ఆర్‌ఎస్‌ఎస్‌ అండతో మైనారిటీలపై దాడులు | attacks on minotities with behind rss | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌ అండతో మైనారిటీలపై దాడులు

Published Mon, Dec 12 2016 3:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

attacks on minotities with behind rss

బీజేపీపై దీపాంకర్‌ భట్టాచార్య ధ్వజం
హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ అండతో మైనార్టీలు, దళితులపై బీజేపీ దాడులు, హత్యలు చేస్తోందని, దీనిని  సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య అన్నారు. అదివారం ఇక్కడ  విలేకరుతో మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకున్నవారి పాలనలో సైతం రైతు ఆత్మహత్యలు ఆగడంలేదని విచారం వ్యక్తం చేశారు.

పాలకులు కార్పొరేటు శక్తులకు, కంపెనీలకు రుణ సౌకర్యాలు అందిస్తూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు పేరుతో బడా వ్యాపారులకు నష్టం జరగకుండా సామాన్యులపై సర్జికల్‌ దాడులు చేసిందని అన్నారు. జేఎన్‌టీయూ విద్యార్థి నజీబ్, సెంట్రల్‌ యూనివర్శీటీ విద్యార్థి రోహిత్‌.వేముల ఘటనల్లో బాధితులకు న్యాయం జరగాలని ఉద్యమిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement