి ఈ నెల ఆరంభంలో భారత్ వచ్చారు. ఇప్పుడు మోదీ కువైట్ పర్యటనతో సంబంధాలు మరో స్థాయికి చేరడానికి సిద్ధంగా ఉన్నాయి.పర్యటనను ఫలవంతం చేయటానికి అనేక ముందస్తు చర్యలు ఇప్పటికే చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, రక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆహార భద్రత, వ్యవసాయం, ఉప దౌత్య అంశాలపై పనిచేసే ఏడు కొత్త జాయింట్ వర్కింగ్ గ్రూపు (జేడబ్ల్యూజీ)లకు ఇరువురు విదేశీ మంత్రులు ఆమోదించారు. చమురు, కార్మికులు, ఆరోగ్యంపై ఇదివరకే ఉన్న జేడబ్ల్యూజీలతో కలిసి పనిచేస్తూ విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకు వెళ్ళడానికి ఈ కొత్త గ్రూపులు సహాయపడతాయి. భారత్లో కువైటీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం, అనూహ్య పరిస్థితులలో ఉపయోగపడటానికి భారత్లో కువైటీ చమురును వ్యూహాత్మకంగా నిల్వ చేయడం, భారతీయ పెట్రో కెమికల్స్ రంగంలో కువైట్ పాల్గొనడం, కువైట్ ఆధునికీకరణ ప్రణాళికలలో ప్రపంచ స్థాయి సామర్థ్యాలు కలిగిన భారతీయ మౌలిక సదుపాయాల కంపెనీలు ఎక్కువగా పాలుపంచుకునే విధంగా మార్గం సుగమం చేయడం లాంటివి ఈ సంబంధాల నుంచి ఆశిస్తున్న ఫలితాలు. కువైట్లో భారతీయ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, వారి సమస్య లను వేగంగా పరిష్కరించడం మరో ముఖ్యమైన అంశం.రక్షణ, భద్రతా సమస్యలు కూడా చర్చించాల్సి ఉంది. భారత్, కువైట్ పరస్పర సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు క్రమం తప్పకుండా కువైట్ పోర్ట్ను సందర్శిస్తున్నప్పటికీ, రక్షణ, భద్రత సహకారంపై మరింత శ్రద్ధ, సంప్రదింపులు అవసరం. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాల కారణంగా, ఈ ప్రాంతంలో ఆందోళన భావన నెలకొంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) అధ్యక్ష స్థానంలో కువైట్ ఉన్నందున, భారత సౌహార్ధత, దౌత్య సంబంధాల సహకారంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. సతీశ్ సి. మెహతా వ్యాసకర్త కువైట్కు భారత మాజీ రాయబారి -
శనివారం నుంచి మోదీ కువైట్ పర్యటన
న్యూఢిల్లీ: శనివారం నుంచి ప్రధాని మోదీ కువైట్లో రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఈ గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు ఇండియా, కువైట్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటిస్తున్నారని భారత విదేశాంగ శాఖ బుధవారం పేర్కొంది. పర్యటనలో భాగంగా మోదీ కువైట్ పాలకులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అక్కడ భారతీయ సంతతి వ్యక్తులతో భేటీ కానున్నారు. చివరిసారిగా 1981లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ కువైట్లో పర్యటించారు. కువైట్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో ఏకంగా 10.47 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
కువైట్లో భారత ప్రయాణికులు ఇక్కట్లు.. 13 గంటలుగా ఆహారం లేక..
కువైట్: భారత ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై నుంచి మాంచెస్టర్కు వెళ్లే భారత ప్రయాణికులు కువైట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో దాదాపు 13 గంటలపాటు వారంతా ఎయిర్పోర్టులోనే ఉన్నారు. ప్రయాణికులకు ఆహారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముంబై నుండి మాంచెస్టర్కు వెళ్లున్న విమానం ఇంజిన్లో మంటలు చెలరేగడంతో ఫ్లైట్ అత్యవసరంగా కువైట్లో ల్యాండ్ అయింది. దీంతో, ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయియి. తమ విమానం కువైట్లో దిగే ముందు యూటర్న్ తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికులంతా దాదాపు 13 గంటలుగా విమానాశ్రయంలోనే ఉన్నారు. వారికి ఆహారం, సాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#Breaking l Indian passengers flying from #Mumbai to #Manchester, stuck at #Kuwait airport for 13 hours complain of severe problems including not getting "food or #help"; video on social media shows passengers of Gulf Air arguing with airport authorities.#KuwaitAirport #GulfAir pic.twitter.com/DHpgA26eR1— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) December 1, 2024మరోవైపు.. గల్ఫ్ ఎయిర్లోని ప్రయాణికులు ఎయిర్ పోర్టు అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ప్రయాణికులును వేధించారని, యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్ నుంచి వచ్చిన ప్రయాణికులకు మాత్రమే ఎయిర్పోర్టు సిబ్బంది వసతి కల్పించారని ఆరోపించారు. భారత్, పాకిస్తాన్, ఇతర ఆగ్నేయాసియా దేశ పాస్పోర్ట్లను కలిగి ఉన్న వారిపై పక్షపాతం చూపిస్తున్నారని, ఎలాంటి వసతులు ఇవ్వలేదని మండిపడుతున్నారు.ఈ సందర్బంగా ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఎయిర్పోర్టులోనే 13 గంటలకు పైగా సమయం గడిచింది. దాదాపు 60 మంది ప్రయాణికులు ఇక్కడే ఉన్నారు. ఉదయం నుండి ప్రతి మూడు గంటలకు మేము ఇంటికి వెళతామని వారు మాకు చెబుతున్నారు. కానీ, ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం మాకు కూర్చోవడానికి స్థలం ఇవ్వమని మేము వారిని చాలా సార్లు అడిగాము. అందరూ నేలపై కూర్చున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్
ప్రపంచంలో అత్యధిక విలువైన కరెన్సీ అంటే అంతా అమెరికన్ డాలర్ అనుకుంటారు. అది కొంతవరకూ నిజమే. ప్రపంచంలో అత్యధిక లావాదేవీలు డాలర్తోనే జరుగుతాయి. అక్టోబరు 7 నాటికి.. ఒక డాలర్ విలువ మన కరెన్సీలో సుమారు రూ.84.కానీ, కొన్ని కరెన్సీలు ఒక్కో యూనిట్ కొనాలంటే ఒకటి కంటే ఎక్కువ అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాలి. అలా చూసినప్పుడు ప్రపంచంలో అత్యధిక విలువ ఉన్న కరెన్సీ కువైట్ దీనార్. ఇది ఒక యూనిట్ సుమారు రూ.274. ఒక దీనార్ కొనాలంటే 3.26 డాలర్లు ఖర్చు పెట్టాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన లేదా ఖరీదైన కరెన్సీ టైటిల్ను కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి వివిధ స్థానిక, అంతర్జాతీయ అంశాల సమగ్ర విశ్లేషణ అవసరం. ఈ కారకాలలో విదేశీ మారకపు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ డైనమిక్స్, ద్రవ్యోల్బణం రేట్లు, దేశీయ ఆర్థిక వృద్ధి, సంబంధిత సెంట్రల్ బ్యాంక్ అమలు చేసే విధానాలు, దేశం మొత్తం ఆర్థిక స్థిరత్వం ఉన్నాయి. -
గల్ఫ్ దేశాల్లో ఎందుకు మలయాళీలు ఎక్కువ?
కేరళ ప్రజలు అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ప్రవాసం ఉండే విషయం తెలిసిందే. కువైట్లో ఉండే విదేశీయుల్లో 80 శాతం దాకా మన దేశంలోని కేరళ నుంచి వెళ్ళినవారే. గల్ఫ్ దేశాల్లోని అవకాశాల్ని మొట్టమొదటగా గుర్తించి వాటిని అంది పుచ్చుకోవడం వల్ల వారి ఆధిపత్యం అక్కడ అనేక రంగాల్లో కొనసాగుతోంది. 1972 నుంచి 1983 మధ్య కాలంలో వచ్చిన గల్ఫ్ బూమ్ను మలయాళీలు బాగా వినియోగించుకున్నారు. అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలామంది క్లర్కులుగా, ఆర్కిటె క్టులుగా, నిర్మాణ రంగంలో సూపర్వైజర్లుగా, ఇంజినీర్లుగా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటితరం వారు ఆ తర్వాత తమ బంధువుల్ని, స్నేహితుల్ని తీసుకువెళ్లారు. యూఏఈలో 7,73,624 మంది, కువైట్లో 6,34,728 మంది, సౌదీ అరేబియాలో 4,47,440 మంది, ఖతర్లో 4,45,000 మంది, ఒమన్లో 1,34,019 మంది, బహ్రెయిన్లో 1,01,556 మంది మలయాళీలు ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు పంపించే విదేశీ మారకద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రపు ఆర్థిక చిత్రపటం మారిపోయిందని చెప్పాలి. ప్రతి ఏటా రమారమి 60,000 కోట్ల రూపాయలు కేరళకు వస్తుంటాయి. తాము ఆ దేశాల్లో పనిచేసి సంపాదించిన ధనంలో ప్రతి ఒక్కరు కొంత వెనక్కి తమ కుటుంబాలకు పంపిస్తుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే మలయాళీ ప్రజలు గల్ఫ్లో ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్బు దేశాలతో కేరళకు సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం. కేరళలో పెద్ద పరిశ్రమలు తక్కువ. పర్యావరణంపై ప్రజల చైతన్యం ఎక్కువ. ట్రేడ్ యూనియన్ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సగటు మలయాళీ ప్రవాసిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. యువతులు కూడా దూర ప్రదేశాలు వెళుతుంటారు. కోల్కతా, ముంబై, ఢిల్లీ, ఇంకా దేశంలో ఎక్కడ అవకాశాలు ఉన్నా వెళుతుంటారు. ముఖ్యంగా నర్సింగ్ వృత్తి పరంగా చూస్తే దేశ విదేశాల్లో కేరళ నర్సులకు మంచి డిమాండ్ ఉంది. దేశంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిని చూసినా అత్యంత ఎక్కువ సంఖ్యలో కేరళ నర్సులే ఉంటారు. గల్ఫ్ సంపద కేరళలో ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలామంది మలయాళీ కోటీశ్వరులు ఆ దేశాల్లోనే వ్యాపారం చేసి, తర్వాత మిగతా దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించారు. ముథూట్ గోల్డ్ ఫైనాన్స్ గానీ, జాయ్ అలుక్కాస్ గోల్డ్ కంపెనీ గానీ గల్ఫ్ దేశాల సంపదతో విస్తరించినవే. యూసుఫ్ ఆలీ (లూలూ గ్రూప్), షంషేర్ వయలిల్ (వీపీఎస్ హెల్త్ కేర్), సన్నీ వర్కీ (జెమ్స్ ఎడ్యుకేషన్), పి.ఎన్.సి. మీనన్ (శోభ గ్రూప్) లాంటి మలయాళీ కుబేరులంతా వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి ఆ తర్వాత మన దేశంలో విస్తరించినవారే. ఇప్పటికీ వారి ప్రధాన కేంద్రాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి. కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రమారమి రెండింతలు గల్ఫ్ నుంచి వస్తుంది. గల్ఫ్ నుంచి వచ్చీ పోయే ప్రయాణీకుల కోసం కేరళలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడటానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కొచ్చి, కోజీకోడ్, మలప్పురం, కన్ననూర్ వంటి ప్రాంతాల్లో గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువుల్ని ధారాళంగా అమ్ముతుంటారు.గల్ఫ్ నుంచి వచ్చే ధనం వల్ల వినిమ యతత్వం బాగా పెరిగిందనే ఒక ఆరోపణ ఉన్నది. గల్ఫ్ నుంచి వచ్చిన లేదా అక్కడ పనిచేసే యువకులకు పెళ్ళి విషయంలో మంచి డిమాండ్ ఉన్నది. మరి అక్కడ విషాధ గాథలు లేవా అంటే ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి గల్ఫ్ వెళ్ళి అనుకున్న పని దొరక్క పడరాని పాట్లు పడేవారూ ఉన్నారు. అక్కడి పత్రికల్లోనూ, టీవీ చానెళ్ళలోనూ అలాంటివారి కోసం ప్రత్యేకంగా కొంత స్పేస్ కేటాయిస్తారు. ఇటీవల వచ్చిన ‘ఆడు జీవితం’ (గోట్ లైఫ్) సినిమా అలాంటి వారి బాధల్ని చిత్రించిందన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, లక్షలాది మధ్య తరగతి ప్రజలకు ఉపాధి చూపిన గల్ఫ్ దేశాల చమురు నిల్వలు ఇంకా చాలా కాలం ఉండాలని ఆశిద్దాం.మూర్తి కెవివిఎస్వ్యాసకర్త రచయిత, అనువాదకుడుమొబైల్: 78935 41003 -
ఫోన్లో తలాక్ చెప్పాడు... ఫిక్స్ అయిపోయాడు!
రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం కువైట్కు వెళ్లి జీవిస్తున్నాడు. అయితే అతనికి పాకిస్థాన్కు చెందిన మహిళ పరిచయం అవ్వగా.. ఆమెను వివాహం చేసుకునేందుకు భారత్లోని తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అయితే సోమవారం అతడు జైపూర్ భారత ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు.. రాజస్థాన్లోని చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ కువైట్లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్గఢ్లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్కు పాకిస్థాన్కు చెందిన మెహ్విష్ అనే మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్ కువైట్ నుంచి భారత్లో ఉంటున్న తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం సౌదీ అరేబియాలో పాక్ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో మొదటి భార్య ఫరీదా బానో తన భర్త రెహ్మాన్పై కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్ను హనుమాన్ఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు హనుమాన్గఢ్ డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపారు. -
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. కారణం ఏంటో తెలుసా?
పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. పెళ్లి కొత్త జీవితానికి నాంది.. పెళ్లి అనేక మధురానుభూతులకు, జ్ఞాపకాలకు వేదిక.. ఇలాంటి పదాలన్నీ తరుచూ వింటుంటాం.. ఒకప్పుడు పెళ్లంటే గౌరవం, నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దంపతుల మధ్య అపార్థాలు, చిన్న సమస్యలనే పెద్దదిగా చూడటం.. ఇలా అనేక కారణాలతో పెళ్లైన వెంటనే విడాకుల బాట పడుతున్నారు.తాజాగా ఓ జంట వివాహం జరిగిన మూడు అంటే మూడు నిమిషాలకే విడాకులు తీసుకుంది. న్యాయమూర్తి సైతం ఆ జంటకు విడాకులు మంజూరు చేశాడు. వినడానికి కాస్తా ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ఈ ఘటన కువైట్ దేశంలో జరిగింది. అయితే ఈ సంఘటన 2019 జరగ్గా.. తాజాగా మరోసారి వైరల్గా మారింది. కువైట్లో వధూవరులు, తమ వివాహ రిజిస్ట్రేషన్ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ, వధువు పొరపాటున కాలు జారి కింద పడిపోయింది. దీంతో వెంటనే పక్కనే ఉన్న వరుడు ఆమెను తెలివి తక్కువదానా అంటూ పరుష పదజాలానికి దిగాడు.తనకు సాయం చేయాల్సింది పోయి, పరువు తీశావంటూ అవమానించడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించిన ఆమె, ఒక్కసారిగా జడ్జి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి, విడాకులు కావాలని అడిగింది. దీని న్యాయమూర్తి అంగీకరించి వెంటనే విడాకులు మంజూరు చేేశాడు.అయితే పెళ్లైన మూడు నిమిషాలకే ఆ జంట విడాకులు తీసుకోవడంతో.. దేశ చరిత్రలో అతి తక్కువ సమయం వివాహంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉండగా గతంలో దుబాయ్లో ఓ జంట పెళ్లయన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది. -
కువైట్లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం
గల్ఫ్ దేశం కువైట్లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ భారతీయ కుటుంబం సజీవదహనం అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలోని ఓ ఫ్లాట్లో చోటు చేసుకుంది.వివరాలు.. కేరళకు చెందిన నాలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు రాత్రి 9 గంటలకు నిద్రపోయిన తర్వాత వారిలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఆ కుటుంబం మంటల్లో సజీవదహనం అయింది.Four members of a #Malayali family died in a fire accident at their residence in Abbasiya, #Kuwait. The deceased are Mathew Muzhakkal, his wife Lini Abraham, and their children Isaac and Irene, all hailing from Thiruvalla, #Kerala.The fire broke out in the second-floor… pic.twitter.com/AAa8K7jZqz— South First (@TheSouthfirst) July 20, 2024మృతి చెందినవారిని మాథ్యూ ములక్కల్ (40), అతని భార్య లిని అబ్రహం (38), వారి పిల్లలు ఇరిన్ (14),ఇస్సాక్ (9)గా గుర్తించారు. వీరు కేరళలో అలప్పుజ జిల్లాలోని నీరట్టుపురానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇటీవల వారు కేరళ వచ్చి.. శుక్రవామరే అక్కడివెళ్లారు. అంతలోనే రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనలో కుటుంబం మొత్తం మృతి చెందటంపై తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు కనీరుమున్నీరు అవుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఇంట్లోని ఏసీ పవర్ ఫెయిల్యూర్ కారణంగా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో వారంతా విషపూరిత వాయువును పీల్చుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక.. గతనెల ఓ అపార్టుమెంట్లో భారీగా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో మొత్తం 49 మంది మరణించగా.. 45 మంది భారతీయులేనని అధికారలు గుర్తించారు. ఇందులో కేరళ, తళమిళనాడుకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. -
కువైట్లో అన్నమయ్య జిల్లా వాసి ఆర్తనాదాలు
వాల్మీకిపురం: ఎన్నో ఆశలతో కువైట్కు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఎడారిలో తాను కష్టాలు పడుతున్నానని, కాపాడాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘ఎడారిలో మేకలు, గొర్రెలు, కుక్కలకు నేనొక్కడినే మేత వేస్తున్నా..నీళ్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఎండలకు నా వల్ల కావడంలేదు. ఎవరైనా సాయం చేయండి.. లేదంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన రామచంద్రరావ్ కుమారుడు శివ (40) అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం బోయపల్లికి చెందిన శంకరమ్మను 18ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి వెన్నెల, వనిత అనే కుమార్తెలు ఉన్నారు. శివ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బిడ్డలను చదివించలేని పరిస్థితి ఉండడంతో పెద్ద కుమార్తెతో పాటు భార్యను సైతం కూలీకి తీసుకెళ్లి వచ్చిన డబ్బుతో చిన్న కుమార్తె వనితను చదివిస్తున్నాడు. ఈ క్రమంలో కువైట్ వెళ్లి డబ్బు సంపాదించి పెద్ద కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి డబ్బులు పోగేసుకొని రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ను సంప్రదించాడు. అతని ద్వారా శివ నెలక్రితమే కువైట్కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో గొర్రెలు, పావురాలు, బాతులు మేపడానికి బాధితుడిని పెట్టారు. అయితే అక్కడ సంబంధిత యజమానులు నాలుగు రోజులైనా గొర్రెల దగ్గరికి రాకపోగా సరిపడా ఆహారం, నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయాడు. ఈ తరుణంలో తన భార్యకు, ఏజెంట్కు సమాచారం అందించాడు. తిరిగి రావడానికి డబ్బులు ఎవ్వరు ఇస్తారని, నువ్వు అక్కడే పని చేయాల్సిందేనని ఏజెంటు చెప్పడంతో తన దగ్గర డబ్బులు లేవని, భార్య నిస్పహాయత చూపడంతో బాధితుడు చేసేది ఏమీలేక తనకు చావే శరణ్యమని, తనను ఎవరైనా దయగలవారు ఇండియాకు తీసుకెళ్లాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎంబసీ వారు స్పందించారు. బాధితుడు శివను భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.మా నాన్నను భారత్కు రప్పించండిమా నాన్న శివ కువైట్కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో ఉన్నాడు. దయచేసి ఎవరైనా సహాయం చేసి మా నాన్నను భారత్కు రప్పించండి.– వనిత, బాధితుడి కుమార్తె -
Kuwait Fire Incident: భారత్కు చేరుకున్న‘కువైట్’ బాధితుల మృతదేహాలు
కొచ్చి: మూడు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్లో వలసకార్మికులు ఉంటున్న భవంతిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 31 మంది భారతీ యుల మృతదేహాలు స్వదేశానికి చేరుకు న్నాయి. వీరిలో అత్యధికంగా 23 మంది కేరళీయులు ఉన్నారు. మృతుల్లో కర్ణాటక సంబంధించి ఒకరు, తమిళనాడుకు చెందిన ఏడుగురి మృతదేహాలనూ తీసుకొచ్చారు. మృతదేహాలను తొలుత శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానా శ్రయానికి తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వారికి నివాళులర్పించారు. ‘‘ జీవనోపాధి కోసం విదేశం వెళ్లి విగతజీవులైన బడుగుజీవుల కష్టాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవాలి. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం సరిపోదు’ అని సీఎం అన్నారు. కువైట్ నుంచి మృతదేహాల తరలింపు ప్రక్రియను దగ్గరుంచి చూసుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తోపాటు తమిళనాడు మైనారిటీ సంక్షేమ మంత్రి కేఎస్ మస్తాన్లు సైతం పార్థివదేహాల వద్ద నివాళులర్పించారు.మృతుల్లో ముగ్గురు తెలుగువారుఅగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువ్యక్తులు సైతం చనిపోయారని ఆంధ్రప్రదేశ్ నాన్– రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి. లోకనాథం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణ, ఎం.ఈశ్వరుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఏపీఎన్ఆర్టీఎస్ పేర్కొంది. ‘‘ సొంత పనిమీద స్వదేశానికి వచ్చిన లోకనాథం తిరిగి కువైట్ బయల్దేరారు. స్వస్థలం నుంచి తొలుత జూన్ 5న హైదరాబాద్కు వచ్చి నాలుగు రోజులు ఉండి తర్వాత జూన్ 11న కువైట్ చేరుకున్నారు. ఆయన భవంతికి వచ్చి బసచేసిన అదే రోజున అగ్నిప్రమాదం జరిగి తుదిశ్వాస విడిచారు’’ అని లోకనాథం బంధువు శాంతారావు చెప్పారు. -
కువైట్ నుంచి భారత్ కు 45 మృతదేహాలు
-
Kuwait Fire వచ్చే నెలలోనే పెళ్లి... భగవంతుడా నాబిడ్డ ఎక్కడ?
కువైట్లోని మంగాఫ్ భవనంలో చెలరేగిన మంటలు మరణమృదంగాన్ని సృష్టించాయి. పొట్టచేతపట్టుకొని ఎడారి దేశం పోయిన శ్రమజీవులు 45 మంది భారతీయులు అగ్నికి ఆహూతైపోయారు. పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తన బిడ్డ ఏమైపోయాడో తెలియక బిహార్కు చెందిన ఒక తల్లి తల్లడిల్లి పోతోంది.ఈ అగ్నిప్రమాదం గురించి విన్నప్పటి నుండి బిహార్లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన మదీనా ఖాతూన్ తన కొడుకు ఆచూకీకోసం ఆందోళన పడుతోంది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన తన పెద్ద కొడుకు కాలూ ఖాన్ ఫోన్ కాల్స్కు స్పందించడంలేదనీ, అతని ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదని వాపోతోంది. తన కుమారుడికి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ భయాందోళన వ్యక్తం చేసింది. శుభవార్త అందించు దేవుడా అంటూ ఖాతూన్ కన్నీరు మున్నీరవుతోంది.కాలూ ఖాన్ ప్రమాదం జరిగిన భవనంలో నివసిస్తున్నాడని, పెళ్లి కోసం జూలై 5న రావాల్సి ఉందని చెప్పింది. "కొన్నేళ్లుగా కువైట్లో నివసిస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేనుఫోన్లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు" అని ఆమె మీడియా ప్రతినిధులకు తెలిపింది. అతని ఫోటోలను ఎంబసీ అధికారులకు పంపామనీ, అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది."ఎలక్ట్రికల్ సర్క్యూట్" కారణంగా ఘోరమైన మంటలు సంభవించాయని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. కువైట్ మంగాఫ్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలతో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కేరళలో ల్యాండ్ అయింది.మృతిచెందిన వారి సంఖ్య రాష్ట్రాల వారిగా కేరళ - 23 తమిళనాడు -7ఉత్తరప్రదేశ్ -3ఆంధ్రప్రదేశ్ -3ఒడిశా- 2బీహార్, వెస్ట్ బెంగాల్ పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. రూ. 2 లక్షల పరిహారంకువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. -
కువైట్ అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు.. ప్రత్యేక విమానంలో మృతదేహాలు..
-
కువైట్ నుంచి మృతదేహాలు.. కొచ్చిన్ చేరుకున్న ప్రత్యేక విమానం
Updates..👉కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారికి సీఎం విజయన్, కేంద్ర మంత్రి కృతివర్ధన్ సింగ్, ఇతర మంత్రులు నివాళులు అర్పించారు. కొచ్చిన్ విమానాశ్రయంలో సంతాపం తెలిపారు. #WATCH | Ernakulam: Kerala CM Pinarayi Vijayan, MoS MEA Kirti Vardhan Singh and other ministers pay homage to the mortal remains of the victims of the fire incident in Kuwait, at Cochin International Airport. pic.twitter.com/LvcbBEmQm8— ANI (@ANI) June 14, 2024 👉 కువైట్లో మరణించిన వాళ్ల మృతదేహాలను కొచ్చిన్ ఎయిర్పోర్టు నుంచి స్వస్థలాలకు తరలిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. #WATCH | Ernakulam, Kerala: The mortal remains of the 45 Indian victims in the fire incident in Kuwait arrive at Cochin International Airport. pic.twitter.com/nzl5vDNze4— ANI (@ANI) June 14, 2024 #WATCH | Ernakulam, Kerala: The mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait being taken out of the special Indian Air Force aircraft at Cochin International Airport.(Source: CIAL) pic.twitter.com/Dsn8hHhcqS— ANI (@ANI) June 14, 2024 కువైట్ మృతుల్లో తెలుగు వాళ్లు వీళ్లే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు 👉 కువైట్ నుంచి 45 మంది భారతీయుల మృతదేహాలు కొచ్చిన్ చేరుకున్నాయి. మృతుల్లో ఏపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. కాగా, మృతదేహాలకు ప్రభుత్వం డీఎన్ఏ టెస్టులు నిర్వహించనుంది. #WATCH | Ernakulam: Kerala CM Pinarayi Vijayan arrives at the Cochin International Airport where the special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait will reach shortly. pic.twitter.com/oKNVYE0lcG— ANI (@ANI) June 14, 2024 👉 కొచ్చిన్ విమానాశ్రయానికి చేరుకున్న కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేష్ గోపి. మృతదేహాలను బంధువులకు అప్పగించేందకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. అంబులెన్స్లు సిద్ధం చేసిన కేరళ ప్రభుత్వం. #WATCH | Ernakulam: Special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait reaches Cochin International Airport. (Source: CIAL) pic.twitter.com/UKhlUROaP7— ANI (@ANI) June 14, 2024 👉ఇటీవల కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్కు చెందిన 45 మంది కార్మికులు మరణించారు. కాగా, వారి మృతదేహాలను భారత్కు తరలిస్తున్నారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J శుక్రవారం ఉదయం కువైట్ నుంచి కేరళకు బయలుదేరింది.👉కాగా, కువైట్లోని మంగాఫ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలను భారత్కు తరలించేందుకు విదేశాంగశాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం ఉదయం విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కువైట్ అధికారులతో మాట్లాడి మృతదేహాలను వెంటనే భారత్కు తరలించేలా కృషి చేశారు. ఇక, భారతీయుల మృతదేహాలతో ప్రత్యేక విమానం C-130J కువైట్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరింది. 🚨 India to repatriate remains of 45 nationals killed in Kuwait fire. Most victims are from Kerala (23), followed by Tamil Nadu (7), Andhra Pradesh (3), Uttar Pradesh (3), Odisha (2), and one each from Bihar, Punjab, Karnataka, Maharashtra, West Bengal, Jharkhand, and Haryana.… https://t.co/hLkfaxVnzl pic.twitter.com/mAxV5uzmXK— Dharmishtha (@Dharmishtha_D) June 14, 2024 అయితే, దక్షిణ కువైట్లోని విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 50 మంది మృతిచెందగా వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కేరళకు చెందినవారు ఉన్నారు. 24 మంది మలయాళీలు చనిపోయినట్టు సమాచారం. ఈ మేరకు ఓ అధికారి అనధికారికంగా ఓ ప్రకటన చేశారు. ప్రత్యేక విమానం కొచ్చి విమానాశ్రయానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. We have made all the required arrangements for receiving the bodies. We have coordinated with the family members of the victims: #Ernakulam Range DIG Putta Vimaladitya on mortal remains of #Kuwait fire incident pic.twitter.com/bw8u0YvO1F— DD News (@DDNewslive) June 14, 2024 -
Kuwait Fire Incident: 49లో 45 మంది భారతీయులే
కువైట్ సిటీ/ దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్లో బుధవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో అగ్నికి ఆహుతైన 49 మందిలో 45 మంది భారతీయులేనని అధికారులు తెలిపారు. మరో ముగ్గురు ఫిలిప్పీన్స్ దేశస్తులు కాగా మరో మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుల్లో మలయాళీలు 24 మంది ఉన్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్ర వాసులు మరో ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది. విదేశాంగ శాఖ నుంచి ధ్రువీకరణ సమాచారం అందాక బాధితుల వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్లో మాంగాఫ్ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో 49 మంది మృతి చెందగా మరో 50 మంది వరకు గాయపడ్డారు. గురువారం కువైట్ చేరుకున్న విదేశాంగ మంత్రి కీర్తివర్థన్ సింగ్ క్షతగాత్రులైన భారతీయులతో మాట్లాడి, వారికి అవసరమైన సాయం అందేలా చూస్తున్నారు. ముబారక్ అల్కబీర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న భారతీయులను పరామర్శించారు. అదేవిధంగా, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నీళ్ల ట్యాంకుపైకి దూకి..ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఆ భవనంలో కేరళలోని త్రిక్కారిపూర్కు చెందిన నళినాక్షన్ కూడా నిద్రిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్న ఆయన జనం హాహాకారాలు విని, వెంటనే అప్రమత్తం అయ్యారు. భవనం సమీపంలోనే ఉన్న వాటర్ ట్యాంకుపైకి దూకారు. పక్కటెముకలు విరిగి, తీవ్రంగా గాయపడిన నళినాక్షన్ ట్యాంకుపైన చిక్కుకుపోయారు. కదల్లేని స్థితిలో ఆయన్ను ఉదయం 11 గంటల సమయంలో కొందరు గుర్తించి కిందికి దించి, ఆస్పత్రికి తరలించారని అతడి మామ బాలకృష్ణన్ చెప్పారు.కుమార్తెకు బహుమతిగా ఫోన్ ఇవ్వాలని..12వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన తన కూతురికి ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్నారు లుకాస్. ఇంటికెళ్లాక కుమార్తెను స్వయంగా బెంగళూరు తీసుకెళ్లి నర్సింగ్ స్కూల్లో చేర్పిద్దామనుకున్నారు. అయితే, ఆ కల నెరవేరలేదు. కువైట్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారిలో కేరళలోని కొల్లంకు చెందిన లుకాస్ కూడా ఉన్నారు. బుధవారం వేకువజామున ప్రమాదం జరిగిన సమయంలో లూకాస్ తమ సొంతూళ్లోని చర్చి ఫాదర్తో ఫోన్లో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఫోన్ డిస్ కనెక్టయ్యింది. తర్వాత చర్చి ఫాదర్ ఫోన్ చేసినా లూకాస్ లిఫ్ట్ చేయ్యలేదు. 18 ఏళ్లుగా కువైట్లో ఉంటున్న లూకాస్కు వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
వలస పోయిన మందహాసం
కువైట్ దక్షిణ ప్రాంతంలోని మంగఫ్ నగరంలో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా గాయాల పాలవడం విషాదం. మృతుల్లో 43 మంది స్వదేశంలోని కుటుంబాలను పోషించడం కోసం కడుపు కట్టుకొని వలస వెళ్ళిన మన భారతీయులే కావడం మరింత విషాదం. వలస కార్మికులు ఎక్కువగా నివసించే ఆ ప్రాంతంలో ఆరంతస్థుల అల్–మంగఫ్ అపార్ట్మెంట్ల భవనంలో ఒక్కసారిగా రేగిన మంటలు ఇంతటి ఘోర ప్రమాదానికి దారి తీశాయి. కేరళ, తమిళనాడు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన దాదాపు 200 మంది కార్మికులు నివసిస్తున్న ఆ భవనం మన కేరళకు చెందిన వ్యక్తిది కాగా, మృతుల్లో ఎక్కువ (24) మంది కేరళ వారే! చీకటి వేళ సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో అత్యధికులు ఆ మంటలు, పొగలో చిక్కుకొని ఊపిరి ఆడక చనిపోయారు. ఓ వంట గదిలో మంటలు మొదలయ్యాయనీ, అవి భవనమంతటికీ వ్యాపించాయనీ స్థానిక మీడియా కథనం. ఈ ఘటనపై కూలంకషంగా దర్యాప్తు జరిపి, ఎవరు బాధ్యులనేది నిర్ణయిస్తామని కువైట్ చెబుతోంది. కారణాలు ఏమైనా బాధిత కుటుంబాల కన్నీళ్ళు ఆగేవి కావు. కష్టపడి నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించి, ఊళ్ళోని కుటుంబాలను బాగా చూసుకోవాలని బయలుదేరిన పలువురి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. కువైట్లో అగ్ని ప్రమాదాల చరిత్ర గమనిస్తే, 2009లో రెండో పెళ్ళి చేసుకుంటున్న తన భర్తపై ప్రతీకారంతో ఓ కువైట్ మహిళ వివాహ విందులో గుడారానికి నిప్పు పెట్టినప్పుడు 57 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆ దేశంలో ఇదే అతి పెద్ద ఘోరకలి. 2022 మార్చిలోనూ కువైట్లో పేరున్న ముబారకియా మార్కెట్ వాణిజ్యప్రాంతంలో ఇప్పటిలానే అగ్నిప్రమాదం సంభవించింది. మళ్ళీ ఇప్పుడీ తాజా ప్రమాదం. జాగ్రత్తలు తీసుకుంటామంటూ అధికారులు చెబుతున్నా అవేవీ వాస్తవ రూపం ధరించడం లేదు. ఈ ఘటనల వెనుక స్థానికంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దురాశ లాంటివెన్నో ఉన్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఒక్క కువైట్లోనే కాదు, మధ్యప్రాచ్యంలోని అనేక ప్రాంతాల్లోనూ వలస కార్మికులు అవస్థలు, వారి అమానవీయ జీవన పరిస్థితులు అనేకం. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వల్లో ఆరో స్థానంలో ఉన్న కువైట్ మొత్తం 42 లక్షల పైగా జనాభాలో స్థానికుల కన్నా పని చేయడానికి వలస వచ్చినవారే ఎక్కువ. ఆ దేశంలో మన ప్రవాసీయుల సంఖ్య పది లక్షల పైనే! ఇంకా చెప్పాలంటే, కువైట్ మొత్తం జనాభాలో 21 శాతం మనవాళ్ళే! అక్కడి శ్రామిక వర్గంలో 30 శాతం మంది మనమే. 1990 – 91లో గల్ఫ్ యుద్ధ ప్రభావంతో లక్షలాది భారతీయులు కువైట్ నుంచి వెనక్కి వచ్చేసినా, అనంతరం భారీగా తరలివెళ్ళారు. ఒకప్పుడు అధికంగా ఉన్న పాలస్తీనియుల్ని మనం మించిపోయాం. వడ్రంగులు, తాపీ మేస్త్రీలు, పనివాళ్ళు, డ్రైవర్ల దగ్గర నుంచి ఫుడ్, కొరియర్ బాయ్స్ దాకా కువైట్లో అధికశాతం భారతీయులే. ఇంజనీర్లు, డాక్టర్ల లాంటి వృత్తి నిపుణులున్నా ఎక్కువ మంది అన్–స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులే. ఇలాంటి కార్మికులకు అక్కడ డిమాండ్ ఎక్కువ. అందుకు తగ్గట్టే మన దేశంతో పోలిస్తే, అక్కడ ఆదాయమూ అధికమే. కువైట్, యూఏఈ, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ అనే అరడజను గల్ఫ్ దేశాలకు మన వలసలకదే కారణం. తాజా ఘటనలో చనిపోయిందీ ఇలాంటి వలసజీవులే! అందరూ 20 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు వారే! కేంద్ర మంత్రి, కేరళ ఆరోగ్య మంత్రి సహా పలువురు హుటాహుటిన కువైట్కు పయనమయ్యారు. బాధిత కుటుంబాలకు కేంద్రం, కేరళ ప్రభుత్వాలు తోచిన నష్టపరిహారం ప్రకటించాయి. కానీ, కేవలం ఇది సరిపోతుందా అన్నది బేతాళ ప్రశ్న. కూలి కోసం, కూటి కోసం విదేశాలకు వెళ్ళి, అక్కడ సంపాదించిన సొమ్మును స్వదేశంలోని ఇంటికి పంపి, పరోక్షంగా మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి అండగా నిలుస్తున్న తోటి భారతీయుల పట్ల మన అక్కర అంత మాత్రమేనా? గల్ఫ్ సహా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వలస కార్మికులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ, ఇవాళ్టికీ వీరి వెతల గురించి అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు పట్టించుకొనేది తక్కువే. వెళ్ళినవారు అనుకోకుండా ఏ చిక్కుల్లో పడినా, ఆఖరుకు ప్రాణాలే కోల్పోయినా ప్రవాస తెలుగు, తమిళ, మలయాళీ సంఘాల లాంటి ప్రైవేట్ సంస్థలే చొరవ తీసుకొని సాయపడుతున్నాయి. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క కువైట్లోనే 2014 నుంచి 2018 మధ్య 2932 మంది భారతీయులు మరణించారు. 2023లో 708 మంది చనిపోయారు. అనూహ్య ప్రమాదాలప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే తప్ప, అసలీ వలస కార్మికులు, ప్రవాస భారతీయుల కష్టనష్టాలను నిరంతరం గమనించేందుకు మనకంటూ ఇప్పటికీ పటిష్ఠమైన వ్యవస్థ, ప్రత్యేక మంత్రిత్వ శాఖ లాంటివి లేవు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనల మేరకు గల్ఫ్ వెళ్ళే భారత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలనే భరోసా, కువైట్ వలస కార్మికులకు రూ. 10 లక్షల ప్రవాసీ భారతీయ బీమా పథకం ఉన్నా, విదేశాంగ శాఖలో నమోదు చేసుకొని, అన్ని పత్రాలూ ఉన్నవారికే అవి వర్తిస్తాయి. కానీ, అవేవీ పాటించకుండా పొట్టకూటి కోసం దళారుల్ని ఆశ్రయించి వెళ్ళే బడుగు జీవులే మన దగ్గర ఎక్కువ. పశ్చిమాసియాలోని మన వలస బిడ్డల సంపూర్ణ రక్షణకై ఇప్పటికైనా మన ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. సరైన నివాస వసతి సహా కనీస సౌకర్యాలతో జీవించే ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలతో కలసి కృషి చేయాలి. ఆర్థిక వ్యవస్థను ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలుపుతున్న ఈ కనిపించని శ్రామిక శక్తి పట్ల అది కనీస కర్తవ్యం. జీవితంలో వారు, దేశంగా మనమూ గెలవడం సరే... ముందు హుందాగా బతకడం ముఖ్యం. -
కువైట్లో మన బతుకు చిత్రం (ఛిధ్రం)
-
కువైట్ అగ్ని ప్రమాదంపై కమల్, మమ్ముట్టి దిగ్భ్రాంతి
కువైట్లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందడం పట్ల హీరోలు కమల్ హాసన్, మమ్ముట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది మృత్యువాత పడ్డారు. బాధితుల్లో ఎక్కువమంది కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం కువైట్ వెళ్లి అగ్నికి ఆహుతి అయ్యారు. குவைத் நாட்டின் மங்கஃப் நகரில் உள்ள அடுக்குமாடிக் குடியிருப்பில் நேரிட்ட தீ விபத்தில் இந்தியர்கள் உள்பட 50-க்கும் மேற்பட்டோர் உயிரிழந்த செய்தி மிகுந்த அதிர்ச்சியையும் வேதனையையும் அளிக்கிறது. உயிரிழந்தோர் குடும்பத்தினருக்கு ஆழ்ந்த இரங்கலையும், ஆறுதலையும் தெரிவித்துக் கொள்கிறேன்.…— Kamal Haasan (@ikamalhaasan) June 13, 2024 ఈ విషాద ఘటన పట్ల కమల్ స్పందిస్తూ.. ‘కువైట్లోని మంగాఫ్లో అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో భారతీయులు సహా 50 మందికి పైగా మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘోర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధిత భారతీయులకు అవసరమైన సహాయం అందించడానికి, మరణించిన వారి మృతదేహాలను మాతృదేశానికి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’అని కమల్ ట్వీట్ చేశాడు.Heartfelt condolences to the families of those affected by the Kuwait fire accident. I pray that you gather courage and find solace in this difficult time.— Mammootty (@mammukka) June 12, 2024‘కువైట్ అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో మీకు ధైర్యం, ఓదార్పునివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను’అని మమ్ముట్టి ఎక్స్లో రాసుకొచ్చాడు. -
Kuwait: భారతీయ మృతులపై నో క్లారిటీ: విదేశాంగ శాఖ
దుబాయ్: కువైట్ ఘోర అగ్నిప్రమాదం మృతుల లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 49 మంది చనిపోతే, అందులో 41 మంది భారతీయులే ఉన్నారు. అయితే మృతుల సంఖ్యపై కచ్చితత్వం.. అందులో భారతీయులు ఎందరు?.. వాళ్ల పేర్లు, స్వస్థలం .. ఇతర వివరాలు ఏంటి? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ మేరకు అగ్ని ప్రమాద సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించడానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్ బయల్దేరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తాను అక్కడికి వెళ్తున్నానంటూ కువైట్కు బయలుదేరే ముందు కీర్తివర్ధన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.#WATCH | Kuwait fire incident | Delhi: Before leaving for Kuwait from Delhi Airport, MoS MEA Kirti Vardhan Singh says, "We had a meeting last evening with the PM... The situation will be cleared the moment we reach there... The situation is that the victims are mostly burn… pic.twitter.com/ijqW3QQADM— ANI (@ANI) June 13, 2024‘కువైట్ ప్రమాదంపై ప్రధాని మోదీతో బుధవారం సాయంత్రం సమావేశం అయ్యాం. అక్కడి చేరుకోగానే అక్కడ నెలకొన్న పరిస్థితులపై స్పష్టత వస్తుంది. ప్రమాదంలో చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. మృతదేహాలను గుర్తుపట్టడానికి డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎయిర్ఫోర్స్ విమానం కూడా సిద్ధంగా ఉంది. మృతదేహాలను గుర్తించిన వెంటనే ఎయిర్ పోర్స్ విమానంలో మృతదేహాలను భారత్కు తరలిస్తాం. ఇప్పటివరకు అందినసమాచారం మేరకు 49 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు’ అని అన్నారు.గల్ఫ్ దేశం కువైట్లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుక్ను ఘటనలో ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 40 నుంచి 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు నివసిస్తున్నారు.వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కార్మికుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కార్మికులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది.కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్లోని మొత్తం కార్మికుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కల్పిచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కల్పించని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
Kuwait Building Fire: కువైట్లో భారీ అగ్నిప్రమాదం... 49 మంది దుర్మరణం
దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కారి్మకులు నివసిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వలస వచి్చన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కారి్మకుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కారి్మకులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది. కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్లోని మొత్తం కారి్మకుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కలి్పంచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. యాజమాన్యం దురాశకు అమాయకులు బలి మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కలి్పంచని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కారి్మకులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిహుటాహుటిన కువైట్కు మంత్రి రాజవర్ధన్ సింగ్కువైట్ అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. కువైట్ భారత రాయబార కార్యాలయం సహాయక చర్యల్లో నిమగ్నమైందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. ఈ ఉదంతంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్కు బయలుదేరారు. సహాయ చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. మృతుల్లో మలయాళీలు ఎక్కువగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తమయ్యారు. కేంద్రం వెంటనే తగిన సాయం అందించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు లేఖ రాశారు. -
Kuwait Fire: కువైట్లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో భారతీయులు
కువైట్ సిటీ: కువైట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం (జూన్12) తెల్లవారుజామున 3 గంటలకు సదరన్ అహ్మదిలోని మంగాఫ్లో ఉన్న ఆరు ఫ్లోర్ల అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లోని ఒక గదిలో ఉన్న కిచెన్ నుంచి ముందుగా మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంటల్లో మొత్తం 53 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 40 మంది దాకా భారతీయులే. తీవ్రంగా గాయపడిన మరో 40కి పైగా మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు అపార్ట్మెంట్లో 160 మంది దాకా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికులని సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై కువైట్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విచారం వ్యక్తం చేశారు. -
సునీల్ ఛెత్రి వీడ్కోలు
కోల్కతా: రెండు దశాబ్దాలుగా భారత ఫుట్బాల్ ముఖచిత్రంగా ఉన్న సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భాగంగా గురువారం కువైట్తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ను సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది.నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. నాలుగో నిమిషంలో కువైట్ ప్లేయర్ ఈద్ అల్ రషీది కొట్టిన షాట్ను భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. అనంతరం 11వ నిమిషంలో అన్వర్ అలీ కొట్టిన హెడర్ షాట్ లక్ష్యాన్ని చేరలేకపోయింది. 48వ నిమిషంలో భారత ప్లేయర్ రహీమ్ అలీ ‘డి’ ఏరియాలోకి వెళ్లినా అతను కొట్టిన షాట్లో బలం లేకపోవడంతో బంతి నేరుగా కువైట్ గోల్కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లకు గోల్ చేసేందుకు ఒకట్రెండు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత్ తన చివరి మ్యాచ్ను జూన్ 11న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో ఆడనుంది. 2005లో జాతీయ సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఛెత్రి ఓవరాల్గా భారత్ తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 94 గోల్స్ సాధించాడు. ఇందులో నాలుగు ‘హ్యాట్రిక్’లున్నాయి. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు జాతీయ ఉత్తమ ఫుట్బాల్ ప్లేయర్ అవార్డు గెల్చుకున్న సునీల్ ఛెత్రికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్రత్న’ (2021లో)... అర్జున అవార్డు (2011లో), పద్మశ్రీ (2019లో) లభించాయి. -
భారత్ తరఫున చివరిసారి బరిలోకి సునీల్ ఛెత్రి... నేడు కువైట్తో భారత్ పోరు
ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ టోర్నీ రెండో రౌండ్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భాగంగా నేడు కువైట్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే మూడో రౌండ్కు అర్హత పొందే అవకాశాలు మెరుగవుతాయి. కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి జరగనున్న ఈ మ్యాచ్ భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్ కానుంది. 2005లో తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఆడిన 39 ఏళ్ల ఛెత్రి ఇప్పటి వరకు 150 మ్యాచ్లు పూర్తి చేసుకొని 94 గోల్స్ సాధించాడు. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆసియా క్వాలిఫయర్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రస్తుతం ఖతర్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, అఫ్గానిస్తాన్ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. -
టీసీఎస్కు కువైట్ బ్యాంక్ డీల్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రముఖ కువైట్ బ్యాంకు డీల్ను దక్కించుకుంది. కువైట్లోని ప్రముఖ వాణిజ్య బ్యాంకు అయిన బుర్గాన్ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని ఆధునీకరించడానికి డీల్ కుదుర్చుకున్నట్లు టీసీఎస్ ప్రకటించింది.ఈ డీల్లో భాగంగా బుర్గాన్ బ్యాంక్ బహుళ స్వతంత్ర లెగసీ అప్లికేషన్లను సమకాలీన సార్వత్రిక బ్యాంకింగ్ సొల్యూషన్గా ఏకీకృతం చేయడంలో టీసీఎస్ సహాయం చేస్తుంది. 160కి పైగా శాఖలు, 360 ఏటీఎంల ప్రాంతీయ నెట్వర్క్తో కువైట్లోని అతి తక్కువ కాలంలో ఏర్పాటైన వాణిజ్య బ్యాంకులలో బుర్గాన్ బ్యాంక్ ఒకటి. అధిక లావాదేవీల వాల్యూమ్లను నిర్వహించడానికి, ఆటోమేషన్ను మెరుగుపరచడానికి, సిబ్బంది ఉత్పాదకతను మెరుగుపరచడానికి టీసీఎస్ అందించే పరిష్కారాన్ని బుర్గాన్ బ్యాంక్ అమలు చేయనుంది.బుర్గాన్ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ డాహెర్ మాట్లాడుతూ కస్లమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తమ కోర్ సిస్టమ్ల ఆధునికీకరణపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. బుర్గాన్ బ్యాంక్ వంటి ప్రగతిశీల సంస్థతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని టీసీఎస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ గ్లోబల్ హెడ్ వెంకటేశ్వరన్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
‘‘కఠిన శ్రమకోర్చే.. ఓ మంచి ఆటగాడిగా అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని మాత్రమే కోరుకుంటా. చూడటానికి చక్కగా కనిపించే హార్డ్ వర్కర్ ఉండేవాడని నన్ను గుర్తుంచుకుంటే చాలు’’ అని భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి అన్నాడు. అదే తాను ఇక్కడ విడిచి వెళ్తున్న జ్ఞాపకంగా మిగిలిపోవాలని పేర్కొన్నాడు.కాగా భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. జూన్ 6న తన చివరి మ్యాచ్ ఆడబోతున్నానని 39 ఏళ్ల ఛెత్రి గురువారం ప్రకటించాడు.ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్లలో కొనసాగుతావచ్చే నెల 6న ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భాగంగా కువైట్తో జరిగే మ్యాచే తన కెరీర్లో చివరిదని ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.అయితే ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్లలో కొనసాగుతానని ఛెత్రి స్పష్టం చేశాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఫుట్బాలర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు (19 ఏళ్లు) భారత జట్టుకు సేవలందించాడు. ఢిల్లీకి చెందిన ఆర్మీ అధికారి కేబీ ఛెత్రి, సుశీల దంపతులకు 1984, ఆగస్టు 3న సికింద్రాబాద్ (తెలంగాణ)లో జన్మించిన ఛెత్రి భారత ఫుట్బాల్లో అసాధారణ ఫార్వర్డ్ ఆటగాడిగా ఎదిగాడు. తదనంతరం నాయకత్వ పటిమతో విజయవంతమైన సారథి అయ్యాడు. భారత ఫుట్బాల్ చరిత్రలో చురుకైన దిగ్గజంగా వెలుగొందుతున్నాడు. ఆరోజు ఏడుస్తూనే ఉంటాఇక తన రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సునిల్ ఛెత్రి.. ‘‘జూన్ 6న నేను రిటైర్ అవుతాను.. జూన్ 7 మొత్తం ఏడుస్తూనే ఉంటాను. జూన్ 8న కాస్త రిలాక్స్ అవుతాను. జూన్ 8 నుంచి బ్రేక్ తీసుకుని నా కుటుంబానికి సమయం కేటాయిస్తాను’’ అని తెలిపాడు.సునిల్ ఛెత్రి సాధించిన ఘనతలు 👉150 అంతర్జాతీయ మ్యాచ్లాడిన సునీల్ 94 గోల్స్ కొట్టాడు. భారత్ తరఫున టాప్ స్కోరర్ కాగా... ఓవరాల్గా ఫుట్బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున ఎక్కువ గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో టాప్–3లో ఉన్నాడు. క్రిస్టియానో రోనాల్డో (128 గోల్స్; పోర్చుగల్), మెస్సీ (106 గోల్స్; అర్జెంటీనా) తర్వాతి స్థానం మన ఛెత్రిదే! 👉మూడు సార్లు భారత జట్టు నెహ్రూ కప్ అంతర్జాతీయ టోర్నీ (2007, 2009, 2012) టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 👉దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్షిప్లో భారత్ మూడు (2011, 2015, 2021) టైటిల్ విజయాలకు కృషి చేశాడు. 👉2008లో ఏఎఫ్సీ చాలెంజ్ కప్ను గెలిపించిన ఛెత్రి, ఏడుసార్లు ‘ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. భారత్లోని ప్రముఖ ఫుట్బాల్ క్లబ్లైన ఈస్ట్ బెంగాల్, డెంపో, ముంబై సిటీ ఎఫ్సీ, బెంగళూరు ఎఫ్సీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా జట్లకు లీగ్ ట్రోఫీలు అందించాడు.‘అతనో ఫుట్బాల్ శిఖరం’ భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితరులంతా ఛెత్రి ఘనతల్ని కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా వారంతా అతనొక రియల్ లెజెండ్గా కితాబిచ్చారు. బీసీసీఐ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సైతం ఛెత్రి సేవలకు సెల్యూట్ చేశాయి.నాకు ముందే తెలుసుఛెత్రి రిటైర్మెంట్ గురించి తనకు ముందే తెలుసన్నాడు క్రికెటర్ విరాట్ కోహ్లి. అతడిని చూసి తాను గర్వపడుతున్నానని.. ఏదేమైనా బాగా ఆలోచించిన తర్వాత సునిల్ ఛెత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. కాగా కోహ్లి, సునిల్ ఛెత్రి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.చదవండి: IPLలో రూ. 20 లక్షలు.. అక్కడ అత్యధిక ధర! నితీశ్ రెడ్డి రియాక్షన్ ఇదే -
చేపల పడవలో దేశాలే దాటారు
ముంబై: పరాయి దేశంలో పడరాని పాట్లు పడి, యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్లే సాహసం చేశారు ముగ్గురు భారతీయులు. అనుకున్నదే తడవుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయల్దేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టినగడ్డపై కాలుమోపేలోపే పోలీసులు అరెస్ట్చేశారు. ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కరులు మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో సముద్రజలాల మీద గస్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. జనవరి 28న ప్రయాణం షురూ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ, 29 ఏళ్ల జె.సహాయట్ట అనీశ్, రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిట్సో డిటోలు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లారు. వీరి వృత్తి చేపలుపట్టడం. కువైట్లోనూ అదే పనిచేసేవారు. కేరళలోని త్రివేండ్రమ్ నుంచి వీరు కువైట్కు వెళ్లారు. యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భారత్కు రానీయకుండా వారి పాస్పోర్టులను దాచేశాడు. ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు. జనవరి 28వ తేదీన ప్రయాణం మొదలెట్టి సౌదీ అరేబియా, ఖతర్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు. రంగంలోకి నేవీ, పోలీసులు మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ముంబైలోని యెల్లో గేట్ పోలీస్స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు. ససూన్ డాక్ ప్రాంతంలో వీరి రాకను గమనించారు. ఈ చేపల పడవ నిర్మాణం భారతీయ పడవలతో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో అనుమానమొచ్చి అడ్డుకున్నారు. అందులోని ముగ్గురికీ మరాఠా, హిందీ అస్సలు రాకపోవడం, పొడిపొడిగా ఇంగ్లిష్లో మాట్లాడుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేవీ అధికారులతోపాటు పోలీసులు మూడు పడవల్లో హుటాహుటిన చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం రప్పించి తనిఖీలు చేయించారు. పేలుడుపదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్రమంగా భారత్లోకి ప్రవేశించారంటూ పాస్పోర్టు సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదుచేసి అరెస్ట్చేశారు. ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 10వ తేదీదాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. విదేశీ గడ్డపై వీళ్లు ఏదైనా నేరానికి పాల్పడ్డారో తెల్సుకోండని పోలీసులకు సూచించారు. పడవలో జీపీఎస్ స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్వా్కడ్ క్షుణ్ణంగా తనిఖీచేసింది. ఒక జీపీఎస్ను గుర్తించారు. సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లను కువైట్కు తీసుకెళ్లిన ఏజెంట్ను కెప్టెన్ మదన్గా పోలీసులు గుర్తించారు. ‘‘అబ్దుల్లా షర్హీద్ అనే మాస్టర్ దగ్గర పనిచేసేవాళ్లం. జీతాలు సరిగా ఇచ్చేవాడు కాదు. అదేంటని అడిగితే చితకబాదేవాడు. ఇదే విషయమై కువైట్లోని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాం. ఇండియన్ ఎంబసీలోనూ మా గోడు వెళ్లబోసుకున్నాం. ఫలితం శూన్యం. అందుకే ఇలా పారిపోయి వచ్చాం’’అని ఈ ముగ్గురు పోలీసులకు చెప్పారు. వీళ్ల కుటుంబీలకు ఇప్పటికే వీరి రాక సమాచారం చేరవేశామని పోలీసులు వెల్లడించారు. -
కువైట్ పాలకుడు కన్నుమూత
దుబాయ్: కువైట్ పాలకుడు అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాహ్(86)శనివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఒక మంత్రి వెల్లడించారు. ఆయన మరణానికి గల కారణాలను మాత్రం పేర్కొనలేదు. ఉప పాలకుడిగా వ్యవహరిస్తున్న ఆయన సవతి సోదరుడు షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబేర్(83)తదుపరి పాలనా పగ్గాలు చేపడతారని తెలుస్తోంది. జబేర్కు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన యువరాజుగా పేరుంది. నవంబర్లో షేక్ నవాఫ్ గుర్తు తెలియని కారణాలతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటకు రాలేదు. -
భారత్ శుభారంభం
కువైట్ సిటీ: ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 1–0 గోల్ తేడాతో కువైట్ జట్టును ఓడించింది. ఆట 75వ నిమిషంలో మాన్విర్ సింగ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని 22 ఏళ్ల తర్వాత వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో విదేశీ గడ్డపై భారత్ తొలి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈనెల 21న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో భారత్ రెండో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. ఇంటా, బయట పద్ధతిలో జరిగే లీగ్ మ్యాచ్లు ముగిశాక గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మూడో రౌండ్కు అర్హత పొందుతాయి. ఇప్పటి వరకు భారత జట్టు ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో మూడో రౌండ్ కు అర్హత సాధించలేదు -
కువైట్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం!
కువైట్ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి గారు, ఏపీఎన్ఆర్టీసీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారు, ఏపీఎస్ఎస్డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్ పాల్గొన్నారు. కువైట్ నలుమూలాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. దాదాపు 400 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. సజ్జల భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ: జగనన్న మీద అభిమానమే మనల్ని అందరినీ ఒక చోటకు చేర్చింది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి. 175/175 టార్గెట్గా అందరం కలిసి పని చేద్దాం, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మేడపాటి వెంకట్ గారు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు పేదల పక్షపాతి. అనుక్షణం పేదల కోసం పాటు పడుతున్నారు.. రాష్ట్ర ప్రజలకే కాదు ప్రవాసాంధ్రులకు సైతం ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చల్లా మధు సూధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు మన సీఎం వైఎస్ జగన్ గారు తీసుకు వచ్చారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీఠ వేయడమే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్న గొప్ప నాయకుడికి మనం అందరం అండగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. (చదవండి: దుబాయ్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం) -
కువైట్ బాధితురాలికి విముక్తి
కడప కార్పొరేషన్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పళంగికి చెందిన గరికపాటి లక్ష్మికి కువైట్లో సేఠ్ వేధింపుల నుంచి విముక్తి లభించింది. ఏపీఎన్ఆర్టీఎస్ సాయంతో ఆమె సురక్షితంగా ఇండియాకు చేరింది. గరికపాటి లక్ష్మి 8 నెలల కిందట జీవనోపాధి కోసం కువైట్ వెళ్లింది. కువైటీ ఇంట్లో పెట్టే బాధలు భరించలేక భారత రాయబార కార్యాలయానికి చేరుకుంది. అయితే అక్కడ ఎవరిని కలవాలో, ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో ఉన్న సమయంలో ఏపీఎన్ఆర్టీస్ సామాజిక కార్యకర్త రెడ్డెయ్య రెడ్డి ఆమెతో మాట్లాడి అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కువైట్ ఇమ్మిగ్రేషన్, ఎంబసీ పనులు పూర్తయ్యేందుకు నెల సమయం పట్టింది. 30 రోజుల పాటు ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ భోజన, వసతి సౌకర్యాలు కల్పించడమేగాక విమాన టికెట్, దారి ఖర్చుల కింద రూ.13 వేలు సాయం చేశారు. 14వ తేదీ తెల్లవారుజామున 4.05 గంటలకు కువైట్ నుంచి బయలుదేరిన ఆమె మధ్యాహ్నం 2.35 గంటలకు హైదరాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సీఎంవైఎస్ జగన్ సారథ్యంలో గల్ఫ్లోని ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరిస్తున్న ఏపీఎన్ఆర్టీఎస్ వారికి రుణపడి ఉంటానని చెప్పారు. -
కువైట్లో ఘనంగా వైఎస్సార్ వర్థంతి వేడుకలు
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకలు కువైట్ లో జరిగాయి. వైఎస్సార్ సిపి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆదేశానుసారం కువైట్లోని, మాలియా ప్రాంతంలో గల పవన్ ఆంధ్ర రెస్టారెంట్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమీటీ సభ్యుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అభిమానులు రాజన్న 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రతి తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని గల్ఫ్ కో-కన్వీనర్ గోవిందు నాగరాజు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత , పేద ధనిక పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఆ జన హృదయ నేతకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరఫున నివాళులు అర్పించారు. తండ్రి అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని.. APNRTS రీజనల్ కోఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి, వైకాపా బీసీ ఇంచార్జ్ రమణ యాదవ్, యువజన విభాగం ఇంచార్జ్ మర్రి కల్యాణ్ తెలిపారు. స్వర్గీయ వైయస్ఆర్. మహానేత ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఒక అడుగు ముందుకేసి రాజన్న బిడ్డ రాజకీయాల్లో కూడా 4 శాతం అవకాశం కల్పించి ముస్లిం సోదరులు రాజకీయ ఎదుగుదలకు అవకాశమిస్తున్నారని.. వైఎస్ఆర్సిపీ కువైట్ కమిటీ మైనారిటీ ఇన్చార్జ్ గఫార్, మరియు షేక్ రహమతుల్లా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు అన్నాజీ రావు, అబు తురాబ్, మీడియా ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, సేవాదళ్ ఇంచార్జ్ గోవిందు రాజు,మైనార్టీ నాయకులు షా హుస్సేన్,మహబూబ్ బాషా,సీనియర్ నాయకులు సుబ్బారావు, యువజన విభాగం సభ్యులు ఏ బాలకృష్ణ రెడ్డి, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు, లక్ష్మి ప్రసాద్, జగనన్న సైన్యం అధ్యక్షుడు బాషా, పాటూరు వాసుదేవ రెడ్డి, అప్సర్ అలీ, పోలి గంగిరెడ్డి, బి. మహేశ్వర్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, పి. సుధాకర్ రెడ్డి, మరియు కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా సోదరులు పాల్గొన్నారు. (చదవండి: దుబాయ్లో ఘనంగా వైఎస్సార్ 14వ వర్థంతి వేడుకలు) -
కువైట్లో ఘనంగా వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్లో ఘనంగా నిర్వహించారు. కువైట్ వైఎస్ అవినాష్ రెడ్డి యూత్ అసోషియేషన్ నాయకులు, ముల్లా జిలాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు కువైట్ వైఎస్ఆర్ సిపీ నాయకులు సహా అవినాష్ అభిమానులు బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అవినాష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రవాసాంధ్రులంటే ప్రత్యేక అభిమానమని, వాళ్ల సమస్యలు ఏవైనా ఆయన దృష్టికి వెళితే వెంటనే స్పందించి పరిష్కరించడానికి కృషి చేస్తారని గోవిందు నాగరాజు పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో గల్ఫ్ లో ఉన్న ప్రవాసాంధ్రులను ఆదుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి మైనార్టీ నాయకులు షేక్ రహమతుల్లా కొనియాడారు. -
సౌదీలో రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ఎన్నారై కుటుంబం మృతి
సౌదీ అరేబియాలో జరిగి శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్నారై కుటుంబం మృత్యువాత పడింది. అన్నమయ్య మదనపల్లికి చెందిన దండు గౌస్ బాషా కువైట్లోని అమెరికన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (02), దామీల్ (ఎనిమిది మాసాలు) తో కలిసి కువైట్ నుంచి పది రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకు(ఉమ్రా) వచ్చారు. సౌదీలోని మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. మదీనాలోని ప్రవక్త మసీదులో ఉమ్రా నిర్వహించి..ప్రార్థనలు చేశారు. తిరిగి కారులో కువైట్కు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. రియాధ్ నగరం నుంచి 120 కిలో మీటర్ల దూరంలో హఫ్నా రోడ్డుపై డివైడర్ను వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి అహుతి అయింది. కారులో ప్రయాణిస్తున్న ఈ నలుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను రియాధ్ సమీపంలోని రూమా ఆసుపత్రికు తరలించారు. నలుగురి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. కారులోని పాస్ పోర్టులు, ఇతరత్రా సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. చనిపోయిన వారిని గుర్తించడం అక్కడి పోలీసులకు కష్టంగా మారింది. ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్ధిఖ్ తువ్వూర్.. మలయాళీ సంఘం కార్యకర్తల సహాయంతో బాధితులను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. రోడ్డు ప్రమాదం గురించి తెలిసి గౌస్ బాషా తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కాగా గౌస్ అన్నమయ్య జిల్లా కడకడ మండల కేంద్రానికి చెందిన వారని తెలిసింది. కొన్నాళ్ళ క్రితం వీరి కుటుంబం మదనపల్లికి ఆ తర్వాత బెంగళూరులో స్ధిరపడినట్లుగా సమాచారం. గౌస్బాషా కుటుంబం బెంగళూరు నుంచి కువైట్కి వెళ్లింది. -
కువైట్లో వైఎస్ రాజశేఖరెడ్డి 74వ జయంతి వేడుకలు
-
కువైట్లో ఘనంగా రాజన్న 74వ జయంతి వేడుకలు
మహానేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి వేడుకలు కువైట్ మాలియా ప్రాంతంలో పవన్ ఆంధ్ర రెస్టారెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి, ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. బాలిరెడ్డి, కమిటీ సభ్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గారి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలి రెఢ్డి గారు మాట్లాడుతూ.. అపర భగీరథుడు రాజన్న తన పరిపాలనలోపేద బడుగు బాలహీన వర్గాల, ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ, రైతులకు రుణ మాఫీ పథకం, ఉచిత విధ్యుత్ పథకం,పేద విద్యార్ధుల చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పధకం ఇలా ఎన్నో సంక్షేమ పధకాలను కుల మతాలకు అతీతంగా అందించి రాష్ట్ర ప్రజల మనస్సులో సంక్షేమ సారధిగ నిలిచి పోయారని కొనయాడారు. ప్రస్తుతం రాజన్న భౌతికంగా మన మధ్య లేకపోయిన నింగిన సూర్యచంద్రులు ఉన్నంత వరకు.. భూమిపై జీవరాసులు ఉన్నంత వరకు ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతి తెలుగు ప్రజల గుండెలలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శాశ్వతంగా ఉంటారని తెలిపారు. గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్ యం వీ నరసారెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ వైఎస్స్ రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉండుంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉండేదన్నారు. ఐనా రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ ఉన్నా.. కూడా తండ్రి ఆశయ సాధన కొరకు రాజకీయాలలో వచ్చిన ముఖ్యమంత్రి అయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత గొప్పగా సంక్షేమ పథకాలను అందించి ప్రజల మనుసును గెలుచుకున్నారు. ఆయన తన తండ్రి కన్నా పది అడుగు ముందుకేసి కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సంక్షేమ పధకాలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పారిపాలన చూసి.. నేను కన్న కలలు నా వారసుడు.. నా ముద్దు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నాడని స్వర్గంలో ఉన్న మహా నాయకుడు వైఎస్సార్ గారి ఆత్మ సంబరపడి ఉంటుందన్నారు. మైనారిటీ నాయకులు షేక్ రహమతుల్లా, బీసీ ఇన్చార్జ్ రమణ యాదవ్ మాట్లాడుతూ.. మహా నేత వైఎస్సార్ గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే,, ఒక అడుగు ముందుకేసి రాజన్న బిడ్డ రాజకీయలలో కూడా 4 శాతం అవకాశం కల్పించి.. ముస్లిం సోదరులు రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వడమేగాక ఏకంగా 5 మందికి శాసనసభ టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో నలుగురు గెలవడం.. ఒకరికి ఏకంగా ఉప ముఖ్యంత్రిగా అవకాశం కల్పించి.. తాను తన తండ్రిలాగే మైనారిటీ ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి, యువజన విభాగం ఇన్చార్జ్ మర్రి కల్యాణ్, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అబ్ తురబ్, అన్నాజీ శేఖర్, ఎస్సీ ఎస్టీ విభాగం ఇన్చార్జ్ బీబియన్ సింహ, వైనార్టీ నాయకులు షా హుస్సేన్, మహుబ్ బాషా, సీనియర్ నాయకులు వైఎస్ లాజరస్, ఏవీ సుబ్బా రెడ్డి, యువజన విభాగం సభ్యులు సయ్యద్ సజ్జాద్, షేక్ సబ్దర్, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు లక్ష్మి ప్రసాద్, యన్.వీ సుబ్బారెడ్డి, జగనన్న సైన్యం అధ్యక్షుల బాషా, అరవ సుబ్బారెడ్డి, గజ్జల నరసా రెడ్డి,మణి, ప్రభాకర్ యాదవ్, నాధముణి, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గోన్నారు. (చదవండి: లండన్లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ) -
SAFF ఫుట్బాల్ ఛాంపియన్ భారత్.. 9వ సారి టైటిల్ కైవసం (ఫోటోలు)
-
చాంపియన్ భారత్
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్బాల్లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో కువైట్ జట్టును ఓడించింది. కువైట్ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు. లీగ్ దశలో కువైట్తో జరిగిన మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది. ఆట 14వ నిమిషంలో అల్బలూషి గోల్తో కువైట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో లాలియన్జులా చాంగ్టే గోల్తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ‘షూటౌట్’లో నిరీ్ణత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్లో భారత ప్లేయర్ మహేశ్ సింగ్ గోల్ చేయగా... కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్ను భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్ కువైట్ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 9: ‘శాఫ్’ చాంపియన్షిప్ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్ తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్ సాధించింది. 24: ‘శాఫ్’ చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 23 గోల్స్తో అలీ అష్ఫాక్ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్తో సునీల్ ఛెత్రి అధిగమించాడు. ‘షూటౌట్’ సాగిందిలా... భారత్ స్కోరు కువైట్ సునీల్ ఛెత్రి 4 10 అబ్దుల్లా 8 సందేశ్ జింగాన్ 4 21 అలోతైబి 4 లాలియన్జులా 4 32 ఆల్దెఫీరి 4 ఉదాంత సింగ్ 8 33 మహ్రాన్ 4 సుభాశ్ బోస్ 4 44 అల్ఖాల్ది 4 మహేశ్ సింగ్ 4 54 హజిహా 8 -
భారత్ టైటిల్ నిలబెట్టుకునేనా?
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో నేడు జరిగే ఫైనల్లో పటిష్టమైన కువైట్తో ఆడనుంది. ఈ టోర్నమెంట్లో భారత్, కువైట్లు తలపడటం ఇది రెండోసారి. లీగ్ దశలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. లెబనాన్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ చక్కని ప్రదర్శనతో పెనాల్టీ షూటౌట్లో గెలిచింది. మరోవైపు బంగ్లాదేశ్తో జరిగిన మరో సెమీస్లో కువైట్ 1–0తో విజయం సాధించింది. కువైట్, లెబనాన్ పశ్చిమ ఆసియా దేశాలైనప్పటికీ పోటీతత్వం ఉండాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ రెండు దేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానించాయి. కంఠీరవ స్టేడియంలో ప్రేక్షకుల మద్దతుతో భారత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సొంతగడ్డపై జరుగుతుండటం భారత్కు అనుకూలాంశమైతే... హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ఈ ఫైనల్కు కూడా జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో మైదానంలోకి వెళ్లి ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడంతో ‘రెడ్ కార్డ్’తో ఓ మ్యాచ్ సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో లెబనాన్ తో కీలకమైన సెమీస్ మ్యాచ్కు దూరమయ్యారు. అయితే టోర్నీ క్రమశిక్షణ కమిటీ అతనికి రెండు మ్యాచ్ల సస్పెన్షన్ విధించడంతో.... కువైట్తో అమీతుమీకి కూడా గైర్హాజరు కానున్నారు. 1: ఇప్పటి వరకు భారత్, కువైట్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్లు జరిగాయి. భారత్ ఒక మ్యాచ్లో గెలిచింది. ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. .ట్రోఫీతో భారత జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్, కువైట్ జట్టు గోల్కీపర్ బదర్ బిన్ సానూన్ -
రణరంగాన్ని తలపించిన భారత్-కువైట్ ఫుట్బాల్ మ్యాచ్
శాఫ్ ఛాంపియన్షిప్ 2023 ఫుట్బాల్ టోర్నీలో మరో మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. కొద్ది రోజుల కిందట ఇదే టోర్నీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగగా.. తాజాగా భారత్-కువైట్ మధ్య మ్యాచ్లో సేమ్ సీన్ రిపీటైంది. ఇరు జట్లకు చెందిన ముగ్గురికి రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేశాడు. భారత కోచ్ ఇగోర్ స్టిమాక్, ఫార్వర్డ్ రహీమ్ అలీ, కువైట్కు చెందిన అల్ ఖలాఫ్ మార్చింగ్ ఆర్డర్లు పొందారు. 64వ నిమిషంలో భారత కోచ్కు ఎల్లో కార్డ్ (బంతిని పట్టుకుని ఆటకు ఆటంకం కలిగించాడు) ఇష్యూ చేయడంతో మొదలైన గొడవ చినికిచినికి గాలివానలా మారి ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకునేంతవరకు తీసుకెళ్లింది. ఆట 10 నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత ఆధిక్యాన్ని (1-0) కాపాడే ప్రయత్నంలో భాగంగా భారత కోచ్ మైదానం వెలువల అత్యుత్సాహం కనబర్చాడు. దీంతో రిఫరి అతనికి రెడ్ కార్డ్ ఇష్యూ చేశాడు. How hot is it in Bengaluru? WTH is happening 🙈😂 pic.twitter.com/CMsBFesyNd — Akshata Shukla (@shukla_akshata) June 27, 2023 ఈ క్రమంలో భారత ఫార్వర్డ్ రహీమ్ అలీ తన టెంపర్ను కోల్పోయి కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్ను కిందకు తోసేశాడు. దీంతో అతనికి కూడా రెడ్కార్డ్ ఇష్యూ అయ్యింది. ఇది మనసలో పెట్టుకున్న అల్ ఖలాఫ్.. భారత ఆటగాడు సహల్ అబ్దుల్ సమద్ను నేలపైకి నెట్టడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది. గొడవకు కారణమైన కువైట్ ఆటగాడికి కూడా రిఫరీ రెడ్కార్డ్ చూపించాడు. More chaos after Sahal is left in a heap as Kuwait try to get the ball back after a foul call. The coaching staff is involved in it as well before the ref breaks it up, but Rahim Ali is sent off! pic.twitter.com/owoXhieEfl — Anantaajith Raghuraman (@anantaajith) June 27, 2023 భారత్ సెల్ఫ్ గోల్.. మొదటి అర్ధభాగంలో సునీల్ ఛెత్రి గోల్ చేసి అందించిన ఆధిక్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. అదనపు సమయంలో భారత ఆటగాడు అన్వర్ అలీ సెల్ఫ్ గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో గోల్స్ డిఫరెన్స్ కారణంగా కువైట్ గ్రూప్ టాపర్గా నిలిచింది. భారత్ రెండో స్థానంలో సరిపెట్టుకుంది. కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం.. భారత డగౌట్పై దాడి భారత్ సెల్ఫ్ గోల్తో మ్యాచ్ సమం అయ్యాక కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత డగౌట్పై దాడి చేశారు. దీంతో రిఫరీ వారికి రెండు పసుపు కార్డులు జారీ చేశాడు. -
20 ఏళ్ల క్రితం కువైట్కు వెళ్లింది.. ఇప్పుడు భారత్కు తిరిగొచ్చింది
తూర్పు గోదావరికి చెందిన మూరి పద్మావతి(64) దీనగాధ ఇది.. 20 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆమె కువైట్కు వెళ్లింది. అయితే ఓ కంపెనీ చేసిన ఫ్రాడ్వీసా కారణంగా ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కువైట్లో బట్టలు అమ్మి జీవనం సాగించేది. కరోనా సమయంలో అనారోగ్యానికి గురై,రెసిడెన్సీ కూడా లేని కారణంగా ఆసుపత్రికి కూడా పోలేని పరిస్ధితిలో బంధువులు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడింది. అదే సమయంలో బొంబాయికి చెందిన మహమ్మద్ యూనుస్ అనే యువకుడు అన్నీ తానై సొంత తల్లిలా చూసుకున్నాడు. పద్మావతి విషయం వైఎస్సార్సీపీ కువైట్ సీనియర్ నాయకులు ఆకుమూర్తి లాజరస్.. APNRTS డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్. కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, APNRTS రీజినల్ కో ఆర్డినేటర్ నాయని మహేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎంబసీ అధికారుల సహాయంతో భారత్కు పంపించారు. ఈ సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఇన్నేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. -
విదేశీయులకు షాకిచ్చిన కువైట్.. 66 వేల డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు
మోర్తాడ్ (బాల్కొండ): వలస కార్మికులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించిన కువైట్.. డ్రైవింగ్ లైసెన్స్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి విదేశీయులకు జారీ చేసిన లైసెన్స్లలో ఏకంగా 66 వేల లైసెన్స్లను రద్దు చేసింది. ఇంకా అనేక మంది లైసెన్స్లు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలతో ఇతరులతో పాటు తెలుగు రాష్ట్రాల వలస కారి్మకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన అనేకమంది అరబ్బులకు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అలాగే సేల్స్మెన్ కమ్ డ్రైవర్లుగా కూడా అనేక మంది వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారికి జారీ చేసిన లైసెన్స్ల విషయంలో కువైట్ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సేల్స్మెన్లు కేవలం అదే పని చేయాలని, డ్రైవింగ్ ఎలా చేస్తారని ప్రశి్నస్తూ గతంలో జారీ చేసిన లైసెన్స్లను బ్లాక్ లిస్ట్లో ఉంచారని సమాచారం. మరోవైపు కంపెనీలను నిర్వహిస్తున్నవారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేసి డ్రైవింగ్ లైసెన్స్లను పొందారు. వీరి ఆదాయం కూడా పరిగణనలోకి తీసుకుని సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్లను కొనసాగించనున్నారు. కొన్నేళ్ల కిందట డ్రైవింగ్ లైసెన్స్లను విచ్చలవిడిగా జారీ చేయడంతో కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన కువైట్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుందని అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసులు కొందరు వెల్లడించారు. దిద్దుబాటులో భాగంగా సొంత కారు ఉండి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మన కరెన్సీలో కనీసం రూ.1.50 లక్షల వేతనం ఉండాలనే నిబంధన అమలులోకి తీసుకువచ్చారు. తక్కువ వేతనం అందుకుంటున్నవారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసి ఉంటే దానిని రద్దు చేశారు. కాగా తప్పుడు ఆధారాలతో డ్రైవింగ్ లైసెన్స్లు పొందినవారు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చదవండి: అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ -
ఒక్క ఓవర్లో 46 పరుగులు.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
క్రికెట్లో ఒక్క ఓవర్లో సాధారణంగా అత్యధికంగా ఎన్నిపరుగులు వస్తాయంటే టక్కున వచ్చే సమాధానం 36. అది కూడా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదితే ఈ ఫీట్ నమోదవుతుంది. ఒకవేళ మరో నోబాల్.. లేదా వైడ్ వెళితే కొన్ని పరుగులు జత అవుతాయి. అది కూడా అరుదుగా జరుగుతుంది. అందుకే 36 పరుగులే ఇప్పటివరకు చాలాసార్లు అత్యధికంగా ఉంది. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు వచ్చాయంటే మీరు నమ్ముతారా.. అంత లేదు అని తేల్చేస్తాం. కానీ ఒక్క ఓవర్లో 46 పరుగులు బాదిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఊహించుకోవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అరుదైన దృశ్యం.. కువైట్ వేదికగా జరిగిన కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టి20 ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో ఇది జరిగింది. ఎన్సీఎమ్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టాలీ సీసీ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ అద్బుతం ఆవిష్కృతమైంది. ఎన్సీఎమ్ బ్యాటర్ వాసు.. టాలీ సీసీ బౌలర్ హర్మన్ ఓవర్ను చితకబాది 46 పరుగులు రాబట్టాడు. తొలి బంతిని నోబాల్ వేయగా సిక్సర్ బాదాడు. దీంతో ఏడు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఫ్రీహిట్కు నాలుగు పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. ఒక్క బంతి కరెక్ట్ వేయగా 11 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఐదు బంతులను ఐదు సిక్సర్లు కొట్టగా ఇందులో ఒక నోబ్ సహా మొత్తం 31 పరుగులు వచ్చాయి. దీంతో ఐదు బంతుల్లో స్కోరు 42గా మారింది. ఇక ఆఖరి బంతిని బౌండరీ రావడంతో అలా ఆరు బంతుల్లో 46 పరుగులు వచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 46 పరుగులు రావడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వన్డేల్లో 36.. టెస్టుల్లో 35.. టి30ల్లో 36.. ఐపీఎల్లో 37.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు వన్డేల్లో ఒక్క ఓవర్లో 36 పరుగులు అత్యధికంగా ఉంది. 2006లో సౌతాఫ్రికా ఓపెనర్ గిబ్స్ నెదర్లాండ్స్పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగా.. 2021లో అమెరికా బ్యాటర్ జస్కరన్ మల్హోత్రా పపువా న్యూ గినియాపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక టెస్టుల్లో 2022లో ఇంగ్లండ్పై టీమిండియా బౌలర్ బుమ్రా కొట్టిన 35 పరుగులు ఇప్పటివరకు ఒక్క ఓవర్లో అత్యధికంగా ఉంది. ఇక టి20ల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు రెండుసార్లు నమోదయ్యాయి. తొలిసారి 2007లో యువరాజ్ ఇంగ్లండ్పై 36 పరుగులు(ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు), 2021లో విండీస్ హిట్టర్ పొలార్డ్ శ్రీలంకపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఇక ఐపీఎల్లో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు 37గా ఉంది. తొలిసారి 2011లో ఆర్సీబీతో మ్యాచ్లో కొచ్చి టస్కర్స్ బౌలర్ పి. పరమేశ్వరన్ ఒక్క ఓవర్లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 2021లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సీఎస్కేతో మ్యాచ్లో ఒక్క ఓవర్లో 37 పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం. Getting 46 runs in an over is not possible right? Right? Wrong! Watch this absolute bonkers over now. . .#KCCT20 pic.twitter.com/PFRRivh0Ae — FanCode (@FanCode) May 3, 2023 చదవండి: గమనించారా.. మ్యాచ్తో పాటు పాత పగను కూడా! -
విజయవాడ–కువైట్ విమాన సర్విస్ ప్రారంభం
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి కువైట్కు ఎయిరిండియా విమాన సర్విస్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తిరుచినాపల్లి నుంచి ఇక్కడికి వచ్చిన బోయింగ్ 737–800 విమానం ఉదయం 9.55 గంటలకు బయలుదేరి కువైట్ వెళ్లింది. ఈ విమానం కువైట్ నుంచి రాత్రి 8.35 గంటలకు ఇక్కడికి చేరుకుంది. ఈ విమానం ప్రతి బుధవారం తిరుచినాపల్లి నుంచి వయా గన్నవరం మీదుగా కువైట్కు వెళ్లి వస్తుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ప్రయాణికులకు ‘ఎయిరిండియా’ షాక్ ఈ విమాన సర్విస్లో కువైట్ వెళ్లాల్సిన 17 మందికి ఎయిరిండియా షాక్ ఇ చ్చింది. తొలుత ఈ సర్విస్కు బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానం బయలుదేరే సమయం మధ్యాహ్నం 1.10 గంటలుగా తెలిపింది. తర్వాత విమానం బయలుదేరే సమయాన్ని ఆ సంస్థ ఉదయం 9.55 గంటలకు రీషెడ్యుల్ చేసింది. రిషెడ్యూల్ చేసిన విషయం తెలియకపోవడంతో వారంతా మధ్యాహ్నం 11 గంటలకు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అప్పటికే విమానం కువైట్కు బయలుదేరిన విషయం తెలుసుకుని షాక్కు గురయ్యారు. దీనిపై ఎయిరిండియా ప్రతినిధులను గట్టిగా ప్రశ్నించారు. కువైట్కు వెళ్లడానికి తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే విమాన ప్రయాణ సమయం రీషెడ్యూల్ చేసిన విషయాన్ని సమాచారం రూపంలో సదరు ప్రయాణికుల సెలఫోన్లకు పంపినట్లు ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. అయితే సదరు ప్రయాణికులు సెల్ నంబర్లు బుకింగ్ ఏజెంట్లు, కువైట్ నంబర్లు ఇవ్వడం వల్ల సమాచార లోపం ఏర్పడిందన్నారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వచ్చే వారం కువైట్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధులు తెలిపారు. -
కువైట్లో రోడ్డు ప్రమాదం.. కృష్ణంపల్లె వాసి మృతి
పోరుమామిళ్ల : మండలంలోని చల్లగిరిగెల పంచాయతీ క్రిష్ణంపల్లెకు చెందిన గోపవరం జయరామిరెడ్డి (40) కువైట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సంఘటన జరిగి మూడు రోజులవుతున్నా సరైన సమాచారం లేదని మృతుడి తమ్ముడు దశరధరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశరధరామిరెడ్డి కథనం మేరకు జయరామిరెడ్డి కువైట్లో లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయన భార్య 9 సంవత్సరాల క్రితం క్యాన్సర్తో మృతి చెందింది. ఆయనకు రాముకార్తీక్రెడ్డి(14), తునుషి కౌసల్య(10) ఇద్దరు పిల్లలు. మూడు రోజుల క్రితం బస్తాల లోడుతో వెళుతున్న జయరామిరెడ్డి లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.లారీలో ఉన్న జయరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్నవారిలో ముగ్గురు మృతి చెందారు., మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం గురించి, జయరామిరెడ్డి మృతి గురించి కానీ ఇక్కడకు ఎవ్వరూ సమాచారం ఇవ్వలేదు. జయరామిరెడ్డి రెండు రోజులు ఫోన్ చేయకపోవడంతో దశరధరామిరెడ్డి ఫోన్ చేయడంతో విషయం తెలిసింది. జయరామిరెడ్డి ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ఆయన ప్రమాదంలో చనిపోయారని అరబిక్లో చెప్పాడు. దశరధరామిరెడ్డి కూడా గతంలో కువైట్లో ఉన్నందున భాష తెలిసి అన్న మృతి చెందాడని అర్థం చేసుకున్నాడు. అన్న పని చేస్తున్న సేట్కు ఫోన్ చేశాడు. సేట్ ప్రమాదంలో జయరామిరెడ్డి చనిపోయాడని, మృతదేహం ఆసుపత్రిలో ఉందని, ప్రాసెస్ పూర్తయితే ఇండియాకు పంపిస్తానని చెప్పాడు. రెండు రోజులుగా సేట్ నుండి ఎలాంటి సమాచారం లేదని, ఫోన్ చేస్తే ప్రాసెస్ జరుగుతున్నదని మాత్రమే చెపుతున్నాడని దశరథరామిరెడ్డి వివరించాడు. కువైట్లో ఉన్న ఆంధ్రా ఎంబసీకానీ, ఆంధ్రా వ్యక్తులు కానీ అందుబాటులోకి రావడం లేదని, సరైన సమాచారం ఎవ్వరూ చెప్పడం లేదని దశరధరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మృతదేహం ఎప్పుడు పంపిస్తారు? ప్రమాదంపై కేసు నమోదు చేశారా? కేసు ఏమని రాశారు? తదితర సమాచారం ఏమీ తెలియడం లేదని బంధువులు చెబుతున్నారు. -
ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏంటో తెలుసా..?
అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ఇవేవీ కాకుండా 2023 సంవత్సరంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ రూ.266.64కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. ప్రపంచంతో ఎక్కువగా ట్రేడింగ్ జరిగేది యూఎస్ డాలర్లలోనే కాబట్టి అదే అత్యంత విలువైన కరెన్సీ అనుకుంటుంటాం. అయితే వాస్తవం ఏంటంటే.. మనకు తెలిసిన యూఎస్ డాలర్ యూరో, బ్రిటిష్ పౌండ్లతో పాటు ప్రపంచంలో అనేక కరెన్సీలు ఉన్నాయి. వాటిలో కొన్ని చవకైనవి కాగా మరికొన్ని చాలా విలువైనవి. యూఎస్ డాలర్ కంటే విలువైన కరెన్సీలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తుతం మన రూపాయితో పోల్చుకుని చూస్తే.. కువైట్ దినార్ రూ.266.64, బెహ్రెయిన్ దినార్ రూ.215.90, ఒమన్ రియాల్ రూ.211.39, జోర్డాన్ దినార్ రూ.114.77, బ్రిటిష్ పౌండ్ రూ.99.68, గిబ్రాల్టర్ పౌండ్ రూ.99.40, కేమన్ డాలర్ రూ.98.02, యూరో రూ.88.34, స్విస్ ఫ్రాంక్ రూ.88.04, యూఎస్ డాలర్ రూ.81.36గా కొనసాగుతోంది. చదవండి: భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా? -
కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన
మోర్తాడ్(బాల్కొండ): మనదేశం నుంచి వెళ్లే వారికిగాను కువైట్ వీసా నిబంధనలను సవరించింది. కువైట్ నుంచి వీసాలు జారీ అయిన తరువాత అవి అసలువో నకిలీవో తేల్చడానికి ఆ దేశ కాన్సులేట్ల పరిశీలన కోసం పంపాల్సి ఉంది. ఈ కొత్త నిబంధన పదిహేను రోజుల కింద అమలులోకి వచ్చింది. వీసాలను కాన్సులేట్ పరిశీలన కోసం పంపడం వల్ల కాలయాపనతో పాటు ఆర్థికంగా భారం పడుతుందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కువైట్లో ఉపాధి పొందాలనుకునే వారు లైసెన్స్డ్ ఏజెన్సీలు, లేదా తమకు తెలిసిన వారి ద్వారా వీసాలను పొందిన తరువాత పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో ఒక్క కువైట్కు మాత్రమే పీసీసీ తప్పనిసరి అనే నిబంధన ఉంది. వీసా కాపీల పరిశీలనను ఇప్పుడు అదనంగా చేర్చారు. కువైట్ నుంచి వీసాలను ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. ఈ వీసాలు అన్ని కువైట్ విదేశాంగ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. విదేశాంగ శాఖ ఆమోదంతోనే వీసాలు జారీ కాగా, వాటిని మరోసారి తమ కాన్సులేట్ల్లో పరిశీలనకు పంపాలని కువైట్ ప్రభుత్వం సూచించడం అర్థరహితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ, ముంబైలోనే కాన్సులేట్లు కువైట్ విదేశాంగ శాఖకు సంబంధించిన కాన్సు లేట్లు ఢిల్లీ, ముంబైలలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్కు భారీగానే వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి వలస కార్మికులు కోరుతున్నారు. కువైట్ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కువైట్ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లో తీసుకురావడంతో కాన్సులేట్ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. (క్లిక్ చేయండి: లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల) -
షాకింగ్ వీడియో.. సింహాన్ని చేతుల్తో మోసుకెళ్లిన మహిళ..
అడవి జంతువులను చూస్తే సాధారణంగా ఎవరికైనా భయం వేస్తోంది.దాని కంటపడితే ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యం.అడవికే రాజు అయిన సింహాన్ని చూసి ఏ జంతువైనా భయంతో వణికిపోతుంది. సింహాలు ప్రమాదకరమైనది. చాలా శక్తివంతమైనవి. నచ్చిన జంతువును వెంటాడి ఆహారం చేసుకోవడంలో అవి దిట్ట. అంతటి క్రూరమైన సింహాన్ని ఓ మహిళ ఎలాంటి బెరుకు లేకుండా చేతుల్తో మోసుకొని వెళ్లింది. వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా దీనికి సంబంధించిన వీడియోను యానిమల్స్ పవర్స్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 10 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మహిళ తన రెండు చేతులతో బలవంతంగా సింహాన్ని ఎత్తుకొని వీధిలో నడుస్తూ కనిపించింది. ఆమె చేతిలో నుంచి సింహం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా మహిళ ఇంకాస్తా గట్టిగా దాన్ని పట్టుకొని తీసుకెళ్లింది. అయితే ఇది పాత వీడియో కాగా ప్రస్తుతం మరోసారి నెట్టింట్టా చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. మహిళ తెగవను ప్రశంసిస్తూ వండర్ వుమెన్ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు.. ‘అది పిల్లి, కుక్క కాదు సింహం.. దానితో కాస్తా జాగ్రత్తగా వ్యహరించండి’ అంటూ సలహా ఇస్తున్నారు. కాగా ఈ సంఘటన కువైట్ వీధుల్లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సింహాం మహిళ పెంపుడు జంతువని.. కువైట్ సిటీలో తప్పించుకుని నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. View this post on Instagram A post shared by Animal Power (@animals_powers) -
ఏడుగురికి ఉరి శిక్ష..షాక్లో మానవ హక్కుల సంఘాలు
కువైట్, సౌదీ అరేబియా దేశాల్లో చాలా దారుణంగా ఉరిశిక్షలు అమలు చేస్తుంటారు. అంతర్జాతీయ మానవహక్కుల నుంచి ఎన్ని విజ్క్షప్తులు వచ్చినా తమ ధోరణి తమదే అన్నట్లుగా ఆయా దేశాలు శిక్షలు అమలు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం కువైట్ కోర్టు హత్యకు పాల్పడినందుకు ఏడుగురికి మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. 2017 నుంచి కువైట్లో ప్రముఖ మానవ హక్కుల సంఘాల నుంచి ఉరిశిక్ష రద్దు విషయమై విజ్క్షప్తులు వచ్చినా వాటిని పక్కన పెట్టి మరీ ఈ మరణ శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం మరణ శిక్ష విధించబడిన వారిలో కువైట్కి చెందిన ఒక మహిళ, ఇద్దరు పురుషులు, ఒక సిరియన్, ఒక పాకిస్తానీ ఉన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరానికి గానూ సౌదీ అరేబియా పాకిస్తాన్ పౌరులను ఉరితీసినట్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే విధంగా గతంలో సంపన్న గల్ఫ్ దేశంలో జనవరి 25, 2017న ఒక రాజకుటుంబానికి చెందిన ఒకరితో సహా సుమారు ఏడుగురిని ఒకే రోజు ఉరితీయడం పెద్ద పెద్ద కలకలం రేగింది. అప్పటి నుంచి ఉరిశిక్షలు విషయంలో ఆయా దేశాలను పునారాలోచించమంటూ మానవ హక్కుల సంఘాలు అభ్యర్థించాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణమైన ఘటన విషయమై ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ తక్షణమే తాత్కాలికంగా ఉరి శిక్షలను నిలిపివేయాలని కోరింది. ఈ శిక్ష అంతిమ అమానవీయ, అవమానకరమైన శిక్షలుగా పేర్కొంది. అంతేగాదు అమ్మెస్టీ డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ అమ్నా గుయెల్లాలీ ఈ ఉరిశిక్షలను తక్షణమై తాత్కాలికంగా నిలిపేయాలని కువైట్ అధికారులకు ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్, సౌదీ అరేబియాలో ఈ శిక్షలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఒకేరోజు ఏకంగా 81 మందిని ఉరి తీశారు. కువైట్లో 1960ల మధ్యలో ఈ ఉరిశిక్షలను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి డజన్లకొద్దీ వ్యక్తులను ఉరితీయడం ప్రారంభించింది. వారంతా కూడా హత్యకు పాల్పడినవారు లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణకు పాల్పడినవారే. అంతేగాదు కువైట్ని రెండున్న దశాబ్దలుగా పాలించిన అల్-సబా కుటుంబ సభ్యులను సైతం అక్కడి కువైట్ కోర్టులు మరణశిక్షలు విధించాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత కువైట్ అధికారులకు ఉంది, కానీ నిందితులను ట్రయల్స్లోఅంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా విచారించాలని ఇలాంటి శిక్షలు విధించకూడదని ఆమ్నెస్టీ డైరెక్టర్ గుయెల్లాలి చెప్పారు. (చదవండి: అమెరికాలో ట్రంప్ ఫెయిల్: బైడెన్) -
భారత పురుషుల స్క్వాష్ టీమ్ కొత్త చరిత్ర
భారత పురుషుల స్క్వాష్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్షిప్స్లో తొలిసారి పసిడి పతకం సాధించింది. కువైట్తో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు రమిత్ తాండన్, సౌరవ్ ఘోషల్ దుమ్మురేపారు. తొలి మ్యాచ్లో అలీ అర్మామెజితో తలపడిన రమిత్ తాండన్ 11-5, 11-7, 11-4 తేడాతో విజయం సాధించి భారత్కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో సౌరవ్ ఘోషల్ అమ్మర్ అల్టమిమిపై 11-9, 11-2, 11-3తో గెలిచాడు. మిత్, సౌరవ్ ఇద్దరూ రెండు మ్యాచుల్లో గెలవడంతో...భారత్ విజయం ఖాయమైంది. దీంతో అభయ్ సింగ్ ఫలా మహమ్మద్ తో తలపడాల్సి మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. అప్పటికే రెండు వరుస విజయాలు నమోదు చేసిన భారత పురుషుల జట్టు 2-0 తేడాతో కువైట్ను మట్టికరిపించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. కాగా గతంలో ఈ టోర్నీలో భారత్ రెండుసార్లు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన గోల్డ్ మెడల్ను సాధించాలని మెన్స్ టీమ్ కసితో బరిలోకి దిగింది. ఆడిన ప్రతీ మ్యాచ్లో విజయమే టార్గెట్ బరిలోకి దిగి గెలుపొందింది. తొలుత ఖతర్, పాకిస్తాన్, కువైట్, సౌత్ కొరియా, చైనీస్ తైపీ జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచులన్నింట్లో 3-0తో విజయం సాధించి పూల్-ఏ అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్ లో మలేషియాపై 2-1తో గెలిచి ఫైనల్ చేరింది. కాగా ఇదే చాంపియన్షిప్ భారత మహిళల స్క్వాష్ బృందం క్యాంస్యం పతకం గెలుచుకుంది. -
నువ్వు రాకపోతే ఆడపిల్లలను చంపేస్తా
పెంటపాడు: కన్నతండ్రే తన ఇద్దరు ఆడపిల్లలను చంపేందుకు సిద్ధమై విచక్షణారహితంగా దాడి చేశాడు. పిల్లలు భయంతో ఏడుస్తూ తమను చంపవద్దని తండ్రిని వేడుకుంటుండగా, వీడియో తీయించి కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన తన భార్యకు పంపించాడు. భార్యను వెంటనే తెరిగి రావాలని, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలను చంపేస్తానని హెచ్చరించాడు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులోని ఎస్సీపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెంటపాడు ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పెంటపాడు మండలం వీరపాలేనికి చెందిన గంజి దావీదుకు భార్య నిర్మల, కుమారుడు ఆకాష్(13), కుమార్తెలు అలేఖ్య(12), అమృత(11) ఉన్నారు. మద్యానికి బానిసైన దావీదు తన భార్యపై అనుమానంతో తరచూ కొడుతుండేవాడు. అతను ఏ పని చేయకుండా తాగి గొడవ చేస్తుండటంతో కుటుంబ పోషణ కోసం నిర్మల ఏడాది కిందట కువైట్ వెళ్లింది. నాలుగు నెలల కిందట దావీదు తన పిల్లలను తీసుకుని పెంటపాడు వచ్చి ఎస్సీ పేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తన భార్యను ఎలాగైనా కువైట్ నుంచి రప్పించాలని దావీదు కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇద్దరు ఆడపిల్లలను చిత్రహింసలు పెడుతూ కుమారుడితో వీడియోలు తీయించి భార్యకు పంపుతున్నాడు. ఇది చూసి తట్టుకోలేని నిర్మల ఆ వీడియోలను గురువారం గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళకు పంపింది. సర్పంచ్ వెంటనే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుమారుడు కొట్టు విశాల్కు వాటిని పంపారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో ఆయన సూచన మేరకు విశాల్ స్థానిక పోలీసులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. వారు వెళ్లేసరికి పిల్లలను కొమ్ముగూడెంలోని బంధువుల ఇంటి వద్ద వదిలి దావీదు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేలిముద్రలు మార్చి.. కువైట్కు తిప్పి పంపి! ఇంతకూ ఆ దేశానికే ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: వేలిముద్రలు పడకుండా చోరీలు చేసే కిలాడీల కథలు లేదా నకిలీ వేలిముద్రలతో నేరాలకు పాల్పడే కేటుగాళ్ల ఉదంతాల గురించి మీరు ఇప్పటివరకు విని ఉంటారు. కానీ ఏకంగా శస్త్రచికిత్సల ద్వారా వేలిముద్రలను మార్చి కువైట్ నుంచి బహిష్కరణకు గురైన వలస కార్మికులను అక్రమంగా తిరిగి ఆ దేశం పంపుతున్న ఓ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు తొలిసారి రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) డీసీపీ కె. మురళీధర్తో కలసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గురువారం మీడియాకు వెల్లడించారు. పోలీసుల అదుపులో నిందితులు వేలిముద్రల సర్జరీ గురించి తెలుసుకొని.. సీపీ తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ కడప జిల్లా సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన గజ్జలకొండగారి నాగమునేశ్వర్రెడ్డి తిరుపతిలోని చంద్రగిరిలోని కృష్ణా డయాగ్నస్టిక్స్లో రేడియాలజిస్ట్. అతనికి ఓ రోజు కువైట్లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాటల సందర్భంలో తాను వీసా గడువు ముగిశాక కువైట్లో అక్రమంగా ఉండటంతో ఆ దేశ అధికారులు తిప్పి పంపారని... దీంతో శ్రీలంక వెళ్లి అక్కడ మ్యూటిలేటెడ్ ఫింగర్ప్రింట్స్ సర్జరీ చేయించుకొని మళ్లీ కువైట్కు వెళ్లినట్లు వివరించాడు. ఈ శస్త్రచికిత్స ద్వారా వేలిముద్రలు తాత్కాలికంగా కొత్త రూపంలోకి మారతాయని పేర్కొన్నాడు. ఈ సర్జరీ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయిన మునేశ్వర్... కువైట్ నుంచి బహిష్కరణకు గురైన వారికి ఈ సర్జరీలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్లాన్ను తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా పనిచేస్తున్న వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి గ్రామానికి చెందిన సాగబాల వెంకట్ రమణకు తెలపగా అతను అంగీకరించాడు. తొలుత రాజస్తాన్కు... మునేశ్వర్రెడ్డికి కువైట్లోని తన స్నేహితుడి ద్వారా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురైన రాజస్తాన్లోని ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వారికి మ్యూటిలెటెడ్ ఫింగర్ప్రింట్ సర్జరీ చేసేందుకు మునేశ్వర్, వెంకట రమణ రాజస్తాన్కు వెళ్లారు. ఒక్కొక్కరికీ రూ. 25 వేల చొప్పున వసూలు చేసి శస్త్రచికిత్స చేశారు. అక్కడి పరిచయాలతో కేరళలోని మరో వ్యక్తి మునేశ్వర్ను సంప్రదించాడు. ఈ ఏడాది మేలో మునేశ్వర్, వెంకటరమణ కేరళకు వెళ్లి ఆరుగురికి ఈ సర్జరీ చేసి రూ. లక్షన్నర వసూలు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లా జ్యోతి గ్రామానికి చెందిన బోవిళ్ల శివశంకర్రెడ్డి, పాత అట్లూరి గ్రామానికి చెందిన రెండ్ల రామకృష్ణారెడ్డిలతోపాటు మరో వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. కువైటే ఎందుకంటే? కువైట్ ఇమ్మిగ్రేషన్ విభాగంలో ఐరిస్, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత అందుబాటులో లేదు. కేవలం వేలిముద్రల స్కానింగ్ మాత్రమే ఉంది. దీన్ని నేరస్తులు ఆసరాగా చేసుకుంటున్నారు. దీంతోపాటు ఒక కువైటీ దినార్ భారతీయ కరెన్సీలో రూ. 258.15గా ఉండటం మరో కారణం. ఎలా చేస్తారంటే? చేతివేళ్ల మొనలపై చర్మం పొరను కత్తిరించి కణజాలంలో కొంత భాగాన్ని తీసేస్తారు. సర్జరీ కిట్ను ఉపయోగించి కుట్లు వేస్తారు. ఒకట్రెండు నెలల్లో గాయం మానాక వేలిముద్రల నమూనాలలో స్వల్ప మార్పులు వస్తాయి. ఈ కొత్త ఫింగర్ ప్రింట్లు ఏడాదిపాటు ఉంటాయి. ఆ తర్వాత యథాస్థితికి వచ్చేస్తాయి. దీంతో ఈలోగా కొత్తగా ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఇతరత్రా గుర్తింపు కార్డులను కేటుగాళ్లు పొందుతున్నారు. వాటితో కొత్త అభ్యర్థి లాగా కువైట్కు వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కువైట్ ఇమ్మిగ్రేషన్లో స్కానర్లో వేలిముద్రలను నమోదు చేసుకుంటున్నప్పుడు మ్యూటిలేటెడ్ ఫింగర్ప్రింట్స్ కావడంతో కొత్త ప్రవాసుడు అనుకొని వీసా స్టాంపింగ్ వేస్తున్నారు. ఒకవేళ కువైట్లో పట్టుబడితే.. ఒకసారి బహిష్కరణకు గురైతే పాస్పోర్టు రద్దవుతుంది. అందుకే నేరస్తులు మ్యూటిలెటెడ్ ఫింగర్ప్రింట్లతో కొత్త పాస్పోర్టు, వీసాలను పొందుతున్నారు. ఒకవేళ అక్కడి పోలీసులకు చిక్కినా.. అక్రమ పాస్పోర్టు కలిగి ఉన్నందుకు 2–7 రోజుల జైలుశిక్ష అనంతరం స్వదేశానికి డిపోర్ట్ అవుతున్నారు. ఆపై మళ్లీ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్తో మళ్లీ కువైట్కు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసంపై కువైట్ ఎంబసీని, ఇమ్మిగ్రేషన్ అధికారులకు లేఖ రాస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. హైదరాబాద్లో సర్జరీ కోసం వచ్చి... ఇప్పటివరకు ఈ ముఠా 11 మంది కువైట్ బహిష్కృతులకు ఈ సర్జరీలు నిర్వహించిందని.. వారిలో కొందరు నకిలీ పాస్పోర్టు, వీసాలతో మళ్లీ కువైట్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కువైట్ నుంచి బహిష్కరణకు గురైన పలువురు హైదరాబాదీలకు ఈ ముఠా సభ్యులు పరిచయమయ్యారు. దీంతో వారికి ఈ సర్జరీ చేసేందుకు కడప నుంచి ఈ ముఠా సభ్యులు గత నెల 29న అన్నోజిగూడకు చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న మల్కజ్గిరి ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు... నిందితులు బస చేసిన లాడ్జీపై ఆకస్మిక దాడులు చేసి మునేశ్వర్రెడ్డి, వెంకటరమణ, శివశంకర్, కృష్ణారెడ్డిలను అరెస్టు చేశారు. ఈ ముఠాలో మరో 9 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని సీపీ తెలిపారు. నిందితుల నుంచి 4 సెల్ఫోన్లు, సర్జికల్ గ్లౌవ్స్, అయింట్మెంట్, యాంటీ బయోటిక్ మాత్రలు, హైడ్రోక్లోరైడ్ జెల్, ఇంజెక్షన్లు, సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఇతరత్రా సర్జరీ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
Asian Games: ఆసియా క్రీడల రీషెడ్యూల్.. తేదీలు ఖరారు!
Asian Games- కువైట్ / బీజింగ్: వాయిదా పడిన ఆసియా క్రీడల్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించేలా రీషెడ్యూల్ చేశారు. నిజానికి చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఆసియా మెగా ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జరగాల్సింది. కానీ ఆ దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదల, వైరస్లో కొత్త స్పైక్ కలకలంతో ఆసియా గేమ్స్ను వాయిదా వేస్తున్నట్లు మే 6న ప్రకటించారు. గత రెండు నెలలుగా పలు దఫా చర్చల అనంతరం తాజాగా రీషెడ్యూలును వెల్లడించారు. ‘ఆసియా క్రీడలు తిరిగి నిర్వహించేందుకు టాస్క్ఫోర్స్ రెండు నెలలుగా కృషిచేస్తోంది. చైనీస్ ఒలింపిక్ కమిటీ, హాంగ్జౌ ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ చర్చలు జరిపింది. మరో మేజర్ ఈవెంట్ నిర్వహణకు ఏ ఇబ్బంది లేకుండా తేదీల్ని ఖరారు చేయాలని నిర్ణయించింది’ అని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Babar Azam: కోహ్లిని తలపిస్తున్న పాక్ కెప్టెన్.. ఖాతాలో మరో మైలురాయి -
మాలియా సిటీలో వైఎస్ఆర్ 73వ జయంతి వేడుకలు
-
వలస కార్మికుల మెడపై దేశ బహిష్కరణ కత్తి
నుపూర్ శర్మ బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు విదేశాల్లో బతుకుతున్న వలస కార్మికులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి భవిష్యత్తును అగమ్యగోచరంలో పడేశాయి. ఇందుకు సంబంధించిన ప్రకంపనలు ముందుగా కువైట్లో మొదలయ్యాయి. నుపూర్ శర్మ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపిన విషయం విదితమే. దీనిపై గల్ఫ్ దేశాధినేతలు తమ అభిప్రాయాలను భారత రాయబారులకు తెలిపారు. ఖతార్ లాంటి దేశాల్లో భారత వస్తువులను నిషేధించాలనే దాక వ్యవహారం వెళ్లింది. ఇంతలో భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయితే గల్ఫ్ దేశాలు తమ ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవడంలో విఫలం కావడంతో భారత ప్రభుత్వం కూడా దౌత్యపరంగా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేయడంతో గల్ఫ్ దేశాలు పునరాలోచనలో పడ్డాయి. నుపూర్శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ గల్ఫ్ దేశాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఏమవుతుందో ఏమో అనే భయంతో కొందరు, నుపూర్ వ్యాఖ్యలను నొచ్చుకున్న మరికొందరు వలస కార్మికులు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ర్యాలీలు చేశారు. నినాదాలు వినిపించారు. ఇప్పుడు ఇలా ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్న వలస కార్మికులను కువైట్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. అక్కడి చట్టాల ప్రకారం వలస కార్మికులకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు లేదంటూ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వలస కార్మికులను వెంటనే గుర్తించి వారి దేశాలకు పంపించి వేస్తామంటూ హుకుం జారీ చేసింది. అంతేకాదు వారు భవిష్యత్తులో కువైట్లో పని చేసుకునే అవకాశం ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు నిరసనలో పాల్గొన్న వలస కార్మికులను గుర్తించే పని మొదలెట్టింది. కువైట్లో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఫిలిప్పీన్ దేశాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. అయితే వీరిలో భారతీయులే అధికం. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వలస కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అప్పులు చేసి అక్కడికి చేరుకున్న వారిని ఉన్న పళంగా వెనక్కి పంపిస్తే వారి కుటుంబాలు మరింత చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. చదవండి: సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ.. -
కువైట్లో తమన్ 'సుస్వర తమనీయం'.. వైభవంగా వేడుక
Thaman Music Festival In Kuwait: రెండున్నర సంవత్సరాల తరువాత 'కోవిడ్' అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం 'సుస్వర తమనీయం'. కువైట్లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 3 సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ బృందంతోపాటు సుమారు 1500 మందికిపైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమన్ బృందమైన గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్, పృథ్వీచంద్ర, విమల రోషిని, శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తదితరులు తమ పాటలతో అలరించారు. దాదాపు యాభై పాటలతో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం దద్దరిల్లింది. సభ్యులందరు కేరింతలు,నృత్యాలు, ఆనందో త్సాహాలతో కన్నుల పండుగగా తమన్ 'సుస్వర తమనీయం' ఆద్యతం అలరించింది. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు అనంతరం స్పాన్సర్స్.. తమన్ను, వారి బృందాన్ని, మిగతా సంస్థల అధ్యక్షులను, ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్ను "తెలుగు కళా సమితి" కార్యవర్గం జ్ఞాపికలతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో "తెలుగు కళా సమితి" స్మారక చిహ్నమైన 'సావెనీర్' వార్షిక సంచికను విడుదల చేశారు. -
ముదురుతున్న వివాదం.. ‘భారత ఉత్పత్తులు మాకొద్దు!’
Kuwaiti supermarket pulled: మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అక్కడికి సదరు ప్రతినిధిపై బీజేపీ వేటు వేసింది కూడా. తన వ్యాఖ్యల పట్ల నూపుర్ క్షమాపణలు చెప్పింది కూడా. అయినప్పటికీ గల్ఫ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కువైట్లోని అల్ అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ సూపర్ మార్కెట్ భారతీయ ఉత్పత్తులను పక్కనపెట్టింది. నూపుర్ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ ఉత్పత్తులను వాడేది లేదంటూ ఒక ట్రాలిలో ప్యాక్ చేసి పక్కనే పెట్టేశారు. సదరు స్టోర్ సీఈవో ‘ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సహించం అందుకే భారతీయ ఉత్పత్తులను తొలగిస్తున్నాం’ అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ బీజేపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా తీవ్రంగా మండిపడుతోంది. భారత విదేశీ కార్మికులకు గల్ఫ్ దేశాలు ప్రధాన గమ్యస్థానంగా ఉన్నాయి. భారత్ నుంచి విదేశాల్లో పని చేస్తున్న మొత్తం 13.5 మిలియన్ల మందిలో.. 8.7 మిలియన్ల మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్క. ఇక భారత్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కువైట్ సుమారు 95 శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అదీగాక భారత్ ఆహార భద్రత, ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా గోధుమల ఎగుమతులను నిషేధించిన సమయంలో కూడా కువైట్ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వమని కోరడం గమనార్హం. (చదవండి: నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ) -
వీసాలున్నా వెళ్లలేక..
మోర్తాడ్: విదేశీ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కువైట్ ద్వారాలు తెరచినా రాష్ట్రం నుంచి ఔత్సాహికులు వెళ్లలేకపోతున్నారు. సకాలంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, స్టాంపింగ్ ప్రక్రియ పూర్తవకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసాలు జారీ అయ్యాక మూడు నెలల్లో కువైట్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రక్రియలు అయ్యేలోపే గడువు ముగుస్తోందని ఆందోళన చెందుతున్నారు. రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడిన కువైట్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి కువైట్ విదేశాంగ శాఖ వీసాల జారీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన లైసెన్స్డ్ ఏజెంట్ల ద్వారా రిక్రూట్మెంట్ మొదలు పెట్టింది. సెలవు రోజుల్లో మినహా రోజూ 2 వేల వరకు వీసాలు జారీ చేస్తోంది. కువైట్ వీసా పొందిన ప్రతి ఒక్కరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాలి. పాస్పోర్టు కార్యాలయం ద్వారానే పీసీసీ పొందాల్సి ఉంటుంది. అయితే పీసీసీల జారీలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. గతంలో 2, 3 రోజుల్లో పీసీసీలను జారీ చేసేవారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి 25 రోజులవుతోంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని తరువాత ముంబై, ఢిల్లీలోని కువైట్ ఎంబసీల్లో ఎక్కడో ఓచోట స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాంపింగ్ ప్రక్రియలోనూ తీవ్ర కాలయాపన జరుగుతోందని వలస కార్మికులు చెబుతున్నారు. 5 రోజుల్లో పూర్తి కావాల్సిన స్టాంపింగ్కు 20 రోజులకు మించి పడుతోందని వాపోతున్నారు. పీసీసీ, స్టాంపింగ్ల కోసం నెలన్నర పడుతోందని, ఒకవేళ స్లాట్ సకాలంలో బుక్ కాకపోతే మరింత ఎక్కువ సమయం అవుతోందని చెబుతున్నారు. దీంతో వీసా జారీ అయ్యాక 3 నెలల్లో కువైట్కు చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రక్రియలు ఆలస్యమై వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసాలను రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. భారీగా పెరిగిన స్టాంపింగ్ ఫీజు కువైట్ ఎంబసీలో స్టాంపింగ్ ఫీజును భారీగాపెంచారు. గతంలో రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.20 వేల వరకు ఖర్చు అవుతోంది. కువైట్ విదేశాంగ శాఖనే భారీగా ఫీజు పెంచిందని, తమ చేతిలో ఏం లేదని మన విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. వీసాల జారీకి అనుగుణంగా పీసీసీ, స్టాంపింగ్ ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించాలని వలస కార్మికులు కోరుతున్నారు. -
పచ్చ పన్నాగం: భర్త మోసం చేస్తే.. మధ్యవర్తితం పేరుతో టీడీపీ నేత..
సాక్షి, ఏలూరు: ఆమెది ఈ దేశం కాదు. అయితే కట్టుకున్న వాడికోసం దేశం కాని దేశం నుంచి వచ్చి కలహాల కాపురంలో కష్టాలు ఈదుతోంది. మధ్యవర్తిత్వం నెపంతో వచ్చిన ఓ పచ్చ కామాంధుడి చేతిలో నలిగిపోతోంది. వివరాల్లోకెళ్తే.. శ్రీలంకకు చెందిన విజయలక్ష్మి, ఏలూరు జిల్లా వీరవాసరం మండల పడమటి పాలెంకు చెందిన పితాని వెంకట సత్యనారయణను 2011లో కువైట్లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వారు కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు. అనంతరం పడమటిపాలెం వచ్చి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. అయితే భర్త ఆమెకు తెలియకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా సత్యనారాయణ కుటుంబ సభ్యులు కొంత బంగారంతో పాటు, ఐదు లక్షల నగదు తీసుకుని తనపై దాడి చేశారని విజయలక్ష్మి వాపోతోంది. అయితే మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరవల్లి చంద్రశేఖర్ 2021లో అత్త ఇంటివారి నుంచి రెండున్నర లక్షలు ఇచ్చే విధంగా సెటిల్మెంట్ చేశాడని బాధితురాలు తెలిపింది. కానీ మధ్యవర్తిత్వం చేసి రూ.25వేలు ఇప్పించాడు. మిగిలిన సొమ్ము ఇప్పించమని అడగగా ఇంటికి పిలిచి తనను లోబరుచుకోవడానికి యత్నించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేత చంద్రశేఖర్ లైంగిక వేధించి, బెదిరించాడని శ్రీలంకకు చెందిన విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ('డబ్బే ముఖ్యమని హింసించారు.. నన్ను అర్థం చేసుకోలేదు') -
విజయ్ 'బీస్ట్' రిలీజ్కు అక్కడ నిషేధం.. కారణం ఇదే..
Vijay Starrer Beast Movie Banned In Kuwait Here Is The Reason: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్కు అనూహ్య స్పందన లభిస్తోంది. కానీ ఈ ట్రైలర్తో 'బీస్ట్' చిక్కుల్లో పడ్డాడు. ఈ ట్రైలర్లో షాపింగ్ మాల్ను హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఒక గూఢాచారి ఎలా అంతమొందిచాడనేది చూపించారు. దాదాపు ఈ సినిమా ఉగ్రవాద నేపథ్యంతో తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే అరబిక్ దేశాలు ప్రోత్సహించని ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నందున గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ 'బీస్ట్'ను నిషేధించింది. అరబ్ దేశాలను విలన్లుగా, టెర్రరిస్టులకు నిలయంగా చూపించే ఏ సినిమాను గల్ఫ్ దేశాలు అంగీకరించవని తెలిసిందే. టెర్రరిస్టులు ఎక్కువగా కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో దాక్కుంటారని, అందుకు అక్కడ చట్టాలు కూడా సహకరిస్తాయని టాక్ ఉంది. అయితే యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ వంటి గల్భ్ దేశాల్లో 'బీస్ట్' రిలీజ్కు మార్గం సుగమం అయింది. -
కువైట్లో చిక్కుకున్న మహిళకు ఏపీఎన్ఆర్టీఎస్ చేయూత
కడప కార్పొరేషన్: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు జల్లగుంట గ్రామానికి చెందిన మహిళకు ఏపీఎన్ఆర్టీఎస్ చేయూతనందించింది. వివరాలిలా ఉన్నాయి.. వెంపటపు ప్రశాంతి అనే మహిళ జీవనోపాధి కోసం 2020లో కువైట్కు వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ప్రతినెలా జీతం పంపుతూ, కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్లో మాట్లాడేది. ఇటీవల తన వీసా గడువు ముగిసినా ఇండియాకు పంపకపోవడంతో ఆమె ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్లైన్ను సంప్రదించి సాయం చేయమని అభ్యర్థించింది. స్పందించిన ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ మహేశ్వర్రెడ్డి కువైట్లోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించి, ఆమెకు 10 రోజుల పాటు ఉచితంగా వసతి కల్పించటంతోపాటు తిరిగి ఇండియాకు తీసుకురావటానికి అవసరమైన పేపర్ వర్క్ అంతా పూర్తి చేయించారు. దీంతో ఆమె సోమవారం క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ.. తాను ఇండియాకు తిరిగి రావటానికి సాయపడిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్, సీఈవో దినేష్కుమార్, డైరెక్టర్ బీహెచ్ ఇలియాస్, వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ఎం.బాలిరెడ్డి, ఎన్.మహేశ్వర్రెడ్డి, భారత రాయబార కార్యాలయ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
కువైట్ : అర్జియా హత్య కేసుల నిందితుడి ఆత్మహత్య
-
అక్కడ మౌనం పాటించండి.. ఫోటోలు తీశారో.. భారీ జరిమాన
స్మశాన వాటికల దగ్గర ఎవరైనా కెమెరాలతో హడావుడి చేస్తే చెల్లదంటూ తేల్చి కువైట్ ప్రభుత్వం చెప్పింది. అంత్యక్రియల దగ్గర పాటించాల్సిన నిబందనలను తాజాగా సవరించింది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యూనరల్ డిపార్ట్మెంట్ కువైట్ తెలిపిన వివరాల ప్రకారం స్మశానాల్లో ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీయడం, దిగడం చేస్తే 5,000 కువైటీ దినార్లు జరిమానాగా విధిస్తామని పేర్కొంది. రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్, ఇతర సెలబ్రిటీలు చనిపోయినప్పుడు స్మశానాల దగ్గర కెమెరాల హడావుడి ఎక్కువైంది. అంత్యక్రియల దగ్గర కెమెరాల కారణంగా వాతావరణం పాడైపోతుంది. దీంతో కువైట్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంత్యక్రియల కోసం ఉపయోగించిన స్మశానంలో ఇతర కార్యక్రమాలు చేపట్టినట్టు తేలితే కనిష్టంగా రెండు వేల దినార్లు గరిష్టంగా 5 వేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. -
‘నా భర్తను ఇండియాకు పిలిపించండి.. అన్యాయంగా ఇరికించారు’
సాక్షి, కడప అర్బన్: దేశం కాని దేశంలో బతుకుదెరువుకోసం వెళ్లిన తన భర్తను కువైట్ వాసులు ఒకే కుటుంబానికి చెందిన మూడు హత్యకేసుల్లో అన్యాయంగా ఇరికించారని, ఎలాంటి శిక్ష పడనీయకుండా తన భర్తను ఇండియాకు రప్పించి న్యాయం చేయాలని వెంకటేష్ భార్య స్వాతి విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పాకు చెందిన పిలోళ్ల శ్రీరాములు కుమారుడు వెంకటేష్ కువైట్లో ఓ సేఠ్ వద్ద టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్దియా పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన సేఠ్ అహ్మద్ (80), అతని భార్య కాల్దా (62) కుమార్తె అసుమ (18)ను దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసి అక్కడి జైల్లో ఉంచారు. ఆయన భార్య స్వాతి కూడా కువైట్లోని ఓ న్యాయవాది ఇంట్లో పనిచేస్తోంది. అయితే న్యాయవాది సహాయంతో ఈ నెల 10న కువైట్ నుంచి వైఎస్సార్ జిల్లాకు వచ్చిన వెంకటేష్ భార్య స్వాతి శుక్రవారం తన పిల్లలు జయవర్ధన్, విష్ణువర్ధన్, అత్తామామలు శ్రీరాములు, రమణమ్మ, కుటుంబసభ్యులతో కలిసి కడపలోని కలెక్టరేట్కు వచ్చారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి వారివద్దకు వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, అమాయకుడైన తన భర్త వెంకటేష్ను ప్రభుత్వం చొరవ తీసుకుని కాపాడి ఇండియాకు రప్పించాలని కలెక్టర్ వి.విజయకుమార్ రాజుకు స్వాతి విజ్ఞప్తి చేసింది. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వానికి, విదేశాంగశాఖకు విషయాన్ని వివరిస్తూ వినతిపత్రాన్ని పంపిస్తామని చెప్పారు. -
కువైట్లో ముగ్గురిని హత్యచేసిన ఏపీ వాసి!
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన శ్రీరాములు కుమారుడు పిలోళ్ల వెంకటేష్ కువైట్లో తాను పనిచేస్తున్న యజమానిని, అతడి భార్య, కుమార్తెలను హత్య చేసినట్లు వచ్చిన సమాచారం సంచలనం సృష్టిస్తోంది. వెంకటేష్ మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ ఒకరి ఇంట్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. రెండేళ్ల తరువాత తన భార్య స్వాతిని కూడా కువైట్కు తీసుకెళ్లాడు. వీరికి ఇద్దరు కుమారులు. వారిని వెంకటేష్ అమ్మనాన్నల వద్ద వదిలారు. వారం క్రితం తనకు కువైట్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. యజమానిని, ఆయన భార్యాకూతుళ్లను వెంకటేష్ కత్తితో గొంతు కోసి చంపాడని పోలీసులు తీసుకెళ్లినట్టు అవతలి వ్యక్తి నుంచి సమాచారం వచ్చిందన్నారు. తన కుమారుడికి ఉరిశిక్ష పడుతుందని తెలిపారని శ్రీరాములు చెబుతున్నాడు. వారం రోజుల క్రితం వెంకటేష్ ఇంటికి ఫోన్ చేసి పిల్లల క్షేమసమాచారాలు తెలుసుకున్నాడని, కానీ ఇంతలోకే ఇలా జరిగిందా అని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. -
వలస కార్మికుల ఆశలు ఆవిరి
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకునే విషయంలో మొదట వెనక్కి తగ్గిన కువైట్ ప్రభుత్వం మళ్లీ చర్యలు తీసుకుంటోంది. డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన విదేశీ వలస కార్మికుల వీసాల రెన్యువల్కు సానుకూలత తెలిపిన కువైట్ ప్రభుత్వం అంతలోనే మనసు మార్చుకుంది. తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికులలో 60 ఏళ్ల వయసు నిండినవారికి డిగ్రీ పట్టా లేకుంటే వారిని సొంత గడ్డకు పంపించాలని 2020 డిసెంబర్లో కువైట్ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ నిబంధనను అమలు చేస్తే తమ దేశంలోని వివిధ కంపెనీలలో ఉన్న ఎంతో మంది నిపుణులను కోల్పోవలసి వస్తుందని భావించిన కువైట్ సడలింపులు ఇచ్చింది. దీని ప్రకారం 250 దినార్లు అంటే మన కరెన్సీలో రూ.60 వేల వరకు ఫీజును చెల్లించి 60 ఏళ్లు పైబడిన వలస కార్మికులు వీసాను రెన్యువల్ చేసుకోవచ్చని సూచించింది. దీంతో ఈ కేటగిరీలోని కార్మికులు కాస్త ఊరట చెందారు. సీనియారిటీ ఉన్న వలస కార్మికులకు రూ.50 వేలకు మించి వేతనాలు ఉన్నాయి. కువైట్ ప్రభుత్వం సూచించిన ఫీజు చెల్లిస్తే నెల నుంచి 40 రోజుల వేతనం ఖర్చు చేస్తే సరిపోతుందని వలస కార్మికులు భావించారు. కువైట్లోని ఆయిల్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు, మాల్స్ ఇలా ఎన్నో రంగాల్లో 1.75 లక్షల మంది వరకు తెలంగాణకు చెందిన వలస కార్మికులు ఉంటారని అంచనా. ఇందులో డిగ్రీ పట్టా లేని 60 ఏళ్ల వయసు నిండిన వలస కార్మికుల సంఖ్య 30 వేల వరకు ఉంటుంది. కువైట్ ప్రభుత్వం ఇప్పుడు వీసాలను రెన్యువల్ చేయకపోవడంతో వీసా గడువు ముగిసిన వారు ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది. చదవండి: విదేశాల్లో వైద్య విద్యకు ఎన్ఎంసీ కఠిన నిబంధనలు -
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్కి షాక్.. FIR మూవీ బ్యాన్
Vishnu Vishal FIR Movie Banned: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్కి షాక్ తగిలింది. తాజాగా ఆయన నటించిన చిత్రం FIR(ఎఫ్ఐఆర్ )నేడు(ఫిబ్రవరి11)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తున్న ఈ సినిమాకు మూడు దేశాలు షాకిచ్చాయి. కువైట్, మలేషియా, ఖతార్లతో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్ వెల్లడించాడు. సినిమాలోని ప్రధాన కంటెంట్ కారణంగా అక్కడ సెన్సార్ని క్లియర్ చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో మలేషియా, కువైట్, ఖతార్ ఫ్యాన్స్కు హీరో విష్ణు విశాల్ క్షమాపణలు చెప్పాడు. కాగా ఈ సినిమాలో విష్ణు ముస్లిం యువకుడిగా నటించగా, గౌతమ్ మీనన్ పోలీసు అధికారిగా నటించాడు. మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 😔🤫🤫 Sorry #MALAYSIA and #KUWAIT audience... https://t.co/mUDZA3mJK4 — IRFAN AHMED (ABA) (@TheVishnuVishal) February 10, 2022 -
కువైట్కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త
మోర్తాడ్ (బాల్కొండ): కువైట్కు వలస వెళ్లే కార్మికులకు శుభవార్త. ఆ దేశంలో పని చేసే భారత కార్మికులకు కనీస వేతనంగా నెలకు వంద దినార్లు అంటే మన కరెన్సీలో రూ.24,700 ఇవ్వాలని భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రతిపాదించారు. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (పీఏఎం)కు అధికారులు ఈ మేరకు ప్రతిపాదన చేశారు. కువైట్లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న వలస కార్మికులకు చెల్లించాల్సిన కనీస వేతన ఆంశంపై అక్కడి ప్రభుత్వం వివిధ దేశాల కార్మిక శాఖలతో చర్చలు జరిపింది. ప్రధానంగా భారత్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ల కార్మిక శాఖలతో కువైట్ ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. ఈ మేరకు భారత వలస కార్మికులకు కనీస వేతనంగా రూ.24,700 చెల్లించాలనే ప్రతిపాదన సిద్ధమైంది. గతంలో కనీస వేతనంగా నెలకు 45 దినార్లు చెల్లించాలని విదేశాంగ శాఖ అధికారులు చెప్పడంతో కార్మికులనుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇదిలా ఉండగా కరోనా కష్టాల సమయంలో కువైట్.. వలస కార్మికులకు కనీస వేతనం పెంచే విషయంపై ఆలోచన చేయడం హర్షణీయమని కార్మికులు అంటున్నారు. (క్లిక్: ఎంబసీ బాత్రూమ్లో స్పై కెమెరాల కలకలం) 60 ఏళ్లు నిండిన కార్మికులకు ఊరట.. 60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపాలన్న నిర్ణయంపై కువైట్ వెనక్కు తగ్గింది. డిగ్రీ అర్హత లేదా 60 ఏళ్లు దాటినవారి వీసాలు, వర్క్పర్మిట్లను కొంతకాలం రెన్యూవల్ చేయలేదు. దీంతో నిపుణులైన కార్మికులు డిగ్రీ పట్టా లేక ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అయితే నైపుణ్యం ఉన్న కార్మికులకు కొరత ఏర్పడడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. డిగ్రీ పట్టా లేనివారి నుంచి 250 దినార్లను ఫీజుగా వసూలు చేసి వర్క్పర్మిట్లను రెన్యూవల్ చేస్తోంది. (క్లిక్: అరుదైన గౌరవం అందుకున్న కాజల్ అగర్వాల్) -
సీనియర్ వలస కార్మికులకు శుభవార్త! వీసాల విషయంలో వెనక్కి తగ్గిన కువైట్
ఎన్నాళ్ల నుంచో రెక్కలు ముక్కలు చేసుకుని దేశ అభివృద్ధికి పాటుపడిన సీనియర్ ప్రవాస కార్మికులకు చేటు తెచ్చే నిబంధనల విషయంలో కువైట్ సర్కార్ వెనక్కి తగ్గింది. వయసుపై బడిన కార్మికుల ఇబ్బందులు, వారి సేవలను దృష్టిలో ఉంచుకుని వర్క్ పర్మిట్ వీసా నిబంధనల్లో పలు సవరణలు చేసింది. కువైట్ ప్రభుత్వం ఇటీవల వర్క్ పర్మిట్ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. డిగ్రీ విద్యార్హత లేని 60 ఏళ్లుపై బడిన వలస కార్మికులకు వర్క్ పర్మిట్ వీసాలను రెన్యువల్ చేయడానికి నిరాకరించింది. పనుల్లో వీరి స్కిల్ సరిపోవడం లేదని, శ్రమ కూడా తగ్గిపోతుందనే నెపంతో కువైత్ ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 4,000ల మంది వలస కార్మికులు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దీంతో కువైత్ ప్రభుత్వ నిర్ణయం పట్ల విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దీంతో వర్క్ పర్మిట్ వీసా నిబంధనలకు సంబంధించి తాజాగా జారీ చేసిన గెజిట్ను ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంది. మరో ఏడాది తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో డిగ్రీ లేని, 60 ఏళ్లు పైబడిన సీనియర్ వలస కార్మికులకు ఊరట లభించింది. ఎప్పటిలాగే వారు 250 కువైట్ దినార్లు (రూ.61,000) చెల్లించి తమ వర్క్ పర్మిట్ను రెన్యూవల్ చేయించుకోవచ్చు. చదవండి: దేశం కాని దేశంలో భారత మహిళ ఒంటరి పోరాటం -
వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!
Viral Video: Woman Spotted Carrying Lion In Her Arms: ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన వీడియోలను చాలనే చూశాం. పైగా అవి సాహాసోపేతంగా తోటి జంతువులను లేదా మనుషులను రక్షించిన వీడియోలను చూశాం. అచ్చం అలానే కాకపోతే ఒక అల్లరి పెంపుడు సింహాన్ని యజమాని చేతులతో ఎత్తుకుని మోసుకుంటూ తీసుకువచ్చిన వీడియో ఒకటి సామాజికి మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. (చదవండి: దాల్సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం) అసలు విషయంలోకెళ్లితే...ఆ వీడియోలో కువైట్లోని ఒక మహిళ ఒక సింహాన్ని చేతులతో మోసుకొస్తున్నట్లు ఉంటుంది. పైగా ఆ సింహం నన్ను వదిలేయమంటూ తెగ మెలికలు తిరిగిపోతున్నట్లు కనిపించింది. అసలు విషయం ఏమిటంటే ఒక మహిళ సింహాన్ని పెంచుకుంటుంది. అయితే ఇది బయటకు వచ్చి పక్కంటి వాళ్ల తోటను నాశనం చేసి అక్కడున్న వాళ్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో సదరు మహిళ ఆ సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చింది. (చదవండి: తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్ ఫాలో మీ అంటూ..) My neighbor and her dog seemed to not be getting along last night pic.twitter.com/fUGcpuTkMY — Arlong (@ramseyboltin) January 3, 2022 -
బిడ్డ భవిష్యత్ కోసం కువైట్కు.. మరోగంటలో ఆమెను చూస్తాననగా..
పెళ్లయిన కొన్నాళ్లకే భర్తను మృత్యువు కబళించేసింది. ఒక్కగానొక్క బిడ్డ భవిష్యత్ కోసం దేశంగాని దేశం వెళ్లింది. మూడేళ్లకోసారి వచ్చి కుమార్తెను తనివిదీరా చూసుకునేది. వయసు మీద పడడంతో ఇక చివరిమజిలీని కుమార్తె వద్దే గడపాలనుకుంది. కువైట్లో విమానమెక్కి స్వదేశానికి వచ్చింది. అక్కడి నుంచి కారులో జిల్లా పొలిమేర వరకు వచ్చింది. మరో గంటలో కన్నబిడ్డను చూసేస్తామనుకుంది. అంతలోనే మృత్యువు అడ్డుపడింది. కారులో ఉన్న ఆమెతో పాటు, సోదరుడినీ తీసుకెళ్లిపోయింది. అమ్మ వచ్చేస్తోందని ఎంతో ఆత్రుతగా ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న కుమార్తె జీవితంలో చీకటి నిండిపోయింది. ఇటు మామయ్య కుటుంబం కూడా తనలాగే పెద్ద దిక్కు కోల్పోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. సాక్షి, చిత్తూరు(రేణిగుంట): రేణిగుంట–కడప రోడ్డు మార్గంలో గురువారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రేణిగుంట అర్బన్ సీఐ అంజూయాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరం పంచాయతీ చెర్లోపల్లి ఎస్టీ కాలనీకి చెందిన ముద్దనూరు సుబ్బనరసమ్మ(60) 15 ఏళ్లుగా మస్కట్, కువైట్కు ఉపాధి కోసం వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట కువైట్కు వెళ్లి, తిరిగి ఇంటికొస్తున్నట్లు బంధువులకు సమాచారం అందించడంతో ఆమెను తీసుకొచ్చేందుకు బుధవారం సాయంత్రం సుబ్బనరసమ్మ సోదరుడు లక్ష్మయ్య(40), అతని కుమారుడు శేఖర్(20), బావ సిద్ధయ్య(67), ఓ బాడుగ కారును మాట్లాడుకుని చెన్నైకి బయల్దేరారు. వారితోపాటు కారు డ్రైవర్ భాను(32) కూడా ఉన్నాడు. చెన్నై విమానాశ్రయంలో దిగిన సుబ్బనరసమ్మను కారులో ఎక్కించుకుని గురువారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. చదవండి: (రాజేంద్రనగర్లో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం) రేణిగుంట మండలం మామండూరు పంచాయతీ కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా రేణిగుంట వైపు వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కువైట్ నుంచి వస్తున్న సుబ్బనరసమ్మ(60), ఆమె సోదరుడు లక్ష్మయ్య(40) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న లక్ష్మయ్య కుమారుడు శేఖర్(20), బావ సిద్ధయ్య(67), బెరసపల్లికి చెందిన కారు డ్రైవర్ భాను (32)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ అంజూయాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో సిద్ధయ్య, భాను పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. చదవండి: (డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి..) కుమార్తె భవిష్యత్ కోసమే.. సుబ్బనరసమ్మకు పెళ్లయిన కొన్నేళ్లకే భర్త మృతి చెందాడు. ఒక్కగానొక్క కూతురు లక్ష్మీదేవి భవిష్యత్తు కోసం, పొట్ట చేతపట్టుకుని 15ఏళ్ల కిందట ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లింది. కొంత సంపాదించి కుమార్తెను మడంపల్లివాసికి ఇచ్చి తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిపించింది. మూడేళ్లకోసారి వచ్చి కుమార్తె చూసుకుంటూ కొన్నేళ్లపాటు ఇక్కడే ఉండి మళ్లీ కువైట్కు వెళుతుండేది. ఈ క్రమంలో 2019లో ఆమె కువైట్కు వెళ్లింది. ఇక ఇంటివద్దే ఉండి, కూతురు బాగోగులను చూసుకుంటానని కుమార్తె, బంధువులకు చెప్పి కువైట్లో బుధవారం బయల్దేరింది. గురువారం ఉదయం కన్నకూతురును చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె సోదరుడు లక్ష్మయ్యది కూడా రెక్కాడితే గానీ డొక్కాడని దుస్థితి. ఆయనకు భార్య గంగాదేవి, ఇద్దరు కుమారులు మహేంద్ర(22), శేఖర్(20) ఉన్నారు. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో గంటకల్లా ఇల్లు చేరుతామనుకున్న వారిపై దూసుకొచ్చిన మృత్యుశకటం ఆ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. -
కువైట్లో ఓపెన్ హౌజ్
కువైట్లో నివసిస్తున్న భారతీయ ఇంజనీర్లు, నర్సుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 22న ఓపెన్ హౌజ్ను కువైట్లో ఇండియన్ ఎంబసీ నిర్వహించింది కోవిడ్ సంక్షోభం తర్వాత కువైట్లో చోటు చేసుకున్న మార్పులు.. అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా ఈ ఓపెన్ హౌజ్ కార్యక్రమం జరిగింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలైంది. గల్ఫ్ దేశాల్లో ఇంటి సహాయకులుగా పని చేస్తున్న వారి హక్కులు, జీత భత్యాలు అక్కడ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను తెలియజేస్తూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఇంటి పని చేసే వారు జీవించేందుకు అనువైన అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు. -
డబుల్ వీసాలు.. ఏజెంట్ల మోసాలు
44 women Flying To Kuwait Were Caught At RGI : ఏజెంట్లు తప్పుదారి పట్టించడంతో రెండు వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో మహిళలు ముందుగా విజిట్ వీసాలు చూపించారు. కువైట్కు ఎందుకు వెళ్తున్నారని అధికారులు ప్రశ్నించ గా కొందరు ఉపాధి నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వారి వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించారు. మహిళలందరి వద్ద విజిట్ వీసాలతో పాటు వర్క్ వీసాలు కూడా లభ్యమయ్యాయి. ఏజెంట్ల సాయంతో బయల్దేరి న మహిళలకు రెండు వీసాలతో వెళ్లడం నేర మని కూడా తెలియదు. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏజెంట్లు సమకూర్చిన రెండు వీసాలతో కువైట్కు బయల్దేరారు. వారంతా ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారిగా నిర్ధారించుకున్న అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా దర్యాప్తు ప్రారంభించారు. వారికి తెలియకుండా.. మూడు రాష్ట్రాలకు చెందిన మహిళలందరు కూడా ఒకే విమానంలో కువైట్కు వెళ్లేందుకు వచ్చారు. వీరంతా ఆయా ప్రాంతాల సబ్ఏజెంట్లతో పాటు ప్రధాన ఏజెంట్లకు అనుసం ధానంగా వీసాలు పొందినట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. ప్రధాన ఏజెంట్ ముంబై కి చెందినట్టు గుర్తించారని సమాచారం. గతంలో కూడా సదరు ఏజెంట్ ద్వారా వెళ్లిన మహిళలు ఇదే తరహా మోసానికి గురయ్యా రు. ఒక్కొక్కరు సుమారు రెండు నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. వీసాల్లో ఉన్న పొరపాట్లను మహిళలకు తెలియకుండానే ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. విజిట్ వీసాను ఇక్కడ బయలుదేరే సమ యంలో చూపించాలని, వర్క్ వీసాలను కు వైట్లో చూపించాలని మహిళలకు ఏజెంట్లు చెప్పినట్లు సమాచారం. మహిళల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల వారున్నారు. రెండు వీసాలు ఎందుకు..? పదో తరగతి కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారు కొన్ని దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లడానికి ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెకింగ్ రిక్వైర్డ్)లో భాగంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే కార్మికులను పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వర్కింగ్ వీసాలను వాడుకునేందుకు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లపై కేసు ఉపాధి నిమిత్తం వెళ్తున్న మహిళలకు ఏజెంట్లు విజిట్ వీసాలు జారీ చేశారు. వర్కింగ్ వీసాలకు ఈసీ ఆర్ లేకుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి విజిట్ వీసాలతో పాటు వర్కింగ్ వీసాలు అందజేశారు. ఏజెంట్లపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిళలను బాధితులుగానే పరిగణిస్తున్నాం. – విజయ్కుమార్, సీఐ, ఆర్జీఐఏ అయోమయంగా ఉంది.. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉపా ధి నిమిత్తం కువైట్ వెళ్లడానికి వచ్చాం.. మా వద్ద రెండు వీసాలున్నాయని అధికారులు నిలిపివేసి పోలీస్స్టేషన్కు పంపారు. గతంలో లాక్డౌన్లో కూడా వీసాలు రద్దయ్యాయి. ఇప్పుడేమో ఇలా.. అంతా అయోమయంగా ఉంది. – బాధిత మహిళ -
పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా..
శంషాబాద్: ఏజెంట్లు తప్పుదారి పట్టించడంతో రెండు వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో మహిళలు ముందుగా విజిట్ వీసాలు చూపించారు. కువైట్కు ఎందుకు వెళ్తున్నారని అధికారులు ప్రశ్నించ గా కొందరు ఉపాధి నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వారి వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించారు. మహిళలందరి వద్ద విజిట్ వీసాలతో పాటు వర్క్ వీసాలు కూడా లభ్యమయ్యాయి. ఏజెంట్ల సాయంతో బయల్దేరి న మహిళలకు రెండు వీసాలతో వెళ్లడం నేర మని కూడా తెలియదు. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏజెంట్లు సమకూర్చిన రెండు వీసాలతో కువైట్కు బయల్దేరారు. వారంతా ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారిగా నిర్ధారించుకున్న అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా దర్యాప్తు ప్రారంభించారు. వారికి తెలియకుండా.. మూడు రాష్ట్రాలకు చెందిన మహిళలందరు కూడా ఒకే విమానంలో కువైట్కు వెళ్లేందుకు వచ్చారు. వీరంతా ఆయా ప్రాంతాల సబ్ఏజెంట్లతో పాటు ప్రధాన ఏజెంట్లకు అనుసం ధానంగా వీసాలు పొందినట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. ప్రధాన ఏజెంట్ ముంబై కి చెందినట్టు గుర్తించారని సమాచారం. గతంలో కూడా సదరు ఏజెంట్ ద్వారా వెళ్లిన మహిళలు ఇదే తరహా మోసానికి గురయ్యా రు. ఒక్కొక్కరు సుమారు రెండు నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. వీసాల్లో ఉన్న పొరపాట్లను మహిళలకు తెలియకుండానే ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. విజిట్ వీసాను ఇక్కడ బయలుదేరే సమయంలో చూపించాలని, వర్క్ వీసాలను కు వైట్లో చూపించాలని మహిళలకు ఏజెంట్లు చెప్పినట్లు సమాచారం. మహిళల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల వారున్నారు. రెండు వీసాలు ఎందుకు..? పదో తరగతి కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారు కొన్ని దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లడానికి ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెకింగ్ రిక్వైర్డ్)లో భాగంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే కార్మికులను పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వర్కింగ్ వీసాలను వాడుకునేందుకు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లపై కేసు ఉపాధి నిమిత్తం వెళ్తున్న మహిళలకు ఏజెంట్లు విజిట్ వీసాలు జారీ చేశారు. వర్కింగ్ వీసాలకు ఈసీ ఆర్ లేకుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి విజిట్ వీసాలతో పాటు వర్కింగ్ వీసాలు అందజేశారు. ఏజెంట్లపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిళలను బాధితులుగానే పరిగణిస్తున్నాం. – విజయ్కుమార్, సీఐ, ఆర్జీఐఏ అయోమయంగా ఉంది.. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉపా« ది నిమిత్తం కువైట్ వెళ్లడానికి వచ్చాం.. మా వద్ద రెండు వీసాలున్నాయని అధికారులు నిలిపివేసి పోలీస్స్టేషన్కు పంపారు. గతంలో లాక్డౌన్లో కూడా వీసాలు రద్దయ్యాయి. ఇప్పుడేమో ఇలా.. అంతా అయోమయంగా ఉంది. – బాధిత మహిళ చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం) -
ఇండియన్లకు కువైట్ షాక్ ! టూరిస్టు వీసా జాబితాలో మొండి చేయి
భారతీయ పర్యాటకులకు కువైట్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. టూరిస్టు వీసాల జారీకి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో కువైట్ దేశానికి వచ్చేందుకు ఇటీవల 53 దేశాలకు చెందిన పౌరులకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లో సభ్యత్వం ఉన్న దేశాల్లో గత ఆర్నెళ్లుగా నివసిస్తున్న విదేశీ ప్రొఫెషనల్స్కి టూరిస్టు వీసాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు కువైట్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్లో ఇ వీసాలు వీటిని జారీ చేయనుంది. అయితే టూరిస్టు వీసాలు ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్న దేశాల జాబితాలో భారత్ను మినహాయించింది. కువైట్లో వలస కార్మికులతో పాటు పెద్ద ఎత్తున్న ప్రొఫెషనల్స్ అక్కడ పని చేస్తున్నారు. అయినప్పటికీ భారత్కు వీసాలు జారీ చేసే విషయంలో కువైట్ భారత్ని పక్కన పెట్టింది. కువైట్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం... 53 దేశాలకు చెందిన వారికి ఈ వీసాలు జారీ చేసేందుకు అంగీకారం తెలపగా ఇందులో మెజారిటీ దేశాలు యూరప్, అమెరికా ఖండాలకు చెందినవే ఉన్నాయి. ఏషియాకు సంబంధించి జీసీసీ సభ్యదేశాలకే ప్రాధాన్యం ఇచ్చింది. జీసీసీ సభ్యదేశాలల్లో ఉన్న కన్సల్టెంట్స్, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, జడ్జిలు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యులు, యూనివర్శిటీ అధ్యాపకులు, ప్రెస్ అండ్ మీడియా సిబ్బంది, పైలట్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, సీస్టం అనలిస్ట్స్, మేనేజర్స్, వ్యాపారవేత్తలు, దౌత్య దళం, యూనివర్శిటీ గ్రాడ్యుయేట్స్, సౌదీ ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు కువైట్ టూరిస్టు వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్, కువైట్లలో ఆరు నెలల కంటే ఎక్కువ నివాసం ఉండాలనే నిబంధన విధించింది. చదవండి: Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం -
స్వస్థలాలకు కువైట్ బాధిత మహిళలు
కడప కార్పొరేషన్: కువైట్లో ఇబ్బందులు పడుతున్న మహిళలను ఇండియాకు పంపించేందుకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) చేసిన కృషి ఫలించింది. మంగళవారం వైఎస్సార్ జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు, చిత్తూరుకు చెందిన మరో మహిళ స్వస్థలాలకు చేరిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా టి. సుండుపల్లెకు చెందిన పళ్లపు మహేశ్వరి, చింతకొమ్మదిన్నెకు చెందిన మొగిళ్ల సుజాత, పుల్లంపేటకు చెందిన పళ్లపు వెంకటమ్మ, చిత్తూరు జిల్లా మదనపల్లె, బొమ్మన్ చెరువుకు చెందిన పెద్ద కొండేటి గీత కువైట్లో ఒకే ఇంట్లో పనిచేస్తుండేవారు. కువైటీ(స్పాన్సర్) సక్రమంగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ బాధల నుంచి ఎలా విముక్తి పొందాలని ఆలోచిస్తుండగా సోషల్ మీడియాలో ఏపీఎన్ఆర్టీఎస్ వారి నంబర్లు చూసి సాయం చేయాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం ఏపీఎన్ఆర్టీఎస్ రీజినల్ కో–ఆర్డినేటర్ ఎన్.మహేశ్వర్రెడ్డి తదితరులు భారత రాయబార అధికారులతో మాట్లాడి వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. తమను ఆదుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యులు ఎన్.మహేశ్వర్రెడ్డి, ఆకుల ప్రభాకర్రెడ్డి, రహమతుల్లా, సుబ్బారెడ్డికి బాధిత మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. -
వలస కార్మికులకు కువైట్ సర్కార్ ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడానికి 60 ఏళ్ల వయసు పైబడిన వారిని స్వదేశాలకు పంపిన కువైట్ ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేసింది. వలస కార్మికులను బలవంతంగా పంపించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో 60 ఏళ్ల పైబడిన వారిని మళ్లీ విధులలో కొనసాగించాలని కువైట్ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించే బాధ్యత కువైట్ ప్రభుత్వంపై పడటంతో 2020 డిసెంబర్లో విదేశీ వలస కార్మికులను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాపార, వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. కువైట్ పౌరులలో ఎక్కువ మందికి వ్యాపార, సాంకేతిక రంగాల్లో అనుభవం లేక పోవడం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వ్యాపారాలకు ప్రతిబంధకంగా మారింది. దీంతో వృత్తి నైపుణ్యం ఉన్న విదేశీ వలస కార్మికులను వయసుతో సంబంధం లేకుండా పనుల్లోకి తీసుకోవాలని కువైట్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జనవరి 1 నాటికి 60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపించగా ఆ తర్వాత కూడా 60 ఏళ్లు నిండిన వారికి వీసాలను రెన్యూవల్ చేయలేదు. 60 ఏళ్ల వయసు నిబంధనను ఎత్తివేయడంతో తెలుగు రాష్ట్రాల కార్మికులకు ఊరట లభించింది. కువైట్లో ఉపాధి పొందుతున్న తెలుగు రాష్ట్రాల వలస కార్మికుల సంఖ్య దాదాపు 3.5 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా కరోనాతో నిలిపివేసిన కువైట్ ప్రభుత్వం నిలిపివేసిన వీసాలను ఇప్పుడు జారీచేయడానికి ఆమోదం తెలిపింది. (చదవండి: ఆ విషయంలో దేశానికే ఆదర్శం.. హైదరాబాద్) -
ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా మారి
సాక్షి, మర్రిపాడు: ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మండలంలోని నందవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లి అక్కడ ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతిచెందాడు. వివరాలు.. నందవరం గ్రామానికి చెందిన షేక్ మౌలాలి – జానీబేగం దంపతుల 3వ కుమారుడు షేక్ ఖాజాగరీబ్ నవాజ్(22) కువైట్లోని ఫెర్దోస్ పట్టణంలో ఉన్న గ్రేన్ కోసుర్ ఏరియాలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి) రెండేళ్ల క్రితం కువైట్కు వెళ్లిన నవాజ్ అక్కడ ఇళ్లలో పూల మొక్కల పెంపకం పనులు చేసుకుంటూ సంపాదించిన నగదును ఇంటికి పంపుతూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించే తల్లిదండ్రులకు అండగా ఉండేవాడు. తరచూ ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడే నవాజ్ మంగళవారం కూడా వారితో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ బుధవారం ఉదయం అతను ఉంటున్న ఇంటి సమీపంలో రేకుల షెడ్లో నవాజ్ ఉరేసుకుని మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. నవాజ్తోపాటు అక్కడ పనుల కోసం వెళ్లిన మరికొంతమంది ఈ విషయం తెలియజేశారు. అందరూ నిద్రపోయిన తరువాత నవాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాస్పదంగా ఉందంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవాజ్ మృతదేహానికి అక్కడే గురువారం పోస్టుమార్టం నిర్వహించారని, శనివారానికి మృతదేహం స్వగ్రామానికి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. నవాజ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు) -
కువైట్లో మహానేత వైఎస్ఆర్కు ఘన నివాళి
కువైట్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కువైట్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కువైట్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిపైనా క్రియేటివ్ మాస్ మస్తాన్ గారి డైరెక్షన్ లో వై.యస్.ఆర్ జిల్లా పెనగలూరు మండలంకు చెందిన పెడమల్లి మోహన్ రెడ్డి రచించి గానం చేసిన తొలి తెలుగు పాటను కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గ రెడ్డి గార్ల చేతుల మీదుగా ఈ పాటను విడుదుల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిపైనా ఇంతటి మంచి పాట చేసినందుకు మస్తాన్, మోహన్ రెడ్డిని అభినందించారు. కో-కన్వీనర్లు గోవిందు నాగరాజు యం.వి నరసా రెడ్డి మాట్లాడుతూ.. సూర్య చంద్రలు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతి తెలుగు వారి గుండెల్లో శాశ్వతముగా ఉంటారని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత, పేద, ధనిక, పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఆ జనహృదయ నేతకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరపున నివాళిలు అర్పించారు. తదుపరి కోకన్వీనర్ యం.వి నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటి ప్రధాన కోశాధికారి నాయిని మహేశ్వర రెడ్డి, పులపుత్తూరు సురేష్ రెడ్డి, యువజన విభాగం లీడర్ మర్రి కల్యాణ్, బీసీ సంఘం లీడర్ రమణ యాదవ్, మైనారిటీ విభాగం సభ్యులు రహంతుల్లా, యువజన విభాగం సభ్యులు షేక్ సబ్దర్, హరినాథ్ చౌదరి, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షలు లక్ష్మి ప్రసాద్ పాల్గొన్నారు. -
కువైట్ ప్రయాణం చాలా ఖరీదు.. 15 వేల నుంచి 1.35 లక్షలు
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర తరువాత కువైట్ ప్రభుత్వం తమ దేశానికి విదేశీ విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో వివిధ విమానయాన సంస్థలు టికెట్ ధరలను పెంచేశాయి. షెడ్యూల్ విమానాలను నడపాల్సిన సంస్థలు చార్టర్డ్ విమానాలలో ప్రయాణికులను చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. సాధారణ షెడ్యూల్ విమానాలు నడిపితే తమకు గిట్టుబాటు కాదని పలు విమానయాన సంస్థలు చార్టర్డ్ విమానాలను నడపడానికే మొగ్గుచూపుతున్నాయి. భారత్నుంచి కువైట్కు మామూలుగా షెడ్యూల్ విమాన టికెట్ ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం చార్టర్డ్ విమానాలకు వివిధ విమానయాన సంస్థలు టికెట్ ధరను రూ.1.35 లక్షల వరకు నిర్ణయించాయి. దీంతో మన దేశం నుంచి కువైట్కు వెళ్లాలనుకునే వలస కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 22 నుంచి మన దేశ విమానాల ల్యాండింగ్కు కువైట్ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటివరకు షెడ్యూల్ విమానాలు ప్రారంభం కాలేదు. చార్టర్డ్ విమానాల టికెట్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కువైట్కు వెళ్లాలనుకుంటున్న వలస కారి్మకులను కొన్ని సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయనే అరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా కువైట్ నుంచి భారత్కు సెలవుపై వచ్చిన కారి్మకులకు ఇప్పుడు తిరిగి వెళ్లడానికి అవకాశం లభించింది. కానీ విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడం వారికి భారంగా మారింది. ఇప్పటికైనా విమానయాన శాఖ జోక్యం చేసుకుని కువైట్ విమాన టికెట్ల ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ -
వయసు 58... ఉత్సాహం 18: కాంస్యం సాధించిన షూటర్
2016 రియో ఒలింపిక్స్... షూటింగ్ స్కీట్ ఈవెంట్లో 53 ఏళ్ల అబ్దుల్లా అల్ రషీదీ కాంస్య పతకం సాధించాడు. అయితే అతనిలో ఏమాత్రం ఆనందం లేదు. తన సొంత దేశం కువైట్పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించి ఉండటంతో అతను ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్గా బరిలోకి దిగాడు. ఫుట్బాల్ క్లబ్ ‘అర్సెనల్’ జెర్సీ వేసుకొని పతకం అందుకోగా... వేడుక సమయంలో ఒలింపిక్ పతాకం మాత్రమే ఎగిరింది. ఇది అతడిని చాలా బాధించింది. అంతే... తాను మళ్లీ ఒలింపిక్స్ ఆడాలని, దేశం తరఫున పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా అనుకోవడమే కాదు... ఐదు సంవత్సరాల తర్వాత దానిని సాధించి చూపించాడు. 58 ఏళ్ల వయసులో అదే స్కీట్ ఈవెంట్లో మళ్లీ కాంస్యం గెలిచి కువైట్ జాతీయ పతాకం ఎగురుతుండగా సగర్వంగా నిలబడ్డాడు. టోక్యో క్రీడల్లో పతకం సాధించిన అతి పెద్ద వయస్కుడి గా రషీదీ నిలవడం విశేషం. 1996 నుంచి వరుసగా విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న రషీదీకి ఇవి ఏడో ఒలింపిక్స్ కావడం విశేషం. తొలి ఐదు సందర్భాల్లో 42, 14, 9, 9, 21 స్థానాల్లో నిలిచినా, అతను వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే వచ్చాడు. సోమవారం ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి పతకం కోసం రషీదీతో చివరి వరకు పోటీ పడిన ఈటూ కలినన్ (ఫిన్లాండ్)... రషీదీ తొలి ఒలింపిక్స్ ఆడే సమయానికి పుట్టనే లేదు! అన్నట్లు అతని కుమారుడు తలాల్ అలా రషీదీ కూడా షూటరే. 2012 లండన్ ఒలింపిక్స్లో తండ్రితో కలిసి బరిలోకి దిగిన తలాల్, ఈసారి కూడా ‘ట్రాప్’ ఈవెంట్లో మళ్లీ ఆడుతున్నాడు. చివరగా... ఇంతటితో ఆగిపోనని చెబుతున్న రషీదీ, రిటైర్మెంట్ వయసు (61) వచ్చినా సరే పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణమే లక్ష్యంగా పోటీ పడతానని ప్రకటించడం విశేషం! అదో అంకె మాత్రమే... టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగిన పెద్ద వయస్కురాలిగా మేరీ హనా (ఆస్ట్రేలియా) నిలిచింది. 66 ఏళ్ల హనా ఈక్వెస్ట్రియన్లో ఏడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. అమెరికా ఈక్వెస్ట్రియన్ జట్టు సభ్యుడైన ఫిలిప్ డాటన్ వయసు 57 ఏళ్లు కాగా, ఉజ్బెకిస్తాన్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవితినా వయసు 46 సంవత్సరాలు. ఎనిమిదో ఒలింపిక్స్లో పాల్గొంటున్న చుసోవితినాకు 21 ఏళ్ల కొడుకు ఉండగా... ఈ పోటీల్లో అతనికంటే చిన్న వయసువారు ఎంతో మందితో ఆమె పోటీ పడుతోంది. 45 ఏళ్ల అమెరికా బీచ్ వాలీబాల్ ప్లేయర్ జేక్ జిబ్ను చూసినా సరే... వీరంతా కాలాన్ని వెనక్కి తిప్పి యవ్వనంతో పోటీ పడుతున్నారా అనిపిస్తుంది! -
దెయ్యం వదిలిస్తానంటూ.. రూ. 73 లక్షలు స్వాహా
కువైట్: మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా.. మూఢనమ్మకాలను మాత్రం జయించలేకపోతున్నాడు. శాస్త్రం కంటే మంత్రతంత్రాల మీదే నమ్మకం ఎక్కువ చాలా మందికి. అందుకే మన దగ్గర శాస్త్రవేత్తల కన్నా బాబాలు, స్వామీజీలకు ఆదరణ, గుర్తింపు ఎక్కువ. శాంతి చేస్తాం.. దెయ్యాలను వదిలిస్తామంటూ జనాల దగ్గర డబ్బులు గుంజే వారికి కొదవే లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దెయ్యం వదిలిస్తామంటూ ఏకంగా 73 లక్షల రూపాయలు స్వాహా చేశాడో వ్యక్తి. ఈ ఘటన కువైట్లో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కైరో రిపోర్ట్స్ ప్రకారం ఓ మహిళ తన ఒంట్లో దెయ్యం ప్రవేశించిందని.. అది తనను కంట్రోల్ చేస్తుందని దాని వల్ల ఏం చేస్తున్నానో తనకే తెలియకుండా పోతుందంటూ స్నేహితురాళ్ల దగ్గర చెప్పుకుని బాధపడింది. దాంతో ఆమె స్నేహితులు తమకు ఓ తాంత్రికుడు తెలుసని.. దెయ్యాలు వదిలించడంలో అతడు ఎక్స్పర్ట్ అని చెప్పి.. సదరు మహిళను అతడి దగ్గరకు తీసుకెళ్తారు. తాంత్రికుడు దెయ్యం వదిలిస్తానని దానికి బాగా ఖర్చవుతుందని వారికి తెలుపుతాడు. ఈ క్రమంలో మహిళ తొలత 4 వేల దినార్లు అతడి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాంతో అతడు దెయ్యం వదిలించే కార్యక్రమం ప్రారంభిస్తాడు. ఏవోవే పూజలు చేసి.. దెయ్యాన్ని పారదోలానని చెప్పాడు. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి మరో 26 వేల దినార్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం 30 వేల దినార్లు(73 లక్షల రూపాయలు) స్వాహా చేశాడు. ఆ తర్వాత కూడా మహిళకు తన ఆరోగ్యంలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహిస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి తన స్నేహితురాళ్లు, సదరు మాంత్రికుడి మీద ఫిర్యాదు చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు బాధితురాలి స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఆ దెయ్యం బొమ్మ తిరిగి వచ్చేసిందా? -
కువైట్ పరిస్థితుల నేపథ్యంలో వస్తున్న ‘సాల్ట్’
ఒక అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఒక సంఘటనలో చిక్కుకొంటే ఆ అమ్మాయి ఆ ప్రాబ్లమ్ నుండి ఎలా బయట పడిందనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా వాస్తవికత వినోదాల మేళవింపుతో కువైట్ పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరించిన చిత్రం "సాల్ట్". సింక్ ఫ్రేమ్ పతాకంపై అబ్దుల్ ముజీర్, ఖాజా మొయినుద్దీన్, బాబావలి షేక్, హైదర్ షేక్, మస్తాన్ యోయో ప్రధాన పాత్రలుగా మున్నా సయ్యద్ దర్శకత్వంలో వెంకట్ కోడూరు నిర్మించిన సస్పెన్స్, థ్రిల్లర్ మర్డర్, మిస్టరీ చిత్రం ‘సాల్ట్’అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17 న అమెజాన్, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, హంగామా, యమ్ యక్స్ ప్లేయర్, ఓడాఫోన్ ఐడియా మొదలగు అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర దర్శక,నిర్మాతలు కువైట్ లో ఉన్నందున వారి ప్రతినిధిగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ డాక్టర్ పద్మిని నాగులపల్లి ఆద్వర్యంలో హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఘర్షణ శ్రీనివాస్,దర్శక,నిర్మాత మంజుల సూరజ్, నిర్మాత యమ్ ఆర్.సి చౌదరి, దర్శకుడు నల్లపూసల బాబ్జి, దర్శక,నిర్మాత వెంకటప్పరావు, అమెజాన్ రాజీవ్, రావిపల్లి రాంబాబు,చరణ్ నటుడు, నిర్మాత సురేష్ తదితరులు పాల్గొని చిత్ర ట్రైలర్స్,పోస్టర్స్ లను విడుదల చేశారు. అనంతరం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ డాక్టర్ పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ .."సాల్ట్" మూవీ మొత్తం కువైట్ లోనే చిత్రీకరించడం జరిగింది. కువైట్ లో ఉన్న తెలుగు వారందరూ కలసి రూపొందిన సస్పెన్స్, థ్రిల్లర్ "సాల్ట్". ఈ చిత్రం ప్రీ లాంచ్ ఇక్కడ జరుపు కుంటున్నాము. దర్శక, నిర్మాతలు ఇక్కడ లేకపోయినా వారు తీసిన సినిమాకు మేమున్నాం అంటూ ఇక్కడున్న దర్శక నిర్మాతలు సపోర్ట్ గా నిలిచారు వారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ముఖ్య కారణం దర్శక,నిర్మాత వెంకటప్పరావు, ప్రభంజన్ గార్లే. కరోనా టైం లో కూడా ధైర్యం చేసి కువైట్ నేపథ్యంలో నిర్మించిన "సాల్ట్" చిత్రం వెంకట్ కోడూరు గారికి పెద్ద విజయం సాధించాలని అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ...ప్రతి మనిషికి బీపీఎక్కువైనా, తక్కువైనా ప్రతి రోజు మాట్లాడుకునేది "సాల్ట్" గురించే. అలాంటిది ఈ సాల్ట్ ఏంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల అవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని అన్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. దర్శకనిర్మాతల ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను.డబ్బు సంపాదించాలని కాకుండా వారంతా సినిమా పై ఉన్న ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.వారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు. నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొత్త ఆర్టిస్టులను అవకాశం కల్పిస్తూ నిర్మించిన ఈ "సాల్ట్" చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు. నటుడు,నిర్మాత సురేష్ మాట్లాడుతూ.. ఎంత కాస్ట్ లీ బిర్యానీ తిన్నా సాల్ట్ లేకపోతే రుచి ఉండదు.ఆ "సాల్ట్" కు అంత డిమాండ్ ఉంది. ఆలాంటి మంచి టైటిల్ తో మనముందుకు వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు. రావిపల్లి రాంబాబు, మాట్లాడుతూ... కువైట్ పరిస్థితుల నేపథ్యంలో తీసిన ఈ "సాల్ట్" చిత్రం టీజర్ చాలా బాగుంది.ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. బల్లెం వేణుమాధవ్ మాట్లాడుతూ ..కువైట్ లో ఉన్న వ్యకులని గుర్తించి తీసిన వెంకట్ కోడూరి గారి "సాల్ట్" చిత్రం డిజిటల్ మీడియా ద్వారా విడుదల అవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు. సీనియర్ నిర్మాత యమ్ ఆర్.సి చౌదరి, మాట్లాడుతూ ..నేను చాలా సినిమాలు నిర్మించినా ఇంతమంది గెస్ట్ లను పిలిపించుకోలేక పోయాను. అలాంటిది వెంకట్ కోడూరు గారి ప్రజెన్స్ లేకుండా ఇంతమంది గెస్ట్ లు వచ్చి సినిమా విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నారు . అద్భుతమైన టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు. దర్శక,నిర్మాత మంజుల సూరజ్ మాట్లాడుతూ.. వెంకట్ కోడూరు గారు కువైట్ లో ఉంటూ ఎంతో ఫ్యాషన్ తో ఈ సినిమా తీశారు.వారు తీసిన "సాల్ట్" చిత్రం పెద్ద విజయం సాధించి మరిన్ని సినిమాలు నిర్మిచాలని అన్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రభంజన్ మాట్లాడుతూ.. మున్నా సయ్యద్ ఈ సినిమాను చాలా చక్కగా తీశారు. ఇక్కడున్న వారే సినిమా తీస్తే ఎంత లాభం వస్తుందని ఆలోచిస్తున్నారు. అలాంటిది కువైట్ లో ఉంటూ సినిమా తీసిన వెంకట్ కోడూరి గారికి నా ధన్యవాదాలు. వారికి ఈ సినిమా మంచి పేరుతో పాటు డబ్బు రావాలని ఆశిస్తున్నా నని అన్నారు. దర్శకుడు నల్లపూసల బాబ్జి మాట్లాడుతూ.. కరోనా రావడం వలన ఓ.టి.టి ఫ్లాట్ ఫామ్స్ లకు డిమాండ్ పెరిగిపోయింది.ప్రస్తుతం చాలా మంది ఫ్యామిలీస్ తో కలసి ఇంట్లోనే సినిమా చూస్తున్నారు. కరోనా తరువాత చాలా మందికి డబ్బులు ఇబ్బంది అయ్యాయి. అలాంటి కరోనా టైం లో కూడా "సాల్ట్" పేరుతో సినిమాను తీసిన నిర్మాతల గట్స్ కు మెచ్చుకోవాలి. ఈ సినిమా వారికి పెద్ద విజయం సాధించి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో అమెజాన్ రాజీవ్, నటుడు చరణ్, జ్వాల చక్రవర్తి తదితరులు పాల్గొని గల్ఫ్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం విడుదల అవుతున్న అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో గొప్ప విజయం సాదించాలని అన్నారు. -
కైనన్ షెనాయ్ పసిడి గురి
కువైట్: ఆసియా ఆన్లైన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు అదరగొట్టారు. కువైట్లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 11 పతకాలు గెల్చుకున్న భారత్ టాప్ ర్యాంక్ను దక్కించుకుంది. ఇందులో నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల ట్రాప్ ఈవెంట్లో తెలంగాణ షూటర్ కైనన్ షెనాయ్ చాంపియన్గా నిలిచాడు. 34 మంది షూటర్లు పాల్గొన్న ట్రాప్ ఈవెంట్లో 30 ఏళ్ల కైనన్ 150 పాయింట్లకుగాను 145 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2016 రియో ఒలింపిక్స్లో పాల్గొన్న ఈ హైదరాబాద్ షూటర్ ఆరు రౌండ్లలో వరుసగా 24, 24, 24, 25, 24, 24 పాయింట్లు సాధించాడు. నసీర్ (కువైట్–144 పాయింట్లు) రజతం, పృథ్వీరాజ్ (భారత్–143 పాయింట్లు) కాంస్య పతకం నెగ్గారు. భారత్కే చెందిన సౌరభ్ (10 మీ. ఎయిర్ పిస్టల్), దివ్యాంశ్ (10 మీ. ఎయిర్ రైఫిల్), రాజేశ్వరి (మహిళల ట్రాప్ ఈవెంట్) కూడా బంగారు పతకాలు నెగ్గారు. 22 దేశాల నుంచి 274 మంది షూటర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ముంబై సిటీ జట్టుకు షాక్ బంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో ముంబై సిటీ జట్టుకు రెండో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో ముంబై జట్టును ఓడించింది. 30 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ముంబై జట్టుకు ఈ టోర్నీలో ఎదురైన రెండు పరాజయాలు నార్త్ ఈస్ట్ జట్టు చేతిలోనే రావడం గమనార్హం. నవంబర్ 21న తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్లోనూ ముంబై 0–1తో నార్త్ ఈస్ట్ జట్టు చేతిలో ఓడింది. -
విమానాలపై గల్ఫ్ నిషేధం
మోర్తాడ్ (బాల్కొండ): కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్ సహా పలు దేశాల్లో విస్తరిస్తుండటంతో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్ అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. సోమవారం నుంచి వారంపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులపై సౌదీ, ఒమన్ నిషేధం విధించగా జనవరి 1 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కువైట్ తెలిపింది. అవసరమైతే నిషేధాన్ని మరో వారంపాటు పొడిగిస్తామని సౌదీ పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి భారత్ నుంచి విమాన సర్వీసులను నిలిపేసిన సౌదీ... తమ దేశం నుంచి భారత్ తిరిగి వెళ్లాలనుకొనే వారికి మాత్రం అనుమతించింది. తాజాగా వాటిపైనా నిషేధం విధించింది. (చదవండి: దేశానికి ‘గల్ఫ్’ కష్టాలు) మరోవైపు ఒమన్లో క్షమాభిక్ష అమల్లో ఉన్న తరుణంలో విమాన సర్వీసులపై నిషేధంతో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒమన్లో చాలా సంవత్సరాల తరువాత క్షమాభిక్ష అమలు చేస్తుండటంతో అక్కడ చట్టవిరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు క్షమాభిక్ష పొందడానికి గడువు ఉంది. ఒమన్ ఆకస్మిక నిర్ణయంతో వారు ఇప్పట్లో స్వదేశానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఒమన్లో ఉపాధి పనులకు వీసాలు పొందినవారు కూడా ఇప్పట్లో ఆ దేశానికి వెళ్లే పరిస్థితి లేదు. -
గన్నవరంలో అదృశ్యం.. కడపలో ప్రత్యక్షం
సాక్షి, కృష్ణా: దుబాయ్ నుంచి వచ్చిన మహిళ అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. సదరు మహిళను గుర్తించిన పోలీసులు ఆమె భర్తకు అప్పగించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ కనిపించడం లేదంటూ ఆమె భర్త సత్యనారాయణ గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అతడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దుర్గను గుర్తించి ఆమె భర్త వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ.. ‘ఈ నెల 16న కువైట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాను. అయితే ఇండియాకి వచ్చే ముందు ఫోన్లో నాభర్త సత్యనారాయణతో గొడవ జరిగింది. ఇంటికి వెళ్లేందుకు భయపడి కడపలో ఉన్న నా చెల్లి వద్దకు వెళ్ళాను. పోలీసులు సాయంతో కడప నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్కు వచ్చాను. నాకు,నా భర్తకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు’ అని తెలిపింది. (చదవండి: శ్రుతి కోసం అన్వేషణ) -
60 దాటితే వీసా నో రెన్యూవల్
కువైట్: తమ దేశంలో విదేశీ వలసదారుల సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు తమ పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తృత పరచడానికి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ వలస కార్మికుల్లో ఎవరికైనా 60 ఏళ్లు పైబడితే వారికి వీసాలను రెన్యూవల్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కొత్త వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసిన కువైట్ ప్రభుత్వం.. తమ దేశంలోని వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్న విదేశీ వలస కార్మికుల వయస్సును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా కువైట్లో లైసెన్స్ పొంది వ్యాపారం చేసుకునేవారు తమ వయస్సుతో సంబంధం లేకుండా వీసా రెన్యూవల్ చేసుకోవచ్చు. కరోనా సంక్షోభంతో ఇప్పటికే ఎంతో మంది తెలంగాణ కార్మికులు కువైట్ నుంచి ఇంటి బాట పట్టగా.. వయస్సు ఆధారంగా వీసాల రెన్యూవల్కు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో కొంత మంది కార్మికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంటికి రాక తప్పదని వెల్లడి అవుతోంది. -
స్వదేశానికి రప్పించాలని వేడుకోలు
-
కువైట్లో తెలుగువారి ఆర్తనాదాలు..
సాక్షి, నిజామాబాద్: బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన తెలుగు రాష్ట్రాల వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. వారితో పాటు తమిళనాడు, బీహార్ వాసులు కూడా కరోనా ప్రభావంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్, కామారెడ్డి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వాసులు ఐదు నెలలుగా జీతాలు లేక కువైట్లో కష్టాలు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో రూముల్లోంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. వసతులు లేక విలవిల్లాడుతున్నారు. కనీసం భోజనం, నీళ్లు ఇప్పించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. భారత్కు రప్పించాలని సెల్పీ వీడియోలు ద్వారా వేడుకుంటున్నారు. అక్కడ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు. -
కువైట్లో విలవిల.. మూడు నెలలుగా పనుల్లేక
సంతబొమ్మాళి: బతుకు తెరువు కోసం విదేశాల కు వెళ్లిన వారు కరోనా ప్రభావంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నారు. తమ సమస్యలు ఎవరికి ఎప్పుకోవాలో తెలీక, బాధలు వినేవారు లేక ఆందోళన చెందుతున్నారు. సంతబొమ్మాళి మండలంలోని గెద్దలపాడు, పిట్టవానిపేట, గొలుగువానిపేట, ఎం.సున్నాపల్లి, వజ్రపుకొత్తురు మండలం దేవునల్తాడ, పోలా కి మండలం గప్పెడుపేటకు చెందిన సుమారు 200 మంది యువకులు 2018లో కువైట్ వెళ్లారు. వెల్డింగ్, రిగ్గర్ పనులు చేసుకుంటూ నాలుగు రా ళ్లు వెనకేసుకుంటున్న సమయంలో కరోనా వీరి ఉపాధిని ధ్వంసం చేసింది. కోవిడ్ ప్రభావంతో కువైట్లో ప్రైవేటు కంపెనీలు పనులు ఆపేశాయి. దీంతో మూడు నెలలుగా పనుల్లేక, జీతాలు రాక వీరు అల్లాడిపోతున్నారు. పనులు నిలుపుదల చేసిన మొదటిలో కంపెనీ భోజనాలు పెట్టి నా ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో దాచుకున్న డబ్బులను వీరంతా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. కుటుంబాలను పోషించడానికి ఇంత దూరం వస్తే.. మళ్లీ ఆ కుటుంబాలపైనే ఆధార పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి పంపేయండి అని కంపెనీ యాజమాన్యానికి చెప్పినా వారు తమ వల్ల కాదంటూ తెగే సి చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు ఏజెంట్లను సంప్రదించారు. వారిది కూడా అదే మాట. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని బాధితులు ఎరుపల్లి లక్షుమయ్య, చింతలబాలకృష్ణ, చెక్క వేణునాథం, రట్టి చిన్నారావు, చెక్క రాజయ్య తదితరులు కోరుతున్నారు. కరోనా భయం ఓ వైపు తీవ్రంగా ఉందని, అదే సమయంలో ఉపాధి లేక మరోవైపు నలిగిపోతున్నామని, అధికారులు, ప్రభుత్వమే తమపై దయ చూపాలని కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం బతుకు తెరువు కోసం కువైట్ వచ్చాను. కరోనా ప్రభావంతో కంపెనీ పనులను ఆపేసింది. దీంతో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం కూడా ఏమీ చేయలేక చేతులెత్తే సింది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – ఎరుపల్లి అప్పయ్య, గెద్దలపాడు, సంతబొమ్మాళి మండలం స్వదేశానికి రప్పించండి నాలుగు డబ్బులు సంపాదించడానికి దేశం కాని దేశం వచ్చాను. డ్యూటీ బాగానే ఉన్నా కరోనా ప్రభావంతో అతలాకుతలం అయ్యాము. పనులు సాగక షెడ్డులోనే ఉన్నాము. మూడు నెలలుగా జీతాలు లేవు. స్వదేశానికి పంపించాలని బతిమలాడినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడు కుంటున్నాను. – రట్టి చిన్నారావు, పిట్టవానిపేట, సంతబొమ్మాళి మండలం ఇంటి నుంచి డబ్బులు పంపుతున్నాం కువైట్లో పనిచేయడానికి మా అబ్బాయి లక్ష్మయ్య వెళ్లాడు. మూడు నెలలుగా అక్కడ పనులు లేకపోవడంతో జీతాలు ఇవ్వడం లేదని, ఇ బ్బంది పడతున్నామని ఫోన్లో చెప్పాడు. దీంతో ఇంటి నుంచి డబ్బులు పంపాను, ఫ్లయిట్ టిక్కెట్ కోసం ఏజెంట్కు డబ్బులు ఇస్తే, రెండు వారాల తర్వాత మావల్ల కాదని డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ప్రభుత్వమే అదుకోవాలి. – వై.కుంతెమ్మ, బాదితుడు తల్లి, గెద్దలపాడు -
దేశానికి ‘గల్ఫ్’ కష్టాలు
కరోనా వైరస్ మహమ్మారి చుట్టుముట్టడంతో భూగోళానికి చేటుకాలం దాపురించింది. ఒకపక్క ప్రపంచవ్యాప్తంగా ఆ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య కోటి 20 లక్షలకు చేరవవుతుంటే మృతుల సంఖ్య అయిదున్నర లక్షలకు ఎగబాకుతోంది. నెలల తరబడి అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోవడం వల్ల ప్రతి దేశమూ ఒడిదుడుకుల్లో పడింది. ఒకప్పుడు బతుకు తెరువు కోసం తలుపు తట్టినవారిని అక్కున చేర్చుకున్న దేశాలే... వారి స్వేదంతో ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్న దేశాలే ఇప్పుడు వెనక్కిపొమ్మని హుకుం జారీ చేస్తున్నాయి. అందుకోసం రకరకాల నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. గత కొన్ని నెలలుగా అందరూ భయపడుతున్నట్టే కువైట్ కూడా విదేశీయుల సంఖ్యను నియంత్రించే ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. దాని ప్రకారం కువైట్ దేశ జనాభాలో భారతీయులు 15 శాతం మించకూడదు. ఆ దేశ జనాభా 43 లక్షలు. అందులో భారతీయులు14.5 లక్షలు. ఇది చట్టమైతే వారిలో దాదాపు 8 లక్షలమంది నిష్క్రమించక తప్పదు. ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇలాంటి ఆలోచనే చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే నిజమైతే ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు 90 లక్షలమంది ఉండొచ్చని ఒక అంచనా. ఇందులో పది శాతంమంది మాత్రమే నైపుణ్యం వున్న శ్రామికులు. మిగిలినవారంతా ఏదో ఒక పని చేసి పొట్టపోసుకుంటున్న వాళ్లే. వీరిలో అత్యధికం నిర్మాణ రంగం, పారిశుద్ధ్యం, రవాణా, ఆతిథ్యరంగాల్లో కార్మికులుగా పని చేస్తున్నారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం రోజుల నుంచి గల్ఫ్ దేశాలన్నీ విదే శీయుల్ని అనుమతించడానికి సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేస్తూ వస్తున్నాయి. పర్యవ సానంగా అంతక్రితం దశాబ్దాలతో పోలిస్తే గల్ఫ్ దేశాలకు పోవడం కష్టమవుతోంది. కువైట్ ఇప్పుడు ఈ కొత్త చట్టం తీసుకొస్తే అంతంతమాత్రంగా వున్న అవకాశాలు మరింత తగ్గడం ఖాయం. కరోనా వైరస్కు తన పర భేదం లేదు. అన్ని దేశాలనూ అది సమానంగా ఊడ్చిపెడుతోంది. కరోనా వాతబడిన ఏ దేశం గణాంకాలు తీసినా గుండె గుభేలుమంటుంది. అన్ని దేశాలూ ఆర్థికంగా చతికిలపడ్డాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా చమురు ధరలు దారుణంగా పడిపోగా, ఈ తొలి త్రైమాసికంలో గల్ఫ్ చమురు, సహజవాయు ఎగుమతులు సైతం కుదేలయ్యాయి. భారత్, చైనాలకు అంతక్రితం ఎగుమతులతో పోలిస్తే 4 శాతం కోత పడితే, దక్షిణ కొరియా 7 శాతం, జపాన్ 8 శాతం తగ్గించుకున్నాయి. యూరప్ యూనియన్(ఈయూ), అమెరికాలకు వెళ్లే ఎగుమతులైతే భారీగా తగ్గాయి. ఈయూ 11 శాతం, అమెరికా 9 శాతం ఇంధన దిగుమతుల్ని తగ్గించుకున్నాయి. ఈ స్థాయిలో ఆదాయం పడిపోవడం గల్ఫ్ సంక్షోభ సమయం తర్వాత ఇదే మొదటిసారి. 2008–09 ఆర్థిక మాంద్యం తర్వాత గల్ఫ్ దేశాల పెట్టుబడులకు ఆసియా దేశాల్లో గిరాకీ ఏర్పడింది. స్థిరాస్తి, ఆరోగ్య రంగం, హైటెక్ సెక్టార్లలో ఆ దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. వాటిపై మంచి రాబడి కూడా లభిస్తోంది. కానీ ఆ రంగాలన్నీ ఇప్పుడు కుంటుబడ్డాయి. ప్రపంచ దేశాల్లో ఈ ఏడాది ఆఖ రుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) 30 శాతం తగ్గుతాయని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) ఈమధ్యే అంచనా వేసింది. వాస్తవానికి గత అయిదేళ్లుగా ఎఫ్డీఐలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. అనేకులు ఆశిస్తున్నట్టు ఈ ఏడాది ఆఖరుకైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలు కుంటుందా లేదా అన్నది ఇప్పటికైతే ఖచ్చితంగా చెప్పే స్థితి లేదు. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడటానికి ముందున్న స్థితి రావాలన్నా వచ్చే ఏడాది డిసెంబర్కు సాధ్యం కావొచ్చని కొందరి అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో వలస ప్రజలను వీలైనంత మేర వదుల్చుకుందామని గల్ఫ్ దేశాలన్నీ చూస్తున్నాయి. ఆ దిశగా కువైట్ తొలి అడుగేసింది. వాస్తవానికి కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం చూపించడం మొదలెట్టిన నుంచీ గల్ఫ్ దేశాల్లో వుంటున్న వలస కార్మికులకు కష్టాలు అనేక రెట్లు పెరిగాయి. పశ్చిమాసియాలో వున్న కరోనా కేసుల్లో సగం యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైన్ వంటి గల్ఫ్ దేశాల్లోనే వున్నాయి. లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలూ స్తంభించిపోవడంతో వలస కార్మికులందరినీ ఆ దేశాలు లేబర్ క్యాంపులకు తరలించాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు రోజూ ఇచ్చే ఆహారం పొట్లాలే అక్కడ తలదాచుకుంటున్నవారికి దిక్కయ్యాయి. ఆ శిబిరాలు కిక్కిరిసి వుండటంతో కరోనా వేగవంతంగా వ్యాపిస్తోంది. కనుకనే అక్కడ చిక్కుకున్న తమవారిని తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరిగాయి. లేబర్ క్యాంపుల్లో సదుపాయాలు అంతంతమాత్రంగా వున్నాయి. వాటిని సక్రమంగా నిర్వహించడం చేతకాక దాదాపు గల్ఫ్ దేశాలన్నీ చేతులెత్తేశాయి. ఏ దేశానికి ఆ దేశం తమ పౌరుల్ని వెంటనే ఇక్కడినుంచి తీసుకెళ్లాలంటూ అవి భారత్తోసహా అన్ని దేశాలనూ కోరాయి. పర్యవ సానంగా కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ కింద భారీయెత్తున వలస కార్మికుల్ని వివిధ మార్గాల ద్వారా స్వస్థలాలకు తీసుకొచ్చింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ తమ కుటుంబాలకు పంపే మొత్తాలు చాలా ఎక్కువ. నిరుడు విదేశాల్లో స్థిరపడినవారు ఇక్కడికి పంపిన సొమ్ము 8,300 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇందులో అత్యధిక భాగం గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులుగా వుంటున్నవారినుంచి వచ్చిందే. ఈ సొమ్మంతా ఇక్కడున్న మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఆధారమవుతోంది. ఇప్పుడు తలెత్తిన కరోనా సంక్షోభం కారణంగా భారత్కు వలస కార్మికుల నుంచి వచ్చే మొత్తంలో 23 శాతం...అంటే 1,900 కోట్ల డాలర్లమేర కోత పడొచ్చని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. ఇలా ఆదాయం తగ్గడంతోపాటు లక్షల్లో వెనక్కివస్తున్న వలస కార్మికులకు ఉపాధి చూపించడం కూడా సమస్యే. మొత్తానికి రాగలకాలమంతా ప్రపంచంతోపాటు మనకూ గడ్డుకాలమే. ఈ పరీక్షా సమ యాన్ని ఎలా అధిగమించగలమన్నది చూడాల్సివుంది. -
కువైట్లో 8 లక్షల మంది భారతీయులకు కత్తెర?
దుబాయ్: ఎడారి దేశం కువైట్లోని భారతీయులకు పెద్ద ముప్పు వచ్చిపడింది. దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. దీంతో సుమారు ఎనిమిది లక్షల మంది భారతీయులు తప్పనిసరిగా ఆ దేశం వదిలి రావల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విదేశీయుల సంఖ్యను క్రమేపీ తగ్గించుకోవాలన్న కువైట్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు దేశ రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందని న్యాయ, చట్ట సంబంధిత కమిటీ నిర్ణయించడంతో త్వరలోనే అక్కడి భారతీయులు కువైట్ను వదిలి రావాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. కువైట్ జనాభా: 43 లక్షలు ఇందులో కువైటీలు: 13 లక్షలు భారతీయులు: 14.5 లక్షలు 2018లో కువైట్లోని భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తం: 480 కోట్ల డాలర్లు విదేశీయులపై వ్యతిరేకత! ముసాయిదా బిల్లు ప్రకారం కువైట్ జనాభాలో భారతీయులు 15 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కువైట్ జనాభా దాదాపు 43 లక్షలు కాగా ఇందులో కువైటీలు 13 లక్షల మంది ఉన్నారు. భారతీయుల సంఖ్య 14.5 లక్షల వరకూ ఉంది. ముడిచమురు ధరలు భారీగా పతనం కావడం, కోవిడ్–19 కారణంగా ఆర్థిక వ్యవహారాలు మందగించిన నేపథ్యంలో దేశం మొత్తమ్మీద విదేశీయులపై వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కరోనా బారిన పడ్డవారిలో విదేశీయులు ఎక్కువగా ఉండటం, కిక్కిరిసిపోయిన వలసకూలీల ఆవాసాలు దీనికి కారణమని భావిస్తూండటం కూడా ఒక కారణమైంది. కువైట్ జనాభాలో ఎవరెంతమంది? కువైటీలు: 30.36% ఇతర అరబ్ దేశాల వారు:27.29 ఆసియావాసులు:40.42% ఆఫ్రికావాసులు: 1.02% యూరప్వాసులు: 0.39% ఇతరులు: 0.52% ప్రస్తుతం కువైట్ మొత్తమ్మీద సుమారు 49 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కూడా విదేశీయుల సంఖ్యను తగ్గించాల్సిందిగా కోరుతున్నారు. కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ గత నెలలో విదేశీయుల సంఖ్యను ప్రస్తుతమున్న 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిద్దామని ప్రతిపాదించినట్లు కథనాలు వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్ మర్జూక్ అల్ ఘనేమ్ కువైట్ టీవీతో మాట్లాడుతూ దశలవారీగా విదేశీయులను తగ్గించే అంశంపై ఒక కమిటీ అసెంబ్లీకి సమగ్రమైన ముసాయిదా బిల్లును సమర్పిస్తుందని తెలిపారు కూడా. విదేశాల నుంచి వచ్చిన వారిలో అధిక శాతం మంది నిరక్షరాస్యులు లేదా కేవలం చదవడం, రాయడం మాత్రమే తెలిసిన వారు ఉన్నారని, కువైటీలకు వారి అవసరమేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వారిని నియమించుకుంటే ఫర్వాలేదు. కానీ వీసా వ్యాపారుల జిమ్మిక్కు కారణంగా నైపుణ్యం లేని కూలీల వలసలు దేశంలోకి ఎక్కువయ్యాయి’ అని అసెంబ్లీ స్పీకర్ మీడియాతో అన్నారు. సంబంధిత కమిటీలకు ముసాయిదా బిల్లు విదేశీయుల సంఖ్యపై కోటా అమలు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు సంబంధిత కమిటీలకు వెళ్లనుంది. దాని ప్రకారం దేశ జనాభాలో భారతీయులు 15 శాతం కంటే ఎక్కువ ఉండరాదు. ఫలితంగా సుమారు ఎనిమిది లక్షల మంది కువైట్ వీడాల్సి ఉంటుంది. కువైట్లో భారతీయ ఎంబసీ లెక్కల ప్రకారం సుమారు 28 వేల మంది భారతీయులు ఆ దేశ ప్రభుత్వంలో నర్సులు, ఇంజనీర్లు, చమురు కంపెనీల్లోనూ పనిచేస్తున్నారు. సుమారు 5.23 లక్షల మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తూండగా వీరిపై ఆధారపడ్డ వారు 1.16 లక్షల మంది ఉన్నారు. ఇందులోనూ సుమారు 60 వేల మంది భారతీయ సంతతి విద్యార్థులు దేశంలోని 23 పాఠశాలల్లో చదువుకుంటున్నారు. -
భారతీయులకు షాకిచ్చిన కువైట్
కువైట్: గల్ఫ్ దేశాల్లో ఉన్న విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించాలని కోరుతూ కువైట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రవాసీ కోటా డ్రాఫ్ట్ బిల్లుకు ఆదేశ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమోదం తెలిపింది. దీని ప్రభావం గల్ఫ్ దేశాలలో ఉన్న 8 లక్షల మంది భారతీయులపై పడనుంది. ఈ బిల్లు ప్రకారం గల్ప్ దేశాలలో భారతీయుల జనాభాలో 15 శాతానికి మించకూడదు. గల్ఫ్లో ఉన్న విదేశీయుల జనాభాలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం కువైట్ జనాభాలో 4.3 మిలియన్లు అయితే అందులో 3 మిలియన్లకు పైగా (30 లక్షలు) ప్రవాసీయులే ఉన్నారు. అంటే దాదాపు 8 లక్షల మంది భారతీయులను కువైట్ నుంచి తిరిగి స్వదేశానికి పంపనున్నారు. (కువైట్ నుంచి సొంత రాష్ట్రానికి..) కరోనా వైరస్ కారణంగా అక్కడి ప్రధాన వ్యాపారమైన చమురు ధరల క్షీణించడంతో కువైట్లో ఉన్న విదేశీయుల సంఖ్యను తగ్గించాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మద్దతు తెలపడంతో సునాయాసంగా ఆమోదం లభించింది. గత నెలలో కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా విదేశియుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. అంతేగాక కువైట్లో ప్రవాసియుల సంఖ్యను క్రమంగా తగ్గించాలని కోరుతూ సమగ్ర ముసాయిదా బిల్లు చట్టాన్ని తాను శాసనసభ్యుల బృందంతో కలిసి అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ మార్జౌక్ అల్-ఘనేమ్ కువైట్ పేర్కొన్నారు. ఈ బిల్లులో తాము వైద్యులను, నైపుణ్యం కలిగిన మానవశక్తిని మాత్రమే నియమించుకుంటామని, నైపుణ్యం లేని కార్మికులను తిరిగి పంపించేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ప్రభుత్వానికి నర్సులు, జాతీయ చమురు కంపెనీలలో వివిధ విభాగాల్లో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నవారు సుమారు 28 వేల మంది ఉన్నారు. మెజారిటీ భారతీయులు 5.23 లక్షల మంది ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నారు. అదనంగా, సుమారు 1.16 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారు. వీరిలో దేశంలోని 23 భారతీయ పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. తాజా బిల్లు వీరందరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో అక్కడున్న కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు ఆమోదం
-
7లక్షలమంది భారతీయులు వెనక్కి!
-
కువైట్ నుంచి సొంత రాష్ట్రానికి..
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం కువైట్కు వెళ్లి కరోనా మూలంగా ఇబ్బందులు పడుతున్న 320 మంది వలస కార్మికులు శుక్రవారం సాయంత్రం రాష్ట్రానికి చేరుకున్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా కువైట్లో అనేక మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్న వీరిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్కు తరలించారు. కాగా, కువైట్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను తెలంగాణకు రప్పించేందుకు విమాన అనుమతుల కోసం మాజీ ఎంపీ కవిత సహకారం అందించారని కువైట్ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు ముత్యాల వినయ్కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా కవితతో పాటు రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు కృతజ్ఞతలు తెలిపారు. షార్జా నుంచి 200 మంది.. మోర్తాడ్: కరోనా నేపథ్యంలో షార్జాలో ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడిన 200 మంది తెలంగాణ వలస కార్మికులు గురువారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. వీరందరిని ఒక ప్రముఖ కంపెనీ తమ క్యాంపు నుంచి తొలగించింది. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోవడమే కాకుండా ఉండటానికి నివాసం లేక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న ఇండియన్ అసోసియేషన్ షార్జా (ఐఏఎస్), పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అండగా నిలిచాయి. షార్జా పోలీసుల సహకారంతో తాత్కాలిక వసతిని, భోజన సదుపాయాలను కల్పించాయి. వలస కార్మికులు ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా, వలస కార్మికులకు నాలుగు నెలల పాటు వసతి కల్పించిన షార్జా పోలీసుల సహకారం మరువలేనిదని పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎస్వీ రెడ్డి పేర్కొన్నారు. -
నా భర్తను స్వదేశానికి చేర్చండి
వైఎస్ఆర్ జిల్లా, రైల్వేకోడూరు రూరల్ : కువైట్లో తన భర్త అనారోగ్యంతో అవస్థలు పడుతున్నాడని, క్షేమంగా స్వదేశానికి చేర్చాలని ఓ మహిళ వేడుకుంటోంది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతరాజుపేట పంచాయతీ బీసీ కాలనీకి చెందిన ఇర్ల సురేష్బాబు డ్రైవర్గా జీవనం సాగించే వాడు. ఆయనకు భార్య తేజావతి, కుమారుడు వంశీ(14), మధురిమ(13), మరో కుమారుడు సంతోష్(10) ఉన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావించి, నాలుగేళ్ల క్రితం కువైట్ వెళ్లారు. గతేడాది అక్టోబరులో ఇండియాకు వచ్చారు. భార్య, పిల్లలతో కొన్ని రోజులు గడిపారు. (మరదలిని చంపిన బావ ) రెండో సారి వెళితే జీతం పెరుగుతుందని.. గతేడాది నవంబరు 1న కువైట్ వెళ్లారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో.. జనవరిలో అనారోగ్యంగా ఉందని కువైట్లో ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విషయం భార్య, పిల్లలకు తెలిపారు. మే 2న అదే ఆసుపత్రికి వెళ్లి తనకు ఆరోగ్యం కుదుట పడలేదని, అడ్మిట్ అవుతున్నానని భార్య పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. అక్కడే ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి విచారణ చేయగా.. ఆసుపత్రిలో ఉన్నాడని, వైద్య సేవలు సక్రమంగా అందలేదని తెలిపారు. కోవిడ్ – 19 లాక్డౌన్ కారణంగా ఆసుపత్రిలోకి ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు. తన భర్త ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని తేజావతి ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం ఆదుకుని ఆయనకు మంచి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటోంది. (కువైట్ నుంచి ప్రవాసాంధ్రుల రాక) -
కువైట్ నుంచి ప్రవాసాంధ్రుల రాక
గన్నవరం/తిరుపతి అన్నమయ్య సర్కిల్/ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ): కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్తో విదేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి రప్పించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో కువైట్, సౌదీ అరేబియా, మలేసియాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక విమానాలు, ఎయిర్ ఇండియా విమానాల ద్వారా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాలకు చేరుకున్నారు. కువైట్ నుంచి జజీరా ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం 150 మంది వలస కార్మికులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్లో వీరందరికి వైద్యసిబ్బంది మెడికల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో వారిని గూడవల్లి సమీపంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్కు తరలించారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులకు టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది ► సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి 58 మంది ప్రవాసాంధ్రులు ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి గన్నవరం చేరుకున్నారు. ► కువైట్ నుంచి మరో 150 మంది ప్రవాసాంధ్రులు ఎయిర్ ఇండియా విమానంలో గురువారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరారు. వీరిలో ఒకరు హైదరాబాద్లో నిలిచిపోగా, మిగతా 149 మంది శుక్రవారం తెల్లవారుజామున 1.50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించాక వీరిలో వైఎస్సార్ జిల్లాకు చెందిన 116 మందిని, తూర్పుగోదావరి 6, పశ్చిమగోదావరి 5, విశాఖ 4, నెల్లూరుకు చెందిన ఆరుగురిని, కృష్ణా జిల్లాకు చెందిన ఒకరిని ఆయా జిల్లాల్లోని క్వారంటైన్ సెంటర్లకు బస్సుల్లో తరలించారు. మిగిలిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఏడుగురిని, చెన్నైకి చెందిన ఒకరిని, కర్నూలు జిల్లాకు చెందిన ఒకరిని, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరిని తిరుపతిలోని క్వారంటైన్ సెంటర్కు పంపించారు. ► మలేసియా నుంచి ఢిల్లీ మీదుగా విశాఖకు ఎయిరిండియా విమానంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు 62 మంది చేరుకున్నారు. వీరిలో కర్నూలుకు చెందిన ఒకరు, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 6, గుంటూరు 12, కృష్ణా 7, నెల్లూరు 2, ప్రకాశం 2, శ్రీకాకుళం 6, విజయనగరం 4, విశాఖపట్నం 15, ఇతర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు ఉన్నారు. -
రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న
సాక్షి, విజయవాడ: కువైట్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను ప్రభుత్వం వెనక్కి రప్పించిందని ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక విమానం కువైట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. గత నెలలుగా కువైట్లో ఉపాధి లేక ఏపీ వలస కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కువైట్లో చిక్కుకున్న బాధితుల్ని వెనక్కి తీసుకురావాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారని తెలిపారు. (రాజకీయ కార్యక్రమాలొద్దు: సజ్జల) సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాం.. అమ్నెస్టీ సాయంతో 152 మంది బాధితులు ఏపీకి చేరుకున్నారని వెల్లడించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం 14 రోజుల పాటు క్వారంటైన్కు తరలిస్తామని వెంకట్ పేర్కొన్నారు. చొరవ తీసుకుని ఏపీకి రప్పించిన సీఎం వైస్ జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. (విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత) సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితంగా.. గురువారం ప్రత్యేక విమానంలో కువైట్లోని 145 మంది వలస కార్మికులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే.. వారిలో 126 మంది మహిళలు, 18 మంది పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరిని నూజివీడు త్రిబుల్ ఐటీలో ఉన్న ప్రభుత్వ క్వారంటైన్కు తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా వలస కార్మికులు దశల వారీగా ఆంధ్రప్రదేశ్కు చేరుకుంటున్నారు. -
కువైట్ నుంచి గన్నవరం చేరుకున్న విమానం
సాక్షి, అలమరావతి : విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో దశ ‘వందే భారత్ మిషన్’లో భాగంగా కువైట్ నుంచి బయలుదేరిన విమానం గన్నవరంకు చేరింది. మొత్తం 145 మంది మహిళలు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. అమ్నెస్టీలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వీరంతా కువైట్ నుంచి గన్నవరం చేరారు. వీరిలో వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన మహిళలు ఎక్కుగా ఉన్నారు. వీరందరినీ థర్మల్ పరీక్షలు తర్వాత నూజివీడులో ఏర్పాటు చేసిన క్వారెంటైన్కు తరలించాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కువైట్ నుంచి మరో విమానం రానుందని ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ తెలిపారు. వారి వసతి కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా ఉపాధి కోసం కువైట్ వెళ్లి లాక్డౌన్ కారణంగా ఆదేశంలో చిక్కుకున్న ఏపీ వాసులను స్వరాష్ట్రానికి తీసురావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర విదేశాంగశాఖకు సీఎం లేఖ రాశారు. ఏపీ వాసులను తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. సీఎం జగన్ లేఖపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే ఏపీ వాసులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. -
కువైట్లో భారతీయులను స్వస్థలానికి రప్పించండి
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల: లాక్డౌన్ కారణంగా కువైట్లో ఉన్న భారతీయులను సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్కు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. కువైట్లో వీసాల గడువు మించిపోతున్న భారతీయులు దాదాపు 10వేల మంది ఉన్నారన్నారు. వారిని కువైట్ ప్రభుత్వం సొంత ఖర్చులతో ఇండియాకు పంపేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇండియాకు సంబంధించిన 10వేల మంది వలస కార్మికులలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2,500మంది ఉన్నారన్నారు. అందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారన్నారు. వీరందరికి అక్కడి కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇబ్బందులు పడకుండా వారిని సొంతూళ్లకు చేర్చవలసిన బాధ్యత ఉందన్నారు. వెంటనే కువైట్లోని భారతీయులను ఇండియాకు తీసుకొచ్చి.. ఆయా రాష్ట్రాలకు పంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వలస కార్మికులను చెన్నై లేదా విజయవాడ విమానాశ్రయాలకు చేరిస్తే అక్కడ నుంచి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు తమ ప్రభుత్వానికి వీలుంటుందని ఆయన కేంద్ర మంత్రికి లేఖలో పేర్కొన్నారు. -
కువైట్ నుంచి వచ్చిన భారతీయుల్లో కరోనా
భోపాల్ : గతవారం కువైట్ నుంచి ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల్లో 25 మందికి పైగానే కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. విద్యార్థులు, పర్యాటకులు సహా 120 మంది భారతీయులు మే13న కువైట్ నుంచి రెండు విమానాల్లో ఇండోర్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని భోఫాల్లోని క్వారంటైన్ సెంటర్కి తరలించారు. 240 మంది ప్రయాణికుల్లో 25కి పైగానే కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. శనివారం మరికొంత మందిలో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. (60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్) ప్రస్తుతం కరోనా బాధితులు భోపాల్లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 5,000 దాటగా, కరోనా కారణంగా ఒక్క ఇండోర్లోనే అత్యధికంగా 249 మంది మరణించారు. ఇప్పుడు ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల్లో కరోనా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో వారికి చికిత్స అందిస్తున్న సిబ్బందికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. (ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి ) -
కేంద్ర మంత్రికి సీఎం వైఎస్ జగన్ లేఖ
సాక్షి, అమరావతి : కువైట్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రశ్కు చెందిన వలస కార్మికులును స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమాన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా వలస కార్మికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అదే విధంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయలను వెనక్కి రప్పించేందుకు ‘వందే భారత్’ మిషన్ పేరుతో కేంద్రం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.(టెలీమెడిసిన్ కోసం కొత్త బైక్లు : సీఎం జగన్) ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులు వందే భారత్ మిషన్ను సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారన్నారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి, అక్కడే చిక్కుకుపోయిన వేలాది వలస కార్మికులు కూడా స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో చూస్తున్నారని, అయితే వారంతా స్వదేశానికి రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేరని ముఖ్యమంత్రి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఆమ్నెస్టీ ద్వారా స్వదేశాలకు వెళ్లడానికి అనుమతి పొందిన సుమారు 2500 మంది వలస కూలీలు వారి ప్రయాణ ఛార్జీలకు కూడా డబ్బులు లేని స్ధితిలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. (చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు ) ఇమ్మిగ్రేషన్ రుసుము మాఫీ చేయడం ద్వారా మన దేశ రాయబార కార్యాలయం, వారందరికీ ఎగ్జిట్ క్లియరెన్స్ కూడా ఇచ్చిందని, మరోవైపు వారి ప్రయాణ ఖర్చును భరించడానికి కువైట్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం వారంతా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, అరకొర భోజన వసతి, కనీస సదుపాయాలు కూడా లేకుండా రెండు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతూ, స్వదేశానికి తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారని వైఎస్ జగన్ లేఖలో తెలిపారు. (కరోనా: యోగీ ఆదిత్యనాథ్కు ప్రియాంక లేఖ) ''రాష్ట్రానికి చెందిన వలస కూలీల ప్రయాణ ఖర్చు భరించడానికి కువైట్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున మీరు వెంటనే కువైట్ హైకమిషనర్కు సూచనలు జారీ చేసి, ఆ దేశం నుంచి రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి విమానాలు ఏర్పాటు చేసేలా చూడగలరు. వలస కూలీలందరినీ ఇక్కడ సొంత రాష్ట్రంలో రిసీవ్ చేసుకుని, వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడం, క్వారంటైన్కు పంపించడంతో పాటు, అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాం. జిల్లా కేంద్రాల్లో క్వారంటైన్ సదుపాయంతో పాటు, విదేశాల నుంచి తిరిగొచ్చే వారికోసం తగిన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం''. (20 ఏళ్లలో 5 వైరస్లు అక్కడినుంచే..! ) ''ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కువైట్తో పాటు మధ్య ఆసియా, అగ్నేయాసియా దేశాల నుంచి రానున్న వలస కార్మికులు కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నందున వారిని నేరుగా ఏపీకి వచ్చేలా అనుమతించాలని కోరుతున్నాను. విదేశాల్లో ఉన్న వలస కార్మికులు స్వరాష్ట్రానికి తిరిగి వస్తే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉంది. అందువల్ల కువైట్తో పాటు తూర్పు మధ్య, ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న వలసకార్మికులును వీలైనంత త్వరగా దశలవారీగా రాష్ట్రానికి అనుమతించాలని కోరుతున్నాం''. అని విదేశాంగ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలో సూచించారు. (లాక్డౌన్ 4.0 : మోదీ కీలక భేటీ ) (భారత్లో కరోనా కేసులు తక్కువే? ) -
ఉచితం అని చెప్పి పెయిడ్ క్వారంటైన్కా..?
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వలస కార్మికుల్లో పేద వారికి ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మాటలకే పరిమితమైంది. శనివారం రాత్రి కువైట్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన తొమ్మిది మంది వలస కార్మికులు ఉండగా వారిని అధికార యంత్రాంగం క్వారంటైన్ కోసం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించింది. అయితే క్వారంటైన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, రూ.15 వేలు, రూ.30 వేల ప్యాకేజీలను ప్రకటించింది. అంతలోనే రూ.5 వేల ప్యాకేజీని ప్రభుత్వం ఎత్తివేసింది. కేవలం రెండు రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. అలాగే పేద కార్మికులు ఎవరైనా ఉంటే వారికి ఉచిత క్వారంటైన్కు తరలిస్తామని ప్రభుత్వం వివరించింది. కువైట్ నుంచి వచ్చిన 163 మందిలో వలస కార్మికులైన తొమ్మిది మంది ఉచిత క్వారంటైన్కు వెళ్లడానికి ఆప్షన్ ఇచ్చారు. కానీ హోటల్ నిర్వాహకులు వలస కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఉచిత క్వారంటైన్ అని భావించిన వలస కార్మికులు అవాక్కయ్యారు. -
కువైట్ టు హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: కరోనా విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు కేంద్రం ప్రారంభించిన వందేభారత్లో భాగంగా తొలి విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగింది. కువైట్లో చిక్కుకుపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం తరలించింది. అక్కడి నుంచి శనివారం రాత్రి 10.07 గంటలకు ఎయిరిండియా ఏఐ 988 విమానం 163 మంది ప్రయాణికులతో చేరుకుంది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వలస కార్మికులు ఉన్నట్లు తెలిసింది. కాగా, ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, కస్టమ్స్ తనిఖీలు చేపట్టిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. భౌతిక దూరం పాటించడంలో భాగంగా ఒక్కో బస్సులో 15 మంది ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లారు. ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లను సైబరాబాద్ సీపీ సజ్జనార్ దగ్గరుండి పర్యవేక్షించారు. (చదవండి: సహజీవనం చేయాల్సిందే) 4 హోటళ్లు రెడీ.. విదేశాల నుంచి వచ్చే వారికి సొంత ఖర్చులతో హోటళ్లలో క్వారంన్టైన్ అవకాశం కల్పించిన నేపథ్యంలో కువైట్ నుంచి వచ్చిన వారి కోసం హైదరాబాద్లో నాలుగు హోటళ్లు సిద్ధం చేశారు. హైటెక్సిటీ సమీపంలోని షెరటాన్ హోటల్, గచ్చిబౌలిలోని రెడ్ ఫాక్స్ హోటల్ను ఎక్కువ చార్జీ కేటగిరీలో కేటాయించారు. ఇక్కడ ఒక్కొక్కరికి భోజనంతో కలుపుకొని రూ.30 వేలు (క్వారంటైన్ మొత్తానికి) చార్జీ చేస్తారు. రూ.15 వేల కేటగిరీ కింద కామత్ లింగాపూర్, కాచిగూడలోని ఫ్లాగ్షిప్ హోటళ్లను కేటాయించారు. ఆ తర్వాత వచ్చే వారికి కూడా ఇప్పటికే ఆయా హోటళ్లలో గదులు సిద్ధం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని హోటళ్లకు తరలించే బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించారు. ఇందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు తిప్పుతోంది. హోటళ్ల ఎంపిక, తదితర అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ పర్యవేక్షిస్తోంది. (చదవండి: ఇక పరీక్షల్లేకుండానే..!) -
హైదరాబాద్కు రాగానే వారంతా క్వారంటైన్లోకి..
సాక్షి, హైదరాబాద్ : కరోనా లాక్డైన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం ‘వందేభారత్ మిషన్’ను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈమిషన్లో భాగంగా కువైట్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువస్తున్న విమానం హైదరాబాద్ బయల్దేరింది. 200మంది ప్రయాణికులతో బయల్దేరిన ఆ విమానం శనివారం రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనుంది. కువైట్ ఎయిర్పోర్టులో రెండు వందలమంది ప్రయాణికులు చెక్ ఇన్ చేసుకున్నారు. (చదవండి : విదేశాల నుంచి వస్తే క్వారంటైన్కే..) ప్రయాణికుల్లో కొందరు తెలంగాణకు చెందినవారు కాగా, మరికొందరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు.వీరంతా హైదరాబాద్ రాగానే క్వారంటైన్లోకి వెళ్లనున్నారు.ఇందుకోసం హోటళ్లు, లాడ్జీలలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ. 5 వేల నుంచి రూ. 30 వేల మధ్య ప్యాకేజీలు ప్రకటించింది. ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పేద కార్మికులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కువైట్లోని భారతీయులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : కువైట్లోని భారతీయులకు అక్కడి ప్రభుత్వం శుభవార్తను అందించింది. లాక్డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచింది. భారత ప్రభుత్వం ఆమోదం కోసం కువైట్ ప్రభుత్వం ఎదురుచూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగానే భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేయనుంది.( చదవండి : హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట) మరోవైపు గల్ఫ్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే దీనికోసం రక్షణ శాఖకు చెందిన విమానాలను సిద్ధం చేసింది. ఏ క్షణంలోనైనా కువైట్ సహా గల్ఫ్ దేశాలకు విమానాలు వెళ్లనున్నాయి. కోవిడ్-19 వ్యాపించకుండా సకల జాగ్రత్తలు పాటిస్తూ, వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి ఎక్కువ మందిని తీసుకొచ్చేందుకు వీలుగా యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. -
టేకాఫ్
వలసల కష్టాలు కథలుగా వినే ఉన్నాం.. వాటిని ‘కరోనా’ ఇప్పుడు నిజాలుగా చూపిస్తోంది.. పరాయి రాష్ట్రాల నుంచి కూలీనాలీ కోసం మన దగ్గరకు వచ్చినవాళ్ల కన్నీళ్లనే కాదు.. పని వెదుక్కుంటూ పరాయి దేశం పోయిన మన వాళ్ల వ్యథలనూ! కువైట్లోని మన మహిళా డొమెస్టిక్ హెల్పర్స్ (ఇళ్లలో పని చేసే వాళ్లు) పడుతున్న ఇబ్బందుల గురించిన కథనం ఇది.. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆమ్నెస్టీ ప్రకటించింది కువైట్. వీసా గడువు అయిపోయాక కూడా ఆ దేశంలో ఉంటున్న వారికి, జరిమానా శిక్షలు పడ్డవారికి క్షమాభిక్ష పెట్టి వాళ్ల వాళ్ల దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ అవకాశం అక్కడున్న మన మహిళా డొమెస్టిక్ హెల్పర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ముఖ్యంగా అరబ్బీ మాట్లాడలేక, నిరవధికంగా పన్నెండు గంటలు, ఒక్కోసారి 20 గంటలు పనిచేయలేక, తిండి, నిద్రలేక అనారోగ్యం పాలై.. యజమానుల చేతుల్లో హింసకు గురవుతున్న వారికి ఈ ఆమ్నెస్టీ ఓ వరంలా కనిపించింది. దాంతో యజమానుల కళ్లు గప్పి, రెండంతస్తుల మేడ మీద నుంచి చీర సహాయంతో కిందకు దూకి .. ఇలా రకరకాల ప్రయత్నాలతో బయటపడ్డారు. కొందరైతే ఆమ్నెస్టీ పెట్టకముందే బయటకు వచ్చేశారు... పాస్పార్టుల సంగతి అటుంచి చేతిలో చిల్లిగవ్వ, కాళ్లకు చెప్పుల్లేక కట్టుబట్టలతో. ఎటు వెళ్లాలి? ఎవరిని కలవాలి? ఎక్కుడుండాలి? ఏమీ తెలియదు. స్నానం లేదు, తిండి లేదు. పైగా కరోనా లాక్డౌన్. బయట కనిపిస్తే జరిమానా, జైలు. వీటన్నిటి నుంచీ తప్పించుకుంటూ తిరుగుతుండగా అక్కడ వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న తెలుగు స్వచ్ఛందసేవా కార్యకర్తల సాయంతో షెల్టర్ హోమ్కి చేరారు. వాళ్లలో కొంతమంది నేపథ్యాలు.. కూలోనాలో చేసుకుంటా... అంటోంది ఈడిపల్లి లక్ష్మి. ఆమె స్వస్థలం.. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం మండలంలోని రామారావుపేట. కువైట్కు వెళ్లి మూడేళ్ల అవుతోంది. ‘నా తాగుబోతు భర్తతో పడలేక విడాకులు తీసుకున్నా. అప్పటికే ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువు, పెళ్లిళ్లకు అప్పు చేయాల్సి వచ్చింది. ఇల్లు, పొలం లేవు. అప్పలు తీరాలి, పూట గడవాలి. అందుకే కువైట్కు వచ్చా. ఇక్కడి భాష రాక బాధలు పడ్డా. ఇంక నావల్ల కాక ఓరోజు షేక్ ఇంట్లోంచి పారిపోయా. తిండిలేక కడుపు మాడ్చుకుంటాను కాని అద్దె కట్టకపోతే గదిలో ఉండనివ్వరు కదా! నయా పైసా లేక నానా తిప్పలు. చివరికిలా క్యాంపులోకొచ్చి పడ్డా. మా సొంతూరెళ్లిపోయి కూలోనాలో చేస్కోని బతుకుతాను’’ అంటూ చేతులు జోడిస్తోంది లక్ష్మి. ఇంట్లోంచి గెంటేశారు.. అని జరిగింది తలుచుకుంటూ ఏడుస్తోంది కోన కృష్ణవేణి. ఆమె స్వస్థలమూ తూర్పు గోదావరి జిల్లానే. యేడాది కిందట భర్త చనిపోయాడు. అమ్మానాన్నా, అత్తమామల అండ లేదు. జీవనాధారమూ లేదు. దాంతో పొరుగుదేశంలో పనిమనిషిగానైనా నాలుగు డబ్బులు వెనకేసుకుందామని కువైట్ చేరింది. ఇంతలో కరోనా వల్ల కష్టమొచ్చిపడింది. ‘‘పనివాళ్ల వల్ల కరోనా వస్తుందని భయపడ్డారో ఏమో ఉన్నట్టుండి ఓ రోజు ఇంట్లోంచి బయటకు గెంటేశారు నన్ను. ఎక్కడికెళ్లాలో తెలియదు. భాష రాదు. తిండి, నీళ్లు లేక తిరుగుతుంటే తెలుగు వాళ్లే చూసి క్యాంప్కు తీసుకొచ్చారు’ అంటూ ఏడుస్తోంది కృష్ణవేణి. అకామా బ్లాక్ అయిందని.. భయపెడ్తున్నారు అని బాధపడుతోంది పశ్చిమగోదావరి జిల్లా, నిడుదవోలు మండలం, ఆట్లపాడుకు చెందిన సత్యభారతి. 2019, నవంబరులో కువైట్కు వచ్చింది భారతి. అయితే గల్ఫ్ ఆమెకు కొత్త కాదు. ఇదివరకు ఖతర్, దుబాయ్, బహరెయిన్లలో డొమెస్టిక్ హెల్పర్గా పనిచేసింది. కాని ఇప్పుడు కువైట్లో ఎదురైన సమస్యే భయపెడుతోంది ఆమెను. ‘ఖతర్లో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైంది. ఇండియాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈలోపు మా నాన్న చనిపోవడం, నా భర్తతో గొడవలు.. మానసికంగానూ దెబ్బతిన్నా. కూర్చుంటే రోజు గడిచే దారి లేదు. అందుకే మళ్లీ గల్ఫ్కు ట్రై చేసుకొని కువైట్కొచ్చా. నాలుగు నెలలుగా జీతం ఆపేశారు. నా పరిస్థితి గురించి మా చుట్టాలకు ఫోన్ చేద్దామన్నా డబ్బుల్లేవు. కొంచెం టెన్షన్ పడ్డా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. ఇండియా వెళ్లిపోతాను సహాయం చేయండని తెలిసిన వాళ్లను అడిగితే నీ అకామా (రెసిడెంట్ స్టాంప్)బ్లాక్లో ఉంది, రెండు లక్షల రూపాయలవుతాయి అని చెప్పారు. బ్లాక్లో ఎందుకు ఉంటుందని భయపడి ఏజెంట్కు ఫోన్ చేస్తుంటే అతణ్ణించి రెస్పాన్స్ లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఆమ్నెస్టీ నాకోసమే వచ్చినట్టయింది’ చెప్పుకొచ్చింది సత్యభారతి. వీళ్లంతా కువైట్ నుంచి టేకాఫ్ అయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అక్కడున్న మన రాయబార కార్యాలయం ద్వారా వైట్పాస్ (లేదా అవుట్పాస్ అంటే ఆపద్ధర్మ పాస్పార్ట్)లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛందసేవా కార్యకర్తలు. -
కువైట్ అత్యవసర క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్/ మోర్తాడ్: కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశమైన కువైట్ వలస కార్మికుల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)పై ఇప్పటిదాకా చట్టపరమైన చర్యలు తీసుకున్న కువైట్... ఈసారి అత్యవసర క్షమాభిక్ష అమలు చేయడమే కాకుండా సొంత ఖర్చులతో వారిని భారత్కు తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన.. విజిట్ వీసాలపై వచ్చి గడువు ముగిసినా ఏదో ఒక పని చేసుకోవడం, రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోకపోవడం, ఒక కంపెనీ వీసా పొంది మరో సంస్థలో చేరి చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులను వారి సొంత దేశాలు పంపేందుకు గల్ఫ్ దేశాలు క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) అమలు చేస్తుండటం తెలిసిందే. 2018 జనవరిలో దీర్ఘకాలిక ఆమ్నెస్టీని అమలు చేసిన కువైట్ ప్రభుత్వం... ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో అత్యవసర క్షమాభిక్షను తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. విదేశీ కార్మికుల సంఖ్యను వీలైనంత తగ్గించుకోవడం కోసమే అత్యవసర క్షమాభిక్షను కువైట్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ షెడ్యూల్ ప్రకటించిన కువైట్.. భారత్కు సంబంధించిన కార్మికుల దరఖాస్తుల ప్రక్రియను గురువారం నుంచి మొదలుపెట్టనుంది. ఈ నెల 20 వరకు సూచించిన కేంద్రంలో క్షమాభిక్ష దరఖాస్తులు సమర్పించే వారికి కువైట్ సర్కారు ఔట్పాస్లు జారీ చేయనుంది. ఉచితంగా బస, విమాన చార్జీలు.. అత్యవసర క్షమాభిక్షకు సమయం ఖరారు చేసిన కువైట్ సర్కారు... అక్రమ వలస కార్మికులపట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీసా, రెసిడెన్సీ పర్మిట్ గడువు, ఖల్లివెల్లి కార్మికులు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. అలాగే మునుపెన్నడూ లేనివిధంగా వలస కార్మికులను స్వదేశాలకు పంపేందుకు విమాన చార్జీలను సైతం భరించనున్నట్లు ప్రకటించింది. మరో విశేషమేమిటంటే లాక్డౌన్ కారణంగా ఆనేక దేశాలు అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఈ సేవలు పునరుద్ధరణ జరిగే వరకు స్వదేశానికి వెళ్లేందుకు లైన్ క్లియరైన వలస కార్మికులను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. శిబిరాల నిర్వహణ ఖర్చును కూడా భరించనుంది. తక్కువ సమయం... ఎక్కువ మంది. కువైట్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కార్మికుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 3 వేల మంది వరకు ఉంటారని అంచనా. అయితే భారతీయ కార్మికులకు ఐదు రోజులపాటే క్షమాభిక్ష దరఖాస్తుల పరిశీలనకు కువైట్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్వల్ప వ్యవధిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాదని అందువల్ల గడువు పెంచాలని వలసదారులు కోరుతున్నారు. లాక్డౌన్తో అందరికీ అందని దరఖాస్తులు కరోనా కట్టడి కోసం కువైట్లోనూ లాక్డౌన్ అమలవుతోంది. లాక్డౌన్ వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ పరిస్థితుల్లో చట్టవిరుద్దంగా ఉన్న మన కార్మికులందరికీ దరఖాస్తులు అందించడం సాధ్యం కావట్లేదని స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. రెడ్జోన్ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, గొర్రెలు, మేకల షెడ్లలో పనిచేసే వలస కార్మికులకు క్షమాభిక్ష దరఖాస్తులను అందించడం ఇబ్బందిగా ఉందని వాలంటీర్లు తెలిపారు. అందువల్ల భారత విదేశాంగశాఖ అధికారులు చొరవ తీసుకొని ఆమ్నెస్టీ గడువు పెంచేలా కువైట్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని పలువురు కోరుతున్నారు. దరఖాస్తులు అందించడం ఇబ్బందిగా ఉంది కువైట్లో లాక్డౌన్ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా ఉన్న మన కార్మికులందరికీ క్షమాభిక్ష దరఖాస్తులు అందించడం ఇబ్బందిగా ఉంది. వాలంటీర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆమ్నెస్టీ దరఖాస్తులను కార్మికులకు చేర్చడం సాధ్యం కావట్లేదు. లాక్డౌన్ వల్ల ఏర్పడిన ఇబ్బందులను గుర్తించి క్షమాభిక్ష గడువు పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రమోద్ కుమార్, ఆమ్నెస్టీ వాలంటీర్, కువైట్ -
కువైట్లో అసలైన కర్ఫ్యూ
-
కరోనా కట్టడి : ఇదీ అసలైన కర్ఫ్యూ
కువైట్ సిటీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలును తీసుకుంటున్నాయి. చైనా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు ఇప్పటికే తీవ్ర ఆంక్షలను విధించాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కువైట్ కూడా అనేక జాగ్రత్త చర్యలను చేపడుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆదివారం నాటికి 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కువైట్లో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 4 గంటలు వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని ఆ దేశ అధికారులు తెలిపారు. దీంతో కువైట్లో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఏ ఒక్కరూ రోడ్లపై తిరగకుండా స్వచ్చందంగా నిర్బంధాన్ని పాటిస్తున్నారు. (కరోనా అలర్ట్ : మూడో దశకు సిద్ధమవ్వండి!) -
కువైట్కు విమానాలు రద్దు
తిరువనంతపురం : కోవిడ్ -19 ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న భయాల నేపథ్యంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతో సహా ఏడు దేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈ ఆదేశాలు ఒక వారం పాటు అమల్లో వుంటాయని కువైట్ అధికారులు ప్రకటించారు. శనివారం కువైట్ ఆరోగ్య అధికారులు తీసుకున్న ఈ ఆకస్మిక ప్రయాణ నిషేధంతో కోజికోడ్ కరీపూర్ విమానాశ్రయంలో 170 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్ట్, సిరియా, లెబనాన్ నుండి కువైట్కు వెళ్లే అన్ని విమానయాన సంస్థలకు ఈ నిషేధం వర్తిస్తుంది. -
పొట్టకూటి కోసం వెళ్లి పరలోకాలకు...
వైఎస్ఆర్ జిల్లా, లక్కిరెడ్డిపల్లె : మండల పరిధిలోని బి.యర్రగుడి పంచాయతీ కాపుపల్లెకు చెందిన దేరంగుల కృష్ణంరాజు(30) బుధవారం రాత్రి కువైట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... 2018వ సంవత్సరంలో కృష్ణంరాజు బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లాడు. వచ్చే నెలలో తిరిగి ఇండియాకు వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. అయితే కువైట్కు వెళ్లినప్పటి నుండి సేఠ్ వద్దనే పని చేస్తూండే వాడు. ఈ మధ్య కాలంలో ఎలాంటి సమస్యలు లేవని.. సంతోషంగా ఉన్నానని చెబుతూ కుటుంబం ఖర్చుల కోసం డబ్బులను కూడా పంపించేవాడు. ప్రతి రోజూ వీడియో కాల్ ద్వారా తల్లిదండ్రులు, భార్య, బిడ్డలతో సంతోషంగా మాట్లాడేవాడు. చివరి సారిగా బుధవారం గ్రామంలో వివాహ వేడుక జరుగుతుండగా ఆ సమయంలో కూడా ఫోన్ చేసి పెళ్లి వేడుకపై అడిగి తెలుసుకున్నాడు. గురువారం ఫోన్ రాకపోవడంతో కృష్ణంరాజు భార్య ఫోన్ చేయగా మరో వ్యక్తి ఫోన్ తీసి మీ భర్త మృతి చెందినట్లు తెలియజేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికిపెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే... కాపుపల్లెకు చెందిన దేరంగుల చిన్న వెంకటరమణ, సావిత్రి దంపతుల చిన్న కుమారుడు కృష్ణంరాజు మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మూడేళ్ల క్రితం మానసా అనే యువతిని కృష్ణంరాజు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఏడాదికే పాప దివ్యశ్రీ జన్మించడంతో కుటుంబానికి అదనపు సంపాదన కోసం కువైట్కు వెళ్లాడు. అక్కడ రూ.3 లక్షలు నగదు, కొంత బంగారం , కొన్ని వస్తువులు తీసుకున్నట్లు కృష్ణంరాజు తెలిపినట్లు భార్య తెలిపింది. ఉన్నట్లుండి మరణవార్త వినగానే భార్య మానస, తల్లి సావిత్రి, కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని కటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విలపిస్తున్న మృతుడి తల్లి -
కువైట్లో ఉపాధి పాట్లు
శ్రీకాకుళం, కంచిలి: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన పలువురు నిరుద్యోగులు మరోసారి ఏజెంట్ల చేతిలో మోసపోయారు. మంచి కంపెనీలో ఉద్యోగాలకు పంపిస్తామని చెప్పి, గుర్తింపులేని కన్స్ట్రక్షన్ కంపెనీలో తాత్కాలిక పద్ధతిలో చేర్పించడంతో... ఆ యువకులు దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఐదు నెలలుగా జీతా ల్లేక.. పాస్పోర్టులు కంపెనీ యాజమాన్యం చేతిలో చిక్కుకోగా.. నరకం చూస్తున్నారు. ఇచ్ఛాపురం, కంచిలి మండలాలతోపాటు సరిహద్దు ఒడిశా రాష్ట్ర పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన పదిమంది యువకులు ఇచ్ఛాపురం పట్టణంలో రాజా ప్యాలెస్ ఎదురుగా నడుస్తున్న ఒక వెల్డింగ్ ఇనిíస్టిట్యూట్ యాజమాన్యం ద్వారా పది నెలల క్రితం కువైట్లో ‘గల్ఫ్టెక్ కంపెనీ’లో వెల్డర్, ఫిట్టర్ ఉద్యోగాలకు వెళ్లారు. ఇనిస్టిట్యూట్ యాజమాన్యానికి ఒక్కొక్కరూ రూ.65 వేల నుంచి రూ.75 వేల వరకు చెల్లించి పది నెలల క్రితం ఉద్యోగాల్లో చేరారు. వీరికి ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు రూ.30 వేల జీతం. మొదటి నెల నుంచే జీతం ఇచ్చేందుకు కంపెనీ యాజమాన్యం మొరాయించేది. మొత్తమ్మీద ఐదు నెలలు ఎలాగోలా గడిచాయి. తర్వాత తమకు జీతాలు చెల్లించలేదని బాధిత యువకులు వాపోతున్నారు. జీతం ఇచ్చి పనిచేయించుకోవల్సిందిగా బతిమాలినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. చివరికి తమ ను ఇండియాకు పంపించాల్సిందిగా కోరినప్పటికీ ససేమిరా అంటున్నారని, తమ పాస్పోర్టులు వారి వద్ద భద్రపర్చుకొని ఇలా ఏడ్పిస్తున్నారని యువకులు వాపోతున్నారు. సాక్షికి అక్కడి నుంచి ఫోన్ చేసి తమ కష్టాలను చెప్పుకొన్నారు. కువైట్లో గల ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి 15 రోజుల క్రితం ఫిర్యాదు చేశామని, వారి నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆకలి దప్పికలతో ఆందోళన చెందుతున్నామని తెలిపారు. కంపెనీకి చెందిన ఒక ఇంట్లో సరైన ఆహారంఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని యువకులు పేర్కొన్నారు. మోసపోయింది వీరే.. కంచిలి మండలం కుంబరినౌగాం గ్రామానికి చెందిన కడియాల గణేష్, ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామానికి చెందిన బ్రజరాజ బెహరా, లొద్దపుట్టికి చెందిన కొంతాల వినోద్కుమార్, అరకభద్రకు చెందిన సాడి తేజేశ్వరరావు, ఒడిశా రాష్ట్ర పరిధిలో గంజాం జిల్లా చికిటి బ్లాక్ పరిధి కె.సువాని గ్రామానికి చెందిన అబధాన్ డొంబురు బెహరా, కొత్తసింగి గ్రామానికి చెందిన శంకర్ కృష్ణారెడ్డి, బొనసొల గ్రామానికి చెందిన బాకి లింగరాజు, పాత్రపూర్ బ్లాక్ బొరంగొ గ్రామానికి చెందిన సిద్దాబత్తుల బాలకృష్ణ, సంకుడా గ్రామానికి చెందిన చిత్తరంజన్ సాహు, లండ ఈశ్వరరావులు మోసపోయారు. ఎలాగైనా తమను ఇండియాకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు ఇటువంటి గల్ఫ్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని ఇప్పటికే పలుసార్లు హెచ్చరించామని ఇచ్ఛాపురం సీఐ ఎం.వినోద్బాబు పేర్కొన్నా రు. ఈ విషయమై ఆయనను సాక్షి వివరణ కోరగా.. అనుమతులు లేకుండా ఇంటర్వ్యూలు నిర్వహించవద్దని ఇచ్ఛాపురం సర్కిల్ పరిధిలో గల అన్ని వెల్డింగ్ ఇనిస్టిట్యూట్లకు నోటీసులిచ్చామన్నారు. కువైట్ పంపించిన సంబంధిత వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ వ్యవహారాన్ని కూడా పరిశీలించి, అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
సొంతూళ్లకు చేరుకున్న మత్స్యకారులు
సాక్షి, అమరావతి/పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ)/విజయనగరం ఫోర్ట్: బతుకుదెరువు కోసం దేశ సరిహద్దులు దాటి ఆయా దేశాల జైళ్లలో మగ్గుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో విముక్తి లభించింది. సముద్రంలో వేటాడుతూ పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో ప్రవేశించి ఆ దేశంలో అరెస్టైన 8 మంది మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం విడిపించింది. వీరంతా మంగళవారం స్వగ్రామాలకు చేరుకున్నారు. అలాగే ఇంతకుముందు పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న మత్స్యకారులకు, ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయి మలేషియా, కువైట్లో అష్టకష్టాలు పడుతున్న బాధితులకు కూడా సీఎం చొరవతో విముక్తి లభించిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గుతున్న మత్స్యకారులను సురక్షితంగా విడిపించి వారిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడంతో సీఎం వైఎస్ జగన్పై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. బంగ్లాదేశ్ నుంచి 8 మంది మత్స్యకారుల విడుదల గతేడాది అక్టోబర్ 2న అరెస్టు అయిన 8 మంది మత్స్యకారులను విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించడంతో బంగ్లాదేశ్ గత బుధవారం వారిని విడుదల చేసింది. మత్స్యకారులు మంగళవారం విజయనగరం కలెక్ట్రేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్, నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు మత్స్యకారులకు స్వాగతం పలికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామాలకు చేరుకున్నవారిలో బోటు డ్రైవరు మరుపల్లి పోలయ్య (43), రాయితి అప్పన్న (41), వాసుపల్లి అప్పన్న (24), మరుపల్లి నరసింహ (43), బర్రి రాములు (31), వాసుపల్లి అప్పన్న (41), రాయితి రాము (24), వాసుపల్లి దానయ్య (51) ఉన్నారు. వీరంతా విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్న గంగమ్మ గుడికి తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. తమ విడుదలకు కారణమైన సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్నవారికి విముక్తి గుజరాత్ సముద్ర తీరంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్థాన్ పరిధిలోని సముద్ర జలాల్లోకి ప్రవేశించి అరెస్ట్ అయిన 20 మంది మత్స్యకారులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ చొరవతో విముక్తి లభించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాధితులను తీసుకురావడానికి మంత్రి మోపిదేవి వెంకట రమణారావు స్వయంగా పాకిస్థాన్ సరిహద్దులోని వాఘా బోర్డర్ వరకు వెళ్లారు. అదేవిధంగా ఉపాధి కోసం మలేషియా వెళ్లి వీసా గడువు ముగియడంతో అక్కడే మగ్గిపోతున్న 97 మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం రక్షించింది. ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్లో అష్టకష్టాలు పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళకూ సీఎం కృషితో విముక్తి లభించింది. కువైట్లో ఉన్న మరో 15 మందిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. సీఎం చొరవ వల్లే బాధితులకు విముక్తి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాకిస్తాన్, బంగ్లాదేశ్ జైళ్ల నుంచి విడుదలై తిరిగొచ్చారంటే అందుకు సీఎం వైఎస్ జగన్ చూపిన ప్రత్యేక చొరవే కారణం. పరాయి దేశాల్లో బందీలవుతున్న మత్స్యకారులను ఆదుకునేలా, వలసలను అరికట్టి స్థానికంగా ఉపాధి చూపేలా ప్రభుత్వం రెండు మేజర్ ఫిషింగ్ జెట్టీలను నిర్మించేందుకు నిర్ణయించింది. –మంత్రి మోపిదేవి వెంకటరమణ సీఎం దయతోనే విడుదలయ్యాం సీఎం దయ వల్లే మేం బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యాం. స్వదేశంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. – రాయితి రాము, మత్స్యకారుడు, తిప్పలవలస తిరిగొస్తామని ఊహించలేదు మన దేశానికి తిరిగొస్తామని ఊహించలేదు. బోటులో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ సరిహద్దులోకి ప్రవేశించిన వెంటనే అక్కడి అధికారులు మా డ్రైవర్ను కొట్టి మా సెల్ఫోన్లు, వైర్లెస్ సెట్లు లాగేసుకున్నారు. మమ్మల్ని జైల్లో పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషితో విడుదలయ్యాం – రాయితి అప్పన్న, మత్స్యకారుడు, తిప్పలవలస వారిని రప్పించడం గొప్ప విషయం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషి అభినందనీయం. కువైట్లో మోసపోయిన వారిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మలేషియా నుంచి మన వాళ్లను తీసుకురావడంలో ప్రభుత్వ సహకారం మరువలేనిది. – వెంకట్ మేడపాటి, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ చైర్మన్ -
బాధ విన్నారు.. భరోసా కలిగించారు
సాక్షి, అమరావతి/అత్తిలి : ‘జగనన్నా, మమ్మల్ని మీరే కాపాడాలి’.. అంటూ నలుగురు మహిళలు కువైట్ నుంచి పంపిన వీడియో వైరల్ కావడం.. అది సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడం.. వెంటనే ఆయన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో సీఎం కార్యాలయం హుటాహుటిన స్పందించింది. సదరు వీడియోను డీజీపీ డి. గౌతమ్ సవాంగ్కు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో ఆయన ‘దిశ’ చట్టం ప్రత్యేక అధికారి దీపికా పాటిల్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ను అప్రమత్తం చేశారు.తమను ఏజెంట్ మోసం చేశాడని, కువైట్లో పనిలేకుండా ఉన్నామని.. తమను ఆదుకోవాలంటూ పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామానికి చెందిన కరెం వసుంధర కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశిస్తూ ఓ వీడియోను వాట్సాప్ ద్వారా తన వాళ్లకు పంపించింది. ఆ వీడియో వైరల్ కావడంతో.. ‘జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి’ అంటూ ఈ నెల 25న ‘సాక్షి’ ఆమె ఆవేదనను ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాధితురాలు వసుంధరకు సంబంధించిన వివరాలు సేకరించారు. పేదరికం కారణంగా కుటుంబ పోషణ కోసం ఆర్నెల్ల క్రితం వసుంధర కువైట్ వెళ్లినట్లు.. అలాగే, వారం రోజుల క్రితం కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలుసుకున్నారు. కాగా, కడపకు చెందిన ఓ ఏజెంట్ సాయంతో ఆమె క్షేమ సమాచారాలు కూడా తెలుసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ ‘సాక్షి’కి తెలిపారు. వసుంధర పాస్పోర్టు అక్కడి యజమాని వద్ద ఉండిపోయినందున దానిని తిరిగి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కువైట్లోని భారతీయ ఎంబసీకి బాధితురాలి తల్లి శాంతకుమారి రాసిన లేఖను మెయిల్ చేశామని.. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్కు కూడా శాంతకుమారి లేఖను మెయిల్ చేశామని ఆయన వివరించారు. అలాగే, కువైట్లోని కాన్సులేట్ కార్యాలయాన్ని కూడా సంప్రదించామని గ్రేవల్ చెప్పారు. వసుంధరతోపాటు మిగిలిన మహిళలను కూడా రప్పించేందుకు దిశ చట్టం ప్రత్యేక అధికారి దీపిక ఆధ్వర్యంలో తణుకు సీఐ, అత్తిలి ఎస్సై మరికొందరితో పోలీస్ ప్రత్యేక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. కాగా, ఇదే విషయాన్ని కువైట్లోని బాధితులు కూడా ధృవీకరించారు. ఏపీ నుంచి పోలీసులు తమతో మాట్లాడారని వారు మరో వీడియోను పంపించారు. ఇందులో, ‘జగనన్నా.. కొద్దిరోజుల్లోనే మమ్మల్ని ఆదుకున్నందుకు ధన్యవాదాలన్నా.. మీ మేలు మరువలేం.. ఇక్కడ అందరూ బాగా సహకరిస్తున్నారు.. ధైర్యం చెబుతున్నారు.. థ్యాంక్స్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తె క్షేమంగా వస్తుందని జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వసుంధర తల్లి శాంతకుమారి విశ్వాసం వ్యక్తంచేసింది. ఇదిలా ఉంటే.. మహిళలను కువైట్ పంపిన ఇరగవరం మండలం పొదలాడకు చెందిన సబ్ఏజెంట్ లక్ష్మణరావును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారం రోజుల్లోపు తీసుకొస్తాం కరెం వసుంధర, మరో ముగ్గురు మహిళలు కువైట్లోని పునరావాస శిబిరంలో ఉన్నట్లు నిర్ధారించుకున్నాం. వారిని సొంతూళ్లకు తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఇప్పటికే కువైట్ ఎంబసీ అధికారులు, అక్కడి లేబర్ కమిషనర్ను ‘పశ్చిమ’ పోలీసులు సంప్రదించారు. బాధితులు ఏ తప్పూ చేయలేదని నిర్ధారణ అయ్యింది. దీనివల్ల చట్టపరమైన చిక్కులు ఉత్పన్నం కావు. పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు, సంప్రదింపులు సానుకూలంగా ఉన్నాయి. నాలుగు నుంచి వారం రోజుల్లో వారిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – గౌతమ్ సవాంగ్, రాష్ట్ర డీజీపీ -
జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి!
‘‘జగనన్నా.. మాది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామం. ఇరగవరం మండలం పొదలాడకు చెందిన ఏజెంట్ లక్ష్మణరావు అక్కడి మహిళలకు మాయమాటలు చెప్పి కువైట్ పంపించి, అరబ్ షేక్లకు అమ్మేస్తున్నాడు. మమ్మల్ని అమ్మేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మా పాస్పోర్టులు లాక్కున్నారు. జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి. ఇక్కడ కువైట్లోని భారత దౌత్య కార్యాలయం (ఇండియన్ ఎంబసీ)లో వందల మంది బాధితులు ఉన్నారు’’ – కారెం వసుంధర అనే మహిళ శుక్రవారం వాట్సాప్లో పంపించిన వీడియో సందేశం సాక్షి ప్రతినిధి, ఏలూరు/అత్తిలి : ఉపాధి కోసం ఏజెంట్ల మాయమాటలు నమ్మి పొట్ట చేతపట్టుకుని పరాయి దేశాలకు వెళ్లిన మహిళల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పనులు ఇప్పిస్తామని నమ్మ బలికి అరబ్ షేక్లకు అమ్మేస్తున్నారని, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కువైట్ వెళ్లిన కొందరు మహిళలు అక్కడి యజమానుల బారి నుంచి తప్పించుకుని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నారు. భారత్కు తిరిగి వచ్చేందుకు వారి వద్ద పాస్పోర్టులు కూడా లేవు. తమను కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరుతూ శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని వాట్సాప్లో తమ బంధువులకు పంపించారు. కారెం వసుంధరతోపాటు మరికొందరు మహిళలు అందులో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గుత్తుల శ్రీను అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా ఇండియా తిరిగి వెళ్లే దిక్కు లేకుండా పోయిందని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బి.ఏటికోట గ్రామానికి చెందిన ప్రకాశ్రాజ్ అనే ఏజెంట్ మోసం చేసి అమ్మేశాడని కొత్తపేటకు చెందిన ఇంకో మహిళ, నెల్లూరు జిల్లా వెంకటగిరి, గుంటూరు జిల్లా రేపల్లె పట్టణాలకు చెందిన మహిళలు కూడా తమను కాపాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) వెంటనే స్పందించింది. బాధిత మహిళలను వెనక్కి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇరగవరం మండలం పొదలాడకు చెందిన ఏజెంట్ లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. కువైట్లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించి, బాధితులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
కువైట్లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
కువైట్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని కువైట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో సాల్మియా ప్రాంతంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెచ్చిన భారీ కేక్ను కట్ చేసి వైఎస్ జగన్కు తమ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 25 మంది రక్తదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) సహకారంతో వైఎస్ఆర్ జిల్లాకు చెందిన షేక్ గౌసియా అనే మహిళకు రూ.33 వేల రూపాయల విలువ గల ఓపెన్ టికెట్ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్. ముమ్మడి బాల్రెడ్డి, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, వైఎస్సార్ కువైట్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
టిక్టాక్ వీడియో వైరల్తో మనస్తాపం..
సాక్షి, రాజోలు(తూర్పుగోదావరి జిల్లా): పేదరికంతో బాధ పడుతున్న కుటుంబానికి అండగా నిలవాలని ఉపాధి కోసం కువైట్ వెళ్లిన శివకోడు గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహనకుమార్ (30) ఈ నెల 3వ తేదీన అక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు వేసుకున్న చీటీ పాట సొమ్ము చెల్లించలేదని అతడి ఫొటోలతో టిక్టాక్లో పెట్టిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మనస్తాపం చెందిన అతడు కువైట్లో నివాసం ఉంటున్న కాంప్లెక్స్లో ఉరి వేసుకున్నాడు. వారం తర్వాత ఆదివారం అతడి మృతదేహం శివకోడు చేరుకుంది. చేతికి అందివచ్చిన కొడుకు కువైట్ వెళ్లి విగతజీవిగా రావడంతో తల్లి విజయకుమారి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శివకోడు చేరుకున్న మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లిన అతడు ఐరన్ షాపులో పనికి చేరాడు. అక్కడే ఒక రూమ్లో స్నేహితులతో కలసి ఉన్న అతడు రెండు వేల దినార్లు (రూ.4.60 లక్షలు) చీటీ పాటలో సభ్యునిగా చేరాడు. పాడుకున్న చీటీ సొమ్ము కట్టకుండా పారిపోయాడని, ఫొటోల్లో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ అతడి స్నేహితులు వడ్డి దుర్గారావు, మధు కలసి అతడి ఫొటోలతో చేసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. అయితే అతడు చీటీ పాట పాడుకోకుండా నెల వారీ సొమ్ము చెల్లిస్తున్నాడని, కొంత సొమ్ము స్నేహితుల నుంచి అప్పుగా తీసుకుని చీటీ సొమ్ము చెల్లిస్తున్నా ఈ వీడియో పెట్టారని మృతుడి బావ కందికట్ల రాజబాబు తెలిపారు. తను కూడా కువైట్లోనే ఉంటున్నానని, భారత రాయబార కార్యాలయం ద్వారా కువైట్ రాయబార కార్యాలయంతో సంప్రదించి బావమరిది మృతదేహాన్ని ఇండియాకు తీసుకుని వచ్చామన్నారు. నెలరోజుల్లో ఇంటికి వస్తానన్నాడు.. రెండేళ్లుగా కువైట్లో ఉంటున్న కొడుకు నెల రోజుల్లో వచ్చేస్తానని తల్లి విజయకుమారికి ఫోన్ చేశాడు. అయితే అతడు విగతజీవిగా వచ్చాడని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కువైట్ వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటే కనీసం ప్రాణాలతో ఉండేవాడని ఆమె రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. -
నందలూరు వాసి కువైట్లో మృతి
కడప కార్పొరేషన్: జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలోని నందలూరుకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ(34) ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, ముమ్మడి బాలిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నందలూరుకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ కొన్నేళ్లుగా కువైట్లో సీసీ కెమెరాల టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 19వ తేది జాబిరియా ప్రాంతంలోని హాస్పిటల్లో కెమెరా అమర్చుతూ ప్రమాదవశాత్తు నిచ్చెన నుంచి కిందపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 28వ తేది మరణించాడు. మృతునికి భార్య, ఐదేళ్ల బాబు ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు సేవాదళ్ ఇన్చార్జి గోవిందు రాజు ద్వారా భారత రాయబార కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్ పనులన్నీ పూర్తి చేశారు. బాడీ బాక్స్కు అయిన రూ.14వేలు బాలిరెడ్డి భరించగా, చెన్నై విమానాశ్రయం నుంచి నందలూరు వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీ ఎన్ఆర్టీ కార్పొరేషన్ వారు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని ఇలియాస్, బాలిరెడ్డి తెలిపారు. -
‘జగనన్న విజయంలో మీరు భాగస్వాములయ్యారు’
-
‘జగనన్న విజయంలో మీరు భాగస్వాములయ్యారు’
కువైట్ సిటీ: వైఎస్ షర్మిల కువైట్ పర్యటనలో భాగంగా జోసెఫ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జీవము గల దేవుడు’ 8వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆదివారం తన భర్త బ్రదర్ అనిల్కుమార్తో కలిసి హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. జగనన్నను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పార్టీ అభ్యర్థుల విజయంలో వారు భాగస్వామలు అయినందుకు తమ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కువైట్లో ఉంటూ.. వారు చేసే సామాజిక సేవ అభినందనీయమని ఆమె కొనియాడారు. దీంతో పాటు గల్ఫ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం వారు పనిచేస్తున్న తీరును, కువైట్ కమిటీ చేసే సామాజిక సేవల గురించి షర్మిల.. ఇలియాస్, బాలిరెడ్డిలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్, బి.హెచ్. ముమ్మడి బాలిరెడ్డి, ఇతర వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!
బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్, కేట్ మిడిల్టన్, మేఘన్ మార్కెల్ లా.. క్వీన్ రానియా చాలామందికి తెలియకపోవచ్చు. విద్య, స్త్రీ సాధికారత, మధ్య ఆసియా దేశాల శరణార్థులు స్థితిగతుల గురించి ఆసక్తి ఉన్నవారికి మాత్రం ఈ పేరు బాగా పరిచయం. ఎందుకంటే క్వీన్ రానియా ఈ సామాజికాంశాల కోసమే పాటుపడుతూ దేశవిదేశాల్లో తన ప్రసంగాలతో అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. క్వీన్ రానియా జోర్డాన్ రాజు అల్ అబ్దుల్లా బిన్ అల్–హుస్సేన్ భార్య. 1970 ఆగష్టు 31 న కువైట్లో పాలస్తీనా దంపతులకు జన్మించారు. అమెరికన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలు అయ్యాక, అక్కడి సిటీబ్యాంక్లోని మార్కెటింగ్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. తరువాత జోర్డాన్ రాజధాని అమ్మన్ లో ‘ఆపిల్’ సంస్థలో చేరారు. ఆపిల్లో పనిచేస్తున్నప్పుడే ఒక విందులో జోర్డాన్ యువరాజు అల్ అబ్దుల్లా బిన్ అల్–హుస్సేన్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్యా ప్రేమ అంకురించింది. 1993లో వివాహం చేసుకున్నారు. పెళ్లినాటికి ఆమె వయసు 23 ఏళ్లు. అప్పటికి రాజుగా ఉన్న కింగ్ హుస్సేన్ 1999లో మరణించడంతో ఆమె భర్త సింహాసనాన్ని అధిష్టించాడు. వెంటనే రానియాను రాణిగా ప్రకటించాడు. అప్పటినుండి రానియా క్వీన్ హోదాలో ప్రపంచ విద్యకు, సమాజ సాధికారతకు కృషి చేస్తున్నారు. మధ్య ఆసియా దేశాలనుంచి ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారిపై ప్రపంచదేశాలకు కనికరం కలిగించేందుకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ‘‘వలస వచ్చే వాళ్లు యుద్ధ ప్రభావాల మూలంగా వాళ్ల ఇళ్లను, అయినవాళ్లను పోగొట్టుకుని మానసికంగా, శారీరకంగా కుంగిపోయి ఏ దిక్కూ తోచని వాళ్లే అయి ఉంటారు. అలాంటి వాళ్లను మనం చిన్న చూపు చూస్తే వాళ్లు ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంది. దానికంటే కూడా వాళ్లు గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించి, వాళ్లకు ఒక దారి చూపిస్తే బాధ్యత గల పౌరులు అవుతారు’’ అని చెబుతుంటారు క్వీన్ రానియా. ఆమె రచయిత్రి కూడా. ముఖ్యంగా చిన్న పిల్లల మానసిక వికాసం కోసం పుస్తకాలు రాశారు. ది కింగ్స్ గిఫ్ట్, ఎటర్నల్ బ్యూటీ, మహా ఆఫ్ ది మౌంటైన్స్, ది శాండ్విచ్ స్వాప్ వాటిలో ముఖ్యమైనవి. నేటితో నలభై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రానియా.. ‘ఏంటి! ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!’ అనిపించేలా ఉంటారు. ఓప్రా విన్ఫ్రే చేసిన ఒక ఇంటర్వ్యూలో ‘‘ఇంత అందంగా ఉన్నారు, ప్రపంచంలోని ఇన్ని అంశాల గురించి పాటుపడుతున్నారు. అసలు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి?’’ అన్నప్పుడు ‘చాక్లెట్’ అని సమాధానమిచ్చారామె.– రేఖ పర్వతాల ది శాండ్విచ్ స్వాప్ : పిల్లల కోసం రానియా రాసిన పుస్తకం -
'కార్మికుల కష్టాలు నన్ను కదిలించాయి'
రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ.. దూర దేశం బోయిన మా అన్న చంద్రుడా.. రాఖీట్ల పున్నానికి వస్తవని వాకిట్ల కూసున్నరో మాయన్న.. అని జానపద గాయని అంకుల గంగాదేవి పాడిన పాట గల్ఫ్లో ఉన్న వలస కార్మికులతో పాటు ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టించింది. జానపద పాటలకు ఆదరణ లభించేలా తన గానంతో విశేష కృషి చేసిన ‘రేలా రె రేలా ఫేం’ గంగాదేవి గల్ఫ్ దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయా సందర్భాల్లో అక్కడి కార్మికుల క్యాంపులను ఆమె సందర్శించి వారి జీవనశైలిని పరిశీలించారు. సంవత్సరాల కాలంగా కన్న తల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకు దూరంగా ఉంటూ కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు తనను చలింపజేశాయని, అనేక మంది దుర్భర జీవితం గడుపుతున్నారని చెప్పారు. ఎడారి దేశాల్లో మన కార్మికుల జీవనంపై గంగాదేవి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నిజామాబాద్ జిల్లా ముల్లంగిలో జన్మించిన నాకు చిన్నతనంలోనే తండ్రి దూరమయ్యాడు. తల్లి, అమ్మమ్మ, అక్క ఆప్యాయతను పంచుకుని పెరిగిన నేను చిన్ననాటి నుంచి కష్టాలనే అనుభవించాను. జానపదాలను అందరికి వినిపిస్తూ గాయనిగా ఒక్కో మెట్టు ఎక్కాను. పల్లె పాట ద్వారా అందరి అభిమానం చూరగొన్న నేను గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నా. జానపద గాయకురాలిగా స్వరాష్ట్రంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే అవకాశం వచ్చింది. తద్వారా కార్మికుల జీవన విధానాన్ని పరిశీలించే అవకాశం కూడా లభించింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఒమాన్ దేశాల్లో ఇప్పటి వరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాల్లో మాత్రం ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం రాలేదు. ప్రధానంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా, బతుకమ్మ సంబరాల సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి పాటలు పాడుతుంటా. గల్ఫ్లో ప్రదర్శనల అనంతరం కార్మికుల క్యాంపులకు వెళ్లి వారితో మాట్లాడాను. ప్రధానంగా దుబాయి లోని సోనాపూర్ క్యాంపు, షార్జాలోని కార్మికుల క్యాంపులకు వెళ్లి తెలుగు రాష్ట్రాల కార్మికులను కలుసుకున్నా. కార్మికులు ఏజెంట్ల చేతుల్లో మోసపోవడం, కంపెనీ యాజమాన్యాల ద్వారా వంచనకు గురికావడం ఇలా ఎన్నో రకాలుగా కార్మికులు అవస్థలు పడటాన్ని తెలుసుకున్నా. ఖల్లివెళ్లి అయిన కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలు ఇళ్లకు చేరుకోవడానికి కాలయాపన జరుగుతోంది. మరికొందరి మృతదేహాలు మార్చురీలలోనే మగ్గిపోతున్నాయి. ఇలా ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చాయి. గల్ఫ్ కార్మికుల అంశాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాను. వారిలో మనోధైర్యం కలిగించేందుకు కృషిచేస్తున్నా. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. గల్ఫ్లో ఏ కార్మికుడిని కదిలించినా మాతో ఒకే ఒక్కమాట చెప్పారు అదే.. ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని. ఎన్ఆర్ఐ పాలసీ అమలైతేనే గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ఎంతో మందికి విశ్వాసం ఉంది. అలాగే ఎడారి దేశాల్లో నష్టపోయిన కార్మికులకు పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలి. వారి జీవితాలపై ఆల్బమ్ చేయాలని ఉంది.. జానపద గాయనిగా ఎన్నో పాట లను ఆలపించిన నేను.. గల్ఫ్ కార్మికుల జీవితాలపై ఆల్బమ్ రూపొందించాలనుకుంటున్నా. అవకాశం వస్తే కచ్చితంగా కాల్బమ్ చేస్తా. ఆ ఆల్బమ్ను గల్ఫ్ కార్మికులకే అంకితం ఇస్తాం. మున్ముందు గల్ఫ్ కార్మికుల జీవితాలకు అద్దం పట్టే పాటలను ఆలపిస్తా. -
ప్రవాసులను ఆలోచింపజేస్తున్న ‘గల్ఫ్ బాబాయ్’
సాక్షి, కడప : కడప జిల్లా రాజంపేటకు చెందిన గిరిప్రసాద్ కాస కువైట్ కేంద్రంగా ‘గల్ఫ్ బాబాయి’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ గల్ఫ్ సమస్యలపై తెలుగులో విషయాత్మక లఘు చిత్రాలు ప్రసారం చేస్తూ ప్రవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. గిరిప్రసాద్ 20 ఏళ్లుగా కువైట్లో ఓ మీడియా కంపెనీలో ఎడిటర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, గల్ఫ్ జీవితాల పట్ల ఉన్న అవగాహనతో నాలుగేళ్ల క్రితం ‘గల్ఫ్ బాబాయి’ యూట్యూబ్ ఛానల్ను స్థాపించారు. కువైట్లోని 20 మంది తెలుగువారితో ఒక టీమ్ ఏర్పాటు చేసి వారినే ఆర్టిస్టులుగా చేసి అవగాహన, సందేశాత్మక, వినోదాత్మక షార్ట్ ఫిల్మ్లను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 18 నిమిషాల నిడివిగల ‘సారాయి’ షార్ట్ ఫిల్మ్ నిజ జీవితాన్ని ఆవిష్కరించింది. గిరిప్రసాద్ కాస కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం అందించిన ఈ ష్టార్ట్ మూవీ ‘గల్ఫ్బాబాయ్’ యూట్యూబ్ఛానల్లో ఉంది.https://www.youtube.com/ watch? v=63U5Ek_l9tM_ feature=youtu.be లింక్పై క్లిక్ చేసి ఈ మూవీని చూడవచ్చు. గల్ఫ్కు వెళ్లే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. గతంలో విడుదల చేసిన చీటి పాటల మోసం, గల్ఫ్లో కొత్త కుర్రోడు లాంటి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్లను కూడా ఈ ఛానల్లో చూడవచ్చు. -
కువైట్లో ఏడాదిగా బందీ
కోరుట్ల: ‘నేను ఏ నేరం చేయలేదు.. నాకు సంబంధం లేకుండా జరిగిన తప్పునకు కంపెనీ పని నుంచి తొలగించి నాపై కేసు పెట్టింది. వారం రోజులు జైలులో పెట్టారు. ఆ తరువాత జైలు నుంచి విడుదల చేసి ఏడాదిగా ఓ గదిలో బంధించారు. తిండి తిప్పలు లేక అవస్థలు పడుతున్న. అయ్యా.. కేసీఆర్, కేటీఆర్ సార్లు.. నా మీద దయచూపండి. నన్ను స్వదేశానికి రిప్పంచండి.’ఇదీ కువైట్లో ఓ నేరంలో ఇరుక్కున్న కోరుట్ల వాసి నారాయణ దీన పరిస్థితి. తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి పంపడంతో రెండు రోజుల నుంచి ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇరవై ఏళ్లుగా కువైట్కు.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వంగరి నారాయణ సుమారు ఇరవై ఏళ్లుగా కువైట్కు వెళ్లి వస్తున్నాడు. అక్కడ కేజీఎల్ అనే కంపెనీలో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ వ్యాన్ ద్వారా కేజీఎల్ కంపెనీ వారు డబ్బులను కువైట్లోని ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు పంపుతారు. 20 ఏళ్లుగా అదే కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న నారాయణ.. 2018 జులై 26వ తేదీన విధుల్లో భాగంగా మరో ఇద్దరితో కలసి (నేపాల్, పిలిప్పీన్స్కు చెందిన వ్యక్తులు) ఎప్పటిలాగే కంపెనీ వ్యాన్ నడుపుతున్నాడు. మధ్యా హ్నం అకస్మాత్తుగా డబ్బు లు తీసుకెళ్లే వ్యాన్ పాడైంది. సాయంత్రం వేళ కంపెనీకి చేరాడు. కంపెనీ వారు డబ్బులు లెక్కింపు చూసుకోగా.. 1.90 లక్షల దినార్లు (ఇండియా కరెన్సీలో సుమారు రూ.4 కోట్లు) తేడా వచ్చింది. కంపెనీవారి ఫిర్యాదు మేరకు పోలీసులు నారాయణతోపాటు వ్యాన్లో పనిచేస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తరువాత కేజీఎల్ కంపెనీకి అప్పగించారు. నా భర్తను రప్పించండి ఇరవై ఏళ్లుగా ఒకే కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న నా భర్తపై అకారణంగా కేసు పెట్టారు ఇండియాకు రాలేక నానా అవస్థలు పడుతున్నాడు. దయచేసి సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎంపీ అరవింద్లు కలసి నా భర్తను ఇండియాకు రప్పించండి. – వంగరి పద్మ, కోరుట్ల -
విదేశాంగ మంత్రిని కలిసిన మిథున్రెడ్డి
న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభా పక్ష నేత మిథున్రెడ్డి మంగళవారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను కలిశారు. కువైట్లో ఆంధ్రప్రదేశ్ వాసులు అరెస్టు అయ్యారని, వారిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన జైశంకర్ను అభ్యర్థించారు. తెలంగాణలోని వరంగల్లో 9 నెలల పాపపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆంధ్రవాసులు కువైట్లో నిరసన ప్రదర్శన నిర్వహించారని, దీంతో వారిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని మిథున్రెడ్డి విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. -
కువైట్లో కడపవాసుల అరెస్టు కలకలం!
రాజంపేట : తెలంగాణలోని వరంగల్లో చిన్నారి అత్యాచారానికి స్పందించడమే వైఎస్సార్ జిల్లా వాసులకు శాపంగా మారింది. కువైట్ దేశంలోని మాలియాలో శుక్రవారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినందుకు అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. మొత్తం 24 మందిని అరెస్టు చేసి కేసులు పెట్టారు. ఇందులో జిల్లాకు చెందిన వారు ఉండటంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు తదితర ప్రాంతాలకు చెందిన వారు అరెస్టైన వారిలో ఉండడంతో ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కువైట్ దేశంలో ఉంటూ అక్కడ చట్టాలు తెలియకపోవడం ప్రవాసాంధ్రులకు శాపంగా పరిణమించింది. తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసు విషయంలో స్పందిస్తే అదే వారికి పెద్ద శాపమై కూర్చుంది. రాచరిక వ్యవస్థ ఉన్న కువైట్ సహా ఏ గల్ఫ్దేశంలోనైనా నిరసన సభ, ప్రదర్శన నిర్వహించడం తీవ్రనేరం. దీనికి జైలుశిక్ష పూర్తయినా తర్వాత వీసా రద్దు చేసి ఏ గల్ఫ్దేశంలోనూ అడుగుపెట్టకుండా జీవితకాలం నిషేధం విధిస్తారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ... తమవారు కువైట్లో అరెస్టు అయి ఉంటే విడుదల చేయించే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రవాసాంధ్రులు విన్నవిస్తున్నారు. అరెస్టయిన వారిని కలిసేందుకు భారతీయ దౌత్యవర్గాలు రెండురోజులుగా ప్రయత్నిస్తున్నా, అక్కడి అధికారులు అనుమతించడం లేదని తెలిసింది. జిల్లాకు చెందిన ఎంపీలు వెంటనే స్పందించి తమ వారిని విడిపించాలని అరెస్టయిన సంబంధీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గల్ఫ్దేశానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : గత పది సంవత్సరాలుగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు రాక పొలం పంట సాగు చేసుకోలేక, రూ.లక్షలు వెచ్చించి అప్పులు చేసి బిడ్డల్ని ప్రయోజకులిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అందిరినీ వదిలి పొట్టకూటి కోసం కువైట్ వెళ్లాడు లక్కిరెడ్డిపల్లె మండలం పందేళ్లపల్లె గ్రామంకు చెందిన సోముగారి లక్షుమయ్య. అక్కడికి వెళ్లి నాలుగు నెలలు కూడా గడవక మునుపే లక్షుమయ్య (34)ను మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కువైట్లో ఆయన డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అక్కడి వారు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. లక్షుమయ్య మరణవార్త విన్న కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. 14 రోజులుగా భర్త, బంధువులు, మిత్రులు మృతదేహం కోసం కంటిమీద కునుకు లేకుండా ఎప్పుడోస్తాడా అని ఎదురు చూస్తున్నారు. గురువారం అర్థ రాత్రి మృతదేహాన్ని ఇండియాకు పంపినట్లు సమాచారం అందింది. కువైట్లోని ఇండియాకు చెందిన పలువురు తమ వంతు ఆర్థిక సహాయంతో మృతదేహాన్ని ఇండియాకు రప్పించడానికి సహకరించారు. ఇంటికి చేరిన మృతదేహాన్ని చూసిన భార్య పిల్లలు బోరున విలపించారు. నాన్న మా బాగు కోసం మమ్మల్ని విడిచి వెళ్లావా అంటూ ఇద్దరు కుమార్తెలు కన్నీటిపర్వతమవుతూ దుఖించడం అందరినీ కలచివేసింది. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు. ఎంపీ సహాయంతో.. కువైట్లో మృతి చెందిన లక్షుమయ్య మృతదేహాన్ని మద్రాసు ఎయిర్ పోర్టు నుంచి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తన సొంత ఖర్చులు వెచ్చించి ప్రత్యేక అంబులెన్సు ద్వారా పందిళ్లపల్లె గ్రామం బురుజుపల్లెకు రప్పించేందు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎంపీ మిథున్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఎప్పుడొస్తావు.. నాన్నా..!
భార్యా బిడ్డలను పోషించుకునేందుకు పొట్టచేత బట్టుకుని పరాయి దేశానికి వెళ్లిన ఆ ఇంటి యజమాని ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో.. తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. పిల్లలైతే నాన్నా ఎప్పుడొస్తావు.. అంటూ ఎదురు చూస్తున్నారు.. గల్ఫ్ దేశంలో సేఠ్ల చేతిలో చిత్ర హింసలకు గురై ఆచూకీ లేకుండా పోయిన తమ తండ్రిని తమ వద్దకు చేర్చాలంటూ ఆ చిన్నారులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టిస్తోంది. సాక్షి,లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్కడప) : లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన సయ్యద్ అలీ 2013 సంవత్సరం జనవరి నెల 31వ తేదీన చెన్నై నుంచి కువైట్కు జి8300359 నెంబరు గల పాస్పోర్టు ద్వారా వెళ్లాడు. అప్పటి నుంచి సయ్యద్ అలీని కువైట్ సేఠ్లు(కఫిల్) మారుస్తూ, అతడిని కొడుతూ ఉండేవారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఇతను నలురుగు కఫిల్ల వద్ద పని చేశాడు. కువైట్లో ఇతడిని గొర్ల కాపరిగా, తోట హమాలీగా పనికి కుదుర్చుకున్నారు. కఫిల్ అతడిని ప్రతి రోజూ కొడుతూ ఉండేవాడని, ఈ విషయమై గొడవ కూడా జరగడంతో అతను 2016 సంవత్సరం జూన్ 10వ తేదీన ఇంటికి నెట్ ద్వారా ఫోన్ చేసి సిటీకి దూరంగా ఉన్న అడవిలో మరో కఫిల్ వద్ద పని దొరికిందని, అక్కడికే వెళ్తున్నానని, అక్కడ బాగుంటే ఉంటానని, లేకుంటే నాలుగు రోజుల్లో ఇండియాకు తిరిగి వస్తానని చెప్పాడు. ఇక అంతే అప్పటి నుంచి సయ్యద్ అలీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. దీంతో అతను ఏమయ్యాడోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016వ సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీన కువైట్లో ఉంటున్న జి.కె.రాచపల్లెకు చెందిన అబ్దుల్ రహిమాన్ అనే వ్యక్తి ఇక్కడికి ఫోన్ చేసి సయ్యద్ అలీ ఇండియాకు వచ్చాడా అని అడిగాడు. సయ్యద్ అలీ మరణించి రెండు నెలలు అయిందని , అతని బంధువులు ఎవ్వరూ కువైట్లో లేరా అని అక్కడి కఫిల్ తనను అడిగాడని రహిమాన్ పేర్కొన్నాడు.ఈమేరకు ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు చేసినా ఇంకా సయ్యద్ అలీ ఆచూకి తెలియలేదని, సమాధానం వస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సయ్యద్ అలికి భార్య రహమతున్నిసా, కుమారుడు అమీర్, కుమార్తె ఆసిఫా ఉన్నారు. మూడేళ్లుగా ఆచూకీ లేకుండా పోయిన తమ అన్న ఏమయ్యాడో తేల్చాలని, సయ్యద్ అలీ తమ్ముడు సయ్యద్ షరీఫ్ బుధవారం కువైట్ ఎన్ఆర్ఐలకు వినతిపత్రం అందజేశాడు. భర్త కోసం భార్య, తండ్రి కోసం పిల్లలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి అతని ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
కువైట్లోని 92 కంపెనీలపై నిషేధం
కువైట్లో నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా కార్మికులను రోడ్డున పడేస్తున్న కంపెనీలను భారత విదేశాంగ శాఖ నిషేధించింది. ఈ కంపెనీలు కార్మికులకు పని కల్పించే పేరిట వీసాలను జారీచేసి కువైట్కు చేరిన తరువాత కార్మికులను పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ విధమైన 92 కంపెనీలను గుర్తించి వాటిని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ కంపెనీల జాబితాను అధికారులు విదేశాంగ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కువైట్లో ఉపాధి, ఉద్యోగం పొందాలనుకునేవారు తమకు వీసా జారీ చేసిన కంపెనీ విదేశాంగ శాఖ బ్లాక్లిస్టులో ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సి ఉంది. వీసా పొందిన వారికి ఒప్పందం ప్రకారం పని కల్పించకపోవడం, సరైన వేతనాలు, సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో కార్మికులు ఇబ్బందులు పడు తున్నారు. కువైట్ రావడానికి చేసిన అప్పులు తీరకపోవడం.. స్వదేశానికి వెళ్లినా అక్కడ ఏమి చేయాలో తెలియక కార్మికులు అక్కడే ఉండిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఖల్లివెల్లిగా (అక్రమ నివాసులు) మారుతున్నారు. కొంతమంది కార్మికులు గత ఏడాది కువైట్ ప్రభుత్వం అమలు చేసిన క్షమాభిక్షతో ఇంటికి చేరుకున్నారు. -ఎన్. చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) వీసాల దందా... కార్మికులు తక్కువ మంది అవసరమైనప్పటికీ కొన్ని కంపెనీలు లెక్కలేనన్ని వీసాలను జారీచేసి కార్మికులను పెద్ద సంఖ్యలో రప్పించుకుంటున్నాయి. ఫలితంగా నైపుణ్యం ఉన్నవారికి ఆ నైపుణ్యానికి అనుగుణంగా పని లభించకపోవడం, నైపుణ్యం లేని వారికి శక్తికి మించి పని లభించడంతో గందరగోళ పరిస్థితి ఎదురవుతోంది. వీసాల దందాను అరికట్టడానికి డొల్ల కంపెనీలను గుర్తించి మన విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులు వెబ్సైట్లో జాబితా పెట్టారు. కాగా, ఈ కంపెనీలను మన దేశం నిషేధించి నప్పటికీ ఇతర దేశాల నుంచి కార్మికులు వస్తునే ఉన్నారు. విదేశాంగ శాఖ వెల్లడించిన కంపెనీల జాబితా ఇదీ.. 1. అల్ బ్లాసీమ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 2. అషీ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 3. జెర్సెన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 4. అల్ వెలియా ట్రావెల్ అండ్ టూరిజం 5. అల్ అతీక్ కంపెనీ 6. అల్ అమేర్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్ 7. సదా మసూద్ 8.అల్ సక్లవీ ఇంటర్నేషనల్ కంపెనీ 9. లండన్ గ్రూప్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ 10. ఆజాద్ అరేబియన్ జనరల్ ట్రేడింగ్అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 11.సాద్ ముత్లక్ డఖాన్ ఫర్ హోమ్ కేర్ సర్వీసెస్ కంపెనీ 12. నేషనల్ కాంట్రాక్టింగ్ కంపెనీ 13.కువైట్ ఇండస్ట్రీయల్ రిఫైనరీ మెయింటనెన్స్అండ్ ఇంజనీరింగ్ కంపెనీ (క్రేమెన్కో) 14.అల్ హజీమ్ కార్ ఎస్ట్ 15.తలాల్ ఎస్ఎఫ్ ఆల్ అలీ క్లీనిక్ 16.అల్ సబా ఫర్నీచర్ 17.వతానియా ఆఫ్టికల్స్ కంపెనీ 18.ఫస్ట్ ల్యాండ్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 19.బైత్ అల్ అకావత్ జనరల్ ట్రేడింగ్ 20.వరల్డ్ ఆఫ్ డిజైన్ కంపెనీ 21.ఇంటర్నేషనల్ సిటీ కార్ప్ కంపెనీ ఫర్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ 22.మర్తయార్ అల్ అస్రార్ అల్ ఖాబందీ బిల్లింగ్నౌల్ స్కూల్ 23.ఎలైట్ యూనివర్సల్ గ్రూప్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 24.అల్ ముస్తాస్హార్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 25.బాబర్ నసీర్ హజీ షహరాన్ అల్ ట్రేడ్ మార్క్ 26.జెంట్స్ మాస్టర్ హ్యాండ్ టైలర్స్ 27.అల్ అబ్రాక్ ట్రేడింగ్ కంపెనీ 28.అల్ అబ్రాజ్ క్లీనింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 29.అల్ ఖాందక్ సెక్యూరిటీ కంపెనీ 30.జనరల్ ట్రేడింగ్ కంపెనీ(జీటీసీ) 31.కువైట్ అల్ సాకూర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ 32.అరబ్ సెంటర్ ఫర్ కమర్షియల్ అండ్రియల్ ఎస్టెట్ కంపెనీ 33.అహ్మద్ గౌహులమ్ రెధా అష్ఖానాని కోఫర్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ డబ్ల్యూ.ఐ.ఐ 34.టీజీఎం ఇంజనీరింగ్ కంపెనీ 35.అల్ మిషైల్ సెంటర్ ఫర్ క్లోక్స్ 36.జౌహారా డోరైన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. 37.గల్ఫ్ కార్ రెంటల్ కంపెనీ 38.అల్ మసా సెంటర్ లాండ్రీ కో. 39.సఫేర్ అల్ నిదా కో. 40.వాఎల్ అల్ నుసీఫ్ ట్రేడింగ్ కో. 41.బాస్కో ఇంటర్నేషనల్ కో. జనరల్ అండ్ కాంట్రాక్టింగ్ 42.ఫస్ట్ కువైట్ జనరల్ ట్రేడింగ్ కో. 43.షబా ఇంటర్నేషనల్ గ్రూప్ జనరల్ ట్రేడింగ్ అండ్కాంట్రాక్టింగ్ 44.ఆక్సిజన్ హార్డ్ లైన్ కో. 45.అల్ తన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ అండ్ ఇట్స్ అసోసియేట్ మ్యాన్ టెక్ సర్వీసెస్ 46.సహారాస్ అల్ రోలా జనరల్ ట్రేడింగ్ అండ్కాంట్రాక్టింగ్ కంపెనీ 47.అల్ అబ్రాజ్ క్లీనింగ్ కంపెనీ అండ్ సిటీస్ కాంట్రాక్టింగ్ కంపెనీ 48.అల్ ముదీర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ 49.అఖీలా ఫుడ్స్టఫ్ కంపెనీ 50.అల్ లయాలీ కార్గో ట్రాన్స్పోర్ట్ కో. 51.బ్రోన్జియా ప్రాజెక్ట్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. 52.అల్ కహాల్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఈస్ట్. 53.మషాల్ లైలుబీ వాల్ బాషూట్ 54.ఖరాఫీ నేషనల్ కేఎస్సీ 55.ఖరాఫీ నేషనల్ కేఎస్సీ (మూసివేయబడినది) 56.జనరల్ ట్రేడింగ్ 57.బయాన్ నేషనల్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 58.అల్ బహార్ మెడికల్ సర్వీసెస్ కో. 59.తరీఖ్ కో. డబ్యూ.ఐ.ఐ 60.ఎస్కేఎస్ గ్రూప్ జనరల్ ట్రేడ్ అండ్ కన్స్ట్రక్టింగ్ కో. డబ్ల్యూ.ఐ.ఐ 61.అల్ మనార్ ఫ్యాక్టరీ ఫర్ ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ సిమెంట్ 62.సబీక్ గ్లోబల్ ఫ్యాక్టరీ అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ 63.అల్ తఖీబ్ ట్రేడింగ్ కో. అల్ తఖీబ్ చాక్లేట్ కో. 64.అల్ మిషల్ కో. అబయా అండ్ బీషూట్ వర్క్షాప్ సెంటర్ 65.బిన్ హమ్జా జనరల్ ట్రేడింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కో. అల్ సబీల్ అల్ అలామియా ఫర్ ద రిపేయిర్ ఆఫ్ జ్యూవెలరీ అండ్ సిల్వర్ 66.ఫహాద్ అల్ సలీమ్ సన్స్ అండ్ పార్ట్నర్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. 67.యూఎన్ఐ సిగ్న్ అడ్వర్టైజింగ్ కో. 68.అల్ ఫూటూత ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్అండ్ కన్స్ట్రక్టింగ్ కంపెనీ 69.గాజ్వాన్ ట్రేడింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్ కంపెనీ 70.ఫస్ట్ ప్రాజెక్టస్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 71.కేర్ సర్వీసెస్ (అల్ రియా కంపెనీ ఫర్ బిల్డర్స్అండ్ సిటీస్ క్లీనింగ్ కాంట్రాక్టింగ్) 72.అల్ రువాడీ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్కాంట్రాక్టింగ్ కంపెనీ 73.అల్ రియా కంపెనీ ఫర్ బిల్డింగ్ సిటీస్ క్లీనింగ్ కాంట్రాక్టింగ్ 74.అల ఎస్సా మెడికల్ అండ్ సైంటిఫిక్ ఎక్యూప్మెంట్ కో. 75.నసర్ గోల్డెన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ గ్రూప్ 76.నేషనల్ రెడీమిక్స్ కాంక్రీట్ కంపెనీ 77.అల్ రకీబ్ జనరల్ బిల్డింగ్ కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్ 78.రవ్నాక్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. తయాబా కిచెన్ ఫ్రమ్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ 79.హమీద్ మజ్యాద్ అలీ అల్ద్వానీ 80.నెస్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ కంపెనీ డబ్ల్యూ.ఎల్.ఎల్ 81.ఎనాస్కో జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీడబ్ల్యూ.ఎల్.ఎల్ 82.క్రిస్టియల్ హౌజ్ జనరల్ ట్రేడింగ్ కో. 83.అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంపెనీ(ఏటీసీ) 84.స్విస్ మెడికల్ సర్వీసెస్ 85.అబ్దుల్లా యూసుఫ్ అల్ రాద్వాన్ జనరల్ ట్రేడింగ్అండ్ కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్ 86.స్పీడ్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్. కో. 87.హైతమ్ రెస్టారెంట్ 88.అల్ అల్మియా ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ టెంపర్డ్ గ్లాస్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్ 89.లాబ్స్టర్ లేక్ రెస్టారెంట్ 90.సకీనా బుక్ స్టాల్ సకినా ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్ కో. 91.ఖుదాస్ అల్ అహిలియా కో. జనరల్ ట్రేడింగ్ 92.అల్ అహిలా జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. తెలంగాణ కార్మికులకు విదేశాంగ శాఖ చేయూత గల్ఫ్డెస్క్: సౌదీ అరేబియాలోని రియాద్లో ఇరుక్కుపోయిన తెలంగాణ కార్మికులను భారత విదేశాంగ శాఖ ఆదుకుంది. జెఅండ్పి కంపెనీ సౌదీ ఆరేబియాలో భవన నిర్మాణ పనులను నిర్వహిస్తుండగా.. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఆ కంపెనీలో ఉపాధికి వెళ్లారు. అయితే, గత సంవత్సరం ఏప్రిల్ వరకు వేతనాలు చెల్లించిన కంపెనీ యజమాన్యం ఆ తరువాత నిలిపివేసింది. అంతేకాకుండా అకామ(గుర్తింపు)ను రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు అక్కడే ఉండిపోయారు. దీని కారణంగా కార్మికులు బయట పనిచేయలేకపోయారు. అలాగే స్వదేశానికి రావాలన్నా వారిని పంపించేందుకు కంపెనీ యాజ మాన్యం అంగీకరించలేదు. దీంతో కార్మికులకు సౌదీ ఆరేబియాలోని మన విదేశాంగ శాఖ అధికారులతో పాటు లేబర్కోర్టును ఆశ్రయించడంతో సౌదీ ప్రభుత్వం స్పందించింది. లేబర్కోర్టు సూచన మేరకు సౌదీ ప్రభుత్వం భారత్కు వెళ్లే కార్మికులకు విమాన టికెట్లు సమకూర్చింది. 56 మంది తెలంగాణ కార్మికుల్లో ఇప్పటికే కొంతమంది స్వదేశానికి రాగా.. మరికొంత మంది ఈనెల 17న రియాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. దాదాపు 8 నెలలకు సంబంధించి వేతనాలు కార్మికులకు అందాల్సి ఉంది. ఆ బకాయిలు త్వరలో కార్మికులకు అందనున్నాయి. విదేశాంగ శాఖ చొరవ చూపడం.. లేబర్కోర్టు సానుకూలంగా స్పందించడంతో తమకు న్యాయం జరిగిందని కార్మికులు చెప్పారు. -
స్వదేశానికి ఫారహాద్దీన్ మృతదేహం
కరీంనగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఫారహాద్దీన్ కువైట్లో మరణించారు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. మహమ్మద్ ఫేరాజుద్దీన్ కువైట్లో డ్రైవర్గా పనిచేసేవాడు. మే 14న జరిగిన రోడ్డు ప్రమాదం అతను మృతిచెందారు. ఫారహాద్దీన్ మృతదేహాన్ని ఫ్లయిట్ నెం. అల్ జజీరా J9-403లో కువైట్ నుంచి హైదరాబాద్కు తరలించారు. ఉదయం 1.35గం.లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అతని బంధువు ఆసాఢహ్మద్ ఖాన్ను సిటీస్ బస్సు యాజమాన్యం అదే ప్లయిట్ లో శవపేటికతో పాటు పంపారు. వారి దగ్గరి బంధువు ఖాజా జాహీరోద్దీన్, సామాజిక కార్యకర్త శ్రీ స్వదేశ్ పరికిపండ్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో శవపేటికను స్వీకరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చిట్టి బాబు నేతృత్వంలో అంబులెన్సును ఏర్పాటు చేశారు. మదదు పోర్టల్ ద్వారా, ఎంబసీ సహకారం తీసుకున్నారు. ఖాదర్ సిటీ బస్సు యాజమాన్యం తరపున సెటిల్మెంట్లో ఒకరిని ఇచ్చి పంపడంలో చాలా బాగా సహకరించింది. అతని మిత్రులు సర్వర్, అదిల్ సహకరించారు. శ్రీ భీం రెడ్డి, ఆ ఏరియా సీఐ త్వరగా వెంటనే స్పందించారు. ఈ మొత్తం పనిలో తెలంగాణ ప్రభుత్వం, సిటీ బాస్ యాజమాన్యం, ఇంటివారితో మాట్లాడం పనులు జరుగడంలో గంగుల మురళీధర్ రెడ్డి తన పని చేసారు. భవిష్యత్తులో ఇతని ఇన్సూరెన్సు కు కూడా కంపెనీ తో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు : చిరునామా: ఇంటినెంబర్ 8-14-3/5, కృష్ణ నగర్, కళ్యాణి గార్డెన్ దగ్గర, బొమ్మకల్ (గ్రామం ), కరీంనగర్ జిల్లా -
‘నా భార్యను వెనక్కి రప్పించండి’
చార్మినార్: కువైట్ దేశంలో ఇబ్బందులు పడుతున్న తన భార్యను వెంటనే నగరానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని పాతబస్తీ రెయిన్బజార్కు చెందిన ఓ వ్యక్తి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను కోరుతున్నారు. తన భార్యకు వేతనం ఇవ్వకపోగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సంబంధిత ట్రావెల్ ఏజెంట్పై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రెయిన్బజార్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఆయూబ్, సిరాజ్ బేగం దంపతులు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అతను స్థానిక ట్రావెల్ ఏజెంట్ మహ్మద్ ఎక్బాల్, అతడి భార్య షజహాన్ బేగం ద్వారా గత డిసెంబర్ 8న కువైట్కు పంపాడు. అప్పటి నుంచి ఆమె కువైట్లో నరకయాతన అనుభవిస్తుందన్నారు. తల్లి కనిపించకపోవడంతో చిన్నారులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. ఆమెకు జీతభత్యాలు ఇవ్వకపోగా.. దౌర్జన్యం చేస్తున్నారని.. వెంటనే తన భార్యను నగరానికి రప్పించడంతో పాటు ట్రావెల్ ఏజెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ఏం జరిగిందో..!
వైఎస్ఆర్ జిల్లా ,రాజంపేట : వారిద్దరు వేర్వేరు జిల్లాలకు చెందినవారు. జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లారు. అక్కడ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కా స్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగిన వారి దాంపత్యంలో ఎందుకో కలతలు మొదలయ్యాయి. అవి కాస్తా ముదిరి ఇద్దరూ కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించారు. వివరాల్లోకి వెళితే.. రాజంపేట మండలం బోయనపల్లె దళితవా డకు చెందిన కత్తి సుబ్బన్న దంపతులు బేల్దారి పని చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండో కుమార్తె వాణి (27) జీవనోపాధి నిమిత్తం ఏడాదిన్న ర క్రితం గల్ఫ్ దేశమైన కువైట్కు వెళ్లింది. అక్కడ ఆమెకు కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన సుబ్రమణ్యం (31)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి అక్కడే వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంతానం లేదు. మూడు నెలల క్రితం స్వదేశానికి.. తమ వారిని చూసేందుకు మూడు నెలల క్రితం వీ రిద్దరు కువైట్ నుంచి నేరుగా బోయనపల్లెకు చేరుకున్నారు. అక్కడ వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. ఈ మధ్యలో కుటుంబంలో భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, కుటుంబ కలహాలు తలెత్తినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరు ఇంటి నుంచి వెళ్లి తనువు చాలించాలని అనుకున్నారో ఏమో బుధవారం కడప నగర శివారులోని కనుమలోపల్లె రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లారు.. కనుమలోపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతుల సంఘటనపై వాణి తండ్రి కత్తి సుబ్బన్నకు సమాచారం అందింది. అయితే ఆయన ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలిపేందుకు ఇష్టపడలేదు. ఉదయం ఇంటి నుంచి వెళ్లారనే విషయాన్ని మాత్రం చెబుతున్నాడు. -
బతుకుదెరువు కోసం వెళ్లి .. అనంత లోకాలకు
వారిరువురు రైతు బిడ్డలు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుండేవారు. కానీ వరుస కరువులతో వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో పాటు చేసిన అప్పులు తీర్చుకునేందుకు కువైట్కు వెళ్లారు. కష్టపడి పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో విధి చిన్నచూపు చూసింది. బతుకుదెరువు కోసం వెళ్లిన దేశంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వైఎస్ఆర్ జిల్లా , బద్వేలు అర్బన్ : బద్వేలు మండలం గొడుగునూరు గ్రామానికి చెందిన చెన్నుపల్లె శ్రీనివాసులరెడ్డి (41) రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లాడు. ఈయనకు భార్య రమాదేవితో పాటు సుమ అనే కుమార్తె ఉన్నారు. కువైట్లోని ఖైతాన్లో నివసిస్తుంటాడు. అలాగే బద్వేలు మండలం చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన పోకల మల్లేశ్వర్రెడ్డి (40) నాలుగు నెలల క్రితం కువైట్కు వెళ్లాడు. ఆయనకు భార్య ప్రమీలతో పాటు హర్షవర్దన్రెడ్డి, విష్ణువర్దన్రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతులు ఇద్దరిది ఒకే మండలం కావడంతో పాటు ఒకే పని (రాడ్బెండింగ్) చేస్తుండటంతో ఖైతాన్లోని ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శనివారం ఉదయం వీరు మరో నలుగురితో కలిసి కువైట్లోని ఫాహిల్ అనే ఏరియాలో పనికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేందుకు వారు ఉంటున్న గదికి బయలు దేరారు. కువైట్లోని కింగ్ఫాహద్ అల్అహ్మద్ ఎక్స్ప్రెస్హైవే–40లో కారులో వస్తుండగా ముందు భాగంలో ఓ ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా ఆపడంతో దానిని తప్పించేందుకు కారును కూడా ఆపారు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో సుమారు వంద మీటర్ల మేర కారు పల్టీలు కొట్టి బోల్తాపడింది. దీంతో కారులో ఉన్న మల్లేశ్వర్రెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందగా బద్వేలు మండలం చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన మల్లేశ్వర్రెడ్డి సోదరుడు విశ్వనాథరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురికి కూడా గాయాలైనట్లు తెలిసింది. గ్రామాల్లో విషాదఛాయలు కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేలు మండలం గొడుగునూరు, చిన్నకేశంపల్లె గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గొడుగునూరు గ్రామవాసి అయిన శ్రీనివాసులరెడ్డి త్వరలో రానున్న శివరాత్రి పండుగకు ఇంటికి వస్తానని తెలిపాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు విలపించారు. అలాగే చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన మల్లేశ్వర్రెడ్డి నాలుగు నెలల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి వచ్చి ఒక నెల రోజుల పాటు ఇంటి వద్ద ఉండి తిరిగి కువైట్కు వెళ్లాడు. ఇక నాకు దిక్కెవరు, నా పిల్లలను ఎలా పోషించాలి దేవుడా అంటూ మల్లేశ్వర్రెడ్డి భార్య ప్రమీల రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. -
పెళ్లయిన 3 నిమిషాలకే డైవోర్స్!
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ కువైట్లో ఓ జంట మాత్రం మూడు నిమిషాలకే ఈ పెళ్లి మాకొద్దు బాబోయ్ అంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. కువైట్లో గత నెలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కువైట్లో ఓ జంట తమ పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్పై జడ్జి ఎదుట సంతకాలు పెట్టారు. అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో పెళ్లికూతురు పొరపాటున కింద పడింది. పక్కనే ఉన్న వరుడు ఆ అమ్మాయికి సహాయం చేయాల్సింది పోయి.. కింద పడినందుకు పరుష పదజాలంతో దూషించాడు. అంతే ఒక్కసారిగా ఉక్రోషానికి గురైన వధువు జడ్జి దగ్గరకు వెళ్లి విడాకులు కావాలని అడగటం.. ఆయన ఇవ్వడం చకచకా జరిగిపోయింది. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కువైట్ చరిత్రలోనే ఇంత తక్కువ వ్యవధిలో విడాకులు తీసుకున్న జంటగా వీరు గుర్తింపు పొందారని స్థానిక మీడియా పేర్కొంది. ఇంతకుముందు దుబాయ్లో ఓ జంట 15 నిమిషాల వ్యవధిలో విడాకులు తీసుకున్నా.. వీరు కేవలం 3 నిమిషాల్లోనే విడిపోయారని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా విడాకులు తీసుకున్న జంట కూడా ఇదే కావచ్చని అభిప్రాయపడింది. -
ఊపిరి ఆడక కువైట్లో మహిళ మృతి
కడప కార్పొరేషన్ : రైల్వేకోడూరు నియోజకవర్గం టీ కమ్మలపల్లెకు చెందిన పంట అరుణమ్మ కువైట్లో మృతి చెందిందని వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలాయాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. జీవనోపాధి కోసం కువైట్ వచ్చిన రమణమ్మ చలికి తట్టుకోలేక ఎలక్ట్రానిక్ హీటర్ వేసుకోవడంతో ఊపిరి ఆడక ఈనెల 3న చనిపోయిందన్నారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలం పంపించేందుకు అంబేడ్కర్ సేవా సమితి ద్వారా ఇమ్మిగ్రేషన్, భారత రాయబార కార్యాలయంలో పనులన్ని పూర్తి చేసి ఎయిర్ ఇండియా ప్లైట్లో ఈనెల 26న పంపించారు. చెన్నై నుంచి టీ కమ్మపల్లె వరకు రాజంపేట మాజీ ఎంపీ మిథున్రెడ్డి ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అరుణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ నాయకులు నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
అట్లూరు వాసి ...
వైఎస్ఆర్ జిల్లా , అట్లూరు : బతుకు దెరువు కోసం కువైటు వెళ్లి ప్రమాదవశాత్తూ కిందపడి అట్లూరు క్రాస్ రోడ్డుకు చెందిన కల్లూరు వెంకటసుబ్బయ్య(33)మృతి చెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటసుబ్బయ్య మూడేళ్ల క్రితం కువైటు వెళ్లాడు. అక్కడ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణకు డబ్బు పంపేవాడు. ఈనేపథ్యంలో వెంకటసుబ్బయ్య ఇంటికి వచ్చి మూన్నెళ్ల క్రితమే మళ్లీ కువైట్కు వెళ్లాడు. కువైట్లో సెంట్రల్ ఏసీ పనులు చేస్తూ పైనుంచి కిందపడి చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
‘పని మనుషుల’ ఒప్పందానికి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : పని మనుషుల నియామకంలో సహకారానికి కువైట్తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంతో కువైట్లో పనిచేస్తున్న 3 లక్షల మంది భారతీయులకు(అందులో 90 వేల మంది మహిళలే) ప్రయోజనం కలుగుతుంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఎంఓయూలో భారత పని మనుషుల హక్కుల పరిరక్షణకు కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చారు. ఐదేళ్ల వరకు అమలులో ఉండే ఈ ఒప్పందాన్ని రెన్యూవల్ చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఎంఓయూ అమలు పర్యవేక్షణకు సంయుక్త కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. -
కువైట్తో ‘పని మనుషుల’ ఒప్పందానికి కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: పని మనుషుల నియామకంలో సహకారానికి కువైట్తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం వల్ల కువైట్లో పనిచేస్తున్న 3 లక్షల మంది భారతీయుల(అందులో 90 వేల మంది మహిళలే)కు ప్రయోజనం కలుగుతుంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఎంఓయూలో భారత పని మనుషుల హక్కుల పరిరక్షణకు కొన్ని రక్షణలు కల్పించారు. ఐదేళ్ల వరకు అమల్లో ఉండే ఈ ఒప్పందాన్ని ఆటోమేటిక్గా రెన్యువల్ చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఎంఓయూ అమలు పర్యవేక్షణకు సంయుక్త కమిటీని ఏర్పాటుచేయనున్నారు. -
కువైట్లో రోడ్డుప్రమాదం
వైఎస్ఆర్ జిల్లా, సుండుపల్లె : గల్ఫ్ దేశమైన కువైట్లో శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో జి.కె.రాచపల్లెకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. సుండుపల్లె మండలం మడితాడు గ్రామ పంచాయతీ జీకే రాచపల్లెకు చెందిన గాదంశెట్టి లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడికి వివాహమై సుండుపల్లె మండలంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండవ కుమారుడు జి.నాగరాజు (35) జీవనోపాధి కోసం కువైట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి లగేజీని కారు డిక్కీలో పెడుతుండగా వెనుక నుంచి మరో కారు వచ్చి ఢీకొంది. ఈప్రమాదంలో అక్కడికక్కడే నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి నెలలో ఇంటికొచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుని తిరిగి వెళ్తానని చెప్పిన కుమారుడు అంతలోనే రోడ్డుప్రమాదంలో మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా నాగరాజు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఆర్థిక వనరుల కోసం బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. -
చనిపోయిందనుకున్న మహిళ ఆస్పత్రిలో ప్రత్యక్షం
మలికిపురం (రాజోలు): తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలానికి చెందిన పుట్టి వెంకటలక్ష్మి 2016లో ఉపాధి కోసం కువైట్కు వెళ్లింది. కొద్ది రోజుల పాటు కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడింది. క్రమంగా ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబీకులు ఆమె ఆచూకీ కోసం వాకబు చేశారు. ఎటువంటి సమాచారం రాకపోవడంతో చనిపోయి ఉంటుందని భావించి అదే ఏడాది చివర్లో దిన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ క్రమంలో కువైట్లో తూర్పుగోదావరి జిల్లా ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న మహాసేన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ఈ నెల 10న ఫోన్ కాల్ వచ్చింది. అక్కడి ఓ ఆస్పత్రిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ అపస్మాకర స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మహాసేన సభ్యులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. మహాసేన టీం సభ్యులు ఆమె ఫొటోను కువైట్లోని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి, వివరాలు తెలుసుకున్నారు. జిల్లా వాసుల ద్వారా ఆమె పాస్పోర్టు వివరాలు తెలుసుకుని, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి విషయాన్ని ఆమె భర్త రాఘవులు, కుమారుడు దుర్గాప్రసాద్కు తెలిపారు. అప్పటివరకూ వెంకటలక్ష్మి స్పృహలోకి కూడా రాలేదు. వెంకటలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ మహాసేన సభ్యులతో ఫోన్లో మాట్లాడగా..ఆ ఫోనును ఆమె చెవి వద్ద పెట్టడంతో కుమారుడి మాటలకు వెంకటలక్ష్మి స్పృహలోకి వచ్చింది. ఆమె ఎందుకు ఈ దుస్థితికి వెళ్లిందనేది చెప్పలేకపోతోందని మహాసేన సభ్యులు చెబుతున్నారు. ఆమెను భారత్కు తరలించేందుకు మహాసేన సభ్యులు కృషి చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం నుంచి న్యాయపరమైన అనుమతి పొందడంతోపాటు ప్రయాణ ఖర్చులకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని కువైట్ మహాసేన టీం అధ్యక్షుడు యల్లమిల్లి ప్రదీప్, సభ్యుడు గంటా సుధీర్ తెలిపారు. త్వరలో ఆమెను స్వదేశానికి పంపిస్తామని మహాసేన సభ్యులు చెప్పారు. -
కువైట్ను ముంచెత్తిన వరదలు: మంత్రి రాజీనామా
ఎడారి దేశాన్ని వరదలు మళ్లీ ముంచెత్తాయి. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు ధ్వంసమైనాయి. దేశవ్యాప్తంగా పరిస్థితి అతలాకుతమైపోయింది. ఉరుములతో కూడిన భారీ వర్షం కువైట్లో బీభత్సం సృష్టించింది. వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. రబ్బరు బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో సౌకర్యాలలేమిపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కువైట్ పబ్లిక్వర్క్స్ మంత్రి హుస్సం అల్-రౌమి రాజీనామా చేశారు. మరోవైపు అంతర్గత వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. సైన్యం, నేషనల్ గార్డ్ భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా బయటికి రావొద్దంటూ ప్రజలను హెచ్చరించారు. మరోవైపు వర్షధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో నెటిజన్లు ట్విటర్ ద్వారా ఈ వరద బీభత్స దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. WATCH: Rubber boats are used in #Kuwait’s rescue operations from floods caused by heavy rains pic.twitter.com/652DJR6Lb9 — Al Arabiya English (@AlArabiya_Eng) November 9, 2018 شكرا لرجال الاطفاء وكل فرق الطوارئ .#الكويت_الان pic.twitter.com/ogEeWkfRSw — مباشر نيوز (@mobashernewss) November 9, 2018