
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్కు సింగరేణి ఎన్నికల భయం పట్టుకుందని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆర్సీ.కుంతియా అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయబోరని సింగరేణి కార్మికులు భావిస్తున్నారని చెప్పారు.
ఈ ఎన్నికల్లో కేసీఆర్కు కార్మికులు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. బలమైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు కలవడంతో కేసీఆర్కు భయం పట్టుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment