‘ఓడిపోయిన నాకు జగన్‌ ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారు’ | YSRCP Mohamed Iqbal Praises YS Jagan Mohan Reddy Over Minorities | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన మహ్మద్‌ ఇక్బాల్‌

Published Tue, Jun 11 2019 3:29 PM | Last Updated on Tue, Jun 11 2019 6:11 PM

YSRCP Mohamed Iqbal Praises YS Jagan Mohan Reddy Over Minorities - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి ఇవ్వడం పట్ల  వైఎస్సార్‌సీపీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఓట్ల కోసం చివరలో మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో దొంగలు, బ్యాంక్‌ లూటీ చేసిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. జగన్‌ మాత్రం ఓడిపోయిన తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వలనే మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో మైనార్టీలకు ఎలాంటి సంక్షేమం జరిగిందో సీఎం జగన్‌ సారథ్యంలో కూడా అలానే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement