minorities
-
కాంగ్రెస్పార్టీ మైనార్టీలను మోసం చేసింది: మాజీ హోం మంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: గతంలో మైనార్టీ డిక్లరేషన్ను ప్రకటించిన కాంగ్రెస్పార్టీ ఆ విషయాన్ని ఇప్పుడు మర్చిపోయిందని, ఓట్లు వేయించుకుని మైనార్టీలను కాంగ్రెస్పార్టీ నాయకులు మోసగించారని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మైనార్టీలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మైనార్టీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్పార్టీ ఏ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి.. ప్రధాన మంత్రి మోదీని బడే భాయ్ అని సంబోధించారని, అసలు కాంగ్రెస్పార్టీ సెక్యులర్ పార్టీయా.. కాదా..? అనే విషయాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మైనారిటీల భద్రత ఆందోళనకరం
ఢాకా: బంగ్లాదేశ్లోని మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మత, సాంస్కృతిక, దౌత్య సంబంధ ఆస్తులపై కొనసాగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం బంగ్లా విదేశాంగ శాఖ కార్యదర్శి మహ్మద్ జషిమ్ ఉద్దీన్తో ఢాకాలో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా మిస్రీ చెప్పారు. పదవీచ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్ హసీనా ఆగస్ట్ 5న భారత్కు వచ్చాక, రెండు దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం. సమావేశం అనంతరం ఢాకాలో మిస్రీ మీడియాతో మాట్లాడారు. ‘రెండు దేశాల సంబంధాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఇద్దరం చర్చించాం. భారత్ వైఖరిని స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా వివరించాను’అని మిస్రీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్లోని ఆపద్ధర్మ ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేయాలని భారత్ భావిస్తోందన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనుస్, విదేశాంగ శాఖ సలహాదారు తౌహీద్ హుస్సేన్తోనూ సమావేశమయ్యానని చెప్పారు. బంగ్లాదేశ్ అభివృద్ధి, సుస్థిరత కోసం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు భారత్ తోడ్పాటునందిస్తుందని వారికి చెప్పానని మిస్రీ వివరించారు. ఆగస్ట్లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలకు అవరోధంగా మారే అవకాశమే లేదని చెప్పారు. ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన యూనుస్కు శుభాకాంక్షలు తెలిపిన విదేశీ నేత మన ప్రధాని మోదీయేనని మిస్రీ వివరించారు. ఇద్దరు నేతలు ఫోన్లో మనసు విప్పి మాట్లాడుకున్నారని చెప్పారు. భారత్ సహకారంతో బంగ్లాదేశ్లో అమలవుతున్న వివిధ ప్రాజెక్టుల రోజువారీ పురోగతి, వాణిజ్యం, వ్యాపారం, కనెక్టివిటీ, ఇంధన రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలతోనూ రెండు దేశాల సంబంధాలు ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. -
దారుణ విద్వేష క్రీడ!
అయిదు నెలలుగా బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాకులపై అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళకు తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం బలంగా గళం విప్పే దాస్ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ రాజద్రోహ నేరం మోపడం విడ్డూరం. ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి, బెయిలివ్వకుండా, పది రోజుల కస్టడీకి పంపడంతో నిరసనలు చెలరేగాయి. సందట్లో సడేమియాగా దుష్టశక్తులు అల్లర్లు రేపి, పొరపాటున ఓ ముస్లిమ్ లాయర్ మరణానికి కారణమై, ఆ పాపం మైనా రిటీల నెత్తిన వేయడంతో ఢాకా మరోసారి భగ్గుమంది. ఆలయాలపై దాడులు, ప్రాణనష్టంతో... మైనారిటీలనూ, భావప్రకటనాస్వేచ్ఛనూ కాపాడాలంటూ బంగ్లాను భారత్ అభ్యర్థించాల్సొచ్చింది.ఇస్లామ్ అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం మానేసి, చాలాకాలమైంది.అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్’ను ర్యాడికల్, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్ బుధవారం అభివర్ణించడం ఆందోళనకరం. ‘ఇస్కాన్’ను నిషేధించాలని బంగ్లా యోచిస్తు న్నట్టు వార్త. ఆధ్యాత్మిక చైతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం అక్షరాలా బుద్ధిహీనతే. దేశంలోని విభిన్న వర్గాల మధ్య సౌహార్దం పెంపొందించి, బాధితులకు న్యాయం చేసి, మానవ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏ శక్తుల ప్రోద్బలంతో ఇలా మాట్లాడుతోందన్నది ఆశ్చర్యకరం. జూలై నాటి ప్రజా ఉద్యమంతో ఢాకాలో ప్రభుత్వ మార్పు జరిగిపోయింది కానీ, అల్పసంఖ్యాక వర్గాలపై సాగుతున్న దాడులు మాత్రం అప్పటి నుంచి ఆగడం లేదు. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే పన్నాగం దీనికి వెనక ఉందని స్థానిక స్వతంత్ర విశ్లేషకుల మాట. ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లామీ ఉందనేది స్పష్టం. హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)లు యూనస్ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్ షరియత్ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్ను ప్రజాస్వామ్య ఎన్నికలు, పార్ల మెంట్తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది. అదే గనక నిజమైతే, అత్యంత ప్రమాదకర పరిణామం. పౌరసమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలసి కట్టుగా అలాంటి వ్యూహాలను భగ్నం చేసి, కష్టించి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. అసలు అఫ్ఘన్ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్కే కాదు... యావత్ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా – పసిఫిక్ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ధి పొందాలని అమెరికా భావించింది. నిరుటి హసీనా సర్కార్ నో చెప్పడంతో అది కుదరలేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిచి ఉంటే ఏమో కానీ, ట్రంప్ గెలవడంతో బంగ్లా మధ్యంతర సర్కార్ సారథి – ట్రంప్ ద్వేషి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ట్రంప్ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారట. బంగ్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు అయిదు దశాబ్దాల పైచిలుకు క్రితం భారత్ అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే గడ్డపై భారత వ్యతిరేకత, మైనారిటీలపై ద్వేషాలను స్వార్థపరులు పెంచిపోషించడం విషాదం. దాదాపు 14 ఏళ్ళ పైగా షేక్ హసీనా ఏలుబడిలో నియంత పోకడల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగిందని ఆరోపణలొస్తే, కొత్త హయాం కూడా తక్కువేమీ తినలేదు. విజృంభిస్తున్న విద్వేషం, విధ్వంసం ఢాకాలో పత్రికా స్వాతంత్య్రానికి సైతం ముప్పుగా మారాయి. ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’లాంటి స్వతంత్ర పత్రికా రచనకు పేరుపడ్డ పత్రికలపై దాడులు అందుకు ఓ మచ్చుతునక. బాధితు లకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సహా మైనారిటీల కనీసపాటి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బంగ్లా సర్కార్కు ఉన్న కష్టమేమిటి? హసీనా సర్కార్ను గద్దె దింపినప్పటి నుంచి ఇప్పటికి బంగ్లాలో మైనారిటీలపై 2 వేలకు పైగా దాడులు జరిగాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను మతపరంగా కాక మానవ హక్కుల పరంగా చూడాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది. 1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతం చిల్లరకు పడిపోయారన్న నిష్ఠుర సత్యం అక్కడ జరుగుతున్నదేమిటో ఎరుకపరుస్తుంది. విద్యుత్ సహా, బియ్యం, పత్తి, చమురు లాంటి అనేక సరుకుల విషయంలోనూ మనపై భారీగా ఆధారపడ్డ బంగ్లా సర్కార్పై ఇకనైనా భారత్ కఠినవైఖరిని అవలంబించాలి. పొరుగు దేశంలో బతుకు భయంలో ఉన్న హిందువులను కాపాడేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలి. కేవలం మాటలకు పరిమితం కాకుండా, దౌత్య, వాణిజ్య రంగాల్లో చేయగలిగినదంతా చేయాలి. పేరుకు మాత్రం లౌకికవాదం ముసుగు వేసుకొని, మైనారిటీలకు వ్యతిరేకంగా, తెర వెనుక శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిన అసమర్థ యూనస్ సర్కార్పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. -
కృష్ణ దాస్ అరెస్ట్ వేళ దారుణం.. నిరసనకారులపై విరిగిన లాఠీ!
ఢాకా: బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇస్కాన్కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్ చేయడం, బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఆయన బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయస్థానం బయట భయానక ఘటన చోటుచేసుకుంది. కోర్టు బయట ఉన్న వారిపై పోలీసులు లాఠీలు ఝలిపించారు.బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభును దేశద్రోహం ఆరోపణలపై బంగ్లాదేశ్లోని ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆయన్ను పోలీసులు రిమాండ్కు కోరకపోవడంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది.మరోవైపు.. కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తుపై కోర్టులో దాదాపు మూడు గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా కోర్టు బయట వందల సంఖ్యలో ఆయన మద్దతుదారులు గుమ్మిగూడారు. కృష్ణ దాస్ అరెస్ట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను జైలుకు తరలిస్తుండగా.. పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ నెలకొంది. కృష్ణ దాస్ను తీసుకెళ్తున్న వ్యాన్ను అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు రెచ్చిపోయారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్, సౌండ్ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి చనిపోయినట్టు సమాచారం.🚨 SHAMEFUL! Fascist Yunus govt police 'BRUTALLY' beat Bangladeshi Hindus who were protesting against the 'ARREST' of Bangladesh ISKCON prominent saint Chinmoy Krishna Das Prabhu. pic.twitter.com/Nw1kw4dFl1— Megh Updates 🚨™ (@MeghUpdates) November 26, 2024ఇదిలా ఉండగా.. చిన్మోయ్ కృష్ణ దాస్ను బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. దాస్ అరెస్టు విషయంలో బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపింది. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. -
హిందువులకు రక్షణ కల్పిస్తాం: యూనుస్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పిస్తామని, దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. యూనుస్ శుక్రవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాతి పరిణామాల్లో మోదీ, యూనుస్లు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ‘ప్రజాస్వామ్యయుత, సుస్థిర, శాంతికాముక, ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించాను’ అని మోదీ ఎక్స్లో వెల్లడించారు. ‘ప్రొఫెసర్ యూనుస్ కాల్ చేశారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు’ అని మోదీ తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల్లో బంగ్లాదేశ్ ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నామని యూనుస్కు తెలిపారు. అదే సమయంలో బంగ్లాదేశ్లోని హిందువులకు భద్రత కలి్పంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్లో పరిస్థితి అదుపులోకి వచి్చందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీకి స్పష్టంచేసినట్లు యూనుస్ ‘ఎక్స్’లో తెలిపారు. -
బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పరిణామాలపై రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఢాకాలోని భారత్ దౌత్య కార్యాలయం ద్వారా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.బంగ్లాదేశ్లో 19,000 మంది భారతీయులు ఉన్నారని జైశంకర్ వెల్లడించారు. వీరిలో 8,000 మంది విద్యార్థులు ఇప్పటికే భారత్ చేరుకున్నారని తెలిపారు. బంగ్లాదేశ్లో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని, మైనార్టీల రక్షణకు అక్కడున్న సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు.‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్లో భారతీయ యువకులు వెనక్కి రావాలనుకుంటున్నారు. భారతీయ యువకులను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. బంగ్లాదేశ్లోని భారతీయులు, మైనారిటీల భద్రతపై అక్కడి ఆర్మీతో మేము టచ్లో ఉన్నాం. అక్కడి శాంతి భద్రతనలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’ అని తెలిపారు -
Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
సార్వత్రిక సంగ్రామంలో పశి్చమ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటిదాకా 4 విడతల్లో 18 చోట్ల పోలింగ్ ముగిసింది. 20వ తేదీన ఐదో విడతలో 7 నియోజకవర్గాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవన్నీ రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక బెల్టులోనే ఉన్నాయి. భారీగా పట్టణ ఓటర్లున్న సీట్లివి. ఇటీవలే అమల్లోకి వచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), మైనారిటీలు ఈ సీట్లలో బాగా ప్రభావం చూపే అవకాశముంది. ఐదో విడతలో తలపడుతున్న 88 మంది అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు కీలక నియోజకవర్గాలపై ఫోకస్... హౌరా... వలస ఓట్లు కీలకం సుప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్, హౌరా రైల్వే స్టేషన్, బొటానిక్ గార్డెన్లకు నెలవైన ఈ నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోట. తృణమూల్ ఇక్కడ పాగా వేసినప్పటికీ బీజేపీ కూడా భారీగా పుంజుకుంటోంది. తృణమూల్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ప్రముఖ ఫుట్బాలర్ ప్రసూన్ బెనర్జీ ఈసారి హ్యాట్రిక్పై గురిపెట్టారు. గత ఎన్నికల్లో కాషాయ పార్టీ గట్టి పోటీ ఇచి్చంది. బీజేపీ అభ్యర్థి రంతిదేవ్ సేన్గుప్తా కేవలం 6,447 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కిక్కిరిసిన జనాభా, ఐరన్ ఫౌండ్రీల్లో పనిచేసే కారి్మకులతో కళకళలాడే ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 93 శాతం పట్టణ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో పావు వంతు బెంగాలీయేతరులే! వీరంతా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. బీజేపీ నుంచి రతిన్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం సవ్యసాచి చటర్జీని రంగంలోకి దించింది. అత్యధికంగా 19 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉండటం విశేషం.ఆరాంబాగ్... హోరాహోరీ తృణమూల్ పాగా వేసిన మరో కమ్యూనిస్ట్ అడ్డా ఇది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో 2014లో తొలిసారి తృణమూల్ నుంచి అపురూపా పొద్దార్ (అఫ్రీన్ అలీ) 3.5 లక్షల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో మాత్రం సీపీఎం అభ్యర్థి శక్తి మోహన్ మాలిక్పై ఆమె కేవలం 1,142 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ రాయ్ గెలుపు వాకిట బోల్తా పడ్డా తృణమూల్తో పాటు సీపీఎం ఓట్లకు భారీగా గండికొట్టారు. అపురూపపై అవినీతి ఆరోపణలతో పాటు ముస్లింను పెళ్లి చేసుకుని ఆఫ్రిన్ అలీగా పేరు మార్చుకోవడంపై దుమారం చెలరేగడంతో తృణమూల్ ఈసారి మిథాలీ బాగ్ను రంగంలోకి దించింది. బీజేపీ కూడా కొత్త అభ్యర్థి అరూప్ కాంతి దిగర్ను పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ దన్నుతో సీపీఎం బిప్లవ్ కుమార్ మొయిత్రాకు సీటిచి్చంది. మూడు పారీ్టలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు బీజేపీ, మూడు తృణమూల్ గుప్పిట్లో ఉన్నాయి. హుగ్లీ... సినీ గ్లామర్! ఒకప్పుడు కమ్యూనిస్టు దుర్గం. తర్వాత తృణమూల్ చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడిక్కడ ఇద్దరు సినీ నటుల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. 2019లో ప్రముఖ బెంగాలీ సినీ నటి లాకెట్ ఛటర్జీ బీజేపీ నుంచి 73 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి తృణమూల్ కూడా సినీ నటి రచనా బెనర్జీని తొలిసారి లోక్సభ బరిలో దించింది. కాంగ్రెస్ సపోర్టుతో సీపీఎం నుంచి మనోదీప్ ఘోష్ రేసులో ఉన్నారు. యూరప్ వలసపాలనకు ఈ నియోజకవర్గం అద్దం పడుతుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలో పోర్చుగీసు, ఫ్రెంచ్, డాని‹Ù, డచ్ కాలనీలుండటం విశేషం. గతంలో టాటా మోటార్స్ నానో కార్ల ప్లాంట్ను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించి వెళ్లగొట్టిన సింగూర్ కూడా ఈ ఎంపీ స్థానం పరిధిలోనే ఉంది. ఈ వివాదం తర్వాతే కమ్యూనిస్టులను ఇక్కడ దీదీ మట్టికరిపించారు కూడా. బెంగాల్లో పారిశ్రామికంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన జిల్లా కావడంతో ఇక్కడ పట్టణ ఓటర్లు ఎక్కువ. దీని పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లూ తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. త్రిముఖ పోరులో ఈసారి బీజేపీకి ఎదురీత తప్పదంటున్నారు.ఉలుబేరియా... మైనారిటీల అడ్డా బ్రిటిష్ జమానా నుంచీ జనపనార పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం హౌరా జిల్లాలో ఉంది. అయితే, ఈ పరిశ్రమలు నెమ్మదిగా మూతబడుతూ వస్తున్నాయి. ఇప్పుడిక్కడ ఒక్క భారీ జూట్ మిల్లు కూడా లేదు. నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ఇంజనీరింగ్, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ హిందూ, ముస్లింలు సమానంగా ఉంటారు. 1980ల నుంచీ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు! సీపీఎం తరఫున హన్నన్ మోలాహ్ ఏకంగా వరుసగా ఎనిమిదిసార్లు నెగ్గారు. 2004 నుంచి ఈ స్థానం తృణమూల్ గుప్పిట్లో ఉంది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు సుల్తాన్ అహ్మద్ గెలుపొందారు. ఆయన మరణానంతరం భార్య సజ్దా అహ్మద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆమె బీజేపీ అభ్యర్థి జాయ్ బెనర్జీపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా సజ్దాయే తృణమూల్ తరఫున బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి అరుణ్ ఉదయ్ పాల్ చౌదరి పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టుల మద్దతుతో కాంగ్రెస్ అజర్ మాలిక్ను పోటీకి దించింది. హుగ్లీ జిల్లాలోని ప్రముఖ ముస్లిం మత గురువు అబ్బాస్ సిద్ధిఖీ తన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పార్టీ తరఫున స్వయంగా పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.బారక్పూర్... పోటాపోటీ ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట. 2014లో తృణమూల్ కాంగ్రెస్ దీన్ని బద్దలుకొట్టగా... కమలనాథులు గత ఎన్నికల్లో దీదీకి షాకిచ్చారు. రెండుసార్లు తృణమూల్ నుంచి గెలిచిన సీనియర్ నేత దినేశ్ త్రివేదిపై 2019లో బీజేపీ నేత అర్జున్ సింగ్ 14,857 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. గతంలో సింగ్ తృణమూల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. 2019 ముందు బీజేపీలోకి జంప్ చేసి అనూహ్యంగా విజయం సాధించిన అర్జున్ సింగ్ 2022లో తిరిగి తృణమూల్ గూటికి చేరారు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఇటీవలే మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకొని టికెట్ దక్కించుకున్నారు. అర్జున్ సింగ్ చేతిలో ఓటమి పాలైన దినేశ్ త్రివేది కూడా తృణమూల్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరడం విశేషం. అర్జున్ సింగ్పై ఏకంగా 93 కేసులుండటం గమనార్హం! తృణమూల్ నుంచి ఈసారి పార్థా భౌమిక్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం దేబదత్ ఘోష్ను బరిలో దింపింది. పోటీ ప్రధానంగా బీజేపీ, తృణమూల్ మధ్యే ఉంది. కమ్యూనిస్టులకు గట్టి ఓటు బ్యాంకున్న నేపథ్యంలో సీపీఎం ఓట్లు ఎవరి విజయావకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరం. ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే ఉన్న ఈ నియోజకవర్గం గతంలో పారిశ్రామికంగా బాగా పురోగతిలో ఉండేది. జూట్, జౌళి మిల్లులు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఎక్కువ. ఇప్పుడవన్నీ మూతబడటంతో ఉపాధి కోసం ప్రజలు వలస బాట పట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Fact Check: బూటకాల బాబుకు రామోజీ బాకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మైనారిటీలకు మేజర్ మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రామోజీ మరోసారి విషం చిమ్మారు. వైఎస్సార్సీపీకి ముస్లిం మైనారీటీలు అండగా ఉన్నారని గుర్తించిన దినకంత్రీ పత్రిక ఈనాడులో తప్పుడు కథనం వండివార్చారు. వాస్తవాలను వక్రీకరించి చంద్రబాబుకు బాకా ఊదారు. మైనారిటీలను మోసం చేసిన జగన్ అంటూ గగ్గోలు పెట్టారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు అందించిన సాయం, సీఎం వైఎస్ జగన్ సర్కార్ అందించిన ఆర్థిక లబ్ది అధికారిక లెక్కలను గమనిస్తే నిజానికి మైనారిటీలకు ధోకా ఇచ్చింది ఎవరో ఇట్టే అర్థమవుతోంది. బాబు చేసిన అరకొర సాయాన్ని భూతద్దంలో చూపే యత్నం చేస్తున్న రామోజీ పచ్చకళ్లకు సీఎం వైఎస్ జగన్ నవరత్నాలతో మైనారిటీలకు కల్పించిన ఆర్థిక భరోసా కన్పించలేదు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.13,239.49 కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, జగనన్న తోడు వంటి కార్యక్రమాల ద్వారా (నాన్ డీబీటీ) మరో రూ.11,064.88 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37 కోట్ల మేర మైనారిటీలకు లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతోంది. మైనారిటీలకు ధోకా ఇచ్చింది బాబే.. ముస్లిం మైనారిటీ ర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదు. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్ హౌస్ల నిర్మాణం హామీ కార్యరూపం దాల్చలేదు. ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లూ కేటాయిస్తానన్న హామీనీ బాబు అటకెక్కించారు. వక్ఫ్ ఆస్తుల రికార్డులను పక్కాగా తయారు చేసి వాటిని పరిరక్షిస్తామని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం రూ.లక్ష వడ్డీలేని రుణాలు ఇస్తామని అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని ఇచ్చిన ప్రధాన హామీనీ అమలు చేయలేదు. అయినా అప్పుడు బాబు ఘనకార్యాలు రామోజీ పచ్చకళ్లకు కనిపించలేదు. ఆరోపణ: ఇదీ వైకాపా ఘనకార్యం వాస్తవం: స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు కేటాయించి అమలు చేయలేదని ఈనాడు అడ్డగోలుగా రాసింది. వాస్తవానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి చూపించేలా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు అందించింది. ఆసరా పథకం ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించి వారికి అండగా నిలిచింది. ఆరోపణ: రాయితీ రుణాలకూ పాతర వాస్తవం: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 36.18 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో అత్యధిక శాతం మంది చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారు ఉండటంతో వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా అరకొర సాయం చేసి చేతులు దులుపుకోకుండా వారికి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా, ఆర్థిక, సామాజిక, రాజకీయ చేయూతను అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. నవరత్నాలతోపాటు అనేక కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఊతమిచ్చేలా చేయడంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర వంటి అనేక పథకాలతో మైనారిటీలకు పెద్ద మేలు చేశారు. ఆరోపణ: ఇమామ్లు.. మౌజమ్లకు వెన్నుపోటే వాస్తవం: రాష్ట్రంలో మసీదుల్లో పనిచేసే ఇమామ్లు, మౌజమ్లకు ఆర్థిక సాయం అందించే విషయంలో ఈనాడు చంద్రబాబు గొప్పులు ఘనంగా చెప్పే యత్నం చేసింది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అరకొరగా ఆర్థిక సాయం అందిస్తే దాన్ని పెంచి మరీ అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కుతోంది. గత ప్రభుత్వం మౌజమ్లకు రూ.3 వేలు, ఇమామ్లకు రూ.5 వేలు మాత్రమే అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మౌజమ్లకు రూ.5 వేలు, ఇమామ్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం పెంచి జగన్ అందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు అందించింది. దీనికితోడు వారికి భరోసా ఇచ్చేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వన్టైమ్ ఫైనాన్సియల్ అసిస్టెన్సీ ఇచ్చింది. తెల్లకార్డుదారులకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్సీగా మైనార్టీలకు సుమారు రూ.100 కోట్లు అందించింది. షాదీతోఫా ద్వారానూ ఆర్థిక సాయాన్ని పెంచి అందించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కింది. ఆరోపణ: తేదేపా హయాంలో రూ.248 కోట్ల రుణాలు వాస్తవం: టీడీపీ ప్రభుత్వంలో గొప్పగా రుణాలు ఇచ్చినట్టు రామోజీరావు బాకాలు ఊదారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీల సామాజిక ఆర్థిక అభివృద్ధి, శిక్షణ, విద్యాభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చినట్టు గొప్పలు పోయారు. వాస్తవానికి 2014 నుంచి 2019 వరకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలకు టీడీపీ ప్రభుత్వం రూ.343.52 కోట్లు కేటాయించి రూ.248.51 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం శోచనీయం. ఐదేళ్లలో కేటాయించిన నిధులూ లబ్దిదారులకు ఖర్చు చేయలేని దారుణమైన పరిస్థితి గత ప్రభుత్వానిది. మరోవైపు మైనారిటీల శిక్షణ–ఉపాధి పథకంలో 2014 నుంచి 2019 వరకు కేవలం రూ.62 కేటాయించి అందులోనూ రూ.53.89 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. అదీ తొలి ఏడాది కేవలం రూ.4.30 కోట్లు కేటాయించి, ఎన్నికల ముందు మాత్రం గొప్పలు చెప్పుకొనేందుకు రూ.16.80 కోట్లు కేటాయించారు. బాబుకు రామోజీ చేస్తున్న భజనను జనం నమ్మరు చంద్రబాబు రాజకీయ ప్రయోజనం కోసం రామోజీ ఎంత బాజా వాయించినా జనం నమ్మే స్థితిలో లేరు. నవరత్నాల ద్వారా ఆర్థిక లబ్ధిని చేకూర్చే అనేక పథకాలను అందించడంతోపాటు మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి కోసం సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముస్లింలను సీఎం వైఎస్ జగన్ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ముస్లిం యువత వేలాది మంది బాగా చదువుకుని నేడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా పలు రంగాలలో స్థిరపడి సామాజికంగా అభివృద్ధి చెందారు. అందుకే ఆ మహానేత వైఎస్సార్ని ముస్లిం సమాజం గుండెల్లో పెట్టుకుంది. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి కంటే పది అడుగులు ముందుకు వేసి ముస్లింలకు మేలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ముస్లింలకు ఐదు సీట్లు ఇచ్చారు. నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, శాసన మండలి డెప్యూటీ చైర్మన్గా అవకాశం కల్పించడమే కాకుండా నామినేటెడ్, స్థానిక సంస్థల పదవుల్లోనూ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి మరింత ఆదరణ చూపిన సీఎం వైఎస్ జగన్కు ముస్లిం సమాజం అండగా ఉంటుంది. – డాక్టర్ మీర్చా షంషీర్ ఆలీబేగ్, చైర్మన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ -
బాబు పొత్తులను చిత్తుచేయండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అవకాశవాద పొత్తులపై రాష్ట్రంలోని క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు కత్తులు నూరుతున్నారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీలతో కలిసి పోటిచేసి అధికారం చేపట్టిన ఆయన అప్పట్లో ఇచ్చిన ఏ హామీని అమలుచేయలేదని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే, ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించిన చంద్రబాబు వాటినీ అటకెక్కించేరన్నారు. ఉదా.. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్హౌస్లు నిర్మిస్తానని, ముస్లిం జనాభా ప్రాతిపదికన వారికి బడ్జెట్లోను, స్థానిక సంస్థల ఎన్నికల్లోను సీట్లు కేటాయిస్తానని, మైనారిటీలకు చెందిన వక్ఫ్ ఆస్తులు, చర్చిల ఆస్తుల రికార్డులను పక్కాగా తయారుచేసి వాటిని పరిరక్షిస్తామంటూ ఆయన ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలుకు నోచుకోలేదని మైనారిటీలు గుర్తుచేస్తున్నారు.నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం వడ్డీలేని రుణాలు ఇస్తామని, వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేస్తామని చెప్పిన మాట కూడా అమలుకు నోచుకోలేదంటున్నారు. ఇక క్రిస్టియన్ మైనార్టీలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు పరిశీలిస్తే.. కబ్జాదారుల నుంచి పేద క్రిస్టియన్లు, బలహీనవర్గాల భూములు కాపాడతామని, క్రైస్తవ సంస్థల ఆస్తులను పరిరక్షిస్తామని, దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేరుస్తామని, క్రిస్టియన్ శ్మాశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తామన్న హామీలను అధికారం చేపట్టిన అనంతరం పట్టించుకున్న పాపాన పోలేదు. 2014లో ఇచ్చిన హామీలు అమలుచేయని ఇదే చంద్రబాబు.. మళ్లీ అదే బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తుతో మరోసారి దగా చేసేందుకు వస్తున్నాడని, పొత్తులతో కట్టకట్టుకుని వస్తున్న ఆయనకు బుద్ధిచెప్పాలని క్రిస్టియన్, ముస్లిం నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. బీజేపీతో కలిసి బాబు పెద్ద తప్పుచేశారు మతతత్వ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకుని చంద్రాబాబు పెద్ద తప్పుచేశారు. 2024 ఎన్నికల్లో గెలుపుకోసం చంద్రబాబు అనేక విష ప్రయోగాలు చేస్తున్నారు. 2014లో ఆయన బీజేపీతో పెట్టుకుని 2019లో ఆ పార్టీని వీడి ప్రధాని మోదీని టెర్రరిస్టుతో పోల్చి మళ్లీ ఇప్పుడు ఆయన కాళ్లబేరానికి వచ్చాడు. బీజేపీ, జనసేనలతో కలిసి వస్తున్న చంద్రబాబును రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చిత్తుచిత్తుగా ఓడిస్తారు. సంక్షేమం, అభివృద్ధి ద్వారా తనదైన ముద్ర వేసుకున్న సీఎం వైఎస్ జగన్ను 2024 ఎన్నికల్లో ప్రజలు మళ్లీ సీఎంను చేస్తారు. – పెరికె వరప్రసాదరావు, నేషనల్ దళిత క్రిస్టియన్ రైట్స్ చైర్మన్ ముస్లింలను అణగదొక్కిన బాబుకు బుద్ధిచెబుతాం చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ముస్లింలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత అణగదొక్కారు. మైనారిటీ శాఖను మైనారిటీలకు కాకుండా చేశారు. ఐదేళ్లపాటు ముస్లింలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వని బాబు ఎన్నికల ముందు కంటితుడుపు చర్యగా ఇచ్చామనిపించారు. బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న బాబు అదే పోకడలతో ముస్లింలలో నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేశారు. ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ను మళ్లీ గెలిపించుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో బాబుకు బుద్ధిచెప్పడం ఖాయం. – షేక్ మునీర్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కర్వీనర్ -
బీసీలు, మైనారిటీలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, తాడేపల్లి: టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేసే చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలతో పాటు మైనారిటీలకు వెన్నుపోటు పొడిశారు. తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యతనిస్తూ 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే కేటాయించారు. మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే ఇచ్చారు. బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు కేవలం 7 సీట్లే కేటాయించడం పట్ల చంద్రబాబు వ్యవహారశైలిపై ఇతర వర్గాలు మండిపడుతున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు. న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు, చంద్రబాబు తీరుపై టీడీపీ యువ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, యువ రక్తంతో పార్టీని నింపేస్తామంటూ చంద్రబాబు, లోకేష్ ప్రకటనలు గుప్పించారు. యువతకు 40 శాతం సీట్లు ఎక్కడంటూ ఆ పార్టీ యువ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
ఆ 23 మంది బలైనారా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నమ్మించి మోసగించడమే జన్మ లక్షణమైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా వెంటాడే సంఖ్య 23. నమ్మకద్రోహానికి ప్రజలు విధించిన శిక్ష ఈ 23. ఈ సంఖ్య వెనుక కథ చాలా పెద్దదే కాదు.. అత్యంత హేయమైంది కూడా. 2014లో... అన్నీ తానై.. తనవారిని గెలిపించుకున్న ఎంఎల్ఏల్లో 23 మంది, ఎంపీల్లో ముగ్గురు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మకద్రోహం చేశారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు విసిరిన నోట్ల కట్టలకు లొంగిపోయారు. పదవులకు ఆశపడ్డారు. భవిష్యత్తును ఊహించుకుని పార్టీ ఫిరాయించారు. ఆ తరువాత 2019 నాటికి చంద్రబాబు కాటుకు వారంతా రాజకీయంగా బలయ్యారు. చంద్రబాబుకూ ఆ ఎన్నికల్లో 23 సంఖ్య శాపమై నిలిచి,, చరిత్రగా మారింది. ఆనాడు రాజకీయ వెన్నుపోటుకు పాల్పడిన వారు నేడేం చేస్తున్నారు? పశ్చాత్తాపం పడిన వారెందరు? రాజకీయంగా కనుమరుగైన వారెవరు? కుంగిపోయి కునారిల్లుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?.. వివరించే కథనమే ఇది. 23 మందిలో అద్దంకి నుంచి పోటీచేసిన గొట్టిపాటి రవికుమార్ మినహా తక్కిన 22 మంది మాజీలయ్యారు. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన ఉప్పులేటి కల్పన (పామర్రు), పాలపర్తి డేవిడ్రాజు (యర్రగొండపాలెం), టి. జయరాములు (బద్వేలు), మణిగాంధీ (కోడుమూరు), మైనార్టీ వర్గానికి చెందిన అత్తార్ ఛాంద్బాషా (కదిరి), ఎస్వీ మోహన్రెడ్డి (కర్నూలు) వరుపుల సుబ్బారావు (ప్రత్తిపాడు)కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదు. రాయలసీమలో గుర్తింపు కలిగిన భూమా నాగిరెడ్డి కుటుంబం పరిస్థితి రాజకీయంగా దుర్భరంగా మారింది. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ టికెట్ కోసం తంటాలు పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భూమా బ్రహ్మానంద రెడ్డిని కొన్ని నెలల కిందటి వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఇప్పుడు ఎం.డి.ఫరూక్కు బాధ్యతలు అప్పగించారు. వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సి.ఆదినారాయణరెడ్డి కుటుంబీకులదీ అదే దుస్థితి. గత ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి పోటీచేసి వైఎస్ అవినాష్రెడ్డి చేతిలో ఓటమిపాలైన నాలుగు రోజుల్లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోక తప్పలేదు. ముగ్గురు ఎంపీల దుస్థితి అంతా ఇంతా కాదు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఎంపీలలో ముగ్గురు ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరినా టికెట్ నిరాకరించడంతో జనసేన నుంచి నామినేషన్ వేశారు. ఆ తరువాత అనారోగ్యంతో మృతి చెందారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత పరిస్థితీ అంతే. ఆమెకు టికెటు దక్కకపోవడంతో పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ అరకు లోక్సభ పరిధిలో పర్యటిస్తున్నారు. కర్నూలులో బుట్టా రేణుక పార్టీ మారినా ఆమెకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. కందుకూరు: పోతుల రామారావు తన సామాజిక వర్గానికి చెందిన పోతుల రామారావు టీడీపీలోకి ఫిరాయించినందుకు పొగాకు, గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించి చంద్రబాబు భారీగానే లబ్ధి చేకూర్చారన్నది బహిరంగ రహస్యం. 2019లో టికెట్ ఇచ్చినా వైఎస్సార్సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్రెడ్డి చేతిలో 14 వేల పైచిలుకు ఓట్లతో పోతుల ఓడిపోయారు. ఆ తరువాత ఆయన క్రమంగా నియోజకవర్గానికి దూరమయ్యారు. పార్టీ అధిష్టానం సైతం రామారావును పూర్తిగా పక్కన పెట్టేసింది. యర్రగొండపాలెం (ఎస్సీ): పాలపర్తి డేవిడ్రాజు టీడీపీలోకి ఫిరాయించేందుకు పెద్దమొత్తంలో ముట్టజెపుతానని, వెలిగొండ ప్రాజెక్టులో ప్యాకేజీలిచ్చి భారీగా లబ్ధి చేకూర్చుతానని నమ్మబలికిన బాబు మాట తప్పారని డేవిడ్రాజు వాపోని రోజంటూ లేదని ఆయన సన్నిహితులు గుర్తుచేస్తుంటారు. 2019 ఎన్నికల్లో సీటు తిరస్కరించడంతో తాను వైఎస్సార్సీపీలో చేరినట్లు అప్పట్లోనే డేవిడ్రాజు ప్రకటించుకున్నారు. బాబు మాటలను నమ్మి మోసపోయిన ఆయన తాజాగా కాంగ్రెస్ వైపు దృష్టి సారించారనేది సమాచారం. గిద్దలూరు: ముత్తుముల అశోక్రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో దాదాపు 79 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్నప్పటికీ జనసేనకు టికెట్ కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. జనసేన నుంచి తానే పోటీ చేయనున్నట్లు ఆమంచి స్వాములు ప్రకటించుకోవడంతో ముత్తుముల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పాడేరు (ఎస్టీ): గిడ్డి ఈశ్వరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చేతిలో దాదాపు 43 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పాడేరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో అనేక వర్గాలు పనిచేస్తున్నాయి. గిడ్డి ఈశ్వరికి సీటు దక్కుతుందా లేదా అన్నది అనుమానమే. పాతపట్నం– కలమట వెంకటరమణ టీడీపీలోకి ఫిరాయించిన కలమట 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో టికెట్ అనుమానాస్పదమే. మామిడి గోవిందరావు టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. అరకు (ఎస్టీ): శ్రావణ్కుమార్ 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరిన రెండేళ్ల తర్వాత మావోయిస్టుల చేతిలో హతమయ్యారు. అనంతరం ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్కు ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నుంచి పోటీచేసిన శ్రావణ్కుమార్ మూడో స్థానంలో నిలిచారు. రెండేళ్ల కిందట కిడారిని నియోజకవర్గ ఇన్చార్జిగా తొలగించి అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన సివేరి దొన్ను దొరను అరకు అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారు. ఈయనే అసెంబ్లీ బరిలో ఉండవచ్చంటున్నారు. రంపచోడవరం (ఎస్టీ): వంతల రాజేశ్వరి టీడీపీలో చేరిన వంతల రాజేశ్వరి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి చేతిలో 39 వేలకు పైగా ఓట్లతో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రాజేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తూ గొర్లె సునీత , కారం పోచమ్మ , మిరియాల శిరీష తదితరులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సైతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గూడూరు (ఎస్సీ): పాశం సునీల్ కుమార్ టీడీపీ కండువా కప్పుకున్న పాశం సునీల్ కుమార్ 2019లో పోటీచేసి వి.వరప్రసాద్ చేతిలో 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గూడూరు నియోజకవర్గ ఇన్చార్్జగా కొనసాగుతున్న సునీల్కు 2024 ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేదు. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పోటీపడుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తోంది. జగ్గంపేట– జ్యోతుల నెహ్రూ సీనియర్ నాయకుడైన జ్యోతుల నెహ్రూ 2019లో టీడీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ జ్యోతుల చంటిబాబు చేతిలో 23 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా నెహ్రూ కొనసాగుతున్నప్పటికీ జగ్గంపేట నుంచి పోటీకి జనసేన పట్టుపడుతోంది. ఆ పార్టీ ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్రరావు సీటు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్తిపాడు– వరుపుల సుబ్బారావు టీడీపీ కండువా కప్పుకున్న వరుపులకు చంద్రబాబు గత ఎన్నికల్లో టికెట్ కాదుకదా కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా బాధ్యతలు ఇవ్వలేదు. సుబ్బారావును కాదని వరుపుల రాజా(గతేడాది చనిపోయారు)కు ఇచ్చారు. తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చిన వరుపుల సుబ్బారావు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. పలమనేరు– ఎన్.అమర్నాథ్రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథ్ రెడ్డి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని పొందారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకటేగౌడ చేతిలో 33 వేల ఓట్లతో చిత్తుగా ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. బొబ్బిలి– ఆర్వీఎస్కే రంగారావు (సుజయ్కృష్ణ రంగారావు) టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన సుజయ్ కృష్ణ రంగారావు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో 8,352 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. రానున్న ఎన్నికల్లో ఆయన సోదరుడు బేబినాయనకు టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. పామర్రు (ఎస్సీ): ఉప్పులేటి కల్పన పామర్రు నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు. 2019లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. విజయవాడ వెస్ట్– జలీల్ఖాన్ టీడీపీలో చేరిన జలీల్ఖాన్ కుమార్తెకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలై రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తరువాత పరిణామాలలో జలీల్ఖాన్ నియోజకవర్గ ఇన్చార్జిగా కోరినా ఫలితం లేకుండా పోయింది. జమ్మలమడుగు: సి.ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన సి.ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి 3.80 లక్షల ఓట్లు తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికీ అదే పార్టీలో రాష్ట్ర ఉపా«ధ్యక్షుడి హోదాలో ఉన్నారు. బద్వేలు (ఎస్సీ) టి.జయరాములు బద్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ ఫిరాయించిన తిరువీధి జయరాములుకు 2019లో టీడీపీ టికెట్ నిరాకరించింది. ఓబులాపురం రాజశేఖర్ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ ఎన్నికల తర్వాత జయరాములు రాజకీయంగా కనుమరుగయ్యారు. కదిరి– అత్తర్ చాంద్ బాషా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా 2014లో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టికెట్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నారు. శ్రీశైలం– బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నా ఈ ఎన్నికల్లో టికెట్ దక్కడం అనుమానమే. ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీపడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆళ్లగడ్డ– భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలుపొందిన భూమా అఖిల ప్రియ టీడీపీలోచేరి మంత్రి పదవి పొందారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం భూమాకు పోటీ ఎదురవుతోంది. ఆళ్లగడ్డ కోసం జనసేన కూడా డిమాండ్ చేస్తోంది. నంద్యాల– భూమా బ్రహ్మానందరెడ్డి భూమా నాగిరెడ్డి చనిపోవడంతో 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. కొన్ని నెలల కిందటి వరకు అతన్నే ఇన్చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఆయన్ను తప్పించి మాజీ మంత్రి ఎండీ ఫరూక్ను ఇన్చార్జిగా నియమించారు. కర్నూలు– ఎస్వీ మోహన్రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి టీడీపీలో చేరినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. కోడుమూరు– మణిగాంధీ మణిగాంధీ టీడీపీలో చేరినా టికెట్ ఇవ్వలేదు సరికదా కనీసం ఇన్చార్జి పదవి కూడా కట్టబెట్టలేదు. తిరిగి వైసీపీలో కొనసాగుతున్నారు. -
తప్పుడు రాతలను నిరసిస్తూ గుంటూరు ఈనాడు ఆఫీసు ముందు ధర్నా
-
40 నియోజకవర్గాల్లో కీలకం.. ముస్లింలు ఎటువైపు?
అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు జై కొట్టెదేవరికి..? వరుసగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ వెంట నడిచినన ముస్లిం ఓటర్లు ఈసారి ఎటు వైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ముస్లిం ఓట్ల ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో కూడా ముస్లిం ఓట్లు కీలకం. మెజారిటీ స్థానాల్లో గెలుపోటములపై ప్రభావితం కనబర్చే మైనారిటీ ఓటర్లపై ప్రధాన రాజకీయపక్షాలు దృష్టి సారించాయి. అధికార బీఆర్ఎస్ ‘అభివృద్ధి, సంక్షేమ’ మంత్రంతో మరోసారి అధికార పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా, బీఆర్ఎస్ పాలనపై ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఈసారి అధికారం హస్తగతం ఖాయమన్న ధీమా కాంగ్రెస్లో వ్యక్తమవుతోంది. భారతీయ జనతాపార్టీ మాత్రం మైనారిటీ ఓట్లపై పెద్దగా ఆశలేనప్పటికీ కేంద్రంలోని సుస్థిర ప్రభుత్వం చూపి కొన్ని ఓట్లయినా రాబట్టుకోవాలని యత్నిస్తోంది. ఇలా ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో కీలకం హైదరాబాద్ పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాలతోపాటు మరో 33 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. హైదరాబాద్లో అత్యధికంగా సుమారు 43 శాతం వరకు,æ ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్లో 34 నుంచి 38 శాతం, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్లో 20 నుంచి 28 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం10 నుంచి 18 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉంటారు. బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం అధికార బీఆర్ఎస్ ముస్లిం ఓట్లపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. గత రెండు పర్యాయాలు కలిసివచ్చినట్టుగానే ఈసారి కూడా ముస్లిం ఓటర్లు తమవెంటే నని భావిస్తోంది. తొమిదిన్నర ఏళ్లలో మైనారిటీ అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 9,166 కోట్ల ఖర్చుచేసినట్లు పేర్కొంటోంది. 204 మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసి అందులో 1.31 లక్షల విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పన చేపట్టడం తమకు కలిసి వచ్చే అంశంగా అంచనా వేస్తోంది. షాదీ ముబారక్ పథకం కింద 2.68 లక్షల మందికి ఆర్థిక చేయూత, విదేశీ విద్య తదితర పథకాలు కలిసి వస్తాయని భావిస్తోంది. వాస్తవానికి దశాబ్ద కాలంగా ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వెంట నడుస్తున్నారనే చెప్పాలి. 2014లో తెలంగాణ సెంటిమెంట్, 12శాతం రిజర్వేష¯న్ హామీలతో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ముస్లిం వర్గాలు 2018లో మైనారిటీ గురుకులాలు, షాదీ ముబారక్, శాంతి భద్రత తదితర అంశాల ప్రభావంతో బీఆర్ఎస్ వెంటే నడిచాయి. ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అత్యధికం బీఆర్ఎస్ గెలుచుకోవడమే ఇందుకు బలం చేకూర్చుతోంది. సబ్ప్లాన్ డిక్లరేషన్తో సహా కాంగ్రెస్ హామీల వెల్లువ ఈసారి ఎలాగైనా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ మైనారిటీ ఓటు బ్యాంక్పై ఆశలు పెంచుకుంది. ముస్లిం ఓటర్లు కలిసివస్తే అధికారం హస్తగతం కావడం సులువవుతుందన్న ఆకాంక్షతో వారి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్స్ డిక్లరేషన్ ప్రకటించింది. మైనారిటీ సంక్షేమ బడ్జెట్ను రూ.4,000 కోట్లకు పెంచుతామని హామీ ఇస్తోంది. నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందిస్తామని, కులగణనతో న్యాయమైన రిజర్వేషన్లు కల్పిస్తామని, విద్యావంతులకు ఆర్థిక చేయూతను అందిస్తామని, మైనారిటీ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తామని వాగ్దానాలు గుప్పిస్తోంది. ఈ హామీలతో మైనారిటీ ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారని కాంగ్రెస్ భావిస్తోంది. మజ్లిస్ మామ పల్లవి మజ్లిస్ పార్టీ తన మిత్రపక్షమైన అధికార బీఆర్ఎస్కు ముస్లిం ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ప్రాంతాల్లో హలత్–ఏ–హజిరా పేరిట బహిరంగ సభలతో నిర్వహిస్తోంది. కాంగ్రెస్వైపు ముస్లిం ఓటర్లు మొగ్గుచూపకుండా కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీతో సమానంగా కాంగ్రెస్ను పోల్చుతూ విమర్శనా్రస్తాలు సంధిస్తోంది.. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని...సీఎం కేసీఆర్ను మామగా సంబోధిస్తూ కొత్త పల్లవి అందుకుంది. స్వయంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సభల్లో విరివిగా పాల్గొని ప్రసంగిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒవైసీ ప్రసంగాలు కొంత వరకు మైనారిటీ ఓటర్లపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. -మహమ్మద్ హమీద్ ఖాన్ -
మనది మనసున్న ప్రభుత్వం. మైనారిటీల సంక్షేమ దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మైనారిటీల గురించి సీఎం జగన్..!
-
మూడో వంతు స్థానాల్లో..ముస్లింలే కీలకం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను మూడింట ఒక వంతు స్థానాల్లో ముస్లింల ఓట్లే కీలకం కానున్నాయి. ఈ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే.. వారి గెలుపు కాస్త సులభతరం అయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 14% వరకు ముస్లింల జనాభా ఉండగా 40 వరకు నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే వీరి మద్దతు పొందిన పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయం స్పష్టమవుతోంది. ఈ కారణంగానే పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారిని తమ వైపు ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈసారి ముస్లింలు ఎవరికి మద్దతు పలికే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మెజారిటీ వర్గం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్)కే మద్దతు ఇస్తూ వచ్చింది. అంతకుముందు వీరు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న సంగతి తెలిసిందే. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో డాక్టర్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడమేకాక.. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 2014 ఎన్నికల నుంచి బీఆర్ఎస్కు ముస్లింలు మద్దతుగా నిలిచారు. ఎంఐఎం) పూర్తిస్థాయి సహకారం ఈ పార్టీకి లభిస్తూ వస్తోంది. ఈసారి కూడా ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో మినహా మిగతా చోట్ల పార్టీ కార్యకర్తలతో పాటు యావత్ ముస్లింలు బీఆర్ఎస్కు మద్దతివ్వాలంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రకటనలో బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. కానీ ఈసారి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని, ఆ పార్టీ వర్గాల్లోనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంపగుత్తగా ఓట్లు పడే అవకాశం లేదంటూ.. కర్ణాటక ఎన్నికల్లో అక్కడి ముస్లింలు జేడీఎస్ను కాంగ్రెస్కు బాసటగా నిలవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆ విధమైన వాతావరణం ఏర్పడే చాన్స్ను తోసిపుచ్చలేమని అంటున్నారు. రాజధాని నియోజకవర్గాలతో పాటు..: హైదరాబాద్ నగర పరిధిలోని యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, మలక్పేట, బహదూర్పురా, నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్, సనత్నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, అంబర్పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నారు. అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ముధోల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, నారాయణపేట, ఉమ్మడి రంగారెడ్డిలోని తాండూరు, మల్కాజిగిరి, మహేశ్వరం, వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా వీరి మద్దతుతో ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీయేతర నియోజకవర్గాల్లో పాగా వేయాలని అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఆ మూడూ ఒక్కటే అంటూ కాంగ్రెస్...: కర్ణాటకలో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా మైనారిటీలను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంగా వ్యవహరిస్తోందని, బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనంటూ గుర్తు చేస్తోంది. ముందు నుంచి మైనారిటీలపై కాంగ్రెస్ది సానుకూల దృక్పథమేనని చెబుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేనని, అంతర్గత అవగాహనతో పనిచేస్తున్నాయనే ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఇతర రాష్ట్రాలలోని సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తూ బీజేపీకి సహకరిస్తోందని ఆరోపిస్తోంది. మైనారిటీల సంక్షేమానికి భవిష్యత్తులో కూడా కట్టుబడి ఉంటామని గట్టిగా హామీ ఇస్తోంది. సంక్షేమ పథకాలే ఆలంబనగా బీఆర్ఎస్..: మైనారిటీలను ఆకట్టుకోవడానికి బీఆర్ఎస్ గడచిన తొమ్మిదిన్నరేళ్లుగా ఆ వర్గానికి అందించిన సంక్షేమ పథకాలపైనే భరోసా పెట్టుకుంది. ఈసారి కూడా ముస్లింలు తమకే మద్దతు పలుకుతారనే ధీమాతో ఉంది. అదే సమయంలో వారు తమ చేజారే అవకాశం లేకుండా.. తాము బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసే అవకాశం లేదంటూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పరస్పరం సహకరించుకుంటున్నారంటూ ప్రతి విమర్శలు చేస్తోంది. మరోవైపు మైనారిటీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడమేకాకుండా..మంత్రివర్గంలో కీలకమైన పదవిని ఆ వర్గానికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మత సామరస్యం కొనసాగుతుండటాన్ని, కర్ఫ్యూల్లాంటివి లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుండటాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇటీవలి బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్..వినాయక నిమజ్జన సమయంలో ముస్లింలు పెద్ద మనస్సు చేసుకుని మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకున్నారంటూ పదే పదే గుర్తు చేయడం ద్వారా ఆ వర్గానికి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం కూడా గమనార్హం. -
మైనార్టీలు భయంతో బతుకుతున్నారు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): దేశంలో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు భయంతో బతుకుతున్నారని, ఈ వర్గాలవారు దేశ పౌరులే అయినప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించారు. శనివారం సికింద్రాబాద్లోని హరిహరకళా భవన్లో క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ క్రైస్తవ హక్కుల సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. దేశంలో మత స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు. 2017–21 సంవత్సరాల మధ్య మైనార్టీలపై 2,900 దాడులు జరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డులో నమోదైందని తెలిపారు. విదేశాల నుంచి పేదలు, షెడ్యుల్డు తెగల విద్య, ఆరోగ్యం కోసం క్రైస్తవ మైనార్టీ సంస్థలకు నిధులు అందుతుంటే 6,622 సంస్థలకు మోదీ ప్రభుత్వం లైసెన్సులు రద్దు చేసిందన్నారు. 3.30 కోట్ల క్రైస్తవ జనాభా ఉంటే క్రైస్తవ మంత్రి ఒక్కరే ఉన్నారని అన్నారు. దేశంలో 42 శాతం మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని, సోనియా గాంధీ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గత 20 నెలల్లో 6.8 శాతం ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ పర్యటన సందర్భంగా కేసీఆర్ను తిడుతున్నారని కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, ప్రభుత్వంలో బీజేపీ కీలకంగా ఉంటుందని అన్నారని.. అంటే బీఆర్ఎస్తో కలసి పాలిస్తారనేది అర్థం అవుతోందన్నారు. కర్ణాటక ఎన్నికలు మోదీ పీఠాన్ని కదిలించాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కేంద్రంలో బీజేపీ గద్దె దిగక తప్పదని పేర్కొన్నారు. మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ మరో మణిపూర్లా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను దూషించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు. -
భారత్లో మైనార్టీలు భద్రంగా లేరా?
భారతదేశంలో మైనార్టీల హక్కులకు భంగం కలుగుతోందని అమెరికా ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్’ (యూఎస్సీ ఐఆర్ఎఫ్) భారత దేశ సార్వభౌమాధికా రానికి వ్యతిరేకంగా రిపోర్టులను తయారు చేసిన విషయం ఈ దేశ ప్రజలలో చాలా మందికి తెలియదు. అమెరికా మత, రాజ కీయ ప్రయోజనాలను కాపాడడం కోసం 1998లో అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఒక సలహా సంస్థే ఈ యూఎస్సీఐఆర్ఎఫ్. అమెరికా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, ఆగమేఘాలపై రిపోర్టులను తయారు చేసి, ఐక్యరాజ్యసమితి ముందు ప్రవేశపెట్టి, ప్రపంచంలోని సార్వభౌమాధికార దేశాలను ఇబ్బంది పెట్టడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఈ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, భారత దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తదితర మైనార్టీ మతాలవారు అనేక ఇబ్బందు లను ఎదుర్కొంటున్నారనీ, వారి కనీస హక్కులకు భంగం కలిగించేలా భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అమెరికా ఆయిల్, ఫార్మా, డిఫెన్స్ లాబీయింగ్ యధేచ్ఛగా నిర్వహించి, తన దేశ ప్రయో జనాలను నెరవేర్చుకునేది. మోదీ ప్రభుత్వంలో ఇవి సాగడం లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని భారతదేశం తనకు అనుకూలంగా మలుచుకుని, తక్కువ ధరలకు రష్యా నుండి ఆయిల్ను సమ కూర్చుకోవడం, తక్కువ ధరలకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను తూర్పు ఆసియా దేశాలకు అమ్మడం, కరోనా టీకాను ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు ప్రవేశపెట్టడం ఇత్యాది విషయాలన్నీ అమెరికాకు కోపం తెప్పించేవే. నిజంగా భారతదేశంలో మైనార్టీలు భద్రంగా లేరా అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మొదట ముస్లింల సంగతి చూద్దాం. ప్రపంచంలో ఏ దేశంలో లేని భద్రత భారతదేశంలోని ముస్లింలకు ఉంది. వారి ఓటు బ్యాంకు కోసం అన్ని రాజకీయ పార్టీలూ సాగిలపడడం మనం చూస్తూనే ఉన్నాం! ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ముస్లింలకు భద్రత కరువైందని చెప్పడం ఒక దుష్ప్రచారం. వక్రబుద్ధితో కూడిన విష ప్రచారం. ఈ దేశంలో భద్రత లేకపోతే బర్మా, బంగ్లాదేశ్ల నుండి లక్షల సంఖ్యలో ముస్లింల అక్రమ వలసలు ఎందుకు జరుగుతున్నట్టు? 1947లో మతం ప్రాతి పదికగా ముస్లింలకు పాకిస్తాన్ ఏర్పాట య్యింది అనేది వాస్తవం కాదా? అటువంటి పాకిస్తాన్లో మైనారిటీలైన హిందు వుల పరిస్థితి ఎలా ఉందో ప్రపంచానికి తెలియని విషయమేమీ కాదు. ఇక క్రైస్తవుల విషయానికొస్తే – ఈశాన్య రాష్ట్రా లైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు క్రైస్తవ మెజార్టీ రాష్ట్రాలుగా ఎలా రూపుదిద్దుకున్నాయి? ఇక మోదీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాల అమలు చేయడంలో మతపరమైన వివక్షతలను ఎక్కడా చూపడం లేదనే విషయం స్పష్టం. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమి వేయడం, అనేక మందిని హత్య చేయడం వంటి విషయాలను ఏనాడు ప్రశ్నించని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ నిప్పు లేకుండానే పొగ ఎందుకు పెట్టింది అనే మర్మాన్ని ఈ దేశ ప్రజలు త్వరలోనే గ్రహిస్తారు. ఉల్లి బాల రంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
అల్ప సంఖ్యాకులకు అగ్రపీఠం
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీలకు అండగా నిలుస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 50,07,259 మంది మైనార్టీలకు రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో డీబీటీ ద్వారా రూ. 12,366.91 కోట్లు, నాన్డీబీటీ ద్వారా రూ. 10,801.02 కోట్లు అందించింది. స్వతంత్ర భారతదేశంలో మైనార్టీలను ఓటు బ్యాంకు కోసమే వినియోగించుకున్నారు. కానీ మైనార్టీ సంక్షేమం కోసం గతంలో వైఎస్సార్, ఇప్పుడు జగన్ మాత్రమే కృషి చేశారు. మైనార్టీ సంక్షేమమంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరే. సీఎం వైఎస్ జగన్ కూడా మైనార్టీల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీల కోసం రూ. 2,665 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ ప్రభుత్వం 50 నెలల్లో రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసి, గత ప్రభుత్వం కంటే 10 రెట్లు అధికంగా నిధులు వెచ్చించింది. – డిప్యూటీ సీఎం అంజద్ బాషా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయండి ప్రభుత్వం మైనార్టీల కోసం 38 పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఇమామ్లు, మౌజమ్లకు, పాస్టర్లకు ఎలాంటి గుర్తింపుగాని, గౌరవ వేతనంగాని ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ అందరితోపాటు మైనార్టీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా చేశారు. పీలేరు చుట్టుపక్కల మైనార్టీ బాలికలు చదువుకునేందుకు దూరంలో ఉన్న కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. దాంతో చాలామంది చదువును మధ్యలోనే మానేస్తున్నారు. పీలేరులో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ప్రారంభిస్తే వారికి మేలు జరుగుతుంది. – చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే విద్యా సంస్కరణల్లో మనమే మేటి ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి ప్రాధాన్య అంశాల్లో విద్య మొదటి స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నాం, విద్యార్థులకు టోఫెల్ బోధనకు కూడా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నాం. గతంలో అక్షరాస్యతపై అంటే కేరళ గుర్తుకువచ్చేది. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారంటే మనం ఎంత ప్రగతి సాధించామో తెలుస్తుంది. మూడో విడత నాడు–నేడులో రూ. 8 వేల కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ ఇవ్వనున్నాం. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్సీ అమలుతో ఆ బోర్డు మన రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యలో రూ. 15,600 కోట్ల నిధులను విద్యాదీవెన, వసతి దీవెన కింద ఖర్చు చేశాం. ఇంజినీరింగ్ చదువుతున్న 1.69 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నాం. వర్సిటీల్లో 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 3,268 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు విదేశీ వర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ కూడా అందించనున్నాం. దీనివల్ల మన విద్యార్థులకు అంతర్జాతీయంగా అవకాశాలు వేగంగా పొందుతారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించేందుకు కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. – మంత్రి బొత్స సత్యనారాయణ ఏజెన్సీ పాఠశాలలకు అధిక నిధులివ్వండి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ వంటివి మన విద్యారంగం గతిని మార్చాయి. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్ను బాగుచేస్తున్నారు. ఇందులో గిరిజన నియోజకవర్గాల్లో 1,400 స్కూళ్లు కూడా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1,000 సింగిల్ టీచర్ పాఠశాలలకు భవనాలు లేవు. నాడు–నేడు కింద భవనాలు నిర్మిస్తే గిరిజన పిల్లలకు మేలు జరుగుతుంది. అదనపు గ్రాంట్ మంజూరు చేసి భవనాలు నిరి్మంచాలి. గతంలో ఆశ్రమ స్కూల్స్లో హెల్త్ వలంటీర్లు ఉండేవారు. రాత్రివేళ ఆయా పిల్లలకు ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు హెల్త్ వలంటీర్లను నియమించాలి. – నాగులపల్లి ధనలక్ష్మి , రంపచోడవరం ఎమ్మెల్యే విద్యలో విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో ఇటు తల్లిదండ్రులకు, అటు విద్యార్థులకు మేలు జరిగేలా అనేక పథకాలను సీఎం ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు కూడా మంజూరు చేశారు. మా నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ కాలేజీలు వచ్చాయి. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో ఎంపీపీ స్కూల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నిడదవోలు టౌన్లో అంతర్భాగమైన లింగంపల్లి గ్రామం.. టౌన్కు దూరంగా ఉంది. ఇక్కడి స్కూల్ను మెర్జింగ్ చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూల్ను డీమెర్జింగ్ చేయాలి. – జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే మన విద్యార్థుల అంతర్జాతీయ ఖ్యాతి నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలతో విద్యారంగం మెరుగుపడింది. మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. ఫౌండేషన్ స్కూల్స్ను తీసుకువచ్చాం. అయితే ఉత్తమ ఫలితాలు రావాలంటే వాటిలో బోధకులకు శిక్షణ ఇవ్వాలి. సీఎం లక్ష్యం నెరవేరాలంటే శిక్షణ, బోధనపై పూర్తి అజమాయిషీ అవసరం. దీనికోసం సరైన కార్యాచరణ రూపొందించాలి. – డాక్టర్ ఎం.జగన్మోహన్రావు, నందిగామ ఎమ్మెల్యే పాఠశాలల్లో పిల్లలకు డైనింగ్ ఏర్పాటు చేయండి గత ప్రభుత్వం విద్యను వ్యాపారం చేయడంతో పేద కుటుంబాలు అక్షరానికి దూరమయ్యాయి. ఇప్పుడు సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాల ద్వారా 42 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టించారు. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్ను బాగుచేస్తున్నారు. సీబీఎస్సీ సిలబస్, బైలింగువల్ బుక్స్, పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసేందుకు పిల్లలకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలి. దీనికి స్కూల్లో ఓ గదిని కేటాయిస్తే మంచిది. విద్యారంగంలో మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. – కిలారి వెంకట రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే ఏపీలో బెస్ట్ విద్యా వ్యవస్థ ఉంది రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నాడు–నేడు విధానాలు పరిశీలించేందుకు తెలంగాణ అధికారులు ఇక్కడకు వస్తున్నారు. చాలా స్కూల్స్లో ప్లస్ 2 అందుబాటులోకి తెచ్చాం. అయితే, టీచర్లకు సరైన శిక్షణ లేదని తల్లిదండ్రుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. దీనిపై అధికారులు, మంత్రులు దృష్టిపెట్టి, ఇంటర్ బోధించేవారికి శిక్షణ ఇవ్వాలి. నైపుణ్యం ఉన్నవారికే ఆ స్కూల్స్లో బోధనా అవకాశం ఇవ్వాలి. దీంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. స్పోర్ట్స్ను కూడా ప్రోత్సహించాలి. అన్ని స్కూళ్లలోను పీఈటీలను నియమించాలి. – సామినేని ఉదయభాను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ పెంచండి స్వతంత్ర భారత చరిత్రలో విద్యలో ఇన్ని సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఆరు, ఏడు తరగతులకు రీడింగ్ స్కిల్స్ తక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప నైపుణ్యం పెంపుపై దృష్టి పెట్టలేదు. ఆరు నుంచి 8 తరగతులకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తే రెండేళ్లలో అద్భుతంగా రాణిస్తారు. దీంతోపాటు అన్ని స్కూళ్లకు వాచ్మెన్లను నియమించాలి. – కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే -
మైనారిటీ స్కాలర్షిప్ పేరిట రూ.144 కోట్ల కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీ స్కాలర్షిప్ కార్యక్రమంలో అవకతవకలపై విచారణ చేపట్టిన సీబీఐ ఈ మొత్తం విద్యా సంస్థల్లో 53 శాతం బోగస్ సంస్థలేనని తేల్చింది. మైనారిటీలకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో కింద యాక్టివ్గా ఉన్న విద్యా సంస్థలలో దాదాపు 53 శాతం నకిలీవేనని గుర్తించారు సీబీఐ అధికారులు. గత ఐదేళ్ళలో 18 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 830 సంస్థల్లో భారీగా అవినీతి జరిగినట్లు విచారణలో వెల్లడైందని ఈ కుంభకోణంలో దాదాపుగా రూ.144.83 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించింది సీబీఐ. అనుమానిత నిందితుల్లో ఈ 830 సంస్థలకు చెందిన ప్రభుత్వాధికారులు, అనేక PSU బ్యాంకుల అధికారులు ఉన్నారని తెలిపింది సీబీఐ. ఏటా సుమారు 65 లక్షల మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయా పథకాల క్రింద మైనారిటీ స్కాలర్షిప్లను పొందుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారాసీలకు చెందిన ఆరు మైనారిటీ వర్గాల విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేవారు. Central Bureau of Investigation (CBI) registers case against unknown officials in connection with alleged minority scholarship scam of Rs 144 crores — ANI (@ANI) August 29, 2023 ఇది కూడా చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్కు విద్యార్థినులు రక్తంతో లేఖ.. -
బీసీల సభలో టీడీపీ నేతలే ఎక్కువ..
రామవరప్పాడు/గన్నవరం : లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు, ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చేరుకున్న పాదయాత్ర విజయవాడ మీదుగా సోమవారం గన్నవరం నియోజకవర్గానికి చేరుకోగా.. సాయంత్రం నిడమానూరు క్యాంప్ సైట్లో బీసీ సామజికవర్గాల ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. సమావేశంలో బీసీ ప్రతినిధుల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. సమావేశంలో.. ‘ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడ’ని లోకేశ్ను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ మాట్లాడుతుండగానే జనం మెల్లగా జారుకున్నారు. గన్నవరం చేరుకున్న పాదయాత్ర అనంతరం.. లోకేశ్ పాదయాత్ర సోమవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం చేరుకుంది. అంతకుముందు, కేసరపల్లి వద్ద మండలంలోకి ప్రవేశించిన యాత్ర ఎయిర్పోర్ట్, దుర్గాపురం, గన్నవరం మీదుగా చిన్నఆవుటపల్లిలోని ఎన్ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో క్యాంప్ సైట్కు చేరుకుంది. పాదయాత్ర జాతీయ రహదారిపై కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఫలితంగా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. కొంతమంది మద్యం మత్తులో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఇక లోకేశ్ సమక్షంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. మరోవైపు.. మండల పార్టీ ఇచ్చిన రూటుకు భిన్నంగా ఎమ్మెల్యే కార్యాలయం మీదుగా పాదయాత్ర వెళ్లాని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే, పోలీసులు అంగీకరించలేదు. దీంతో రూట్మ్యాప్ ప్రకారం పాదయాత్ర కొనసాగింది. -
మైనార్టీ లకూ ‘లక్ష’ణమైన పథకం
సాక్షి, హైదరాబాద్: మైనార్టీల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ‘లక్ష’ణమైన పథకాన్ని ప్రకటించింది. స్వయం ఉపాధి పొందుతున్న, ఉపాధికి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి రూ.లక్ష ఆర్థిక సాయం పథకం ఒకింత ఊతమివ్వనుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, నిబంధనలకు అనుగుణంగా అర్హతలను నిర్ధారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆ నిబంధనలే అమలు: ప్రభుత్వం గత నెలలో వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్దిదారుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కొన్ని నిబంధనలు విధించింది. దరఖాస్తులను పరిశీలించి అర్హతలను నిర్ధారించి లబ్దిదారులకు రూ.లక్ష చెక్కులు ఇస్తోంది. మైనార్టి లకు ఆర్థిక సాయం పథకానికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. 2022–23 సంవత్సరంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఈ పథకం కింద పరిశీలిస్తారు. వీటినే 2023–24 ఆర్థిక సాయం కింద మార్పు చేసి అర్హతల మేరకు తెలంగాణ స్టేట్ మైనార్టి స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సాయమందిస్తారు. క్రిస్టియన్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి అర్హతలను నిర్ధారిస్తారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తుకు మాత్రమే ఆర్థిక సాయాన్ని అందిస్తారు. దరఖాస్తుదారుల వయసు 2023 జూన్ 2 నాటికి 21 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీస్థాయిలోనే అర్హుల ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. జిల్లా ఇంచార్జి మంత్రి అనుమతితో కలెక్టర్ జాబితాను ఖరారు చేస్తారు. అర్హుల జాబితాను టీఎస్ఎంఎఫ్సీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. (బాక్స్) మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మైనార్టి ల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వనున్నట్లు చెప్పారు. మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు.కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే వివిధ పథకాలను అమలు చేస్తూ మైనార్టి ల్లోని వెనుకబాటును తొలగించేందుకు కృషి చేస్తోందన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.లక్షను ప్రభుత్వం అందిస్తోందని సీఎం చెప్పారు. -
మైనార్టీలకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్రావు, త్వరలో జీవో!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కార్ మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం జలవిహార్ లో జరిగిన మైనార్టీనేతల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.‘ మైనార్టీల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం స్కీం ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుంది. అది ముఖ్యమంత్రి మీకు అందజేసిన శుభవార్త’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పలు మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ సన్మానించారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ... మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారు. గంగ జమున తహజిబ్ అమలు చేస్తున్నారు మన సీఎం కేసీఆర్. హిందువులకు కల్యాణ లక్ష్మీ తెచ్చినట్టు మైనార్టీల కోసం షాది ముబారక్ తెచ్చారు. మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ఒకటి రెండు రోజుల్లో జీవో వస్తుంది. కాంగ్రేస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. (చదవండి: బర్త్, స్టడీ సర్టిఫికెట్స్లో కుల, మత ప్రస్తావనపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు) దేశంలో ఇప్పటికి ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే. ఈ బడ్జెట్ లో మీ సంక్షేమం కోసం 2200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినం. ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ కూడా అందుబాటులో ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నాం. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు ఇంజినీర్లు గా ఎదుగుతున్నారు. సల్వా ఫాతిమా ను పైలట్ అవుతానంటే అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ డబులు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మయి నెలకు 5 లక్షలు సంపాదిస్తోంది. ముస్లింల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. (చంద్రబాబు వారసుడు రేవంత్) -
ఇది మీ ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని.. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ వ్యవహరించదని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి డ్రాఫ్ట్ రాలేదని, అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదన్నారు. అయితే మీడియాలో, పలుచోట్ల విపరీతంగా చర్చ నడుస్తోందని, అది చూసి ముస్లింలు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బుధవారం ఆయన ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి పాలకుడిగా, సీఎం స్థాయిలో తాను ఉన్నానని, ఇలాంటి పరిస్థితుల్లో మీ రే ఉంటే ఏం చేసేవారో ఆలోచించి సలహాలు ఇ వ్వాలని కోరారు. ముస్లిం ఆడబిడ్డల హక్కుల పరిరక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం నడుస్తోందని, ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలని సూచించారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏతండ్రి, తల్లి అయినా ఎందుకు భేద భావాలు చూపుతారని, మ హిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మనందరం స్పష్టం చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. అపార్థాలకు తావివ్వరాదు భారత్ చాలా విభిన్నమైనది. ఇక్కడ అనేక మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న ప లు కులాలు, వర్గాలకూ పలు రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలున్నాయి. వారి వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లా బోర్డులున్నాయి. ఏ నియమమైనా, ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాలి. ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. అప్పుడే అపార్థాలకు తావుండదు. మార్పులు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్రం.. అందరూ కలిసి, మతాలకు చెందిన సంస్థలు, వారి పర్సనల్ లా బోర్డ్స్తో మమేకమై ముందుకు సాగాలి. ఇలా కాకుండా వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న భారత్లో తగదు. ముస్లింలకు సీఎం అండగా ఉంటానన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీతో పౌరస్మృతి విషయంలో ముస్లిం మైనార్టీలకు భరోసా లభించిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నామని చెప్పారు. మూడు గంటల పాటు సీఎంతో సమావేశమై చర్చించామని తెలిపారు. యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి మత పెద్దలు సీఎంకు వివరించారన్నారు. ముస్లింలకు నష్టం జరగకుండా తాను ముందుండి పోరాడతానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ముస్లింలకు నష్టం కలిగేలా ఉంటే పార్లమెంట్లో యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారని తెలిపారు. సీఎం నిర్ణయంతో మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రూఫుల్లా, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ ఇసాక్ బాషా పాల్గొన్నారు. -
ఒబామా వ్యాఖ్యలపై సీతారామన్ మండిపాటు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే, ఆ దేశం ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒబామా హయాంలోనే అమెరికా.. సిరియా, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాక్ తదితర ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై వేలాది బాంబులు వేసిందని ఆరోపించారు. ఇది నిజం కాదా? అటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే నమ్మేదెవరు?’ అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఓవైపు ముస్లిం మెజారిటీ దేశాలు కీర్తిస్తుంటే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్లోని ముస్లింల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిర్మలా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు, అందులో ఆరు ముస్లిం మెజారిటీ దేశాలని ఆమె గుర్తుచేశారు. -
Targeted Attacks: నిన్న ఇంట్లోకి చొరబడి కాల్పులు.. నేడు బాంబు దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో మైనారిటీ వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజౌరికి 8 కిలోమీటర్ల దూరంలోని అప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపిన సంఘటన నుంచి తేరుకోకముందే మరోమారు దాడి చేశారు. బాధితుల ఇంటి సమీపంలోనే సోమవారం భారీ పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నాటి కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా.. సోమవారం నాటి బాంబు దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘మొదటి కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలోనే పేలుడు జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలోనే మరో ఐఈడీని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాం.’అని స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం నాటి ఘటన బాధ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలోనే ఈ భారీ పేలుడు జరగటం తీవ్ర కలకలం రేపింది. రూ.10లక్ష పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం.. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం, ఇంట్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గాయపడిన వారికి రూ.1 లక్ష సాయం అందిస్తామని తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, కారకులను చట్టంముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఆందోళనలు.. మైనారిటీలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగటంపై రాజౌరీలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు స్థానికులు. తమ ప్రాణాలు రక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. నిరసనకారులను కలిసేందుకు వెళ్లిన క్రమంలో జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవిందర్ రైనాను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, లెఫ్టినెంట్ గవర్నర్ తమ వద్దకు వచ్చి డిమాండ్లు వినాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ పదవులు, వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. అద్దంకి నేతృత్వంలో ఐదు రోజులుగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సహా ఇతర కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో భేటీ అయిన తెలంగాణ సామాజిక కాంగ్రెస్ బృందం బీసీ, ఎస్సీ, ఎస్టీల అంశాలు, సమస్యలపై చర్చించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో అద్దంకి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఉదయ్పూర్ డిక్లరేషన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు, పార్టీ పదవులు, రాజ్యాంగ పదవుల్లో న్యాయం చేయా లని చేసిన విజ్ఞప్తిపై పార్టీ పెద్దలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతేగాక తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి గల కారణాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని అద్దంకి వివరించారు. వీటితో పాటు ఎనిమిదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ధన రాజకీయాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో ధరణి కారణంగా దళితులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. (చదవండి: మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!) -
ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?
కొంతమంది నియోదళిత్ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ మల్హోత్ర, అరవిందన్ నీలకంఠన్ రాసిన ‘బ్రేకింగ్ ఇండియా – వెస్ట్రన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద్రవిడియన్ అండ్ దళిత్ ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది. ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్లో షెడ్యూల్డ్ కులాల వివక్షమీద అంబేడ్కర్ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్ మేస్ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్ తురిమెన్ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్ ప్రిన్సిపుల్కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. దేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్ సీలింగ్ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!) - డాక్టర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం -
వీగర్లపై చైనా పంజా
చైనా వాయవ్యప్రాంతం షింజియాంగ్లో సర్కారీ దౌష్ట్యానికి లోనవుతున్న మైనారిటీ వీగర్ ముస్లింల విషయంలో ఐక్యరాజ్యసమితి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని కొంతకాలంగా హక్కుల సంస్థలు చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. అక్కడ చైనా ప్రభుత్వం తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని గురువారం విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(యూఎన్హెచ్ఆర్సీ) నివేదిక నిర్ధారించింది. ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. దీన్ని పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలనీ, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలం వాయిదాపడేలా చూడాలనీ చైనా అనేక ఎత్తులు వేసింది. ఇప్పుడిక నివేదికను ఖండించే పనిలోపడింది. 48 పేజీల యూఎన్హెచ్ఆర్సీ నివేదికకు 122 పేజీల్లో బదులిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవటం లేదన్నది దాని సారాంశం. నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడిపడవు. వాటికి రాజకీయ కారణాలతోపాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో, శాపమో వీగర్ ముస్లింలు అత్యధికంగా ఉండే షింజియాంగ్ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటిమధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనా వాసప్రాంతాలు విసిరేసినట్టు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇరుగుపొరుగున రష్యాతోపాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు... గతంలో పాలించినవారూ ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంది. పైగా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా, వాటిపై తన ప్రభా వాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది. భౌగోళికంగా చిన్నదే అయినా షింజి యాంగ్ ఎప్పుడూ బేలగా లేదు. చరిత్రలోకి తొంగిచూస్తే అనేక రాజరిక వ్యవస్థలకు అది కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయంప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. 1949లో చైనా విప్లవ విజయానికి కాస్త ముందు ఆ ప్రాంతం స్వయంపాలనను రుచిచూసింది కూడా. కానీ జాతుల సమస్య విషయంలో కమ్యూనిస్టులకున్న అవగాహనను గౌరవించి కావొచ్చు... తొలిసారి వారికి తలవంచింది. ఆధిపత్య హాన్ జాతి పెత్తనమే ఇక్కడా కనబడటం, 1966–76 మధ్య సాగిన సాంస్కృతిక విప్లవకాలంలో అది మరింత బాహాటం కావడంతో మళ్లీ ఆ ప్రాంతం పోరుబాట పట్టింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాలనుంచి హాన్ జనాభాను ఇక్కడికి తరలించడం, క్రమేపీ వారి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో వీగర్లు రగిలిపోయారు. 90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైన ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్పింగ్ పూర్తిస్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటినుంచీ నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు లక్షలాదిమంది వీగర్లను తరలించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నా యని వార్తలొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈమధ్యవరకూ చైనా ఎవరినీ అనుమతించక పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సమితిలో కదలికలు రావడం మొదలయ్యాక శిబిరాల్లో పరిస్థితులు కొంత మారాయంటున్నారు. నిర్బంధితుల విడుదల కూడా చోటుచేసుకున్నదని కథనాలు వచ్చాయి. కానీ జరగాల్సినదాంతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఒక దేశ ఆంతరంగిక సమస్యగానో, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానీకం ఈ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈమధ్యే యూఎన్హెచ్ఆర్సీ హైకమిషనర్గా రిటైరైన మిషెల్ బాష్లెట్ చిలీలో పినోచెట్ పాలనాకాలంలో స్వయంగా నిర్బంధాన్ని అనుభవించినవారు. అందుకే ఆమె హైకమిషనర్గా వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టు చైనా ఎంత మొండికేసినా దాన్ని ఒప్పించడానికి ఆమె ఓపిగ్గా ప్రయత్నించారు. పరిమిత సంఖ్యలోనైనా పాత్రికేయులను అక్కడి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడటం బాష్లెట్ విజయమే. కానీ ఏళ్లతరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేథంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది. బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు బలమైన దేశాలు కళ్లెదుటే దురాగ తాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్ దేశాలు వీగర్ ముస్లింలకు ఏదో ఒరగబెడ తాయనుకోవడం దండగ. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గుతేల్చడానికి మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక తెలిపింది. యూఎన్హెచ్ఆర్సీ సభ్య దేశాలు అంగీకరిస్తేనే అది సాధ్యం. చైనా దీన్నెలాగైనా అడ్డుకుంటుంది. మొత్తానికి ఈ నివేదిక చైనా నేర వైఖరిని బయటపెట్టింది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్ ముస్లింలకు నైతిక మద్దతునీయడం దేశదేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యం. -
మైనార్టీలపై చైనా మారణకాండ.. ఐరాస నివేదికలో కీలక విషయాలు
జెనీవా: చైనా ప్రభుత్వం మైనార్టీలపై మారణహోమాన్ని సృష్టిస్తోందని గత కొంత కాలంగా అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) స్వరం కలిపింది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో పశ్చిమ జిన్ జియాంగ్ ప్రాంతంలో వీగర్లు, ఇతర ముస్లింలను నిర్బంధించి చైనా ప్రభుత్వం హింసకు పాల్పడుతున్న విషయం వాస్తవమేనని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం పేర్కొంది. నిర్బంధంలోకి తీసుకున్న మైనార్టీలపై కనీస మానవత్వం చూపించకుండా ఘోరమైన నేరాలకు పాల్పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యూఎన్ తాజా నివేదిక స్పష్టం చేసింది. చాలా కాలం కిందటే ఈ నివేదిక బయటకు రావాల్సి ఉంది. కానీ చైనా ప్రభుత్వం ఒత్తిడితో ఇన్నాళ్లుగా యూఎన్ తన నివేదికను బయట పెట్టలేదు. యూఎన్ మానవ హక్కుల చీఫ్ మిషెల్లీ బచెలెట్ బుధవారం నాడు తన పదవీ కాలం ముగియడానికి కేవలం 13 నిముషాల ముందు ఈ నివేదిక బయట పెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పశ్చిమ జిన్ జియాంగ్ ప్రాంతంలోని వీగర్లు, ఇతర ముస్లిం మైనార్టీలపై ఐదేళ్లుగా డ్రాగన్ ప్రభుత్వం హింసాకాండకు పాల్పడుతున్నట్టుగా మానవ హక్కుల సంస్థలు, పశ్చిమ దేశాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. 10 లక్షల మంది వీగర్లను నిర్బంధించినట్టుగా వార్తలు వచ్చాయి. యూఎన్ నివేదికను అమెరికా, మరికొన్ని పశ్చిమ శక్తుల కుట్రగా చైనా అభివర్ణించింది. చదవండి: బ్రిటన్లో ప్రచారానికి తెర -
బీజేపీకి మైనార్టీలు, కమ్యూనిస్టులే టార్గెట్
సాక్షి, విశాఖపట్నం: మైనార్టీలు, కమ్యూనిస్టులే టార్గెట్గా బీజేపీ పని చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ధ్వజమెత్తారు. విశాఖలో జరుగుతున్న సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల్లో శనివారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్ఎస్ఎస్ ఓ ఫాసిస్ట్ సంస్థ అని, బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ రోజుల్లో కష్టాలు, బాధలను అధిగమించే పాలన సోషలిజంతోనే సాధ్యమన్న భావన ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ అనేక మందిలో ఉందని చెప్పారు. అదానీ, అంబానీలను అందలమెక్కిస్తున్నారని, వారు దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. భారత్లో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, నిరుద్యోగం, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయని, దేశంలోనూ శ్రీలంక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతమవుతుండటం వల్ల నిస్సహాయ స్థితిలో ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా లెఫ్టిస్టుల వైపు కాకుండా రైటిస్టుల పక్షానే ఉంటున్నారని విమర్శించారు. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వామపక్షాలు, బీజేపీ యేతర పార్టీలు ఉద్యమించాలని రాజా పిలుపునిచ్చారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీరాజా, సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.సాంబశివరావు, ఆలిండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సుందరరామరాజు, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) రాష్ట్ర నాయకుడు డి.హరనాథ్, ఎస్యూసీఐ రాష్ట్ర నాయకుడు ఎస్.గోవిందరాజులు, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకుడు గణేష్పాండా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, 26 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఈసురోమని మనుషులుంటే...
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి అనేక సమస్యలకు నిలయాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు నేడు అంతకు రెండింతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో 2022–2023 వార్షిక బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు పక్కా భవ నాల నిర్మాణం, వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నెలకొల్పిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు 90% శాతం ప్రైవేటు అద్దె బిల్డింగు లలో కొనసాగుతున్నాయి. కొన్ని గురుకులాల్లో తరగతి గది, వసతి గది (డార్మెటరీ) రెండూ ఒకటే. ఇక సంక్షేమ హాస్టళ్ల విషయానికి వస్తే... అవి సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గతంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్ల పేరుతో కొన సాగిన హస్టళ్ళు, నేడు పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లుగా మారాయి. సంక్షేమ వసతి గృహాలలో కొన్నింటిని 1990 ప్రాంతంలో రేకుల షెడ్డులుగా నిర్మించగా... ఇవ్వాల అవి శిథిలావస్థకి చేరాయి, మెజారిటీ హాస్టళ్లు ప్రైవేటు అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయి. అద్దె బిల్డింగుల సముదా యాలు వ్యాపార సంబంధిత అవసరాలకై నిర్మించినవి కావడంతో కనీస వసతి సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తల్ల డిల్లిపోతున్నారు. మా క్షేత్ర స్థాయి పరిశీలనలో... గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో 22 బాలుర హాస్టళ్లు, 16 బాలికల హాస్టళ్లు పూర్తిగా ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. పదవ తరగతిలోపు విద్యార్థు లుండే ప్రీ మెట్రిక్ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు బాల బాలికలవి 12 ఉండగా... ఇందులో మూడు మాత్రమే ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు భవనాలలో ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 24 ఉండగా, ఇందులో 23 హాస్టళ్లు ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ ప్రైవేట్ బిల్డింగు లలో కనీస సౌకర్యాలు లేక పోగా, ప్రతి నెల అద్దె లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బుతో ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించ వచ్చు. కానీ ఆ పని చేయడంలేదు. హాస్టళ్లలో రీడింగ్ రూమ్లు, లైబ్రరీలు, స్టడీ టేబుళ్లు, కుర్చీల సమస్యలు వెంటాడుతున్నాయి. గురుకులాల్లో కంప్యూ టర్ బోధన పేరుకు మాత్రమే సాగుతోంది. సంక్షేమ హస్టళ్ళలో చదువుతున్న పదవతరగతిలోపు విద్యార్థులకు రూ. 62 మాత్రమే కాస్మోటిక్స్ చార్జీలు ఇస్తుండగా... పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వటం లేదు. నెల నెలా కాస్మోటిక్స్ కొనుక్కో వడానికి, బస్ పాస్, ఇంటర్నెట్ రీచార్జీ తదితర అవసరాలు నెరవేర్చుకోవడానికైప్రభుత్వం ఎలాంటి స్టైఫండ్ ఇవ్వక పోవడంతో విద్యార్థులు కూలీ పనులకు వెళ్తూ అర్ధ కార్మికు లవుతున్నారు. ఇటీవల పనికి వెళ్లొస్తున్న అంబర్పేట హాస్టల్ విద్యార్థి యాక్సిడెంట్లో మరణించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. చాలా హాస్టళ్లకు రెగ్యులర్ వాచ్ మెన్, వాచ్ ఉమెన్, ఇతర సిబ్బంది లేరు, హాస్టళ్లలో వైద్యసదుపాయాలు అందుబాటులో లేవు. సంక్షేమ హాస్టళ్లలో ప్రీ మెట్రిక్ విద్యార్థులకు భోజన ఖర్చులకు రోజుకు రూ. 35 ఇస్తుండగా, కాలేజి విద్యార్థులకు రూ. 50 ఇస్తున్నారు. విద్యార్థులు ఈ ఖర్చుతోనే ప్రతిరోజూ మూడుసార్లు భోజనం చేయాలి. మధ్యాహ్నం, సాయంత్రం భోజనం మెనూలో కూరగాయలతో కూర వండాల్సి ఉండగా... చాలా వసతి గృహాల్లో పప్పుతోనే సరిపెడు తున్నారు. మూడు పూటలా బియ్యంతో తయారైన ఆహారాన్నే తినటంతో... కార్బోహైడ్రేట్లు తప్ప శరీరానికి అందవలసిన మిగతా విటమిన్లు ఏ, సీ, బీ–కాంప్లెక్స్; ప్రొటీన్స్, కొవ్వులు ఇతర పోషకాలు తగినంతగా పిల్లలకు అందటంలేదు. భారత దేశంలోని పిల్లలందరి మనుగడ, పెరుగుదల, అభివృద్ధి, సామర్థ్యాలకు ఉపకరించే పోషకాహార విధానం లేదని యుని సెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్ఎన్ఎస్) 2016–18 ప్రకారం పాఠశాలలకు వెళ్లే పిల్లల పోషక స్థితి గమనిస్తే 21.9 శాతం మంది పిల్లలు కుంగిపోతున్నారని తేలింది. చాలామంది అండర్ వెయిట్కి చేరి రోగాల బారిన పడుతున్నారు. ‘‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడు నోయ్’ అన్న గురజాడ మాటలు అందరూ ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. సరైన తిండి, బట్ట, వసతి సౌకర్యాల లేమితో బలహీనంగా తయారవుతున్న రేపటి పౌరులను ఆదుకోవలసిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే కదా! కె. ఆనంద్ వ్యాసకర్త పి.డి.ఎస్.యు. (విజృంభణ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొబైల్: 96523 57076 -
బీసీలు,మైనార్టీల అభివృద్ధిపై మాట్లాడే అర్హత బాబుకు లేదు
-
మైనారిటీలకు 'నవ'శకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు కనీవినీ ఎరుగని రీతిలో మేలు జరిగింది. ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు ఇచ్చినట్లే ఈ వర్గానికీ నవరత్నాల ద్వారా సీఎం వైఎస్ జగన్ పెద్దఎత్తున ఆర్థిక ప్రయోజనం కల్పించారు. చంద్రబాబు సర్కారు కేవలం రంజాన్ తోఫా అంటూ వారిని మభ్యపెట్టడానికే ప్రాధాన్యతనిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వారు పేదరికం నుంచి బయటపడేందుకు అండగా నిలిచింది. నిజానికి చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాలనలో వారిపట్ల ఎంతో చిన్నచూపు చూసింది. కేబినెట్లో ఒక్క మైనారిటీకి కూడా చోటు కల్పించలేదు. వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూశారు. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు మాత్రమే ఫరూక్ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఇందుకు ఉదాహరణ. అయితే, జగన్ సర్కారు మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వారికి పెద్దపీట వేశారు. 21నెలల్లో రూ.3,952 కోట్ల సాయం సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక ఈ 21 నెలల్లో నవరత్నాల ద్వారా 25.53 లక్షల మంది మైనారిటీలకు రూ.3,952 కోట్ల సాయం అందించారు. ఇందులో 19.77 లక్షల మందికి నేరుగా రూ.2,936.17 కోట్ల మేర నగదు బదిలీ జరిగింది. నగదేతర బదిలీ పథకాల ద్వారా 5.76 లక్షల మందికి రూ.1,016.26 కోట్లు అందించారు. టీడీపీ సర్కారులో మైనారిటీలకు బ్యాంకు రుణాలే దిక్కుగా ఉండేవి. అవీ కూడా పెద్దలు సిఫార్సు చేస్తేనే మంజూరయ్యేవి. కానీ, ఇప్పుడు ఎవరి సిఫార్సులు లేకుండా అర్హులందరికీ నవరత్నాలు సకాలంలో అందుతున్నాయి. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన మైనారిటీలందరినీ ఇంటింటి సర్వే ద్వారా వలంటీర్లతో గుర్తించింది. దీంతో మంత్రులు, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండాపోయింది. -
సీఎం వైఎస్ జగన్ మైనార్టీల మనోభావాలను కాపాడుతారు
-
ప్రజాపోరులో ఐఏఎస్ అధికారి
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు సందర్భంగా కశ్మీర్ ప్రజలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేసిన కన్నన్ గోపీనాథన్ ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. దేశంలో ఓ మైనారిటీ వర్గాన్ని మినహాయించి పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ నుంచి అక్రమంగా వచ్చిన హిందువులకు పౌరసత్వం కల్పించే చట్టం ముమ్మాటికి భారత రాజ్యాంగంలోకి లౌకికవాద స్ఫూర్తికి వ్యతిరేకమే కాకుండా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఆ మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులకు భారత పౌరసత్వం ఇవ్వదలుచుకుంటే పార్లమెంట్ నిర్ణయం ద్వారా ఇవ్వొచ్చని, అలా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా సీఏఏ చట్టం తీసుకురావడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కశ్మీర్ విషయంలో కూడా తాను 370వ ఆర్టికల్ రద్దును వ్యతిరేకించలేదని, ఆ సందర్భంగా ప్రజల హక్కులకు కాలరాసి, వారి కదలికలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించానని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. ఓ పక్క దేశంలో దుర్భర ఆర్థిక పరిస్థితులు కొనసాగుతుంటే పట్టించుకోకుండా, ప్రజలను విభజించే రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం నెత్తినెత్తుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును రెండంకెల పైకి తీసుకెళతాననే హామీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేడు జీడీపీ ఐదు శాతానికి, ఎస్బీఐ అంచనాల ప్రకారం 4.6 శాతానికి పడిపోయినా, సాధారణ ప్రగతి రేటు 42 ఏళ్ల కనిష్ట స్థాయి 7.5 శాతానికి పడిపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ ప్రభుత్వం హయాంలో నేడు నిరుద్యోగ సమస్య 49 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నా, మునుపెన్నడు లేని విధంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 14.7 శాతానికి చేరుకున్నా పట్టించుకోక పోవడం దారణమని ఆయన వ్యాఖ్యానించారు. కన్నన్ గోపీనాథన్ దేశవ్యాప్తంగా సుడిగాలిలా తిరుగుతూ వివిధ కళాశాలలు, ప్రజా వేదికలపై ప్రసంగిస్తున్నారు. చదవండి: సీఏఏపై వెనక్కి తగ్గం ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు కాంగ్రెస్కు షాకిచ్చిన విపక్షాలు..! జాతీయ నాయకులు మళ్లీ పుట్టారు! ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే... సీఏఏపై కేరళ సంచలన నిర్ణయం సీఏఏపై సుప్రీం కోర్టు ఎలా విచారిస్తుంది? -
మైనారిటీల గుర్తింపుపై పిల్ను తోసిపుచ్చిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ గణాంకాల ప్రాతిపదికన కాకుండా రాష్ష్ర్టాల వారీగా జనాభా ఆధారంగా మైనారిటీ వర్గాలను నిర్ణయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం తోసిపుచ్చింది. సామాజిక ప్రయోజనాలను పొందేందుకు 8 రాష్ష్ర్టాల్లో హిందువులను మైనారిటీలుగా పరిగణించాలని ఈ పిటిషన్ కోరింది. పలానా రాష్ష్ర్టంలో ఏ వర్గాన్ని మైనారిటీలుగా పరిగణించాలనే విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ నేత, అడ్వకేట్ అశ్వని ఉపాథ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్కు అటార్నీ జనరల్ మద్దతు పలకలేదు. కాగా, రాష్ష్ర్ట జనాభాకు అనుగుణంగా మైనారిటీ వర్గాన్ని గుర్తించాలని దాఖలైన ఈ పిటిషన్కు సంబంధించి సహకరించాలని జులైలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను సుప్రీం కోర్టు కోరింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ అటార్నీ జనరల్ కార్యాలయానికి పిటిషన్ కాపీని అందించాలని పిటిషనర్, బీజేపీ నేతను కోరుతూ విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధులు, పార్సీలను మైనారిటీలుగా పరిగణిస్తూ 26 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టబద్ధతను ఈ పిటిషన్ సవాల్ చేసింది. -
న్యూయార్క్లో పాక్కు షాక్
న్యూయార్క్: అమెరికా రాజధాని న్యూయార్క్లో శుక్రవారం ఉదయం రద్దీ వీధుల్లో, రహదారులపై.. పాకిస్థాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రకటనలు దర్శనమిచ్చాయి. పాకిస్థాన్లో మైనారిటీలపై సాగుతున్న అరాచకాలు, అణచివేతపై గళమెత్తుతూ.. ట్యాక్సీలు, ట్రక్కులపై భారీ డిజిటల్ డిస్ప్లే ప్రకటనలు కనిపించాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించనున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఒక్కసారిగా ఈ ప్రచారం హోరెత్తడం గమనార్హం. అమెరికాకు చెందిన హక్కుల సంస్థ వాయిస్ ఆఫ్ కరాచీ ఆధ్వర్యంలో పాక్ మైనారిటీల కోసం గళమెత్తుతూ న్యూయార్క్లో ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. న్యూయార్క్లోని ఐరాస కార్యాలయం సమీపంలో ఈ ట్రక్కులు, ట్యాక్సీలు తిరుగుతూ కనిపించాయి. ‘ఐరాస ప్రవచించిన మానవ హక్కులు పాకిస్థాన్లో ఏమాత్రం అమలవ్వడం లేదు. పాక్ విషయంలో ఐరాస జోక్యం చేసుకోవాలని మొహజిర్స్ డిమాండ్ చేస్తున్నారు’ అని ప్రకటనల్లో ఉంది. మైనారిటీలైన మొహజిర్స్కు పాక్లో ఎలాంటి హక్కులు కల్పించడం లేదని, తమకు ఎదురవుతున్న అన్యాయాలు, అణచివేతపై కనీసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా మొహజిర్స్ను అనుమతించడం లేదని, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం, ఐరాస జోక్యం కోరుతూ ఈ ప్రచారం ప్రారంభించామని కరాచీ మాజీ మేయర్ వసే జలీల్ తెలిపారు. -
ముస్లింల ఆత్మ బంధువు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లతో నిరుపేద ముస్లిం కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యావంతులుగా ఎదిగారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్ బాషా పేర్కొన్నారు. పొన్నూరురోడ్డులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో బుధవారం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ‘‘మైనార్టీ యువత ఉన్నత విద్య–నైపుణ్యాభివృద్ధి’’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి పాటుపడిన నేత ఎవరైనా ఉన్నారంటే ఆది వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని స్పష్టం చేశారు. నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన తీసుకున్న మహత్తరమైన చర్యలతో ముస్లిం సమాజం విద్య, ఉద్యోగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి బాటలో ముందుకు వెళ్తూ ముస్లిం, మైనార్టీ వర్గాల సంక్షేమానికి శాశ్వతరీతిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కేబినెట్లో 50 శాతం పదవులను బడుగు, బలహీన వర్గాలకు కేటాయించడంతో పాటు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఉప ముఖ్యమంత్రులుగా పదవులు కట్టబెట్టారన్నారు. ఆంధ్ర ముస్లిం కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందిస్తామని చెప్పారు. కర్నూలులోని ఉర్దూ యూనివర్శిటీ స్టడీ సెంటర్ను గుంటూరులో ఏర్పాటు చేస్తామని చెప్పారు.గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ముస్లింలకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత సీఎం జగనమోహన్ రెడ్డికే చెందిందని అన్నారు. కళాశాల కరస్పాండెంటు షేక్ సుభాని మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో ముస్లిం, మైనార్టీలు సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నారని చెప్పారు. అనంతరం కళాశాల యాజమాన్యం అంజాద్ బాషాను ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్గాంధీ, మహ్మదీయ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు సమీవుల్లా షరీఫ్, ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర ఎండీ మస్తాన్వలీ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్కుమార్, షేక్ గౌస్ పాల్గొన్నారు. లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి 1.26 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి షేక్ అంజాద్ బాషా అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల్లో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కరకట్టను ఆనుకుని అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల పరిపాలనలో ఎల్లో మీడియా అండతో అవాస్తవాలను ప్రచారం చేస్తూ చంద్రబాబు పాలన సాగించారని మండిపడ్డారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని నదులు పొంగి వరదలు సంభవిస్తే అందులోనూ బురద రాజకీయాలు చేశారన్నారు. -
70 ఏళ్లుగా బీజేపీపై మైనార్టీల్లో వ్యతిరేకత
న్యూఢిల్లీ: బీజేపీ పట్ల మైనార్టీల మనసుల్లో వ్యతిరేకత 70 ఏళ్లుగా నాటుకుపోయిందని, దాన్ని 70 రోజులు లేదా ఏడేళ్లలో తుడిచివేయలేమని మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. బీజేపీ 1980లో ప్రారంభమైనప్పటికీ దాని అనుబంధ సంస్థ జన సంఘ్ 1950 నుంచే కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఓట్ల కోసం మైనార్టీలను దోపిడీ చేయకపోవడం, వివక్ష లేకుండా అభివృద్ధి చేయడం వల్లే ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తి రక్షణలో ఉన్నట్లు మైనార్టీలు భావిస్తున్నారని శుక్రవారం పీటీఐ ఇంటర్వ్యూలో నఖ్వీ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల మోదీకి మైనార్టీల్లో ప్రజాదరణ పెరిగిందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి కేంద్రం తెచ్చిన సంస్కరణ చర్యలని, అవి ప్రజాదరణ కోసం ఉద్దేశించినవి కావని పేర్కొన్నారు. -
దాడులను అరికట్టడంలో బీజేపీ విఫలం: యూఎస్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశవ్యాప్తంగా దళితులపై, ముస్లింలపై దాడులు విపరీతంగా పెరిగాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 2019 ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ రిపోర్టు (అంతర్జాతీయ మతస్వేచ్ఛ నివేదిక) అనే యూఎస్ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో పలు అంశాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ.. తన నివేదికలో పలు విషయాలను పొందుపరిచింది. హిందుమత వ్యాప్తి కోసం ఇతర మతాలపై హిందుత్వ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మైనార్టీల మత స్వేచ్ఛకు తీవ్ర భంగం ఏర్పడిందని తెలిపింది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు, అన్ని మతాలకు ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా కొన్ని సంస్థలు వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై దాడులకు అరికట్టడంలో తీవ్రంగా విఫలమైందని, మూక దాడుల పేరుతో ఓ వర్గాన్ని తీవ్రంగా హింసిస్తున్నారని నివేదికలో పేర్కొంది. దక్షిణ భారతదేశంతో పోలిస్తే.. ఉత్తరంలో మూకదాడులు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో దళితులపై దాడులు ఎక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్ రిలీజియన్ ప్రీడమ్ రిపోర్టు తెలిపింది. దీనితో పాటు అగ్రరాజ్యం అమెరికాకు పలు సూచనలు కూడా చేసింది. అమెరికాతో పోలిస్తే భారత్తో మతస్వేచ్ఛను మరింత విస్తరించాలని పేర్కొంది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 18 ఘటనలు జరగగా.. వీటిలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సర్వే రిపోర్టు తెలిపింది. మతస్వేచ్ఛపై ప్రచారం కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని వెల్లడించింది. హిందుత్వ సంస్థలు, గోసంరక్షణ దళాలు దళితులు, మైనార్టీలపై దాడులకు మూలకారణం అవుతున్నాయని పేర్కొంది. -
‘ఓడిపోయిన నాకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి ఇవ్వడం పట్ల వైఎస్సార్సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఓట్ల కోసం చివరలో మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో దొంగలు, బ్యాంక్ లూటీ చేసిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. జగన్ మాత్రం ఓడిపోయిన తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలనే మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో మైనార్టీలకు ఎలాంటి సంక్షేమం జరిగిందో సీఎం జగన్ సారథ్యంలో కూడా అలానే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
పూర్తిస్థాయి మంత్రి మండలే!
సాక్షి, అమరావతి: సుపరిపాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గం ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో అఖండ విజయంతో రాజకీయ విప్లవం సృష్టించిన ఆయన పరిపాలనలోనూ తనదైన ముద్ర వేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఉద్యుక్తులయ్యారు. రాష్ట్రంలో నవయుగానికి నాంది పలుకుతూ పరిపాలన ప్రారంభించిన జగన్ తన మంత్రివర్గ ఏర్పాటులోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. ‘మా ప్రభుత్వంలో అన్ని పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు కేటాయిస్తాం’’ అని ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ గర్జనలో జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తన మంత్రివర్గం ఏర్పాటు నుంచే శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు ఇవ్వాలని జగన్ సంకల్పించడం ద్వారా రాష్ట్రంలో సామాజిక విప్లవానికి పునాది పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. సుపరిపాలన... స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా ఒకేసారి పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని శనివారం ఏర్పాటు చేయనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. నూతన మంత్రివర్గం ఎలా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఓవైపు సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన అందించేలా మంత్రివర్గం ఏర్పాటు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం, పార్టీ పటిష్టం దిశగా ప్రణాళికలు.. ఇలా ద్విముఖ వ్యూహంతో వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. రెండున్నరేళ్ల తరువాత కొందరు మంత్రులు పార్టీ సేవ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని వైఎస్ జగన్ శుక్రవారం నిర్వహించనున్న వైఎస్సార్సీఎల్పీ సమావేశంలో పిలుపునిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తద్వారా పార్టీ పటిష్టతకు ప్రణాళికాబద్ధ విధానాన్ని అమలు చేస్తూ మరోవైపు మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించాలన్నది జగన్ ఉద్దేశమని తెలుస్తోంది. సామాజికవర్గం, ప్రాంతీయ సమీకరణలకు సముచిత ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గ కూర్పు ఉండేలా ముఖ్యమంత్రి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిపాలనలో వేగాన్ని కొనసాగించేలా మంత్రివర్గం ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం తరువాత జగన్ మాట్లాడుతూ ఆరు నెలల నుంచి ఏడాదిలోగా మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ప్రజలకు మాటిచ్చారు. అందుకే అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. తొలి సంతకంతోనే పింఛన్ల పెంపు, అనంతరం ఆశా వర్కర్లకు జీతాల పెంపు తదితర సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ పరిపాలనను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో సమూల మార్పులు చేసి, సమర్థులైన అధికారులతో తన జట్టును ఏర్పరచుకున్నారు. రైతు భరోసా పథకం అమలును ప్రకటించారు. పరిపాలనలో ఆయన వేగం, నిబద్ధత ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. అదే తీరును కొనసాగించే విధంగా తన మంత్రి మండలి ఉండాలని ముఖ్యమంత్రి జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో ఇదే తొలిసారి.. రాష్ట్ర మంత్రి మండలి ఏర్పాటులో వైఎస్ జగన్మోహన్రెడ్డి తనదైన ముద్ర వేయనున్నారు. ఒకేసారి పూర్తిస్థాయి మంత్రి మండలిని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 25 మంది మంత్రులతో శనివారం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈవిధంగా ఒకేసారి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కానుండటం విశేషం. గత ముఖ్యమంత్రులు పలు దశల్లో తమ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇందుకు భిన్నంగా ఒకేసారి పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయానికొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కేటాయింపులోనూ వైఎస్ జగన్ అదే రీతిలో వ్యవహరించారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించి పార్టీ శ్రేణులు, ప్రజలకు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం మంత్రి మండలి ఏర్పాటులోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తున్నారు. తద్వారా ఎలాంటి శషభిషలకు తావులేకుండా మంత్రి మండలి, యావత్ అధికార యంత్రాంగం సుపరిపాలన అందించడంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా చేయాలన్నదే ముఖ్యమంత్రి అక్ష్యంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రభుత్వ మంత్రి మండలి ఏర్పాటుతో రాష్ట్రంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల కేటాయింపులో మహిళలకూ పెద్దపీట వేయనున్నారు. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైఎస్ జగన్ మట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం వాటా కేటాయిస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన కేవలం ఎన్నికల గిమ్మిక్కు కాదని, తాను త్రికరణశుద్ధితో అమలు చేస్తానని పార్టీ టిక్కెట్ల కేటాయింపు ద్వారా నిరూపించారు. రాష్ట్రంలో బీసీలకు అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు కేటాయించడం అందరినీ ఆకట్టుకుంది. జగన్ చిత్తశుద్ధిని గుర్తించిన అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి ఎన్నికల్లో ఘన విజయాన్ని చేకూర్చారు. అదే స్ఫూర్తిని తమ పరిపానలలోనూ కొనసాగించాలని జగన్ సంకల్పించారు. మంత్రి మండలి ఏర్పాటులోనూ సామాజిక న్యాయానికి పెద్ద పీటు వేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వనే లేదు. ఎస్సీ, బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించలేదు.కానీ, తన మంత్రి మండలిలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 25 మంది మంత్రుల్లో 12 మంది వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తదనంతరం కూడా ప్రభుత్వ పరంగా వివిధ పదవుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి పైగా కేటాయించాలని జగన్ విధాన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమతౌల్యం మంత్రి మండలి ఏర్పాటులో సామాజిక, ప్రాంతీయ సమతౌల్యం కచ్చితంగా పాటించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఎస్సీ మాల, మాదిక సామాజిక వర్గాలు, బీసీ ఎమ్మెల్యేల నుంచి వివిధ సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించనున్నారు. ఇతర సామాజిక వర్గాలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ మంత్రి మండలి కూర్పు ఉండేలా జగన్ కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాలూ వైఎస్సార్సీపీకి అఖండ మెజార్టీతో పట్టం కట్టాయి. అందుకు తగ్గట్లుగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా తన మంత్రి మండలి ఉండాలని జగన్ యోచిస్తున్నారు. మంత్రి పదవుల కేటాయింపులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అక్కడి సామాజిక వర్గ సమీకరణలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా–గుంటూరు, ప్రకాశం–నెల్లూరు, రాయలసీమ జిల్లాలు యూనిట్గా మంత్రి మండలి కూర్పు ఉంటుందని భావిస్తున్నారు. పార్లమెంట్ నియోజక వర్గాలను జిల్లాలుగా చేస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్లుగానే మంత్రివర్గం ఏర్పాటులోనూ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నది జగన్ ఉద్దేశమని తెలుస్తోంది. సీనియర్లు, కొత్త నేతల మేలు కలయిక రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. పార్టీకి 7 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిలో గతంలో మంత్రులుగా పని చేసిన సీనియర్లు... రెండు నుంచి నాలుగు సార్లు గెలిచినవారు... మొదటి నుంచీ వైఎస్ జగన్ వెన్నంటి నిలిచినవారు... కొత్తగా పార్టీలో చేరి గుర్తింపు పొందిన వారు ... పార్టీ కోసం పనిచేసిన వారు... ఇలా అందరూ ఉన్నారు. ప్రజలు తన పరిపాలనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నందున మంత్రుల ఎంపికపై వైఎస్ జగన్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు, కొత్త నేతల మేలు కలయికగా మంత్రివర్గం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద మంత్రి మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించడం, అన్ని ప్రాంతాలకు తగిన గుర్తింపునివ్వడం ప్రాతిపదికగా మంత్రి మండలి ఏర్పాటు చేయాలన్నది జగన్ ఉద్దేశంగా ఉంది. రెండున్నరేళ్ల తరువాత పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగ నిబంధన ప్రకారం అవకాశం ఉన్న మంత్రి పదవుల సంఖ్య కంటే వైఎస్సార్సీపీలో మంత్రి పదవులకు అర్హులు చాలా ఎక్కువ మంది ఉండటంతో మంత్రివర్గ కూర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. సుపాలనను అందిస్తూ సుదీర్ఘకాలం రాష్ట్రంలో అధికారంలో కొనసాగాలని ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీని విజయపథంలో నడిపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆయన భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తున్నట్లు సమాచారం.శుక్రవారం నిర్వహించనున్న పార్టీ శాసనసభా పక్ష సమావేశంలోనే ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రులుగా నియమితులయ్యేవారు పార్టీ సేవ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని జగన్ పిలుపు ఇవ్వనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం 25 మందితో పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. మంత్రులుగా అవకాశం రాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించేలా వారు పర్యవేక్షించాల్సి ఉంటుంది. రెండున్నరేళ్ల తరువాత తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని జగన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రి పదవులు రాని వారికి అప్పుడు అవకాశం కల్పిస్తారు. అంతవరకు మంత్రులుగా చేసిన పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. నేడు విజయవాడకు గవర్నర్ సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం విజయవాడకు చేరుకోనున్నారు. శనివారం సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడుతో కూడా ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లనున్నారు. -
కేసీఆర్ పాలనలోనే మైనార్టీలకు గౌరవం
సూర్యాపేట: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమాన్ని ఆలోచించేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని, వివిధ ప్రభుత్వాలు దేశంలో మైనార్టీలకు రూ.4,700 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో రూ.2,400 కోట్ల బడ్జెట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కేటాయించారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లింల ఆత్మీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ పాలనలోనే మైనార్టీలకు గౌరవం పెరిగిందన్నారు. 2004లో అప్పటి కాంగ్రెస్ పాలకులు ముస్లింల సంక్షేమానికి కేవలం రూ.80 లక్షలే కేటాయించారని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు కేసీఆర్లాంటి నాయకులను కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
మైనార్టీలను మర్చిపోయావా ‘బాబు’
సాక్షి, బొబ్బిలి : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు ఆరు ఎమ్మెల్యే సీట్లిచ్చారు. షబ్బీర్ అలీని మైనార్టీ శాఖ మంత్రిగా నియమించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన చలువతో ఎంతోమంది నిరుపేద ముస్లిం పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముస్లింలను పూర్తిగా గాలికొదిలేశారు. ఐదేళ్ల పాటు మా సంక్షేమాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు ముస్లింల సంక్షేమానికి కోట్లు కుమ్మరిస్తామంటే ఎలా నమ్మాలి?’ అని ప్రశ్నించారు ముస్లింలు. బొబ్బిలిలో పలువురు ముస్లింలు తమ సమస్యలు, పాలకుల తీరుపై రచ్చబండ నిర్వహించుకున్నారు. సయ్యద్ అమ్ములు మాట్లాడుతూ.. ‘మా అమ్మాయి షైనాజ్ బేగం పెళ్లి నిమిత్తం దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయానికి దరఖాస్తు చేశాం. రూ.50 వేలు వస్తాయి కదా పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నాం. నేటికీ షాదీ ముబారక్ ప్రోత్సాహకం ఇవ్వలేదు. అప్పులు చేసి పెళ్లి జరిపించాం. దాదాపు ఏడాది నుంచి తిరుగుతున్నా ప్రయోజనం లేదు’ అని వాపోయింది. పూరి పాకలో ఉంటూ ఓ మెస్లో పని చేసుకునే ఈమె ఆర్థిక పరిస్థితి అంతంతే. ఆమె భర్త సయ్యద్ అలీ ఇటీవల ప్రమాదానికి గురి కావడంతో ఆ పని కూడా మానేసి అతనికి సపర్యలు చేస్తోంది. చుట్టుపక్కల వారు, బంధువుల సాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేస్తే.. 2013లో రూ.35 వేల రుణం తీసుకున్నానని ఆపేశారు. మీరేమైనా రుణం ఇచ్చారా? ఎప్పుడో 2013లో రుణం తీసుకుంటే నిరుద్యోగ భృతి ఆపేయడం ఏంటి. ఇది హాస్యాస్పదం కాదా. పథకాలన్నీ టీడీపీ వాళ్లకే వెళుతున్నాయి. మైనార్టీలను అసలు పట్టించుకోవడమే లేదు. – అబ్దుల్ ముజీబ్, నిరుద్యోగి అన్నిటికీ జన్మభూమి కమిటీలే మైనార్టీలు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా చేయాలంటే నేరుగా లబ్ధి కల్పించవచ్చు. కానీ.. అలా చేయట్లేదు. మా ప్రాంతంలో బీసీలతో జన్మభూమి కమిటీ వేశారు. మేం వెళితే వాళ్లెవరూ దొరకరు. ఏం చెబుతారో తెలియదు. కనీసం ఆ జన్మభూమి కమిటీలోనైనా మైనార్టీలకు చోటివ్వలేదు. – షేక్ నాగూర్ మమ్మల్ని బెదిరిస్తున్నారు మా సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే బెదిరిస్తున్నారు. ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరికలు చేస్తున్నారు. మాకు సంక్షేమ పథకాలు అందించకపోగా.. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? – మొహ్మద్ సాదిక్ -
అధికార పీఠంపై.. మైనార్టీల కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీపై మైనార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే తమకు అన్యాయం చేస్తున్నారని, పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా పైరవీకారులకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కర్నూలుకు చెందిన మైనార్టీ నేత, టీడీపీ యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు పర్వేజ్ సోషల్ మీడియా సాక్షిగావిమర్శలు గుప్పించారు. శ్రీశైలం నియోజకవర్గంలో తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, ఆత్మకూరుకు చెందిన మైనార్టీ నేత అహ్మద్ హుస్సేన్ బహిరంగంగా మండిపడ్డారు. అలాగే ప్రస్తుతం నంద్యాలకు చెందిన మైనార్టీ నేత, మాజీ కౌన్సిలర్ మిద్దె ఉస్సేని ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పరంగా రావాల్సిన పదవుల విషయంలోనూ, నామినేటెడ్ పోస్టుల అంశంలోనూ తమను విస్మరిస్తున్నారని అధికార పార్టీకి చెందిన మైనార్టీ నేతలు అంటున్నారు. మైనార్టీల కోసం కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన హజ్హౌస్ను కూడా అడ్డుకున్నారని మండిపడుతున్నారు. మొత్తంగా అధికార పార్టీపై మైనార్టీ నేతల తిరుగుబావుటా జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. ఇదేనా మీరిచ్చే గౌరవం! బీజేపీతో పొత్తు ఉన్నంత వరకు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు ఎన్నికల తరుణంలోకేవలం మభ్యపెట్టడానికే ఫరూఖ్కు పదవి ఇచ్చిందన్న విమర్శలున్నాయి. అది కూడా ఫరూఖ్కు మాత్రమే మంత్రి పదవి ఇచ్చి ఇతర నేతలను విస్మరిస్తోందని మైనార్టీలు మండిపడుతున్నారు. ఇదే విషయమై తాజాగా నంద్యాలకు చెందిన మాజీ కౌన్సిలర్ మిద్దె ఉస్సేని పార్టీకి రాజీనామా చేశారు. ఈయన టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నారు. మూడుసార్లు నంద్యాల మునిసిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. టీడీపీ తరఫున కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గానూ ఉన్నారు. అయితే, తాజా పరిణామాలతో విసుగెత్తి ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా టీడీపీలో మైనార్టీలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ మంత్రి ఫరూక్ను నిలదీశారు. మైనార్టీలపై ప్రేమ లేదు.. మైనార్టీలపై టీడీపీకి మొదటి నుంచీ ప్రేమ లేదని, అందుకే బీజేపీతో పొత్తు ఉన్నంత వరకూ మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించలేదన్న అంశాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. పార్టీ తీరు ఇదే విధంగా ఉంటే మైనార్టీల నుంచి కనీస మద్దతు కూడా దక్కే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. కర్నూలులో ముస్లిం మైనార్టీల జనాభా అధికం. దీంతో ఇక్కడ హజ్హౌస్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం శంకుస్థాపన కూడా చేశారు. అయితే..చివరకు హజ్హౌస్ ఏర్పాటు చేయకుండా గుంటూరుకు తరలించారు. ఇక ఆత్మకూరు పట్టణంలో తమను కనీసం పట్టించుకోవడం లేదంటూ మంత్రి ఫరూక్ ఎదుటే మైనార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా అధికార తెలుగుదేశం పార్టీపై మైనార్టీ నేతలు ఒక్కొక్కరుగా నిరసన వ్యక్తం చేస్తూ.. బయటకు వచ్చి ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. -
ఇమ్రాన్ ఖాన్కు కైఫ్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: మైనార్టీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించారు. ‘‘భారత్పై పాకిస్తాన్ ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలి. పాక్తో పోలిస్తే మైనార్టీలు భారత్లోనే క్షేమంగా ఉన్నారు. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్లో మైనార్టీల జనాభా శాతం 20శాతం ఉంటే ఇప్పడు 2 శాతానికి పడిపోయింది’ అంటూ ట్విటర్ వేదికగా కైఫ్ కౌంటర్ ఇచ్చారు. ‘భారత్లో మైనార్టీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది’ అని ఇటీవల ఇమ్రాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్లోని అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుత్తున్నాయి. పాక్ ప్రధాని వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఖండించారు. కాగా ఇమ్రాన్, కైఫ్ ఇద్దరూ కూడా మాజీ క్రికెటర్లు కావడం గమన్హారం. There were around 20% minorities at the time of Partition in Pakistan,less than 2% remain now. On the other hand minority population has grown significantly in India since Independence. Pakistan is the last country that should be lecturing any country on how to treat minorities. https://t.co/6GTr3gwyEa — Mohammad Kaif (@MohammadKaif) December 25, 2018 -
మైనారిటీలకు న్యాయం ఆయన హయాంలోనే
సాక్షి, రాయచోటి : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోనే మైనారిటీలకు అన్నివిధాల న్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంచేశారు. బుధవారం సాయంత్రం రాయచోటి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు అకేపాటి అమరనాథరెడ్డిలు పాల్గొన్నారు. మైనారిటీలకు అన్నివిధాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా మైనారిటీలకు మరిన్ని సంక్షేమ పథకాలతో ముందుకొస్తున్నారని.. ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు. ఇంటింటికి నవరత్నాల కార్యక్రమంతో నిరంతరం ప్రజల్లోకి వెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.మహానేత వైఎస్సార్ వల్లే రాయచోటికి త్రాగునీరు లభించిందని, పట్టణ ప్రజలకు ఉచితంగా శుద్ధినీరు అందించేందుకు శ్రీకారం చుడుతున్నామని నాయకులు వివరించారు. చంద్రబాబు హయాంలో రాయచోటికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, ఎంపీ నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని వారు తెలిపారు. ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. -
వైఎస్సార్సీపీతోనే మైనార్టీలకు మేలు
సాక్షి, అమరావతి: మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపే ప్రణాళిక వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ఉందని, ఆయనను ముఖ్యమంత్రిని చేసి అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలంతా కలిసికట్టుగా ఉండి సీఎం చంద్రబాబు అవినీతి, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ చేస్తున్న అవినీతి, దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అతిగొప్ప ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగారని గుర్తు చేశారు. నిత్యం ప్రజల క్షేమం కోసం తపిస్తూ ఆయన అనేక పోరాటాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ.. నిజమైన ప్రజాపాలన ఎలా ఉంటుందో చెబుతూనే..మరోవైపు మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలంతా వైఎస్సార్ కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పారు. మైనార్టీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రయోజనాన్ని ఎవరూ మరువలేరని తెలిపారు. చంద్రబాబు చరిత్రంతా వంచన, మోసం, వెన్నుపోటు, దగా చేయడమేనని మండిపడ్డారు. ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే వైఎస్ జగన్ వ్యవహారశైలి అని పేర్కొన్నారు.విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ముస్లింలు సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగాల్లో రాణించే విధంగా వైఎస్సార్సీపీ పథకాలు ఉండబోతున్నాయని తెలిపారు. ముస్లిం సోదరులంతా వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని కోరారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్భాషా మాట్లాడుతూ బీజేపీతో టీడీపీ కలిసి ముస్లింలకు ద్రోహం చేసిందన్నారు. చంద్రబాబు తన కేబినెట్లో ఒక్కముస్లింకు కూడా స్థానం కల్పించలేదంటే.. ఆయనకు ముస్లింలపై ఉన్న గౌరవం ఏపాటిదో తేలిపోతుందన్నారు. త్వరలో గుంటూరు వేదికగా వేలాది మందితో ముస్లిం గర్జన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్.ఆర్ రెహమాన్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 4 శాతం రిజర్వేషన్లను అమలు చేశారన్నారు. విజయవాడలో జలీల్ఖాన్, కదిరిలో చాంధ్బాషా వైఎస్సార్సీపీ టికెట్పై గెలిచి..తర్వాత కోట్ల రూపాయలకు చంద్రబాబుకు అమ్ముడు పోయారని విమర్శించారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంజాద్ భాషా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే శక్తి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సెంట్రల్ ఆఫీస్ మైనారిటీ విభాగం ఇన్చార్జి వెంకట్, జిల్లా డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు మహబూబ్ షేక్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ పాల్గొన్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికి ప్రశంసా పత్రాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగంలో అంకిత భావంతో పనిచేసిన వారికి సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇందులో భాగంగానే ఎస్.కె. జిలాని (గుంటూరు), ఐహెచ్ ఫరూఖీ (విశాఖపట్నం), ఇషాక్ భాషా (నంద్యాల)కు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకంతో కూడిన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
మైనారిటీలు వైఎస్సార్ను మరవలేరు
-
మైనారిటీలు వైఎస్సార్ను మరవలేరు: సజ్జల
సాక్షి, విజయవాడ : మైనారిటీలకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఎవరూ మరవలేరని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ పార్టీ కార్యలయంలో జరిగిన మైనారిటీ విభాగం రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనారిటీల జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలి అని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బీసీలు, ఎస్సీ, మైనారిటీలు, మహిళలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. చంద్రబాబు పైఎత్తులను ధీటుగా ఎదుర్కొవాలన్నారు. అందరికి అభివృద్ధి ఫలాలు అందేజేయడంతోనే దివంగత నేత వైఎస్సార్ కోట్లాది మంది హృదయాల్లో గుడికట్టుకున్నారని తెలిపారు. సంతలో పశువులు కొన్నట్లు చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నా.. జననేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా పోరాటాలే పార్టీని నిలబెట్టాయన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి పోరాటాలు చేసిన పార్టీ మరొకటి లేదని, ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడడం మాములు విషయం కాదన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కిపోయి, పాలన స్తంభించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్రంతా వంచన మోసం, దగానేనని మండిపడ్డారు. ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే వైఎస్ జగన్ వ్యవహారశైలి అని పేర్కొన్నారు. -
మైనారిటీల ఆశాజ్యోతి జగన్
మైనారిటీల ఆశాజ్యోతిగా జగన్ వెలుగొందుతున్నారని, పాదయాత్రలో కాట్రావులపల్లి జంక్షన్ వద్ద జగన్ను కలిసిన గోకవరం మండలం యర్రంపాలేనికి చెందిన ముస్లింలు షేక్ మగ్దూమ్ (రఫీ), ఇష్రత్, షమీ సుల్తాన్, తహారా బేగం, రూహీ, షోయన, హనీఫ్ తదితరులు అన్నారు. జనం కోసం పాటు పడుతున్న మీకు అంతా మంచి జరగాలని అల్లాను ప్రార్థిస్తున్నామని చెప్పామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు రిజర్వేషన్ను కల్పించి ఆదుకున్నారని, తమ కుటుంబాలు బాగుపడాలంటే వైఎస్సార్ బిడ్డ జగన్ సీఎం కావాలని ఆశిస్తున్నామన్నారు. ఆయనపైనే అన్ని ఆశలు పెట్టుకున్నామన్నారు. సామాన్యులతో సైతం జగన్ ప్రేమగా మాట్లాడుతున్నారని, జనం సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించే నేర్పరితనం జగన్కే ఉన్నాయని తాము నమ్ముతున్నామని ముస్లింలు అభిప్రాయపడ్డారు. -
విజయవాడ వించిపేటలో ఉద్రిక్తత
-
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
-
ప్రముఖ సిక్కు నాయకుడి హత్య
పెషావర్ : ప్రముఖ సిక్కు నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త చరణ్జీత్ సింగ్(52) పాకిస్తాన్లోని పెషావర్లో మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. చరణ్జీత్ షాపులో ఉన్న సమయంలో దాడి చేసిన గుర్తు తెలియని దుండగుడు ఆయనను కాల్చి చంపినట్టు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని దశాబ్దాల క్రితమే ఖుర్రం ఏజెన్సీ నుంచి వచ్చి పెషావర్లో స్థిరపడిన చరణ్జీత్ సిక్కుల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా పెషావర్లో సిక్కులు హత్యలకు గురౌతున్న నేపథ్యంలో.. నాయకుడు చరణ్జీత్ మరణంతో స్థానిక సిక్కులు ఆందోళనకు గురవుతున్నారు. జిజియా చెల్లించనందుకేనా..? ఫెడరల్ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాలో(ఫెటా) నివసించే మైనార్టీలైన సిక్కులు పెషావర్లో స్థిరపడి చిన్న చిన్న షాపులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మొహల్లా జోగన్ షాలో గల గురుద్వారా సమీపంలో నివసిస్తున్నారు. అయితే మైనార్టీలపై కక్షగట్టిన తాలిబన్ వంటి పలు మిలిటెంట్ గ్రూపులు జిజియా(ఇస్లామిక్ పన్ను) కట్టాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. అందుకు నిరాకరించిన వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో వాయువ్య పాకిస్తాన్లో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బడుగులు భగ్గు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నెలరోజుల వ్యవధిలోనే నగరానికి చెందిన ముగ్గురు టీడీపీ ప్రజాప్రతినిధులు దళితులు, మైనారిటీలు, బలహీనవర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క దళితులు, బడుగు బలహీనవర్గాలే తమ తొలి ప్రాధాన్యమని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటే.. మరో పక్క ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి గంటా శ్రీనివాసరావు సహా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్కుమార్, వెలగపూడి రామకృష్ణబాబులు వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. యాధృచ్ఛికమే కావొచ్చు కానీ.. జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ప్రజాప్రతినిధులపై ఒకేసారి బడుగులు, దళితులు, మైనారిటీల నుంచి తిరుగుబాటు మొదలైంది.ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మత్స్యకారుల నుంచి తూర్పు ఎమ్మెల్యేవెలగపూడి రామకృష్ణబాబు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు..విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ దళితుల నుంచి తీవ్ర ప్రతిఘటన చవిచూస్తున్నారు. ఆయనపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది.తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై ముస్లిం మైనారిటీలు ఆగ్రహంతో ఉన్నారు.ఆ ముగ్గురిపై తిరుగుబాటు చేస్తున్న ఆయా వర్గాల్లోని బాధితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడం విశేషం.పార్టీకి కొమ్ముకాస్తూ ఏళ్ళతరబడి సేవ చేస్తున్న తమను పూచిక పుల్ల మాదిరిగా తీసిపారేస్తారా.. అంటూ ఆ వర్గాల నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు ‘దేశం’లో ఏం జరుగుతోంది.. నాలుగేళ్లుగా అధికార బలంతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు చివరికి పార్టీలోని బడుగు బలహీన వర్గాలపై కూడా ప్రతాపం చూపిస్తున్నారనేందుకు ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనాలు. వాసుపల్లిపై దళితాగ్రహం తెలుగుదేశం అర్బన్ జిల్లా అ«ధ్యక్షుడిగా రెండోసారి కొనసాగుతున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్పై సొంత నియోజకవర్గంలోనే.. సొంత పార్టీ నుంచే అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. 23వ వార్డు పార్టీ అధ్యక్ష మార్పు వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. పార్టీలో సీనియర్ అయిన పీవీరామారెడ్డిని కాదని ఇటీవలే పార్టీలో చేరిన బంగారు రవిశంకర్కు అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో రామారెడి వర్గీయులు వాసుపల్లిపై తిరుగుబాటు చేశారు. ఈ విషయమై గత నెల 18న సుపల్లిని నిలదీసేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్లగా రామారెడ్డి వెంట ఉన్న దళిత నేతల పట్ల వాసుపల్లి వ్యవహరించిన తీరు పార్టీలోనే కాకుండా దళిత సామాజిక వర్గీయుల్లో తీవ్ర దుమారం రేపింది. సహజంగానే దూకుడుగా ఉండే వాసుపల్లి దళితులని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం, అమర్యాదగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఇన్నాళ్ళూ పార్టీని, వాసుపల్లిని భుజాన మోసిన తమను కులం పేరుతో దూషించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. పార్టీలోని దళిత నేతలను కూడగట్టి వాసుపల్లిపై త్రీటౌన్ పోలీస్స్టేన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలోని దళితులందర్నీ ఏకంచేసింది. వాసుపల్లిపై తిరుగుబాటుకు దారి తీసింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నెల 11న నియోజకవర్గంలో భారీ బహిరంగసభ పెట్టాలని పార్టీలోని దళిత నేతలు నిర్ణయించారు. ఈ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు జి. చెన్నయ్యలను ఆహ్వానించారు. దళితులను బుజ్జగించేందుకు వాసుపల్లి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. రాజీ కోసం కొంతమంది నేతలకు రెండేసి ఇళ్లు, రూ.30వేల నగదు ఇవ్వచూపినట్టు ప్రచారం జరిగింది. దీనిపై కూడా దళిత నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. డబ్బుతో లొంగదీసుకోవాలని చూడటం తమను అవమానించినట్టేనని దళిత నేతలు భావించారు. ఈ ఉదంతం తర్వాతే వాసుపల్లిని సస్పెండ్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు లోకేష్, చినరాజప్ప, గంటా, అయ్యన్న, జవహర్, నక్కా ఆనందబాబు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గంటాపై ముస్లింల గుర్రు ఇక మంత్రి గంటా శ్రీనివాసరావుపై పార్టీకే చెందిన ముస్లిం మైనారిటీ నేతలు, శ్రేణులు గుర్రుగా ఉన్నారు. పార్టీ ముస్లిం మైనారిటీల సదస్సులో వారి మనోభావాలను పట్టించుకోకుండా లెక్కలేనితనంతో వెళ్లిపోయిన గంటా తీరు చిలికి చిలికి గాలివానలా తయారవుతోంది. శుక్రవారం జరిగిన ముస్లింల సదస్సులో ముం దుగా తాను మాట్లాడి వెళ్లిపోతానని గంటా మైక్ పట్టుకోగా.. మాజీ ఎమ్మెల్యే రెహమాన్ నిలువరించారు. జిల్లా మైనారిటీ నేతలు మాట్లాడే వరకు వేచి ఉండాలని కోరినప్పటికీ గంటా లెక్కచేయకుండా అలిగి ఆగ్రహంతో వెళ్లిపోయారు. గంటా తీరుపై ఇప్పుడు పార్టీలోని మైనారిటీ వర్గాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి గంటాను నిలువరించిన రెహమాన్ సామాన్య కార్యకర్త ఏమీ కాదు. మాజీ ఎమ్మెల్యేగా, వుడా మాజీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. పైగా మంత్రి గంటాకు ఎన్నో ఏళ్ల నుంచి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అటువంటి రెహమాన్కు కనీస గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా వ్యవహరించిన గంటా వ్యవహారశైలిపై ఇప్పుడు మైనారిటీ వర్గాల్లో ఆగ్ర హావేశాలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల సదస్సులో గంటా తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిరా>్యదు చేస్తామని మైనారిటీ విభాగానికి చెందిన ఓ నేత సాక్షికి చెప్పుకొచ్చారు. వెలగపూడిపై జాలర్ల తిరుగుబాటు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై మత్స్యకారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పెదజాలారిపేటలోని స్థానిక మత్స్యకారులను కాదని అనర్హులకు ఇళ్లు కేటాయించిన నిర్వాకంపై వారు గత నెల 22న వెలగపూడిని అడ్డుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు మళ్లీ వెలగపూడి జాలర్లను కలవలేని పరిస్థితి నెలకొంది. గతంలో పెదజాలారిపేటలో మత్స్యకారులకు ప్రభుత్వం 103 ఇళ్లు మంజూరు చేసినా ఇప్పటివరకు నిర్మాణాలకు అతీగతీ లేదు. సరిగ్గా అక్కడే వెలగపూడి మత్స్యకారులకు కాకుండా ఇతర వర్గాలకు 72 ఇళ్లు కేటాయించారు. దీనిపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఆ ఇళ్ల శంకుస్థాపనకు వెళ్లారు. వాస్తవానికి ఆ 72 ఇళ్ల లబ్ధిదారులకు గతంలోనే మధురవాడలో ఇళ్లు కట్టించి ఇచ్చారు. స్థానిక మత్స్యకారులను కాదని వారికే మళ్లీ ఇళ్లు కేటాయించడంతో రగిలిపోయిన మత్స్యకార వర్గీయులు వెలగపూడిని శంకుస్థాపన చేయనివ్వకుండా అడ్డుకున్నారు. జాలారిపేటలోకి అడుగుపెట్టకుండా నిలువరించారు. న్యాయపరమైన డిమాండ్తో నిరసన తెలిపిన మత్స్యకారులను కనీసం ఆ తర్వాతైనా వెలగపూ బుజ్జగించలేదు. దీంతో జాలర్లు మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గత ఎన్నికలలో ఎమ్మెల్యేను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఇదేనా మాకు బహుమతి అంటూ రగిలిపోతున్నారు. -
ముస్లింల విశ్వాసాన్ని టీడీపీ ఎప్పుడో పోగొట్టుకుంది
-
మైనారిటీల కోసం పాటుపడే నిజమైన నేత జగన్
-
ఎదురుచూపులు
స్టేషన్ మహబూబ్నగర్ : చేతినిండా ఉపాధి లేదు.. ఏదైనా చిరు వ్యాపారం చేసుకుందామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. నిరుద్యోగ మైనార్టీ యువత స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం మంజూరుచేసి 9నెలలు గడిచినా సబ్సిడీ రుణాలు ఇంకా చేతికందలేదు. 2017–18కి మైనార్టీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం ఉమ్మడి జిల్లాకు(మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల) 861యూనిట్లు కేటాయించి రూ.9.19కోట్లు మంజూరు చేశారు. 26మండలాలు ఉన్న మహబూబ్నగర్ జిల్లాకు 443యూనిట్లకు రూ.4.72కోట్ల 75లక్షలు మంజూరు చేశారు. క్యాటగిరీ–1(రూ.లక్ష)కు 356యూనిట్లు కేటాయించి రూ.2కోట్ల 84లక్షల 80వేలు మంజూరుచేయగా క్యాటగిరీ–2 (రూ.లక్ష నుంచి రూ.3లక్షలు)కు 68 యూనిట్లకు రూ.95లక్షల 20వేలు, క్యాటగిరీ–3(రూ.3లక్షల నుంచి రూ.10లక్షలు) 19యూనిట్లకు రూ.95లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. నాగర్కర్నూల్కు 148 యూనిట్లకు రూ.కోటి 57లక్షల 40వేలు, జోగుళాంబ గద్వాల జిల్లాకు 145యూనిట్లకు రూ.కోటి54లక్షల 40వేలు, వనపర్తి జిల్లాకు 125యూనిట్లకు గాను రూ.కోటి32లక్షల 40వేలు నిధులు కేటాయించారు. ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమయ్యేనా..? గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు యూనిట్లు తక్కువగా కేటాయించడం.. వేలల్లో దరఖాస్తులు రావడంతో చాలామందికి సబ్సిడీ రుణాలు అందని ద్రాక్షగా మిగిలేది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు వేర్వేరుగా మైనార్టీ సబ్సిడీ రుణాలు మంజూరుచేసింది. ఇప్పటికీ ఆన్లైన్ ప్రారంభించకపోవడంతో రుణాలు అందుతాయో లేదోనన్న ఆందోళన నిరుద్యోగ యువతలో వ్యక్తమవుతోంది.జిల్లాలు ఏర్పడడంతో ఎక్కువమంది రుణాలు లభిస్తాయని కొండంత ఆశతో ఉన్నవారంతా ఆవేదనకు గురవుతున్నారు. వెంటనే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు మైనార్టీ సబ్సిడీ రుణాలకు సంబంధించి అన్ని రికార్డులను సిద్దం చేశాం. జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లాలోని బ్యాంకులకు యూనిట్లు కూడా కేటాయించాం. ప్రభుత్వం నుంచి ఇంకా ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. – వెంకటేశ్వర్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రుణాలు అందజేయాలి సబ్సిడీ రుణాల యూనిట్లు మంజూరుచేసి 9నెలలు గడిచినా ఇప్పటికీ ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించకపోవడం సరికాదు. మైనార్టీ సంక్షేమానికి పాటుపడుతున్నామన్న ప్రభుత్వ మాటలు కేవలం నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. వెంటనే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి రుణాలు అందజేయాలి. – ఖాజా అజ్మత్అలీ, మైనార్టీ నేత, మహబూబ్నగర్ -
ఆర్థికంగా వెనుకబడిన వారికి సబ్సిడీ రుణాలు
విజయనగరం పూల్బాగ్: ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, క్రిస్టియన్, బ్రాహ్మణ కులాలు కానివారు)2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీతో కూడిన సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తోందని కలెక్టర్ వివేక్యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాకు రూ.12.76 కోట్లతో 638 మందికి రుణాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయల యూనిట్ ధరలో 50 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం ఉంటుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాల వారు పట్టణ ప్రాంతాల్లో రూ.1.03 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.61వేల లోపు వార్షిక ఆదాయం గల 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్నవారు రుణాలకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు www.apobm-m-r.c-f-f.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని మండల, మున్సిపల్ స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. వెబ్సైట్ ఈనెల 19వ తేదీ నుంచి ఓపెన్ చేయబడిందని అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08922–272080, 94409 66575 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
మైనార్టీలపై టీడీపీ దాడి
-
మైనార్టీలపై టీడీపీ దాడి
సాక్షి, పిడుగురాళ్ల: గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులో ఉద్రిక్తత నెలకొంది. మైనార్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేతలు అంటి రాంబాబు, ఎల్.అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్లు పరామర్శించారు. పోలీసులు టీడీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని వారు ఆరోపించారు. -
‘అనంత’ దుమారం
గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరణనిచ్చి, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని బుధవారంనాడు చెప్పడంతో రెండు వారాలుగా స్తంభించిన పార్లమెంటులో ప్రశాంతత అలుముకుంది. ఈలోగా కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగంపైనా, లౌకికవాదంపైనా, లౌకికవాదులపైనా చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో మళ్లీ ఉభయ సభలూ అట్టుడికాయి. రాజ్యాంగాన్ని మార్చడానికే బీజేపీ అధికారంలోకొచ్చిందని, దాన్నుంచి ‘సెక్యులర్’ అనే పదాన్ని తొలగిస్తామని ఒక కుల సభలో మాట్లాడుతూ ఆయన ప్రకటించారు. అంతటితో ఆగలేదు... ‘లౌకికవాదులు అమ్మానాన్నలెవరో తెలియనివారితో సమానమ’ని నోరు పారేసుకున్నారు. కుల మేమిటో, మతమేమిటో చెప్పుకునేవారే ఆయన దృష్టిలో గొప్పవారు. ఎవరైనా సెక్యులరిస్టునని చెప్పుకుంటే అలాంటి వ్యక్తిని మంత్రిగారు అనుమానంతో చూస్తారట! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ‘ఢిల్లీని పాలించాల్సింది రాముడి సంతానమా, అక్రమ సంతానమా తేల్చుకోవాల’ని చేసిన వ్యాఖ్యకూ, ఇప్పుడు అనంత్కుమార్ హెగ్డే మాట తీరుకూ పెద్దగా తేడా లేదు. అప్పుడు కూడా ఇలాగే ఉభయ సభలూ అట్టుడికితే అలా మాట్లాడటం పొరపాటేనని ఆమె తరఫున నరేంద్రమోదీ సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. రెండేళ్లక్రితం రాజ్యాంగ దినోత్సవాన్నీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంతినీ పురస్కరించుకుని లోక్సభ రెండురోజులు ప్రత్యేక సమావేశాలు జరుపుకున్నప్పుడు సైతం లౌకికవాదం ప్రస్తావన వచ్చింది. అది రాసేనాటికి అందులో లౌకికవాదం, సామ్యవాదం పదాలు లేవని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఎత్తిచూపితే... అప్పట్లో వాటిని చేర్చడం అంబేడ్కర్కు సాధ్యపడలేదని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే జవాబిచ్చారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలు రాజ్యాంగ పీఠికలో చేరాయి. అవి ఎప్పుడు చేరాయన్నది కాదు... రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి బింబిస్తున్నాయా లేదా అన్నదే ప్రశ్న. లౌకికవాదం రాజ్యాంగ స్ఫూర్తికి అను గుణమైనదేనని ఆ చర్చలో రాజ్నాథ్సింగ్ కూడా అంగీకరించారు. రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్నప్పుడు అందులో బ్రిటన్, అమెరికా, కెనడా తదితర దేశాల రాజ్యాంగాల్లోని అంశాలున్నాయి తప్ప మన ప్రాచీన భారతీయ విలువలు, మను ధర్మ సూత్రాలు ఎక్కడని గుండెలు బాదుకున్న వారున్నారు. డాక్టర్ అంబేడ్కర్, రాజ్యాంగ నిర్ణాయక సభలోని ఇతర సభ్యులూ మూడేళ్లపాటు సాగిన చర్చల పరం పరలో ఇలాంటి ఎన్నో ఒత్తిళ్లను, విమర్శలను తట్టుకుని ఇప్పుడు మనం అను సరిస్తున్న రాజ్యాంగాన్ని రూపొందించారు. అనంత్కుమార్ హెగ్డే కొత్తగా లోక్సభలో అడుగుపెట్టినవారు కాదు. ఆయన అయిదు దఫాలనుంచి ఎంపీగా ఎన్నికవుతున్నారు. తొలిసారి కేంద్రమంత్రి అయ్యారు. ఆ స్థాయి నాయకుడు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడారో అనూహ్యం. ఇంతకూ లౌకికవాదం అనే పదంపై తనకున్న అభ్యంతరం ఏమిటో, ఎందుకో ఆయన చెప్పలేదు. మతం, కులం వద్దనుకునేవారివల్ల దేశానికి కలుగుతున్న నష్టమేమిటో ఆయన వివరించలేదు. లౌకికవాదం విషయంలో కాంగ్రెస్ ఆలోచననూ, దాని ఆచరణనూ వ్యతిరేకించినవారు ఇంతక్రితమూ ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఈ పదానికి పోటీగా ‘కుహనా లౌకికవాదం’ అనే పదబంధం వాడుకలోకి తెచ్చారు. ఇలా అనడం ద్వారా లౌకికవాదాన్ని ఆచరిస్తున్నామంటున్నవారు ‘నిజమైన’ లౌకికవాదులు కాదన్నట్టు ధ్వనించారు తప్ప అసలు లౌకికవాదమే మహాపరాధమని అద్వానీ ఎన్నడూ చెప్పలేదు. ఇన్నేళ్లు గడిచాక ఆ విషయంలో పరిణతి రావడానికి బదులు మొర టుదనం పెరిగిందని అనంత్కుమార్ హెగ్డే వ్యాఖ్యలు చూస్తే అర్ధమవుతుంది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో ఏకీభవించడం లేదని కేంద్రం పార్ల మెంటులో వివరణనిచ్చింది. లౌకికవాదంపై, లౌకికవాదులపై ఆయనకున్న అభి ప్రాయాలతో ప్రజాస్వామ్యంపై విశ్వాసమున్న వారెవరూ ఏకీభవించలేరు. మన దేశంలో అనుసరిస్తున్నామని చెప్పుకునే లౌకికవాదంపై ఎప్పటినుంచో విమర్శలున్నాయి. సమర్ధనలు ఉన్నాయి. రాజ్యం, మతం వేర్వేరుగా ఉండటమే లౌకికవాదమని ప్రపంచంలో మిగిలినచోట్ల అనుకున్నా... మన దేశంలో మాత్రం అన్ని మతాలను సమానంగా గౌరవించడమే లౌకికవాదమన్న అభిప్రాయం స్థిరపడింది. కాంగ్రెస్ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మైనారిటీలకు భద్రత కల్పించడమే లౌకికవాదం అనే స్థాయికి తీసుకెళ్లింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయ్యాక అందుకు గల కారణాలను అన్వేషించే బాధ్యత తీసుకున్న ఆ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ... పార్టీపై జనంలో లౌకికవాదం ఎలాంటి అభిప్రాయం కలగజేసిందో ఒక సందర్భంలో చెప్పారు. అన్ని వర్గాలకూ సమన్యాయం చేయాలన్నదే పార్టీ విధానమైనా... మైనారిటీలకు కాంగ్రెస్ సన్ని హితంగా ఉంటున్నదన్న అభిప్రాయం జనంలో ఏర్పడిందని ఆంటోనీ భావించారు. మైనారిటీలకు తమ పాలనలోనే భద్రత ఉంటుందని చెప్పడం తప్ప వారికోసం నిజానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ముస్లింల స్థితిగతులపై జస్టిస్ రాజీందర్ సచార్ నేతృత్వంలో జాతీయ కమిటీని ఏర్పాటు చేసినా ఆ కమిటీ సిఫార్సుల అమలులో అది అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందువల్లే వివాదం సృష్టించడం కోసం అనంత్కుమార్ హెగ్డే ఇలా మాట్లాడారని విపక్షాలంటున్నాయి. లౌకికవాదంపై ఆయనకు ఏ అభిప్రా యమైనా ఉండొచ్చు. కానీ దాన్ని నాగరికంగా, సవ్యమైన చర్చకు దారితీసే విధంగా వ్యక్తం చేయాలి తప్ప ఇష్టానుసారం తోచినట్టు మాట్లాడకూడదు. కేంద్రమంత్రి పదవిలో ఉన్నందువల్ల తాను అన్నిటికీ అతీతుడనని హెగ్డే భావిస్తే దాన్నెవరూ అంగీకరించరు. -
గుజరాత్లో ఆశ్చర్యకర పరిణామం!
అహ్మదాబాద్: గుజరాత్లో 182 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 20 శాతంపైగా ఉన్న ముస్లిం ఓటర్లు 20 స్థానాల్లో ప్రభావం చూపించనున్నారు. ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో నాలుగు అహ్మదాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. భరూచ్, కచ్ జిల్లాలో మూడేసి ఉన్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ముస్లింల గురించి ఏ పార్టీ కూడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఎన్నికల్లో ముస్లింలు, మైనారిటీల గురించి ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మౌనం దాల్చడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కుల సంఘాలు, నాయకులు హవా నడుస్తోంది. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్, ఓబీసీ నాయకుడు-కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అల్పేశ్ థాకూర్, దళిత నాయకుడు జిగ్నేశ్ మెవానీ తమ గళాన్ని గట్టిగా విన్పిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో వీరికి ప్రాధాన్యం దక్కుతోంది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ముస్లింల ప్రస్తావన రాకపోవడం గమనార్హం. గుజరాత్లో దాడుల తర్వాత 2002లో జరిగిన ఎన్నికల్లో ముస్లింల భద్రత ప్రాధానాంశంగా మారింది. మైనారిటీల భద్రత అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేసింది. 2007 ఎన్నికల్లోనూ ఇదే రకమైన వ్యూహంతో కాంగ్రెస్ ముందుకెళ్లింది. సోనియ గాంధీ నేరుగా నరేంద్ర మోదీని మృత్యు వ్యాపారిగా వర్ణించారు. 2012 ఎన్నికల సమయంలోనూ ముస్లిం, మైనారిటీల భద్రత అంశాన్ని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విస్తృతంగా వాడుకుంది. అయినప్పటికీ అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వచ్చాయి తప్పా మార్పు ఏమీ కనబడలేదు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇదేవిధంగా ప్రచారం చేసింది. విషబీజాలు నాటుతున్నారంటూ మోదీపై పరోక్షంగా సోనియా విమర్శలు కూడా చేశారు. ఈసారి కూడా ఫలితం బీజేపీకి అనుకూలంగానే వచ్చింది. కాషాయ పార్టీ 26 ఎంపీ సీట్లు గెల్చుకుంది. అందుకే ఈ పర్యాయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ చూస్తుండగా అరడజను దేవాలయాలను సందర్శించి, పూజలు చేశారు. కాంగ్రెస్ గత ప్రచారానికి భిన్నంగా ఎక్కడా ముస్లిం భద్రత అంశాన్ని ప్రస్తావించలేదు. గుజరాత్లో 9 నుంచి 10 శాతం వరకు ముస్లింలు ఉన్నారు. దీని ఆధారంగా చూస్తే అసెంబ్లీ 18 వరకు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండాలని కొంతమంది వాదన. 1980లో అత్యధికంగా 12 మంది ముస్లింలు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. గుజరాత్ నుంచి పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైన ఎంపీ అహ్మద్ పటేల్ కావడం విశేషం. 1977లో ఇద్దరు ముస్లింలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2007లో కాంగ్రెస్కు 69 శాతం, బీజేపీకి 20 శాతం.. 2012లో కాంగ్రెస్కు 64 శాతం, బీజేపీకి 16 శాతం ముస్లింలు ఓట్లు వేసినట్టు సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైంది. ముస్లిం ఓట్ల శాతం క్రమంగా తగ్గుతుండటంతో తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ రూటు మార్చింది. ఈసారి 49 శాతం కాంగ్రెస్కు, 27 శాతం బీజేపీకి ముస్లిం ఓట్లు రావొచ్చని సీఎస్డీఎస్ తాజా సర్వే అంచనా వేసింది. డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
మైనారిటీలకు 100% సబ్సిడీ రుణాలు
సాక్షి, హైదరాబాద్: మైనారిటీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా 100 శాతం సబ్సిడీపై రుణాలు అందించే ప్రతిపాదనను త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు నివేదిస్తానని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఆయా పథకాల కింద పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నా బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 80 సబ్సిడీ మంజూరు చేస్తున్నా కేవలం 20 శాతం రుణం కోసం బ్యాంకర్లు నిరాకరించటమేమిటని ప్రశ్నించారు. భవిష్యత్లో బ్యాంకర్లతో ప్రమేయం లేకుండా ప్రభుత్వమే 100 శాతం సబ్సిడీపై నేరుగా రుణాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న రుణాల మంజూరు ప్రక్రియ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మైనారిటీ ఓవర్సీస్ ఉపకార వేతనాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించాలని సూచించారు. మైనారిటీ కుట్టు శిక్షణ, కంప్యూటర్ సెంటర్ల నిర్వహణ సరిగ్గా లేదని, వాటి స్థానంలో జిల్లాకు ఒకటి చొప్పున మైనారిటీ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉన్న ఖాళీ పోస్టులను ప్రభుత్వం త్వరలో భర్తీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సమావేశంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్, మేనేజింగ్ డైరెక్టర్ షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీలు వైఎస్సార్సీపీతోనే
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి మదనపల్లె రూరల్: మైనార్టీలు ఎప్పటికీ వైఎస్సార్సీపీతోనే ఉంటారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తెలిపారు. శుక్రవారం నవరత్నాల సభలో పాల్గొనేందుకు మదనపల్లెకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనార్టీలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారన్న మాటలు అవాస్తవమన్నారు. డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో మైనార్టీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వారిని మరల్చేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు, ప్రలోభాలు పెట్టినా ఎప్పటికీ జరగదన్నారు. ప్రధాని మోదీ మీడియాలో చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఒకే దేశం–ఒకే ఎన్నికలు జరపాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. అదే జరిగితే రానున్న ఎన్నికలు వైఎస్సార్సీపీకి చాలా కీలకమన్నారు. కార్యకర్తలు పన్నెండునెలలు శక్తివంచన లేకుండా పార్టీ కోసం కృషి చేయాలన్నారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల జోక్యంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎలాంటి పథకాలకు నోచుకోకుండా, అన్యాయ మైపోయారన్నారు. వైఎస్సార్సీపీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ అండగా ఉంటామని, జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలన్న ధ్యేయంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి బూత్కమిటీలు కీలకమని, జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే బూత్కమిటీ సభ్యులు అపాయింట్మెంట్ లేకుండా నేరుగా కలిసే అవకాశం ఉంటుందన్నారు. బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను వైఎస్సార్ కుటుంబంలో భాగస్వాములుగా చేసి, నవరత్నాల పథకాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని, నిస్వార్థంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బాబ్జాన్, ఉదయ్కుమార్, షమీం అస్లాం, జింకావెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు. -
అది రాజకీయ ప్రచారమే!
► మైనారిటీల అభద్రతపై వెంకయ్య నాయుడు ► భారతీయుల రక్తంలోనే లౌకికవాదముంది ► పరోక్షంగా అన్సారీకి చురకలు ► నేడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం న్యూఢిల్లీ: దేశంలో మైనారిటీలు అభద్రతా భావంలో ఉన్నారన్న వ్యాఖ్యలను కాబోయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖండించారు. మైనారిటీల్లో ఇలాంటి భావమే లేదని.. రాజకీయ ప్రచారం కోసమే కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలను పరోక్షంగా తోసిపుచ్చారు. ‘భారత్లో మైనారిటీలు అభద్రతతో ఉన్నారని కొందరంటున్నారు. ఇది రాజకీయ ప్రచారమే. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్లోనే మైనారిటీలు భద్రంగా ఉన్నారు. వారి హక్కులను పొందుతున్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్నది అవాస్తవం. ఇక్కడి నాగరికత ప్రభావం కారణంగా భారత సమాజం చాలా సహనశీలమైనది’ అని వెంకయ్య గురువారం ఢిల్లీలో పేర్కొన్నారు. దేశంలో సహనం ఉన్నందునే ప్రజాస్వామ్యం విజయవంతంగా నడుస్తోందన్నారు. అయితే మతం పేరుతో ఎవరిపైన దాడి జరిగినా దాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. అన్సారీ వ్యాఖ్యలపై వీహెచ్పీ మండిపడింది. ముస్లింల అభద్రతపై మాట్లాడి మహ్మద్ అలీజిన్నా మార్గంలో అన్సారీ నడుస్తున్నారని వీహెచ్పీ జాతీయ సహకార్యదర్శి సురేంద్ర జైన్ విమర్శించారు. అన్సారీ ఉపరాష్ట్రపతి పదవికి అవమానం చేశారన్నారు. నేడు వెంకయ్య ప్రమాణ స్వీకారం ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం రాజ్యసభ చైర్మన్గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా గురువారం పీటీఐ వార్తాసంస్థతో వెంకయ్య మాట్లాడుతూ.. చట్టాలను సమర్థవంతంగా అమలుచేయటం, రాజ్యసభను సజావుగా నడిపించటంలో ఎంపీల సహకారం తీసుకుంటానని ఆయన తెలిపారు. ‘పార్లమెంటు సజావుగా, అర్థవంతంగా నడవడంలో మనం మరింత పరిణతితో వ్యవహరించాలి. చైర్మన్ సభను నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. సభ్యుల హక్కులకు సంరక్షకుడు కూడా’ అని వెంకయ్య పేర్కొన్నారు. -
మైనార్టీ జీవితాల్లో రాజన్న ముద్ర
-
‘విద్య’లో ముస్లింల వెనుకబాటు
ఓ కమిటీ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: విద్యపరంగా మైనార్టీలలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే ఓ సంస్థ ఏర్పాటు చేసిన ప్యానెల్ వెల్లడించింది. కేంద్ర పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలు మూడంచల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ముస్లింలలో సాధికారత వస్తుందని సూచించింది. వారికోసం 211 పాఠశాలలు, 25 కమ్యూనిటీ కాలేజీలు, 5 జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పాలని పేర్కొంది. పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలు లేదా నవోదయ విద్యాలయాల మాదిరిగా నడపాలని సూచించింది. దీనిపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి అబ్బాస్ నఖ్వీని ప్రశ్నించగా.. విద్య పరంగా మైనార్టీల సాధికారతపై కేంద్ర విధానాల్లో భాగంగా ఈ నివేదిక కూడా ఒకటని చెప్పారు. ‘ఈ నివేదికను పరిశీలిస్తున్నాం. నివేదికలోని అంశాలు ఆచరణీయమైనవని అనిపిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తాం’అని వివరించారు. మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర నిధుల ద్వారా నడిచే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గతేడాది డిసెంబర్ 29న 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఇటీవల తన నివేదికను విడుదల చేసింది. -
నాట్ ఇన్ మై నేమ్
సమానత్వం కోరుతూ శాంతికాముకుల వినూత్న నిరసన సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ సందడిగా ఉండే ట్యాంక్బండ్ బుధవారం సాయంత్రం నాలుగ్గంటల సమయంలో నిశ్శబ్దం ఆవహించింది. అది న్యాయాన్ని డిమాండ్ చేస్తోన్న నిశ్శబ్దం. నిరసనతో కూడిన నిశ్శబ్దం. అన్యాయాన్ని మౌనంగా ధిక్కరిస్తోన్న నిశ్శబ్దం. ఆహారం పేరుతోనో, ఆవు పేరుతోనో, ఇంకో పేరుతోనో, మరేదైనా పేరుతోనో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై నోరు విప్పాలంటూ నిశ్శబ్దంతో నిరసనని పాటించారు దేశంలో శాంతిని కాంక్షిస్తున్న వారు. మానవ హక్కులు కాలరాయొద్దంటున్న వారు. మానవతావాదులు. అంతా ఒక్కరొక్కరుగా ట్యాంక్బండ్పైకి చేరారు నిశ్శబ్దంగా. ప్రజలంటే ఒక మతమో, ఒక అంకెనో, ఒక ఓటో మాత్రమే కాదు అని అభిప్రాయపడుతున్న వారు. జనం అంటే ధనవంతులు మాత్రమే కాదంటున్నవారు. జనం అంటే ఒక్క పురుషులు మాత్రమే కాదంటున్నవారు. జనం అంటే మనం అంటున్నవారు. సమానత్వానికీ దేశంలో స్థానం కల్పించాలంటున్న వారు. స్త్రీలూ, పురుషులూ, థర్డ్ జెండర్స్, ట్రాన్స్ జెండర్స్, పిల్లలూ, పెద్దలూ అంతా అక్కడ చేరారు. అయితే అక్కడంతా నిశ్శబ్దమే. సంస్థల పేర్లు లేవు, రాజకీయ పార్టీల జాడల్లేవు, విద్యాసంస్థల, సంఘాల బ్యానర్లు లేవు. ఊకదంపుడు ఉపన్యాసాలసలేలేవు. ఉన్నదంతా వ్యక్తులే. వారి చేతుల్లో మాత్రం ‘‘నాట్ ఇన్ మై నేమ్’’ ప్లకార్డులు. దేశవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతోన్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ముంబై, బెంగళూరు, ఢిల్లీలోని జంతర్మంతర్, హైదరాబాద్లాంటి ప్రధాన నగరాల్లో సమానత్వాన్ని కాంక్షిస్తోన్న పౌరులంతా సాయంత్రం నాలుగ్గంటల నుంచి ఆరుగంటల వరకు మౌనంగా నిరసనని తెలియజేశారు. ‘‘నాట్ ఇన్ మై నేమ్’’ అనే స్లోగన్కి అర్థం ఈ రోజు నేను దాడికి గురికాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నేను కూడా ఒకానొక కారణంతో దాడికి గురికావచ్చు. ఇప్పుడు నేను వ్యతిరేకించకపోతే రేపు నా వంతూ రావచ్చు. అందుకే ఈ దాడులు ఆపాలంటూ మా నిశ్శబ్ద నిరసన ఇది అన్నారు కార్యక్రమంలో ప్రొఫెసర్ రమామేల్కొటే, వసంతా కన్నాభిరాన్, కల్పనా కన్నాభిరాన్, సుధ, సునీతా రెడ్డి, ఆశాలత, పద్మజాషా, వసుధ, సుమతి, అనితా రెడ్డి, అజీజ్పాషా, తేజస్వీని, కృశాంక్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీ వారిద్దరికి వ్యతిరేకం ’
హైదరాబాద్: బీజేపీ భారత దేశ ప్రజలను కులాలు, మతాల పరంగా విడదీస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతం భిన్నత్వంలో ఏకత్వమని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, ముస్లింల మీద దాడులు పెరిగాయన్నారు. దళితులకు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి కూడా అదేవిధమైన భావాలు ఉన్నాయన్నారు. కోవింద్ రాష్ట్రపతి అయితే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ చేయడం ఫ్యాషన్ అయిందని వెంకయ్య వాఖ్యలు చేయడం రైతుల్పి అవమాన పరచడమేనని అన్నారు. అంతరాత్మ ప్రబోధం మేరకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయానలి ఎమ్మెల్యేలను కోరారు. రాష్ట్రపతి ఎన్నికలు రెండు భిన్న సిద్ధాంతాల పోరుగా అభివర్ణించారు. -
మైనార్టీలు నమ్మటం లేదు!
– సీఎంకు నేరుగా తేల్చిచెప్పిన పలువురు నేతలు – అందుకే బెదిరింపులకు దిగిన సీఎం చంద్రబాబు – మునిసిపల్ చైర్పర్సన్ను దించే అవకాశం లేదంటున్న నిపుణులు – నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టే వీలులేదంటున్న చట్టాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉపఎన్నికల వేడి అధికార పార్టీ అధినేతకు నేరుగా తాకింది. మైనార్టీలు పార్టీని నమ్మడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నంద్యాలకు చెందిన పలువురు నేతలు తేల్చిచెప్పారు. మైనార్టీలకు నిర్దిష్టంగా ఏదైనా లబ్ధి చేస్తే కనీసం వారికి చెప్పుకునే వీలు ఉంటుందని ఈ సందర్భంగా సీఎంకు స్పష్టం చేసినట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనలో భాగంగా నంద్యాలలో సీఎం చంద్రబాబు.. పార్టీ నేతలు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్పొరేటర్లు తమ భావాలను నిర్దిష్టంగా తేల్చిచెప్పారు. మైనార్టీలకు ఇది చేశామని చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైనా వారి సంక్షేమం కోసం ఏమైనా చేస్తేనే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మరుసటి రోజు తమకు ఓట్లు వేయాల్సిందేనని సీఎం బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. తాను ఇచ్చే పింఛన్లను తీసుకుని, తాను వేసిన రోడ్లపై నడిచి ఎందుకు ఓట్లు వేయరని ఎదురు ప్రశ్న వేశారు. పార్టీ పరిస్థితిని గమనించే సీఎం ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఓట్లు వేయకుంటే అభివృద్ధి చేయబోమంటూ బెదిరింపులకు దిగడం ద్వారా లబ్ధి పొందాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి..పార్టీ మారడంతో నంద్యాల మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో మునిసిపల్ చైర్ పర్సన్ను దించాలనే నాటకానికి కూడా తెరదీశారు. చట్టం కుదరదంటోంది..! వాస్తవానికి స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన తర్వాత జెడ్పీ చైర్మన్ను కానీ, ఎంపీపీని కానీ, మునిసిపల్ చైర్మన్ను కానీ దించాలంటే గతంలో రెండేళ్ల కాల పరిమితి ఉండేది. రెండేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టి దించే వెసులుబాటు ఉండేది. అయితే, ఇది పరిపాలనకు ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ సమయాన్ని నాలుగేళ్లకు పెంచారు. అంటే నాలుగేళ్ల వరకూ స్థానిక సంస్థల్లో అంటే జెడ్పీ చైర్మన్ను కానీ మునిసిపల్ చైర్మన్ను కానీ ఈ సమయంలోగా దించే అవకాశం లేదన్నమాట. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టంలోని సవరణలు కూడా 2008లో చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 91–ఏ ప్రకారం పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్ల తర్వాత సగం కంటే ఎక్కువ మంది సభ్యులు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీహెచ్ఎంసీ చట్టం–1995లో యాక్ట్ ఆఫ్ 42 ఆఫ్ 2008 ప్రకారం సవరణలు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానంలో సస్పెండైన సభ్యులు కూడా ఓటింగులో పాల్గొనే వీలుంటుందని జీహెచ్ఎంసీ చట్టం–1955లోని 91–ఏ సెక్షన్ స్పష్టం చేస్తోంది. అయితే, చట్టాలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ అధికార తెలుగుదేశం నేతలు మాత్రం కార్పొరేటర్లపై బెదిరింపులకు దిగుతున్నారు. 24 గంటల్లో పార్టీలోకి రాకపోతే సస్పెన్షన్ వేటు వేసి చైర్పర్సన్ను దించేస్తామనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల వేడి అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అర్థమవుతోంది. -
మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలి
కర్నూలు సిటీ: విద్య పట్ల రాష్ట్రంలోని మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర స్థాయి అధికారి డాక్టర్ షేక్ నాసర్ సాహెబ్ అన్నారు. సోమవారం నగరంలో ఉర్దూ టీచర్లకు ఆరు రోజుల పాటు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమైయ్యాయి. ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మైనార్టీల్లో అధిక శాతం నిరక్షరాస్యులు ఉన్నారని, వారిని అక్షరాస్యులుగా మార్చాల్సిన బాధ్యత ఉర్దూ టీచర్లపై ఉందన్నారు. రాష్ట్రంలోని కస్తూర్బా పాఠశాలల్లో 3600 సీట్లు ఉంటే 2600 ఖాళీగానే ఉన్నాయన్నారు. ఎస్ఎస్ఏ సీమెట్ అధ్యాపకుడు ప్రసాద్రావు, ఎస్ఎస్ఏ పీడీ రామచంద్రారెడ్డి, ఏఎంఓ మాలిబాషా, చిత్తూరు ఏఎంఓ మహ్మాద్ఖాన్, సీఎంఓ జయరామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ ఏఎంఓ రఫీ, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై ‘ప్రత్యేక’ శ్రద్ధ మా స్కూల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఉపాధ్యాయులందరూ నమన్వయంతో పని చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలకు ఇది ఒక కారణం. నేను ఇక్కడ ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాను. వరుసగా ఆరేళ్లు పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. – వాడాల సుబ్బరాయుడు యాదవ్, కునుకుంట్ల జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం -
మైనార్టీల ద్రోహిలా వ్యవహరిస్తున్నారు..
నెల్లూరు: మైనార్టీల ద్రోహిలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హంజాహుస్సేన్ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీలను అవమానించే విధంగా చంద్రబాబు ప్రవర్తన ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు చోటు కల్పించకపోవడం దారుణమన్నారు. మైనార్టీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన బాబు ప్రస్తుతం మోసం చేయడం తగదని హితవు పలికారు. చంద్రబాబు అక్రమ ఆస్తులకు బినావీులుగా ఉన్న వారికి మంత్రి పదవులిచ్చారని ఆరోపించారు. గతంలో బీజేపీపై నిందలు వేసి ఇప్పుడు ఆ పార్టీతో చంద్రబాబు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీలో ఉన్న మైనార్టీలు పార్టీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మైనార్టీలందరూ ఏకమై చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. నాయకులు ఇంతియాజ్, అబూబాకర్, ఫయాజ్ అహ్మద్, రఫీ, హాజీ, మగ్దూమ్ మొమద్దీన్ పాల్గొన్నారు. -
ముస్లింలకు దగా
మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీలకు చోటు కల్పించని చంద్రబాబు ► మేమేం పాపం చేశామంటున్న ముస్లింలు ► వక్ఫ్, హజ్ యాత్రికుల సమస్యలు ముస్లిమేతరులకు ఎలా తెలుస్తాయని నిలదీత ► వచ్చే ఎన్నికల్లో సత్తా చూపుతామని హెచ్చరిక కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలకు మరోసారి మొండిచేయిచూపించారు. తాజాగా చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో కూడా వారికి చోటు కల్పించలేదు. దీంతో జిల్లాలోని ముస్లింలు బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ వ్యతిరేకిలా మారిందని విమర్శిస్తున్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు ఏర్పరుచుకున్న తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖను ముస్లిమేతరులకు ఇస్తే మసీదులు, వక్ఫ్, హజ్ యాత్రికులు ఎదర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని, మైనారిటీల సంక్షేమం కోసం ఎలా పని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కూడా చంద్రబాబు గుర్తించడం లేదని వాపోతున్నారు. నంద్యాలకు చెందిన సీనియర్ మైనారిటీ నేత ఎన్ఎండీ ఫరూక్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అందులోనే ఉన్నారు. పార్టీకి వీర విధేయుడిగా పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని గుర్తించకపోవడం, పదవులు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. ముస్లింల వ్యతిరేకి చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ మతోన్మాదం వైపు నడుస్తోంది: తెలుగుదేశం పార్టీ క్రమంగా మతోన్మాదంవైపు అడుగులేస్తోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్లో ఒక్క ముస్లింకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అలా మైనారిటీలను అణిచివేయాలనే ధోరణి చంద్రబాబులో కూడా మొదలైంది. ముస్లింలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. చంద్రబాబు అసలు రూపం తెలుసుకోవాలి. ఆత్మాభిమానం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి తగిన బుద్ధి చెప్పాలి.-ఎంఎ.గఫూర్, సీపీఎం మాజీ ఎమ్మెల్యే ముస్లింలను అవమానించిన చంద్రబాబు: కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముస్లింలను అవమానించారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు, పదవులు కల్పించాలని రాజ్యాంగం చెబుతుంది. టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మైనారిటీలను విస్మరించడం దారుణం.-మౌలాన హాఫీజ్ ఖాజీ అబ్దుల్ మాజిద్, ముస్లిం జేఏసీ చైర్మన్, జామేతే ఉలమా జిల్లా అధ్యక్షుడు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించకుండా అన్యాయం చేశారు. జనాభాలో 12శాతం మంది ఉన్న ముస్లింలు ఆయనకు గుర్తుకు రాకపోవడం సరికాదు. త్వరలో నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో ముస్లింల వద్దకు వెళ్లి ఓటు ఎలా అడగాలి. -ఎన్ఎండీ ఫిరోజ్, నంద్యాల టీడీపీ యువనేత హామీలతో మభ్యపెడుతున్నారు: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలను అణచివేస్తూనే ఉన్నారు. పదవులు ఇవ్వకుండా హామీలతో మభ్యపెడుతున్నారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో మళ్లీ ముస్లింలకు అన్యాయం జరిగింది. ముస్లింలందరూ సంఘటితమై బాబుకు గుణపాఠం చెప్పాలి.– ఖాద్రి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం -
టీడీపీలో కనిపించని సామాజిక న్యాయం
-
బడుగులను ఓటు బ్యాంకుగా చూస్తోంది
సర్కార్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీనవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తోందని బీజేపీ అధ్య క్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాల మాదిరిగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ వర్గాల పురోభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎన్నికలకు ముందు ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని హామీనిచ్చి వీటి అమల్లో పూర్తిగా విఫలమయిందన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా బుధవారం పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసుల్లో మార్పునకు సేవాలాల్ ఎంతో కృషి చేశారన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నానావత్ భిక్కునాథ్ నాయక్, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతా సాంబ మూర్తి, ఎస్.మల్లారెడ్డి, జి.ప్రేమేందర్రెడ్డి, కిషన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీలకు మంత్రిత్వశాఖ కేటాయించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దాపురం, సామర్లకోట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నాయని, కేబినెట్లో మైనార్టీలకు మంత్రిత్వ శాఖ కేటాయించాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. దళిత, బడుగు వర్గాల సామాజిక హక్కుల వేదిక బస్సుయాత్రలో భాగంగా ఇచ్చాపురంలో బయలేరిన బస్సుయాత్ర బుధవారం ముందుగా పెద్దాపురం, అనంతరం సామర్లకోటలో సాగింది. పెద్దాపురం మెయిన్రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మ«ధు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు. బీసీలకు కేటాయించిన నిధుల్లో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగకుంటే పోరాటాని తీవ్రతరం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు. తొలుత స్థానిక మున్సిపల్ సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక హోదా కోరుతూ రామకృష్ణ, సీపీఐ కార్యకర్తలు, అభిమానులు మున్సిపల్ సెంటర్ నుంచి మెయిన్రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణమూర్తి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం కార్యదర్శి రావుల వెంకయ్య, మహిళా సమాఖ్య కార్యదర్శి దుర్గాభవాని, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కిర్ల కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు బైలపూడి సూరిబాబు, పెదిరెడ్ల సత్యనారాయణ, నిమ్మన సత్యనారాయణ, జల్లిగంపల వెంకన్న, తిరుపతి సత్తిబాబు, ఎలిశెట్టి రామదాసు, కన్నూరి వెంకన్న, పోలపర్తి తాతారావు, అల్లు నాగేశ్వరరావు, వేముల అర్జునరావు, గుమ్మిరేగుల రమణ, బదిరెడ్డి కృష్ణ, నక్కా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సామర్లకోటలోనూ.. స్థానిక మెహర్ కాంప్లెక్స్ వద్ద ఏఐటీయూసీ, ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు బస్సుయాత్రకు స్వాగతం పలికారు. ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి చంద్రయ్యదాసు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణ ప్రసంగించారు. -
గురుకులాలన్నింటికీ శాశ్వత భవనాలు
శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన అన్ని గురుకుల పాఠశాలలకు ఒకే తరహా శాశ్వత భవనాలను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ భవనాల నిర్మాణానికిగాను డిజైన్లు తయారు చేస్తున్నామని, ఫిబ్రవరిలోపు అన్ని చోట్లా స్థలాలను సేకరించి మార్చిలో భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం శాసనసభలో వెల్లడించారు. సంక్షేమ గురుకులాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు హన్మంత్ షిండే, శంకర్నాయక్, శోభ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటివరకు అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించి మొత్తం 299 గురుకుల పాఠశాలలుంటే, తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండున్నరేళ్లలోనే 487 గురుకుల పాఠశాలలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.23 కోట్ల చొప్పున రూ.11,200 కోట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. -
ఆర్ఎస్ఎస్ అండతో మైనారిటీలపై దాడులు
బీజేపీపై దీపాంకర్ భట్టాచార్య ధ్వజం హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ అండతో మైనార్టీలు, దళితులపై బీజేపీ దాడులు, హత్యలు చేస్తోందని, దీనిని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు. అదివారం ఇక్కడ విలేకరుతో మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకున్నవారి పాలనలో సైతం రైతు ఆత్మహత్యలు ఆగడంలేదని విచారం వ్యక్తం చేశారు. పాలకులు కార్పొరేటు శక్తులకు, కంపెనీలకు రుణ సౌకర్యాలు అందిస్తూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు పేరుతో బడా వ్యాపారులకు నష్టం జరగకుండా సామాన్యులపై సర్జికల్ దాడులు చేసిందని అన్నారు. జేఎన్టీయూ విద్యార్థి నజీబ్, సెంట్రల్ యూనివర్శీటీ విద్యార్థి రోహిత్.వేముల ఘటనల్లో బాధితులకు న్యాయం జరగాలని ఉద్యమిస్తామన్నారు.