కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): కాకినాడ రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై సోషల్ మీడియా వేదికగా జనసేన దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తెలిసి కన్నబాబు స్పందించారు. నాలుగు నెలల క్రిందట కూరాడ గ్రామంలో కాలుజారి పడిపోయిన దళిత వృద్ధురాలికి ధన సహాయం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్ చేసి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జనసేన దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.
ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నాగమల్లితోట జంక్షన్ వద్ద సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను ఇటీవలే అరెస్ట్ చేసినట్లు జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనసేన చేస్తోన్న తప్పుడు ప్రచారంపై కన్నబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కన్నబాబుపై జనసేన దుష్ప్రచారం
Published Sat, Apr 6 2019 9:40 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- పెరగనున్న టూ వీలర్స్ ధరలు.. జులై 1నుంచే అమలు
- టీజీలో కొనసాగుతున్న జూడాల సమ్మె..రోగుల ఇక్కట్లు
- హైదరాబాద్లో మళ్లీ కాల్పుల కలకలం.. ఎక్కడంటే?
- బీఆర్ఎస్కు 11 ఎకరాలెందుకు?: షబ్బీర్ అలీ
- స్టార్టప్ ట్రబుల్స్: ఈ బెంగళూరు కంపెనీలో 80% తొలగింపు
- తగ్గనున్న ప్లాట్ఫారం టిక్కెట్ ధర
- 34 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలో విజయశాంతి
- మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
- యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!
- హజ్ యాత్ర మృతులపై సౌదీ అధికారిక ప్రకటన.. మరణాలు ఎన్నంటే?
Advertisement