వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి వంద స్థానాలు | Mahmood Ali on trs | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి వంద స్థానాలు

Published Wed, Feb 28 2018 2:17 AM | Last Updated on Wed, Feb 28 2018 2:17 AM

Mahmood Ali on trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో వంద స్థానాలు టీఆర్‌ఎస్‌వే అని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధికి బంగారు బాటలు వేస్తూ రాష్ట్రాన్ని విజయ తీరాల వైపు నడిపిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో తిరిగి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్‌ వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక వినూత్న సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అనతికాలంలోనే యావత్తు దేశ దృష్టిని ఆకర్షించారని తెలిపారు. నిజాం పాలనలో భూసర్వే తర్వాత రాష్ట్రంలో పాలించిన ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్‌ రెవెన్యూ అధికారులతో చర్చించి సమగ్ర భూప్రక్షాళన సర్వేకు నాంది పలికారని గుర్తుచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement