'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ' | Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter | Sakshi

'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ'

Published Tue, May 19 2020 3:23 PM | Last Updated on Tue, May 19 2020 3:27 PM

Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి  ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'ఆ క్షణం కోసం ఎల్లో మీడియా వారం రోజులపాటు ఎదురు చూసింది. ఎడిటోరియల్స్, కాంగ్రెస్ వాళ్లని రెచ్చగొట్టడాలు, టీవీల్లో జలజగడాలంటూ తగాదా పెట్టే చర్చలు అన్నీ నీరు కారిపోయాయి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏదో అంటారని ఆశపడి భంగపడ్డారు. బాబు కూడా లైవ్ చూశాడంట ఏదైనా వినిపిస్తుందేమో అని' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. చదవండి: నీకు 71 ఏళ్లు.. వైరస్‌ పసిగడుతుంది

కాగా మరో ట్వీట్‌లో.. 'కళ్లు మండుతున్నాయా అని అన్నది నిన్నే బాబూ. పొరుగు రాష్ట్రంలో ప్రవాస జీవితం. ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ. పక్కింటి వాళ్లు కూడా గుర్తించని అజ్ఞాతవాసం ఎక్కడ. బయట అడుగుపెడితే క్షణాల్లో వీడియోలు సోషల్ మీడియాకెక్కుతున్నాయి. ఎంత కష్టం వచ్చిపడింది!' అంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: బాబు వాడకం ఎలా ఉంటుందంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement